-
తెలంగాణ ‘పవర్’ ఫుల్
కేసీఆర్ కు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ప్రశంసలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్కు బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు లభించాయి. అత్యంత గడ్డు పరిస్థితి నుంచి కోతల్లేకుండా కరెంటు అందించేస్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకోవటం మామూలు విషయంకాదని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్సింగ్ అన్నారు. శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో కేసీఆర్తో రమణ్సింగ్ సమావేశమయ్యారు. భేటీలో ముందుగా విద్యుత్ గురించి ప్రస్తావించారు. ‘నేను హైదరాబాద్లో దిగగానే కారెక్కాను. రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఏమిటని డ్రైవర్ను ఆరా తీయగా మా రాష్ట్రంలో ఇప్పుడు కరెంటు కోతలు లేవని చెప్పాడు. ఇంతకు ముందు కరెంటుకు చాలా కష్టముండేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు కష్టాలు పోయాయని చెప్పాడు. రోజుకు సగటున ఆరువేల మెగావాట్ల విద్యుత్ అవసరమయ్యే తెలంగాణలో కోతలు లేకుండా కరెంటివ్వడం మామూలు విషయం కాదు.’ అని రమణ్సింగ్ అన్నారు. భవిష్యత్తు విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో సోలార్ రంగంలో 2700 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ తీసుకురావడానికి అవసరమైన లైన్ నిర్మాణం పూర్తయ్యే దిశగా పని చేయాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లోని ప్రజాపంపిణీ వ్యవస్థ, ఇతరత్రా విషయాలను చర్చించుకున్నారు. ఛత్తీస్గఢ్లో చేపట్టిన నయా రాయపూర్ నిర్మాణ పురోగతి గురించి రమణ్సింగ్ను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న పలు కార్యక్రమాల గురించి రమణ్సింగ్ అడిగి తెలుసుకున్నారు. ‘మీరు బాగా పని చేస్తున్నారు. మీలాగే మేము కూడా భవిష్యత్తులో తయారవుతాం. మంచి కార్యక్రమాలు అమలు చేస్తాం.’ అని రమణ్సింగ్ అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ రమణ్సింగ్కు శాలువా కప్పి చార్మినార్ జ్ఞాపికను అందించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, తుమ్మల, జగదీశ్రెడ్డి, లక్ష్మారెడ్డి, స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రవీందర్రావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు పాల్గొన్నారు. -
కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ సీఎం భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో.. ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేయటం హర్షనీయమని రమణ్ సింగ్ అన్నారు. కరెంటు విషయంలో తెలంగాణను గడ్డు పరిస్థితి నుంచి కేసీఆర్ గట్టెక్కించారని ఆయన చెప్పారు. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరాపై చర్చించినట్టు తెలుస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- నిట్టనిలువునా చీలిపోతున్న 127 ఏళ్ల కంపెనీ
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
Advertisement