-
ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది. ఆదివారం జులై 4 న రోజున ఉదయం 3.25am గంటల నుంచి 5.50am వరకు డిజిటల్ లావాదేవీలు నిలిచిపోనున్నాయి. దీంతో ఖాతాదారులకు డిజిటల్ సేవల నిర్వహణకు ఆటంకం ఏర్పడనుంది. ఎస్బీఐ తమ సేవలను అప్ గ్రేడ్ చేసే క్రమంలో డిజిటల్ సేవలు నిలిచిపోనున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ తదితర సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఎస్బీఐ జూలై ఒకటి నుంచి కొత్త నిబందనలను అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎటిఎమ్ నుంచి నగదు విత్ డ్రా, బ్రాంచీ నుంచి నగదు విత్ డ్రా, చెక్ బుక్ వంటి అంశాలకు సంబంధించిన చార్జీల విషయంలో మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్ బీడి) ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయి. We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/l7dsyoQcsu — State Bank of India (@TheOfficialSBI) July 2, 2021 -
దేవుడా.. దర్శనమేదీ?
అభిషేకాలు.. అర్చనలు, నోములు.. వ్రతాలు.. బోనాలు.. ఒడిబియ్యాలు, ధూపదీపాలు.. నిత్యపూజలతో కళకళలాడే దేవాలయాలు కళతప్పాయి. పవిత్రమైన శ్రావణమాసంలో పొంగిపొర్లెభ క్తిభావం.. అర్చక ఉద్యోగుల సమ్మెతో మూగబోయింది. తమ ఇష్ట దైవాలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుని, మానసిక ప్రశాంతతను పొందడానికి తరలివచ్చిన భక్తజనం.. ఆలయాల్లో పూజలు చేసేవారు లేక తీవ్ర నిరాశకు గురవుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెను ప్రారంభించి 10 రోజులవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో అర్చక ఉద్యోగ సంఘాలు తమపట్టును వీడటంలేదు. దీంతో అనునిత్యం వేలాది మంది భక్తులు నానా అవస్థలు పడుతుండగా, దేవాదాయ శాఖకు రూ.లక్షల్లో ఆదాయం గండి పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 370మంది అర్చక ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. శ్రావణమాసానికి ‘సమ్మె’ట - కళతప్పిన ఆలయాలు - హారతి లేదు.. తీర్థం లేదు - పది రోజులుగా ఆర్జిత సేవలు బంద్ - దేవాదాయ శాఖకు రూ. లక్షల్లో గండి - సత్రాలకు సైతం తాళాలు, భక్తులకు ఇక్కట్లు మెదక్/వర్గల్/శివ్వంపేట/జహీరాబాద్: ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు మెతుకుసీమ నిలయం. ఏడుపాయలలో దుర్గాభవాని, ఝరాసంగంలోని కేతకి సంగమేశ్వర ఆలయం, నాచారం లక్ష్మీనర్సింహస్వామి, బొంతపల్లి వీరభద్రస్వామి, రుద్రారం గణేష్ టెంపుల్, బీరంగూడంలోని శివాలయం, సిద్దిపేటలోని వెంకటేశ్వర, కోటి లింగాల ఆలయాలను అనునిత్యం సుమారు 50 వేలకుపైగా భక్తులు దర్శించుకుంటారు. శ్రావణమాసం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే జిల్లాలోని అర్చక ఉద్యోగులంతా తమ డిమాండ్ల సాధన కోసం ఈయేడు ఆగస్టు 25 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. ప్రతిరోజూ అర్చకులు దేవతా విగ్రహాలకు అభిషేకాలు, నివేదన గావించి సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో తరలివచ్చే వేలాది మంది భక్తులు పూజలు చేయించుకోలేక, మొక్కులు చెల్లించుకోలేక, మొక్కుబడి దర్శననానికే పరిమితమవుతున్నారు. ఏడుపాయల్లో మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే కేతకీ సంగమేశ్వరాలయాల్లో ఆది, సోమవారాల్లో ఇసుకేస్తే రాలనంత భక్తజనం ఉంటుంది. అర్చక ఉద్యోగులంతా సమ్మెలో ఉండటంతో కనీస పూజలకు అవకాశం లేక పోగా, దేవుడి ప్రసాదం కూడా పొందలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది భక్తులు దేవాలయాలకు రావడం లేదు. లక్షల్లో ఆదాయం గండి అర్చక ఉద్యోగుల సమ్మె ప్రభావంతో దేవాలయాల ఆదాయానికి గండి పడుతోంది. కేతకి సంగమేశ్వరాలయంలో ఆది, సోమవారాల్లోనే ఎంతలేదన్న రూ.5లక్షల ఆదాయం వస్తుంది. ఏడుపాయల్లో సోమ, మంగళ, బుధ, శుక్ర , ఆదివారాల్లో కలిసి సుమారు రూ.1.50లక్షల ఆదాయం వస్తుంది. అలాగే జిల్లా అంతటా దేవాలయాల్లో రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. అర్చకుల సమ్మెపోటుతో ఆదాయం గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. ట్రెజరీ వేతనాలే ప్రధాన డిమాండ్ : అర్చక ఉద్యోగులందరికీ 010 పద్దుకింద జీతాలు చెల్లించాలని ప్రధాన డిమాండ్. ధూప, దీప, నైవేద్యం కింద అర్చకులకు రూ.6వేల గౌరవ వేతనం ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఎన్ఎంఆర్(నాన్మస్టర్ రోల్) ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరుతున్నారు. పదో పీఆర్సీని 370 దేవాలయాల్లో పనిచేస్తున్న 2,375మంది అర్చక ఉద్యోగులకు వర్తింపజేయాలని కోరుతున్నారు. రూ. 8 లక్షల ఆదాయం నష్టం కేతకీ ఆలయానికి వచ్చే భక్తుల నుంచి అభిషేకాలు, హారతి, అన్న పూజ, వాహనాల పూజ, ఆకుల పూజ, గండ జ్యోతి, కంట్లం పూజ, ప్రసాదాలు, గదుల అద్దె ద్వారా ఆలయానికి ఆదాయం వచ్చేది. అర్చకులు, ఆలయ సిబ్బంది సమ్మెలో ఉండడంతో కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి దాదాపు రూ.8 లక్షల మేరకు నష్టం వాటిల్లింది. నాచగిరిలో మౌన దీక్ష వర్గల్: సమ్మెలో భాగంగా నాచగిరి ఆలయ అర్చకులు, సిబ్బంది నోటికి గుడ్డలు కట్టుకుని గర్భగుడి ముందు మౌన దీక్ష కొనసాగించారు. సంఘ నేతలు రంగాచారి, గోపాలకృష్ణ శర్మ, సుధాకర్గౌడ్ల నేతృత్వంలో నిరసన కొనసాగింది. మోకాళ్లపై నిరసన శివ్వంపేట: చాకరిమెట్ల ఆంజనేయస్వామి, సికింద్లాపూర్ నర్సింహస్వామి, హత్నూర మండలం పలుగుమీది పోచమ్మ దేవాలయాల అర్చక సిబ్బంది దేవాదత్తశర్మ, ధనుంజయ్యశర్మ, విద్యాకర్చారి, శ్రీకాంత్, నర్సింహారెడ్డి, శ్రీనివాస్, రామకృష్ణ, పోచయ్య, తదితరులు నిరసన వ్యక్తం చేశారు. మోకాళ్ళపై నిల్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. 50యేళ్ల తరువాత వచ్చాను 50యేళ్ల తరువాత దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చాను. పదేళ్ల వయస్సులో మా అమ్మవెంట వచ్చి అప్పట్లో దుర్గమ్మను దర్శించుకున్నా. మళ్లీ ఇన్నేళ్లకు ఇక్కడకు వస్తే కనీసం పూజ చేయించుకునే అవకాశం లేకుండా పోయింది. - జోగమ్మ, ముండ్రాయి 30యేళ్లలో ఇలాంటి సమ్మె చూడలేదు ఏడుపాయల దుర్గమ్మ వద్ద 30యేళ్లుగా పూజలు చేస్తున్నా అప్పుడప్పుడు సమ్మెలు చేశాం. కాని పదిరోజులపాటు చేసిన దాఖలాలు లేవు. భక్తులకు ఇబ్బందులు కలగడం బాధగానే ఉంది. కనీసం మా డిమాండ్లు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. - నర్సింహాచారి, పూజారి, ఏడుపాయల ప్రభుత్వం స్పందించాలి అర్చకులు సమ్మె చేపట్టడంతో భక్తులకు ఇబ్బందిగా మారింది. దీంతో ఆలయానికి వచ్చే వారు ఒకింత నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి అర్చకులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. - రాధాకృష్ణా రాగోజి, భక్తుడు, గుల్బర్గా శ్రావణ మాసంలో ఇదేం చోద్యం వేలూరు-నాచారం క్షేత్రం అంటే మాకు ఎంతో భక్తి, విశ్వాసం. లక్ష్మీ నరసింహస్వామి వారిని, లక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని హారతి, తీర్థంతోపాటు ఫలమో, పుష్పమో తీసుకుంటే మనసు నిండా సంతృప్తి ఉంటుంది. శ్రావణ మాసం దేవున్ని నిండుగా చూసుకునే అవకాశం కూడా దక్కడం లేదు. హారతి లేదు, తీర్థం పెట్టడం లేదు. గ్రిల్స్ నుంచి దేవున్ని చూసి అదే పదివేలు అనుకోవాల్సి వస్తున్నది. - పీ సునీత, భక్తురాలు, సికింద్రాబాద్ ఎంతో ఆశతో వచ్చాం కేతకీ సంగమేశ్వర స్వామి దైవ దర్శనం, అభిషేకం కోసం వందల కిలో మీటర్ల దూరం నుంచి వచ్చాం. ఆలయంలో అభిషేకాలు జరగక పోవడంతో నిరాశకు గురయ్యాం. మాలాగే చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. - శంకర్ భక్తుడు, అత్నూర్ -
ఖజానా సేవలు బంద్!
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ఖజా నా శాఖ ద్వారా అందుతున్న సేవలు పది రోజుల పాటు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా ఈ శాఖ కూడా రెండుగా విడిపోనుండడంతో ఈ శాఖలో కార్యకలాపాలను ఈ నెల 24 నుంచి నిలిపివేయనున్నారు. తప్పనిసరిగా చెల్లించాల్సి న బిల్లులను అన్ని ఉప ఖజానా కార్యాల యాల నుంచి తెప్పించుకుని జిల్లా ఖజానా శాఖ కార్యాలయం ద్వారా పంపించారు. ఇక బిల్లుల సమర్పణకు కూడా అవకాశం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరి వేతనాలు, పింఛన్ల చెల్లింపుల కోసం బిల్లుల స్వీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గతంలో మే 17 నాటికి బిల్లుల స్వీకరణ పూర్తి చేస్తామని చెప్పిన యంత్రాంగం తరవాత 19 వరకూ అవకాశమిచ్చింది. తరవాత ఆ తేదీని 21వ వరకూ పొడిగించింది. నాలుగైదు జిల్లాలను యూనిట్గా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన బిల్లుల స్వీకరణ చేపట్టారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కొన్ని రోజులుగా ఖజానా శాఖ ఉద్యోగులు నానా హైరానా పడుతున్నారు. జిల్లాలోని అన్ని సబ్ ట్రెజరీ కార్యాలయాల పరిధిలో ఉన్న బిల్లులను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి ఇక్కడి సర్వర్తో సమర్పణ కార్యక్రమాన్ని ఎట్టకేలకు పూర్తి చేశారు. 21తో బిల్లుల స్వీకరణ, 24తో చెల్లింపులను నిలుపుదల చేసి, మళ్లీ ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చిన ఆదేశాల మేరకు బిల్లులను మంజూరు చేయనున్నారు. అంత వరకూ ఖజానా శాఖ ద్వారా బిల్లులను నిలుపుదల చేస్తారు. ఇప్పటి వరకూ జరిగిన వ్యయాలను సమైక్యాంధ్రప్రదేశ్ ఖాతాలో లెక్కించుకుని అనంతరం జరిగే బిల్లులను రెండు రాష్ట్రాల ద్వారా ఆయా యంత్రాంగాల ఆధ్వర్యంలో నిర్వహించడానికి వీలుగా ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక నుంచి కార్యాలయ పరిధిలోని పనులే తప్ప బిల్లులకు సంబంధించిన పనులు మాత్రం చేసే అవకాశం లేదు. అభివృద్ధి పనులకు బ్రేక్.. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు నిలిచిపోనున్నాయి. దీని వల్ల పనులకు విఘాతం కలగనుంది. ముఖ్యంగా గతంలో మంజూరై, ప్రస్తుతం పనులు జరుగుతున్న వాటికి సంబంధించి బిల్లుల చెల్లింపులు కూడా రాష్ట్ర విభజన అనంతరం పునఃప్రారంభిస్తారు. 24 నుంచి బిల్లులు పాస్ కావు జిల్లాకు సంబంధించిన వేతనాలు, పింఛన్లు తదితర బిల్లులు 24 తరవాత పాస్ కావు. ఇప్పటికే బిల్లుల సమర్పణ కూడా జరిగిపోయింది. బిల్లులను సమర్పించేందుకు కూడా గడువు బుధవారంతో(ఈ నెల 21తో) ముగిసిపోయింది. జూన్ రెండు తరవాతే బిల్లుల చెల్లింపులు, సమర్పణలు ఉంటాయి. ఇప్పటి వరకూ మా వద్ద పెండింగ్ బిల్లులు లేవు. - పి.వి. భోగారావు, ఖజానా శాఖ డీడీ, విజయనగరం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement