-
మళ్లీ పేచీ!
సాక్షి, సంగారెడ్డి: రైతుల రుణమాఫీపై ప్రభుత్వం మరో మడతపేచీ పెట్టింది. తొలివిడత విడుదల చేసిన రుణమాఫీ సొమ్ము అర్హులైన ఖాతాల్లో జమ అయ్యాయని తేలాకే మలివిడత డబ్బులు విడుదల చేస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. తొలి విడత 25 శాతం రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లు యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) ఇచ్చినా ప్రభుత్వం సంతృప్తి చెందటంలేనట్లు తెలుస్తోంది. తొలివిడత డబ్బులు అర్హులైన రైతులకు చేరిందీ లేనిదీ తెలుసుకునేందుకు ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించాలని బ్యాంకర్లు, అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాల పరిశీలించేందుకు బ్యాంకర్ల బృందం సిద్ధమవుతోంది. ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో ఆడిటింగ్ బృందంలో బ్యాంకు అధికారి, వ్యవసాయశాఖ, రెవెన్యూ, లోకల్ ఫండ్ ఆడిటింగ్, ట్రెజరీ అధికారులు ఉంటారు. వీరందరూ తమకు కేటాయించిన బ్యాంకుల్లో రైతుల ఖాతాల్లో 25 శాతం రుణమాఫీ డబ్బులు జమ చేశారా లేదా? అర్హులైన వారికే చేరాయా? ఒక కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ వర్తించిందా లేక ఎక్కువ మందికి వర్తింపజేశారా? తదితర అంశాలను పరిశీలిస్తారు. ఆడిటింగ్లో అనర్హులని తేలితే వారి పేర్లను రుణమాఫీ జాబితా నుంచి తొలగిస్తారు. జిల్లాలోని ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఆంధ్రా బ్యాంకు, డీసీసీబీ, గ్రామీణ వికాస్ బ్యాంకు తదితర ప్రధాన బ్యాంకులకు చెందిన 30 బ్యాంకు శాఖల్లో ఈనెల 29వ తేదీ వరకు ఆడింటింగ్ నిర్వహించనున్నారు. ఆడిటింగ్ నివేదికలను పరిశీలించాకే ప్రభుత్వం రెండో విడత రుణమాఫీపై నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాల సమాచారం. కాగా తొలివిడతగా 25 శాతం రుణమాఫీ సొమ్ము జమచేసి యూసీలు అందజేసినా ప్రభుత్వం తిరిగి ఆడిటింగ్కు ఆదేశించటంపై బ్యాంకర్లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు విడతల్లో డబ్బులు విడుదల? జిల్లాలో రుణమాఫీ పథకం కింద 4,06,005 మంది రైతులు అర్హులుగా తేలారు. వీరికి సంబంధించిన రూ.2014 వేలకోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. మొదటి విడతగా ప్రభుత్వం 25 శాతం సొమ్ము రూ.503 కోట్ల విడుదల చేసింది. ఇందులో 3,96,191 మంది రైతులకు సంబంధించిన ఖాతాల్లో రూ.483 కోట్లు జమ చేశారు. వేర్వేరు కారణాలతో అనర్హులుగా తేలిన రైతులకు సంబంధించిన రుణమాఫీ మొత్తం రూ.20 కోట్లను తిరిగి ప్రభుత్వం ఖాతాల్లో జమ చేశారు. కాగా ప్రభుత్వం మలి విడత 25 శాతం రుణమాఫీ డబ్బు రూ.483 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు విడుదల చేయలేదు. రెండో విడత రుణమాఫీ సొమ్మును రెండు విడతల్లో విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా రుణమాఫీపై ప్రభుత్వం రోజుకో మడతపేచీ పెడుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాప్యంపై రైతుల్లో అసహనం రెండో విడత రుణమాఫీ సొమ్ము విడుదలలో ప్రభుత్వం జాప్యం చేయటంపై రైతుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఖరీఫ్ ప్రారంభం కావటంతో రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇప్పుడు రుణమాఫీపై ఆడిటింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడిటింగ్ ప్రక్రియ ద్వారా రుణమాఫీ పథకం నుంచి దూరం చేసేందుకు యత్నిస్తోందని అనుమానిస్తున్నారు. -
అంతా గందరగోళం
ప్రభుత్వం రెండో విడత రుణమాఫీ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలను ఆయా బ్యాంకులకు విడుదల చేస్తూ, రుణమాఫీకి వివిధ ఆంక్షలను పెట్టింది. రైతులకు రెండు, ఆపై బ్యాంకుల్లో రుణాలున్నా ఒకే బ్యాంకులో మాత్రమే రుణమాఫీకి అవకాశం కల్పించింది. భార్యాభర్తల పేరిట వేర్వేరుగా రుణాలున్నా 20 శాతమే మాఫీకి వర్తింపచేస్తూ, రుణమాఫీలో గందరగోళం సృష్టించింది. చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో మొత్తం 8,70,321 మంది రైతులు 2013 డిసెంబర్ 31 నాటికి రూ.11,180.25 కోట్ల మేరకు వ్యవసాయ రుణాల రూపంలో బ్యాంకర్లకు బకాయిపడ్డారు. అందులో రుణమాఫీకి అర్హులుగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు 5.63 లక్షల మంది రైతులకు సంబంధించిన ఆధార్కార్డులు, రేషన్కార్డులు, బ్యాంకు ఖా తా నెంబర్లు, భూమి రికార్డులను అనుసంధానం చేసి బ్యాం కర్లు ప్రభుత్వానికి నివేదించారు. వాటిలో కూడా మొదటి విడతలో 3,06,544 మంది, రెండో విడతలో 1,42,229 మందికి మొత్తం 4,48,773 మంది రైతులను మాత్రమే రుణమాఫీకి అర్హులుగా గుర్తించారు. మిగిలిన 4,31,548 మంది రైతులకు రుణమాఫీకి అనర్హులంటూ మొండిచేయి చూపింది. దీంతో రూ. 11,180.25 కోట్ల రుణాలకుగాను రూ. 600 కోట్ల మేరకు మాత్రమే రుణమాఫీ కానున్నట్లు బ్యాంకర్లు లెక్కల్లో తెలియజేశారు. అందులో మొదటి విడత జాబితాలోని రైతులకు రూ.470 కోట్ల మేరకు మాత్రమే రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం బ్యాంకులకు నిధులను కేటాయించింది. అయితే రుణమాఫీ జాప్యం కారణంగా జిల్లా రైతులపై రూ.939 కోట్ల మే రకు అపరాధ వడ్డీభారం పడింది. దీంతో అపరాధ వడ్డీ మే రకు కూడా రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బం దులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండో విడ త జాబితాలోని 1,42,229 మంది రైతులకు రుణమాఫీని ప్ర భుత్వం రెండు నెలల ఆలస్యంగా ప్రకటించింది. దీనికారణం గా రెండో జాబితా రైతులకు అపరాధ వడ్డీ భారం మరింత పెరగడంతో రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఒక్క బ్యాంకులోనే మాఫీకి అవకాశం ప్రభుత్వం రెండో విడత రుణమాఫీ జాబితాలను ఆయా బ్యాంకులకు పంపుతూ, రుణమాఫీలో మరో మెలిక పెట్టింది. ఒకే రైతు రెండు, మూడు ఆపై బ్యాంకుల్లో రుణాలు పొంది ఉంటే ఒకే బ్యాంకులోనే రుణమాఫీకి అర్హతను పెట్టింది. రుణమాఫీ నిధులు అకౌంట్లకు జమచేసిన వెంటనే బ్యాంకర్లు అర్హుల పట్టాదారు పాసుపుస్తకాల్లో ‘డెబిట్ వీవర్స్’గా చూపెడుతూ స్టాంపును వేసి సంతకం చేస్తున్నారు. దీంతో అదే పాసుబుక్ను మరో బ్యాంకులో చూపెట్టడం వల్ల ఆ బ్యాంకు వారు స్టాంపు వేసిన పట్టాదారు పాసుపుస్తకాల్లో మరో మారు స్టాంపు వేయడం కుదరదని తెలియజేస్తున్నారు. దీంతో ఒక రైతు మాఫీ అయిన రుణాల మొత్తాలకు గాను ఒకే బ్యాంకులో మాత్రమే అర్హతను పొందగలుగుతున్నాడు. ఒక ఖాతాకు మాత్రమే20 శాతం మాఫీ రైతులకు రూ. 50 వేలలోపు రుణం ఉంటే ఒకే దఫాలో పూర్తిగా మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు భార్యాభర్తలకు రెండు ఖాతాలకుగాను, ఒక్కో ఖాతా కింద రూ.25 వేల మేరకు విడివిడిగా రుణాలు పొందివున్నా, ఇద్దరికి కలిపి మొత్తం రుణంలో రూ. 50 వేలకన్నా తక్కువగా ఉన్నా ఇద్దరికి కలిపి 20 శాతం మేరకు మాత్రమే రుణమాఫీ చేస్తున్నారు. దీంతో రైతుల్లో రుణమాఫీపై గందరగోళం నెలకొంది. జిల్లాలోని మొత్తం 1,42,229 మంది రైతులు రెండో జాబితాలో రుణమాఫీకి అర్హులుగా ఉన్నారు. కానీ ప్రభుత్వం విధించిన ఆంక్షలతో జాబితా మేరకు రుణాలు మాఫీ జరిగేట్లు లేదని పలువురు బ్యాంకర్లు తెలుపుతున్నారు. ఎంత మందికి మాఫీ అన్నది తెలియదు రెండో విడత ఎంతమంది రైతులకు రుణమాఫీ వర్తించిందన్న విషయం తెలియదు. ప్రభుత్వం నుంచి నేరుగా ఆయా బ్యాంకులకు మాత్రమే రుణమాఫీ జాబితాలను విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది రైతులకు, ఎంతమేరకు రుణమాఫీ అనే విషయాలకు సంబంధించి జాబితాలు రావాల్సి ఉంది. -వెంకటేశ్వరరెడ్డి, లీడ్ జిల్లా మేనేజర్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement