-
వారసత్వ రాజకీయాలకు చెల్లుచీటీ
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా.. 1998 మే నెలలో పోఖ్రాన్2 అణు పరీక్షలను నిర్వహించింది. అప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా, జపాన్, బ్రిటన్ సహా చాలా దేశాలు భారత్పై ఆంక్షలు విధించాయి. అన్ని విధాలా సహాయ సహకారాలను నిలిపివేస్తామని బెదిరించాయి. నిలిపివేశాయి కూడా. భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా తయారు చేయాలన్న సంకల్పంతో ఉన్న అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంది. వాస్తవానికి ఈ పరీక్షలను అంతకు ముందే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. కానీ, అమెరికా బెదిరింపులకు ఆ పార్టీ తలొగ్గింది. వాజ్పేయి ప్రభుత్వం మాత్రం ముందస్తు వ్యూహాలు, కట్టుదిట్టమైన ప్రణాళికలతో.. మూడో కంటికి తెలియకుండా ఈ పరీక్షలను నిర్వహించడమే కాదు.. ఆ తర్వాత ఎదురైన ఒత్తిళ్లను తట్టుకుని సత్తా చాటుకుంది. భారతీయులంతా సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. అదే వాజ్పేయి ప్రభుత్వం.. ఒకే ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని కోల్పోయిన పార్టీగా చరిత్రలో నిలవాల్సి వచ్చింది. మిత్ర పక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఒకసారి 13 రోజుల్లో, మరోసారి 13 నెలల్లో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఇలా అధికారాన్ని కోల్పోవడానికైనా సిద్ధపడిందే తప్ప ఏనాడూ లాలూచీలు పడాలని, ఎదుటివారిని లాక్కోవాలని చూడలేదు. బీజేపీకి కావాల్సింది ఏంటి? ఈ దేశంలో పేదరికం లేకుండా చేయడం, కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరికీ సమాన న్యాయాన్ని, స్వేచ్ఛను అందించడం, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం, అన్నివిధాలా దేశాన్ని అగ్రరాజ్యంగా అవతరింపచేయడం, మన ఘనమైన వారసత్వాన్ని నలుదిక్కులా చాటడం. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రతి బీజేపీ కార్యకర్తా, నాయకుడూ పఠించే, పాటించే మంత్రం ఇదే. 1980 ఏప్రిల్ 6న ప్రారంభమైన బీజేపీ తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకుల్ని చూసింది. తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వాజ్పేయి, అద్వానీ లాంటి మహామహులైన నాయకులంతా పరాజయం పాలయ్యారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ రెండంటే రెండు సీట్లలోనే గెలుపొందింది. ఆ తర్వాతి ఎన్నికల్లో రెండంకెలు, మూడంకెల సీట్లను సాధించి, క్రమంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత మరలా సీట్లు, ఓట్లు తగ్గి బలహీనంగా కనిపించినప్పటికీ.. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాలను సొంతం చేసుకుంది. రెండున్నర దశాబ్దాలపాటు దేశాన్ని సంకీర్ణ ప్రభుత్వాలు నడపడంతో.. ఇక భారతదేశంలో ఏక పార్టీ ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యం అని రాజకీయ పండితులంతా ఏకగ్రీవంగా ప్రకటించిన సమయంలో బీజేపీ 2014 ఎన్నికల్లో 30 శాతానికి పైగా ఓట్లు, 282 సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇది గాలివాటం కాదని నిరూపిస్తూ 2019 ఎన్నికల్లో 37 శాతానికి పైగా ఓట్లు, 300లకు పైగా సీట్లు సాధించింది. భారతదేశంలో నలు దిక్కులా బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. క్షేత్రస్థాయిలో ప్రత్యర్థులను తట్టుకుని నిలబడిన కోట్లాది మంది కార్యకర్తలు సాధించిన, సాధిస్తున్న విజయం ఇది. కార్యకర్తలే బీజేపీకి పునాది, బలం. ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఒక కుటుంబంతో సంబంధం లేకుండా భారతదేశంలో ఇంత పెద్ద చారిత్రక విజయాలను నమోదు చేసిన ఏకైక పార్టీగా బీజేపీ ఎదిగిందంటే దానికి కారణం కార్యకర్తలే. ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో బీజేపీ స్వయంగా కానీ, మిత్రపక్షాల రూపంలో కానీ అధికారంలో ఉంది. కానీ, ఇప్పటి వరకూ అధికారం చేపట్టని, ప్రత్యర్థి పార్టీల్లోని నాయకులకు సరితూగే స్థాయిలో ప్రజాకర్షక నాయకులు లేని కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలంగా ఉందంటే బీజేపీ సిద్ధాంతాలను జీర్ణించుకుని, జెండాను భుజాన పెట్టుకున్న కార్యకర్తలే కారణం. స్వాతంత్య్రానంతరం పాశ్చాత్య ప్రభుత్వ పోకడలకు ప్రభావితమైన నాయకులు భారతీయ ఆత్మతో సంబంధంలేని పోకడలను బలంగా నమ్మి, దేశంపైన బలవంతంగా రుద్దుతున్న సమయంలో భారతీయతత్వంతో ‘సమగ్ర మానవతావాదం’ పేరిట మనదైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ. అత్యంత దీనావస్థలో ఉన్న నిరుపేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వాలన్నీ ‘అంత్యోదయ’ పథకాలను ప్రారంభించాయి. కింది స్థాయిలో ఉండే వారికి ప్రభుత్వం నుంచి నేరుగా సహాయ, సహకారాలు అందేలా మోదీ ప్రభుత్వం ఎన్నడూ ఊహించని స్థాయిలో చర్యలు చేపట్టి, అమలు చేస్తోంది. సంక్షేమ కార్యక్రమాల అమలును కొత్తపుంతలు తొక్కించి, మధ్య దళారులను, లీకేజీలను అరికట్టింది. భారతీయ చారిత్రక సంస్కృతి స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయిలో అన్ని విధాలుగా అగ్రరాజ్యంగా భారతదేశాన్ని నిలపాలన్న లక్ష్యంతో కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు ‘దేశం ముందు, పార్టీ తర్వాత, స్వప్రయోజనాలు చివరాఖరున’ అన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. అలాంటి వారందరికీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు.(నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం) వ్యాసకర్త: పురిఘళ్ల రఘురామ్ బీజేపీ సీనియర్ నాయకులు -
జన భాగస్వామ్యంతో అయోధ్య మందిరం
అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం ఎట్టకేలకు సాకారం కాబో తోంది. ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. అత్యంత ఉన్నతమైన నిర్మాణ విలువలతో మరో రెండేళ్లలో ఈ ఆలయ నిర్మాణం పూర్తి కానుంది. శ్రీరాముడు వనవాసం చేసింది 14 సంవత్సరాలైతే.. అయో ధ్యలోని రామ్ లల్లా 28 ఏళ్లకుపైగా గుడార వాసం చేశారు. శ్రీరాముడి కోసం నిర్మిస్తున్న ఈ ఆలయం అఖండ భారతదేశంలోని హిందువుల చైతన్యానికి, స్వాభిమానానికి కూడా ప్రతీకగా నిలిచిపోనుంది. ఈ ఆలయ నిర్మాణానికి వెయ్యి కోట్ల రూపాయలకుపైగా ఖర్చు కానుంది. దేశంలోని ప్రతి ఒక్క హిందువుకూ ఈ ఆలయ నిర్మాణంలో భాగం అయ్యే హక్కును దృష్టిలో ఉంచుకుని విరా ళాలు సేకరించే కార్యక్రమం మొదలైంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్ పూర్తి చేయనుంది. విరాళాలు స్వీకరించేందుకు వీహెచ్పీ కార్య కర్తలు ఇంటింటికీ వెళ్లనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 15 నుంచి 31 వరకు ఈ విరాళాల స్వీకరణ జరుగుతుంది. హిందు వులందరూ ఆలయ నిర్మాణంలో భాగం అయ్యేలా కనీస విరాళం 10 రూపాయలుగా నిర్ణయించారు. ప్రజలు ఇచ్చే విరా ళాలను అత్యంత పారదర్శకంగా ట్రస్టుకు జమ చేస్తారు. రాముడు పుట్టింది అయోధ్యలోనే. రాముడు అవతారం చాలించిన తర్వాత హిందూరాజులు ఈ ప్రదేశాన్ని పాలిం చారు. తదనంతర కాలంలో ముస్లింలు ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి దండయాత్రలు చేశారు. అయోధ్యలోని రాముని ఆలయాన్ని ధ్వంసం చేస్తే హిందువుల మనోబలం దెబ్బతీసినట్లేనని భావించిన బాబర్ సైన్యాధిపతి మీర్ బాకీ 1528లో అక్కడ ఉన్న ఆలయాన్ని కూల్చి ఆ శిథిలాలపైనే మూడు గుమ్మటాలు నిర్మించాడు. ఇది ఉన్న కొండపేరు రామ్ కోట్. దీనిని బట్టే ఇది శ్రీరాముడి జన్మస్థానం అని స్పష్టమవు తోంది. ఆ తర్వాత మూడు గుమ్మటాల కూల్చివేత, ఆలయ నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ చేసిన, చేస్తున్న అలు పెరుగని పోరాటం అంతా ఒక అద్భుత చరిత్ర. 1990లో మొదటి కరసేవ జరిగినప్పుడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 11 వేల మంది కరసేవకులు ఆ కార్య క్రమంలో పాల్గొనగా, వీరిలో 2 వేల మంది మహిళలు. చాలా మంది వెయ్యి కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి అయోధ్య చేరుకున్నారు. ఎల్కే అడ్వాణీ, అశోక్ సింఘాల్ వంటి ఎందరో ప్రముఖులు రాముని ఆలయం కోసం దేశవ్యాప్తంగా తిరిగి ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. భారతదేశానికి అతిపెద్ద సమస్య అయోధ్య రామ మందిర నిర్మాణమేనని దశాబ్దాలుగా ఎంతో మంది అభివర్ణిస్తూ వచ్చారు. హిందువులు రాత్రికి రాత్రే గుడి కట్టేస్తారని కూడా కొందరు ప్రచారం చేశారు. అలా చేస్తే ప్రపంచ దేశాల ముందు భారత్ పరువుపోతుందంటూ ఇంకొందరు చర్చలు లేవనె త్తారు. అయితే రాముని మందిర నిర్మాణం ఎటువంటి వివా దాలకు, భవిష్యత్ లిటిగేషన్లకు తావులేకుండా వైభవోపేతంగా జరుగుతుందని అయోధ్యలో ఎన్నో ఏళ్లుగా రాతి శిలలు చెక్కు తున్న వారి దగ్గరి నుంచి సాధువులు, సంతుల వరకు అంతా విశ్వసించారు. వారు నమ్మినట్లుగానే ఈ వ్యవహారం 492 ఏళ్ల తర్వాత వివాదాలకు తావివ్వకుండా పరిష్కారం అయ్యింది. ఎటువంటి హింస, రక్తపాతాలు లేకుండానే తుది నిర్ణయం వెలువడింది. ఆ తర్వాత కూడా దేశంలో ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోలేదు. శాంతియుత వాతావరణంలో ఆలయ నిర్మాణం గురించి దేశం చర్చించుకుంటోంది. ఒకప్పుడు ఈ సమస్య పరిష్కారం గురించి ఆలోచించిన చాలామంది.. నిజమైన పరిష్కారం లభించిన రోజు దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసు కుంటుందని, హింసకూ ఆస్కారం ఉంటుందని భావించారు. కానీ, అందుకు భిన్నమైన వాతావరణం ఈ రోజు ఉంది. ఇన్నేళ్ల పాటు ఇంతటి ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలోను, ఇప్పుడు దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లడంలోనూ వీహెచ్పీ పోషించిన పాత్ర చిరస్మరణీయం. బలమైన నాయకత్వంతో పాటు విలువలతో కూడిన ఆలోచనలు, వాటికి తగ్గ ఆచరణ, దేశవ్యాప్తంగా అంద రినీ కదిలించగలిగేంత సమర్థత ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమ వుతాయి. వీహెచ్పీ సంస్థ పరంగానూ, కరసేవకుల పరం గానూ మెచ్చుకోదగ్గ రీతిలో వ్యవహరించిందని చెప్పాలి. అయోధ్యలో నిర్మించేది కేవలం ఆలయం మాత్రమే కాదు. అది రాముడికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం, న్యాయం చేయడం. దాదాపు మూడు దశాబ్దాలుగా గుడారానికే పరిమి తమైన రాముడికి సముచిత గౌరవం ఇవ్వడం. హిందువుల మనోబలాన్ని దెబ్బతీయాలని ఆనాడు ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారు. ఆ భావన తప్పు అని రుజువు చేయడం. నిజాన్ని పూడ్చిపెట్టినా అది ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతుందని చాటి చెప్పడం. అఖండ భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో చైతన్యం, స్ఫూర్తి నింపడం. -పురిఘళ్ల రఘురామ్ వ్యాసకర్త బీజేపీ సీనియర్ నాయకులు, ఢిల్లీ -
లోక నాయకుడు నరేంద్ర మోదీ
ప్రపంచంలోని అత్యధిక ధనిక దేశాలు మాత్రమే సభ్యులుగా ఉన్న జీ7 గ్రూపులోకి భారతదేశాన్ని ఆహ్వా నించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనా వైరస్ దేశంలో 20 నుంచి 30 కోట్ల మందికి సోకుతుందనీ, 50 లక్షల మంది దాకా చనిపోతారనీ ఎంతో మంది ప్రచారం చేసీ, చేసీ అలసిపోయారు. కానీ, కరోనాను కట్టుదిట్టంగా ఎదుర్కోగలిగిన దేశం భారత్. దీనికి కారణం నరేంద్ర మోదీ. ఏ క్షణమైనా చైనా భారతదేశం మీద యుద్ధానికి దిగొచ్చు అన్న రీతిలో వార్తలు వచ్చాయి. కానీ ఉన్నట్టుండి చైనా సైలెంట్ అయింది. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయి. దీనికి కారణం నరేంద్ర మోదీ. కేవలం జనాకర్షణ మాత్రమే కాకుండా దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న నాయకుడుగా, ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు, పారిశ్రామికవేత్తల నమ్మకాన్ని పొందిన నాయకుడుగా నరేంద్ర మోదీ గతంలో భారతదేశం ఎన్నడూ చూడని బలమైన ప్రధాన మంత్రిగా మన్ననలు పొందుతున్నారు. ఏడు దశాబ్దాలుగా ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు నరేంద్ర మోదీ ప్రధానిగా ఏడో ఏట అడుగుపెట్టకముందే పరిష్కారాలు చూపించారు. దశాబ్దాలుగా ప్రజల్ని పట్టిపీడిస్తున్న బ్రిటిష్ కాలం నాటి చట్టాల బూజు దులిపిన మోదీ పార్లమెంటు వేదికగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన చట్టాలను అమల్లోకి తెచ్చారు. మూడుసార్లు తలాక్ చెప్పి భార్యలకు విడాకులు ఇచ్చే పద్ధతి అనాగరికం అంటూ ట్రిపుల్ తలాక్ చట్టాన్ని, ఒకే దేశంలో ఒకే పన్ను వ్యవస్థ ఉండాలంటూ ఆర్థిక ప్రగతి కోసం జీఎస్టీ చట్టాన్ని, దేశం మొత్తం ఒక్కటే అంటూ జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370, 35ఏలను రద్దు చేయడం, బ్యాంకుల విలీనం... కాంగ్రెస్ పార్టీ తన రాజ కీయాల కోసం, తమ నాయకుల అసమర్థతను కప్పి పుచ్చు కునేందుకు ఎన్నో తప్పులు చేస్తే ఆ తప్పుల్ని నరేంద్ర మోదీ సరిచేస్తూ వస్తున్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించే నేతగా కూడా మోదీ పలు విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. దిల్లీ నుంచి రూపాయి పంపిస్తే పది పైసలు మాత్రమే పేదలకు చేరుతోందని ఒకప్పుడు రాజీవ్ గాంధీ అంటే... దాన్ని చక్కదిద్దేందుకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే ప్రభుత్వ పథకాల లబ్ధిని జమ చేస్తున్నారు మోదీ. చిన్న, సన్నకారు వ్యాపారులు, యువతను రాయితీలు, రుణాలు ఇచ్చి ప్రోత్సహి స్తున్నారు. కరెంటు సదుపాయం లేని గ్రామాల్లో వెలుగులు నింపి, పొగగొట్టం దగ్గర దగ్గిదగ్గి అలసిపోయిన మహిళలకు ఉజ్వల పథకం కింద సిలిండర్లు ఇచ్చి, 50 కోట్ల మంది పేదలకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద వైద్య సదుపాయాలు అందించి, దేశ వ్యాప్తంగా రైతులకు పంటల బీమా కల్పించి అండగా నిలుస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత గురించిన చైతన్యం పెంచారు. దేశంలో విదేశీ మారక నిల్వలు పెరిగాయి. ఎగుమతులు పెరిగాయి. రోడ్లు, రైల్వేల వంటి మౌలిక సదుపాయాల కల్పనా సామర్థ్యం పెరిగింది. పెరిగినవే కాదు, తగ్గినవీ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అప్పీజ్మెంట్ పాలిటిక్స్. ఏదో ఒక వర్గాన్ని, మతాన్ని, గ్రూపుని సంతోషపెట్టడం కోసం ఈ దేశంలో చాలాకాలంగా రాజకీయాలు నడిచాయి. మోదీ ఈ తరహా రాజకీయాలకు దిల్లీ స్థాయిలో స్వస్తి పలికారు. అవినీతికి కళ్లెం వేశారు. దిల్లీ అధికార కారిడార్లలో పైరవీకారులు కాలు పెట్టకుండా చేశారు. ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలనే విధానాన్ని రద్దు చేశారు. ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు దిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రులను కలవకుండానే వారికి జరగాల్సిన పనులు జరిగేలా, రావాల్సిన నిధులు వచ్చేలా చూశారు. ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసి, నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసి, రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రణాళికలో భాగం చేశారు. టీమ్ ఇండియా స్ఫూర్తిని రగిలించారు. కరోనా కారణంగా బలమైన ఆర్థిక వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు ఉన్న దేశాలే కుప్పకూలిపోతున్న తరుణంలో భారతదేశం గట్టిగా నిలవగలిగిందంటే దానికి మోదీ ముందుచూపు, దృఢమైన నిర్ణయాలు తీసుకోగలిగిన నాయకత్వ పటిమ, దేశ ప్రజల్ని ఒక్కతాటిపైకి తీసుకురాగలిగిన ఆయన సామర్థ్యాలే కారణం. బ్రిటన్ వంటి అగ్రరాజ్యం, తక్కువ జనాభా ఉన్న దేశం కూడా కరోనా వైరస్ను ఎదుర్కోలేక, డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇచ్చి రక్షించుకోలేక నానా అవస్థలు పడుతోంటే, భారతదేశం మాత్రం ఇరుగుపొరుగు దేశాలకు ఆపన్నహస్తం అందించి ఆదుకుంది. దేశవ్యాప్తంగా ఎంతో మంది అడ్డుపుల్లలు వేసే రాజకీయ నాయ కులు, కుట్రలు, కుతంత్రాలు చేసే గ్రూపులు, అపనమ్మ కాలను పెంచేలా అవాస్తవాలను ప్రచారం చేసే నిపుణులు పుష్కలంగా ఉన్నప్పటికీ; కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ మైనస్లోకి వెళ్లిపోతుందని కొన్ని రేటింగ్ సంస్థలు నివేదికలు ఇస్తున్నప్ప టికీ; భవిష్యత్లో అగ్రరాజ్యం కాగల సత్తా భారత దేశానికి మాత్రమే ఉందని ప్రపంచం యావత్తూ ఏకాభిప్రాయా నికి వచ్చేలా చేయగలిగిన నాయకుడు నరేంద్ర మోదీ. పురిఘళ్ల రఘురామ్ (వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, న్యూఢిల్లీ) -
మోదీ.. ప్రజల్ని గెలిపించగల నాయకుడు
కరోనా అనంతరం ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వేగంగా ఎదగగల దేశం భారత్ మాత్రమే. ఇది బిజినెస్ ఇంటెలిజెన్స్లో ప్రపంచంలోనే గొప్పది అని పేరుపడిన ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) నివేదిక చెప్పిన మాట. కరోనా వైరస్ మహమ్మారిని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశం భారత్. ఇది ఇప్పుడు ప్రపంచం అంతా అంటున్న మాట. ఎందుకంటే.. వందవ కేసు నమోదైన రోజు నుంచి ముప్పై రోజుల్లో భారత్లో నమోదైన మొత్తం కేసులు 15 వేలు కూడా దాటలేదు. కానీ, ప్రపంచానికే పెద్దదిక్కుగా పరిగణించే అమెరికాలో ఏడు లక్షలు దాటితే, బ్రిటన్, చైనా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో సైతం భారత్కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మనకంటే ఎక్కువ కేసులు నమోదైనప్పటికీ కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశాలు దక్షిణ కొరియా, సింగపూర్, జపాన్ మాత్రమే. మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లోని అన్ని ప్రభుత్వాలూ కరోనాపై యుద్ధంలో చేతులెత్తేశాయి. ఆయా దేశాధినేతలంతా తలలు పట్టుకుంటే, ప్రజలంతా విలవిల్లాడిపోతున్నారు. కొన్ని దేశాధినేతలకూ, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ వైరస్ సోకింది. దేశాల సరిహద్దులు ఆపలేని, చిన్నా, పెద్దా.. పేద, ధనిక అన్న భేదం లేని వైరస్ ఇది. ఇలాంటి వైరస్ను భారత్ చాలా చక్కగా కట్టడి చేసింది. కానీ, ఒకే ఒక్క మతపరమైన కార్యక్రమం కారణంగా దేశంలో కేసులు ఉన్నట్టుండి పెరిగిపోయాయి. కరోనా కేసుల్లో సగానికి పైగా ఆ మత కార్యక్రమ సంబంధమైనవే. ఇక్కడ మతాన్ని కానీ, ఆ మత విశ్వాసాలు పాటించే వారిని కానీ నిందించాల్సిన పనిలేదు. వారి తప్పూ లేదు. కానీ, అందులో ఉన్న కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే వారికి మంచి చెడ్డలు చెప్పేందుకు పెద్దలు ఎవ్వరూ ముందుకు రాకపోవడమే విషాదం. ఇప్పుడు భారత్ ఆర్థికంగా చూసినా, ఆరోగ్యపరంగా చూసినా చాలా భద్రమైన చేతుల్లో ఉంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతున్నప్పుడు అమెరికా సహా ఏ దేశమూ నేనున్నానంటూ ఒక పెద్దన్న పాత్ర పోషించలేదు, ఒక్క భారత్ తప్ప. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలంటూ ప్రధాని మోదీ సార్క్ దేశాధినేతలకు పిలుపునిచ్చారు. వ్యక్తిగత చొరవతో, వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా కోటి అమెరికన్ డాలర్లతో నిధిని కూడా ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగకుండా పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులతో మోదీ ఫోన్లో మాట్లాడారు. కరోనాపై పోరాటానికి భారత్ తరపున అన్ని విధాలా సహాయం చేస్తామని చెప్పారు. మోదీ చొరవను, నాయకత్వ ప్రతిభను అమెరికా, రష్యాలు ప్రశంసించాయి. ‘ప్రపంచం విపత్తుల్లో ఉన్నప్పుడు కావాల్సింది ఇలాంటి నాయకత్వమే’ అని అమెరికా మోదీని అభినందించింది. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు భారతదేశం సర్వసన్నద్ధంగా ఉంది. కరోనా కేసుల్ని, అనుమానితుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిక్షణం సమీక్షిస్తోంది. మహమ్మారి ఉధృతిని తట్టుకునేందుకు అవసరమైనన్ని వైద్య సామగ్రిని, యంత్రాలను సిద్ధం చేసింది. అవసరానికి తగ్గట్టుగా మందుల్ని కూడా దగ్గర ఉంచుకుంది. అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన బ్రిటన్లో లాగా వైద్యులు డస్ట్బిన్ కవర్లను కప్పుకునే దుస్థితి భారతదేశంలో లేదు. ధీమానే కాదు బీమాను కూడా అందించి అభివృద్ధి చెందిన దేశాలు సైతం తనవైపు చూసేలా చేస్తోంది. ఇది ఒక యుద్ధం. ప్రపంచ దేశాలన్నీ ఒక కనిపించని శత్రువుతో పోరాడుతున్నాయి. ఇలాంటి యుద్ధ సమయంలో మోదీ నాయకత్వాన్ని అన్ని దేశాలూ అభినందిస్తోంటే విమర్శలు మాత్రం ఒక దేశం నుంచే వినబడుతున్నాయి. అది మన శత్రుదేశమైన పాకిస్తాన్ నుంచి అనుకుంటే మీరు పొరబడినట్లే. ఆ విమర్శలు వినిపిస్తోంది మన సొంత దేశం నుంచే. ఇలాంటి విపత్తులోనూ రాజకీయం చేయాలని చూసే కాంగ్రెస్ పార్టీ నాయకులే నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఒకప్పుడు మోదీపై పోటీకి దిగి, రోడ్డెక్కి ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ సైతం మోదీ సమయానుకూల నిర్ణయాల వల్లే దేశంలో కరోనా సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం అని బహిరంగంగా ప్రశంసిస్తుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం కోడిగుడ్డుపై కూడా ఈకలు పీకుతున్నారు. దేశంలో లాక్డౌన్ విధించి 21 రోజులు గడుస్తున్నాయి. తొలిదశ పూర్తయ్యింది. రెండో దశ మొదలు కానుంది. ఈ రోజు వరకూ దేశవ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క ఆకలి చావు కూడా లేదు. నిజమే, కొంతమంది వలసకార్మికులు కాలి నడకన వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని మొదలు పెట్టి, మార్గమధ్యంలో చనిపోయారు. ఇది చాలా దురదృష్టకరం. కానీ, వారు అప్పుడు ఉంటున్న నగరాలను వదిలిపెట్టాల్సిన పనిలేదు. సొంతూళ్లకే వెళ్లాల్సిన పనీ లేదు. ఎక్కడివారక్కడ ఉండటం వల్ల నష్టం కూడా ఏమీ లేదు. అందరికీ ఆహారం, మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రయాణాలను రద్దు చేసినా, రాష్ట్రాల సరిహద్దుల్ని మూసివేసినా, నియమాలను, నిబంధనలను అతిక్రమించి ఇంకా కొందరు సొంతూళ్లకు వెళ్లాలనే తపనతో ఆపదల్ని కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. తన బాధ్యత ప్రకారం ప్రభుత్వం ప్రజలందరికీ భరోసా కల్పిస్తోంది. నూటముప్పై కోట్ల మంది ప్రజల్ని కాపాడేందుకు నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారు. కనీవినీ ఎరుగని మానవ విపత్తును ప్రపంచం ఎదుర్కొంటున్న సమయంలో ఈ విశ్వంలో ఎన్నడూలేనంత మందిని లాక్డౌన్ చేసి, వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. భారత్లోని ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని చాటిచెప్పేందుకు, ప్రజల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచేందుకు, మనోధైర్యాన్ని నూరిపోసేందుకు పలు కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. ‘దేశం ముందు.. వ్యక్తిగతం ఆఖరికి’ అన్నది భారతీయ జనతాపార్టీ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని అక్షరాలా రుజువు చేసి, కరోనాపై యుద్ధంలో భారతదేశాన్ని గెలిపించడమే కాదు, తమ దేశాలనూ గెలిపించగల సత్తా ఉందని ప్రపంచదేశాల నాయకులు, ప్రజలు అనుకునేంత ధైర్యాన్ని నింపిన వ్యక్తి మోదీ. పురిఘళ్ల రఘురాం వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, న్యూఢిల్లీ ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com -
మైనార్టీల రక్షణ ముసుగులో దాడులు
దేశ రాజధాని ఢిల్లీలో చెలరేగిన హింస, అల్లర్లలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. ఈ హింసాత్మక ఘటనల్లో ఒక మతం వారిని, కేంద్ర ప్రభుత్వాన్ని.. ముఖ్యంగా హోం శాఖను అనుమానించేలా చాలామంది మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఈ ఘర్షణల్లో మూడు మతాలకు చెందినవాళ్లు బాధితులయ్యారు. రెండు వర్గాల మధ్య అపోహలు సృష్టించి, అనుమానాలు రేకెత్తించి, సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టారు. అల్లర్లకు, ఆస్తి నష్టానికి సంబంధించి చట్టం తనపని తాను చేస్తుంది. పోలీసులు ఇప్పటికే కొందరు నిందితులను పట్టుకున్నారు. మరికొందరిపై కేసులు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోంది. కానీ, అనుమానాలు రేకెత్తించి, అపోహలు సృష్టించిన వారి సంగతి ఏంటి? గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్నారు. అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా సీఏఏ నిరసన కార్యక్రమాలకు హాజరై ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ప్రతి ఒక్కరిచేతా జాతీయ జెండా పట్టించి, రాజ్యాంగ పీఠికను చదివిస్తూ, అంబేడ్కర్ ఫొటోలను ప్రదర్శిస్తూ పైకి చాలా పద్ధతిగల వ్యక్తిలాగా కని పించాలని ప్రయత్నించారు. కానీ, ఆయన పార్టీ నాయకుడైన వారిస్ పఠాన్ మాత్రం ఫిబ్రవరి 16వ తేదీన ‘(సీఏఏ వ్యతిరేక ప్రదర్శనల్లో) మహిళల్ని ముందుపెట్టామని అంటున్నారు. ఆడ సింహాలు బయటికొస్తేనే చెమటలు కక్కుతున్నారు. ఇక మనమంతా బయటికొస్తే ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోగలరు. 100 కోట్ల మంది (హిందువుల) కంటే 15 కోట్ల మంది (ముస్లింలు) శక్తివంతులు. దీన్ని గుర్తు పెట్టుకోండి’ అని అసదుద్దీన్ సమక్షంలోనే రెచ్చగొట్టారు. ఒకప్పుడు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా ఉన్న వారిస్ పఠాన్ అసెంబ్లీ సాక్షిగా ‘భారత్ మాతాకీ జై’ అని నినదించనని చెప్పి సస్పెండ్ అయ్యారు. అంతటి ఘన చరిత్ర కలిగిన ఆయన తన సమక్షంలో బహిరంగ సభలో, మీడియా ముందు హిందువులను రెచ్చగొట్టేలా, ముస్లింలను హింసవైపు ప్రేరేపించేలా మాట్లాడితే అసదుద్దీన్ ఏం చేశారు? దేశానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా ఏ ఒక్కరు ప్రవర్తించినా వాళ్లు ముస్లిం వ్యతిరేకులేనని చెప్పిన ఒవైసీ వారిస్, పఠాన్ విషయంలో మౌనంగా ఉన్నారెం దుకు? హిందువుల్ని హీనంగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీ నాయకులకు కొత్తేమీ కాదు. ఇలా ఎదుటివారిని తక్కువ చేయమని ఏ మతమూ చెప్పదు. తన మతం గురించి గొప్పలు చెప్పుకోవడం ఏమాత్రం తప్పు కాదు. కానీ, ఎదుటివారి మతాన్ని కించపర్చడం మాత్రం క్షమార్హం కాదు. అయితే, వారిస్ పఠాన్ మాత్రం ఒక విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు. అదేంటంటే.. మహిళల్ని ముందుపెట్టి సీఏఏ నిరసన ప్రదర్శనలు చేయడం. దీనిని ఒక వ్యూహంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి 22వ తేదీన కూడా ఈశాన్య ఢిల్లీలో వందలాది మంది ముస్లిం మహిళలు రోడ్లపైకి వచ్చారు. ఇది కూడా ఒక వ్యూహం ప్రకారమే జరిగింది. ఎందుకంటే మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ఢిల్లీ వస్తున్నారని, ఆ సందర్భంగా సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందని, పోలీ సులు, కేంద్ర ప్రభుత్వం దృష్టి మొత్తం ఆ పర్యటన సజావుగా జరిగేలా చూడటంపైనే ఉంటుందని అందరికీ తెలుసు. మీడియా కవరేజీ కూడా ఈ విషయాలపైనే ఎక్కువగా ఉంది. దీంతో రోడ్లపైకి వచ్చిన ఈ ముస్లిం మహిళలంతా జఫ్రాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో ఏకమై సీలంపూర్, మౌజాపూర్, యమునా విహార్లను కలిపే రోడ్లను దిగ్బంధించారు. సీఏఏను వెనక్కు తీసుకునేవరకూ తాము అక్కడినుంచి కదలబోమని మంకుపట్టుపట్టారు. అదే సమయంలో సీఏఏ అనుకూల ప్రదర్శనకారులపై కూడా రాళ్లదాడులు జరిగాయి. ఆ తర్వాత రాళ్లదాడులు కాస్తా పెట్రోలు బాంబులతో దాడులుగా మారాయి. అసలు అప్పటికప్పుడు వేలా దిమందికి రాళ్లు, పెట్రోలు బాంబులు ఎక్కడినుంచి వచ్చాయి? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అల్లర్లలో ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్తో తాహిర్ హుస్సేన్ అల్లర్లకు ముందు మూడు రోజులపాటు జరిపిన మంతనాలు, అమనతుల్లా ఖాన్ ఆ మూడు రోజుల్లో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో జరిపిన 18 ఫోన్ సంభాషణలు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో జరిపిన 9 ఫోన్ సంభాషణలు ఏంటో కూడా తేలాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పినట్లుగా సీఏఏ వల్ల ఒక్కరి పౌరసత్వం కూడా పోదు. పొరుగుదేశాల్లో మతం పేరుతో ఇబ్బందులు పడుతున్న మైనార్టీలకు పౌరసత్వం ఇవ్వడానికే ఈ చట్టం తెచ్చారు తప్ప భారతదేశంలో ఎన్నో దశాబ్దాలుగా నివసిస్తున్న, సమాజంలో అంతర్భాగమైన ముస్లింలను వెళ్లగొట్టేందుకు కాదు. పార్లమెంటులో అన్ని పార్టీలూ సమగ్రమైన చర్చలు జరిపి, సెలక్ట్ కమిటీకి పంపించి, క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత చేసిన చట్టమే పౌరసత్వ సవరణ చట్టం. ఇందులో ఎలాంటి తప్పులూ లేవు. దీన్ని అడ్డం పెట్టుకుని, అమాయకుల్ని మోసం చేసి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్న వారిపట్ల జాగ్రత్తగా ఉండండి. ఎన్నో దశాబ్దాలుగా భారతదేశంలో నివసిస్తూ, సమాజంలో అంతర్భాగమైన ముస్లింలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి నష్టమూ జరగదు. కానీ, ముస్లింల పేరుతో దేశంలోకి చొరబడాలని చూసే అసాంఘిక శక్తులకు, ముస్లింలను అడ్డుపెట్టుకుని రాజకీయాలను చేయాలనుకునే పార్టీలకు, మైనార్టీల జపం చేసే సూడో సెక్యులరిస్టులకు మాత్రం మోదీ అంటే ఏమాత్రం గిట్టదు. అందుకే వాళ్లు అమాయకులైన ప్రజల్ని రెచ్చగొట్టి, తమ పబ్బం గడుపుకుంటున్నారు. కానీ, అలాంటి వారు కూడా చట్టం ముందు చేతులుకట్టుకుని నిలబడే రోజు తప్పకుండా వస్తుంది. వ్యాసకర్త: పురిఘళ్ల రఘురాం బీజేపీ సమన్వయకర్త, అధికార ప్రతినిధి ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement