-
పాక్ క్రికెట్ స్టేడియం వద్ద పేలుళ్లు.. ఇండియన్స్పై నోరు పారేసుకున్న పాకిస్తానీలు
పాకిస్తాన్లో ఏ మూలన ఏం జరిగినా ఇండియాపై, ఇండియన్స్పై నోరు పారేసుకోవడం పాకిస్తానీలకు అలవాటుగా మారిపోయింది. తాజాగా జరిగిన ఓ సంఘటనను సంబంధించి కూడా పాకీలు ఇలాగే భారతీయులపై అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2023 సీజన్ సన్నాహకాల్లో భాగంగా క్వెట్టా స్టేడియం (భుగ్తీ) వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 5) పెషావర్ జల్మీ - క్వెట్టా గ్లాడియేటర్స్ జట్ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంకు అతి సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. There is no bomb blast in bughti cricket stadium quetta this is the reason please see this carefully especially for indians #bugticricketstadiu #quettavspz #psl pic.twitter.com/IqHTTOYVzR — Sardar Hamid Ghaffar Thaheem (@SardarHamidGha1) February 5, 2023 ఈ పేలుళ్లలో పదలు సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. పేలుళ్లకు కారణాలు తెలియరానప్పటికీ.. అక్కడికి అతి సమీపంతో పాక్ అంతర్జాతీయ క్రికెటర్లు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నందున అధికారులు మ్యాచ్ను రద్దు చేసి హుటాహుటిన ఆటగాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మ్యాచ్ జరుగుతుండగా స్డేడియం మొత్తాన్ని పొగ ఆవహించడంతో మైదానంలో ఉన్న ప్రేక్షకులు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. జనాలు స్డేడియం నుంచి బయటకు వెళ్లే క్రమంలో తొక్కసలాట జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. Just a clarification No bomb blast near bugti stadium The match is stopped because some persons from outside threw stones and put something on fire They are being identified. Endians are making propaganda, don't give them importance.#PZvsQG #Quetta pic.twitter.com/jmgbU9ODHj — Ali Asghar Wattoo (@Ali1Wattoo) February 5, 2023 అయితే, పేలుళ్లను ఆతర్వాత స్టేడియంలో నెలకొన్న పరిణామాలను పాక్ నెటిజన్లు వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. పేలుళ్ల కారణంగా ఎక్కడ ఆసియా కప్-2023 నిర్వహణ తమ దేశం నుంచి తరలిపోతుందోనని సీన్ను వేరేలా క్రియేట్ చేశారు. అసలు విషయాన్ని దాచే క్రమంలో పాక్ అభిమానులు భారతీయులపై బురదజల్లుతున్నారు. పాక్లో ఆసియా కప్ నిర్వహించడం బీసీసీఐకు భారతీయులకు ఇష్టం లేదని, అందుకే పేలుళ్లను బూచిగా చూపి సోషల్మీడియాలో విషప్రచారం చేస్తున్నారని అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. Iftikhar Ahmed smashed 6 sixes in a single over in the PSL exhibition match.pic.twitter.com/s3NRRmrcZl — Johns. (@CricCrazyJohns) February 5, 2023 పేలుళ్లకు మ్యాచ్ రద్దు చేయడానికి అస్సలు సంబంధం లేదని, మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియం వద్దకు చేరారని, వారిలో చాలామందికి లోనికి ప్రవేశం లభించలేదని, అలాంటి వారు బయట నుంచి స్టేడియంలోకి రాళ్లు విసరడంతో ఆందోళన జరిగిందని లేని విషయాన్ని కథగా అల్లారు. కొందరు పాకీలు అయితే ఏదో ఫేక్ వీడియోను ట్రోల్ చేస్తూ.. స్టేడియం వద్ద జరిగింది ఇది, అసత్యాలను ప్రచారం చేస్తున్న భారతీయుల కోసమే ఇది అంటూ సోషల్మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు భారతీయులు సైతం ధీటుగా జవాబిస్తున్నారు. విషప్రచారాలు చేయడం పాకీలకే చెల్లుతుంది.. పేలుళ్లు జరిగినా, జరగకపోయినా ఆసియాకప్ ఆడేందుకు పాక్లో అడుగుపెట్టేది లేదంటూ ఖరాఖండిగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే, క్వెట్టా స్టేడియంలో జరిగిన ఎగ్జిబిషన్లో మ్యాచ్లో పాక్ ఆటగాడు ఇఫ్తికార్ అహ్మద్.. అదే దేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన స్పోర్ట్స్ మినిస్టర్ వాహబ్ రియాజ్ బౌలింగ్లో 6 వరుస బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. -
చర్చిలో ఆత్మాహుతి దాడులు.. ఐదుగురు మృతి
క్వెట్టా: పాకిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. కల్లోలిత బెలూచిస్థాన్లోని క్వెట్టా నగరంలోని ఓ చర్చిపై ఆత్మాహుతి బంబార్లు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా.. 20మందికిపైగా గాయపడినట్టు సమాచారం అందుతోంది. క్వెట్టా నగరంలోని జార్ఘూన్ రోడ్డులో ఉన్న బెథెల్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చి లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు దిగారు. ఆత్మాహుతి బాంబర్లు చర్చిలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ ఆత్మాహుతి బాంబర్ను గేటు వద్దే భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరో బాంబర్ చర్చి ప్రాంగణంలోకి వెళ్లి తనను తాను పేల్చుకున్నాడు. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ప్రార్థనలు జరగాల్సిన ప్రాంతంలో క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. చర్చిలో మరికొంత ఉగ్రవాదులు నక్కి ఉండొచ్చునని భావిస్తున్నామని, ప్రస్తుతం ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా ఆపరేషన్ కొనసాగుతున్నదని బెలూచిస్థాన్ హోంమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ మీడియాకు తెలిపారు. ఆదివారం కావడంతో సహజంగా ఇక్కడి చర్చిలో 300 నుంచి 400 మంది ప్రార్థనలకు వస్తారని ఆయన తెలిపారు. -
క్వెట్టా దాడి స్వయంకృతం
ఏళ్ల తరబడి శ్రమకోర్చి తానే నిర్మించుకున్న ఉగ్రవాద సాలెగూటిలో చిక్కుకుని పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. రెండు రోజులక్రితం క్వెట్టాలోని పోలీసు శిక్షణ కేంద్రంపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి 60మంది ప్రాణాలు తీయడం అందుకు తాజా ఉదాహరణ. పాక్లో ఇది మొదటి ఉగ్రవాద దాడి కాదు...చివరిదీ కాబోదు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, సైనిక కార్యాలయాలు, స్థావరాలు, వైమానిక దళ స్థావరాలు, శిక్షణ కేంద్రాలు వగైరాలన్నిటిపైనా ఉగ్రవాదులు అడపా దడపా దాడులు చేస్తున్నారు. ఎక్కువ సందర్భాల్లో వారు విజయం సాధించ గలుగుతున్నారు. నిరుడు పెషావర్లో గట్టి సైనిక పహారా ఉండే కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న పాఠశాలపై దాడిచేసి 140మంది పిల్లల్ని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఏడాది జనవరిలో బచాఖాన్ యూనివర్సిటీపై జరిపిన దాడిలో ఒక ప్రొఫెసర్ తోపాటు 20 మంది విద్యార్థుల్ని కాల్చిచంపారు. ఏడేళ్లక్రితం లాహోర్లోని పోలీసు శిక్షణ కేంద్రంలో సైతం ఉగ్రవాదులు నెత్తురుటేర్లు పారించారు. ఉగ్రవాదం ఒక దేశానికో, ఒక ప్రాంతానికో పరిమితమైన సమస్య కాదు. తరతమ భేదాలతో దాదాపు అన్ని దేశాలూ దాంతో సతమతమవుతున్నాయి. ఏం చేసినా అదుపులోనికి రాక... ఇంకేం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. గట్టి భద్రతా ఏర్పాట్లు చేసుకున్నామని, ఈసారి దాడులు జరిగే అవకాశం లేనేలేదని అనుకుం టున్న ప్రతిసారీ ఉగ్రవాదులు కొత్త మార్గాల్లో, కొత్త వ్యూహాలతో దాడులు చేస్తున్నారు. క్వెట్టాలో జరిగిన దాడి దాన్నే నిరూపిస్తున్నది. ఈసారి దాడి తమ పనేనని పాకిస్తాన్ తాలిబన్కు చెందిన ఒక అనుబంధ సంస్థ అల్–అలామి ప్రకటించుకోగా, ఉగ్రవాద సంస్థ ఐఎస్ తామే చేశామంటున్నది. వీటితోపాటు మరో మూడు సంస్థలు సైతం అది తమ ఘనతేనని చెప్పుకుంటున్నాయి. క్వెట్టాపై దాడి జరగొచ్చునన్న సమాచారం అందడంతో నగరమంతా భద్రత పెంచామని, అయితే పోలీసు శిక్షణ కేంద్రంపై దాడి చేస్తారని మాత్రం ఊహించలేదని బలూ చిస్తాన్ ముఖ్యమంత్రి సనావుల్లా జెహ్రీ అన్నారంటే ప్రభుత్వం ఎంత అయో మయంలో ఉన్నదో అర్ధమవుతుంది. బలూచిస్తాన్లో ప్రత్యేక పరిస్థితులున్నాయంటూ ఆ రాష్ట్రంలో శాంతిభద్రతల బాధ్యతలను దశాబ్దం క్రితం సైన్యమే తీసుకుంది. అక్కడి పోలీసులు దాని కను సన్నల్లోనే పనిచేస్తారు. అయితే క్వెట్టా దాడితో ఆ భద్రతలోని డొల్లతనమెంతో నిరూపణ అయింది. విసిరేసినట్టు ఓ మూలన ఉండే బలూచిస్తాన్కు సాధారణ పాక్ పౌరుల రాకపోకలు బాగా తక్కువ. షియా తెగకు చెందినవారు అధికంగా నివసించే ఆ రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన దాడి వెనుక తెగల వైషమ్యాలు కూడా ఉండొచ్చు. దాడి జరిగిన వెంటనే బాధ్యులం తామంటే తామని ప్రకటించిన లష్కరే జంఘ్వీ, అల్–అలామీవంటి రెండు, మూడు మిలిటెంట్ సంస్థలు షియా వ్యతిరేక ఉన్మాదంతో ఉండేవే. ఈ సంస్థలు ఐఎస్తో చేతులు కలుపుతున్నాయన్న సమాచారం అందడంతో నిరుడు పాక్ సైన్యం వరస దాడులు చేసి అనేకమంది మిలిటెంట్లను అదుపులో తీసుకుంది. వారిలో 15మందిని ఎన్కౌంటర్ పేరిట హత మార్చింది. ఆ తర్వాత తగ్గినట్టే కనబడిన మిలిటెంట్ ముఠాలు ఇప్పుడు పంజా విసిరాయి. ఏ సంస్థ అయినా గాల్లోంచి ఊడిపడదు. జనరల్ జియా ఉల్ హక్ పాలన సమయంలో అఫ్ఘాన్లో సోవియెట్ ప్రాబల్యాన్ని తగ్గించడానికంటూ మిలి టెంట్ సంస్థలను ఏర్పాటు చేసి, వాటికి సైనిక శిక్షణనిప్పించి, ఆయుధాలిచ్చిన పాపం దశాబ్దాలుగా పాకిస్తాన్ను వెన్నాడుతోంది. ఇప్పుడు దేశంలోని మారు మూల ప్రాంతాల్లో సైతం ప్రాబల్యం సంపాదించిన అనేక మిలిటెంట్ సంస్థలు వాటినుంచి పుట్టుకొచ్చినవే. చిత్రమేమంటే సమస్యగా మారాయని గుర్తించాక వాటిని రద్దు చేసి సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి కృషి చేయాల్సిన ప్రభు త్వాలు, సైన్యం ఆ సంస్థలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకుందామన్న దురా లోచన చేశాయి. భారత్పైకి ఉసిగొల్పాయి. అటు తర్వాత అఫ్ఘాన్లోనూ ఈ పాచిక పారుతుందనుకున్నాయి. తమకు మిలిటెంట్ ముఠాల సమస్య తీరడంతో పాటు భారత్, అప్ఘాన్లు ఇబ్బందుల్లో పడతాయని అంచనా వేశాయి. ఉగ్రవాదులకు పాక్ సహాయసహకారాల గురించి బయటి ప్రపంచానికి తెలిసేలా వివిధ వేదికలపై భారత్ ప్రచారం చేయకపోయి ఉంటే, పాకిస్తాన్పై ఒత్తిడి రాకపోయి ఉంటే ఎన్నేళ్లయినా ఇది ఇలాగే కొనసాగేది. తమ దేశంలో తాలిబన్లు పాల్పడుతున్న దాడుల వెనక పాకిస్తాన్ హస్తం ఉన్నదని అఫ్ఘాన్ తరచు ఆరోపించడం కూడా ఫలితాలనిచ్చింది. అందువల్లే ఇటీవలికాలంలో ఉగ్రవాద ముఠాలకు దాని సాయం తగ్గింది. పైగా అఫ్ఘాన్ ప్రభుత్వంతో చర్చలు జరపా లంటూ తాలిబన్లపై ఒత్తిడి తీసుకురాక తప్పలేదు. తాలిబన్లలో కొందరు నేతలు ఈ చర్చల ప్రతిపాదనను తీవ్రంగా తప్పుబట్టి దానికి దూరంగా ఉన్నారు. అఫ్ఘాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన వర్గాలు సైతం ఏమంత సంతృప్తిగా లేవు. తిరిగి అఫ్ఘాన్ను చేజిక్కించుకోవాలన్న తమ లక్ష్యానికి పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచిందని కక్ష పెంచుకున్న తాలిబన్ చీలిక వర్గాలు... ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న వివిధ మిలిటెంట్ సంస్థలను చేరదీసి దాడులు చేయిస్తున్నాయి. క్వెట్టా దాడి కూడా ఈ నేపథ్యంలో జరిగిందే. అయితే ఈ స్థితిలో కూడా పాక్ ప్రభుత్వం వివిధ మిలిటెంట్ సంస్థల విషయంలో తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. జైషే మహమ్మద్(జెఈఎం) అధినేత మసూద్ అజర్ బ్యాంకు ఖాతాలను స్తంభింప జేస్తూ తీసుకున్న నిర్ణయమే ఇందుకు ఉదాహరణ. నిన్నమొన్నటి ఉడీ దాడి వరకూ వివిధ ఉగ్రవాద దాడుల వెనక మసూద్ అజర్ హస్తమున్నదని మన దేశం గతంలో అనేక సాక్ష్యాధారాలను అందజేసినా అతడిని ఇన్నేళ్లుగా పాక్ వెనకేసుకొస్తున్నది. ఉడీ దాడి తమ ఘనతేనని ఈమధ్యే అతడు ప్రకటించాడు. అయినా అతన్ని అరెస్టు చేయడానికి సిద్ధపడని పాక్...ఇప్పుడు అమెరికా ఒత్తిడి కారణంగా ఈ మాత్రం చర్యనైనా తీసుకుంది. ఇలా రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తుండటం వల్లే క్వెట్టా దాడి జరిగిందని ఇప్పటికైనా పాక్ గ్రహించకపోతే, అవసరమైన కఠిన చర్యలు తీసుకొనకపోతే దాన్నెవరూ కాపాడలేరు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement