-
తోటివారికి సాయపడితేనే నిజమైన సంతోషం
‘సిటీ ఆఫ్ చారిటీ’ ఇష్టాగోష్ఠిలో సినీ నటి సమంత సాక్షి, హైదరాబాద్: ‘‘ఈ ప్రపంచంలో మనిషికి సంతోషం డబ్బువల్లా, పేరువల్లా రాదు. కేవలం తోటివారికి సాయపడడమే నిజమైన సంతోషాన్ని కలిగిస్తుంది’’ అని సినీ నటి సమంత అన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన కథనాలు ‘సిటీ ఆఫ్ చారిటీ’ పేరుతో ‘సాక్షి’ సిటీప్లస్లో ఇటీవల ప్రచురితం కావడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సమంత బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. సోమవారం ఇక్కడి ‘సాక్షి’ టవర్స్లో జరిగిన ‘సిటీ ఆఫ్ చారిటి’ ఇష్టాగోష్ఠిలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాక్షి చేపట్టిన ఈ సేవా ప్రచారానికి ఎల్లప్పుడూ బాసటగా నిలవడానికి తాను సిద్ధమని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. సాక్షి ఛైర్పర్సన్ వైఎస్ భారతి మాట్లాడుతూ, సమాజంలో ఏ ఒక్కరు సేవాపథంలో నడిచినా సాక్షి వారి వెన్నంటి ఉంటుందని పునరుద్ఘాటించారు. ‘‘ప్రత్యూష సపోర్ట్ పేరుతో చిన్న వయసులోనే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమంతను, ఇటీవల పద్మశ్రీ పురస్కారం పొందిన ప్రత్యూష సపోర్ట్ కో ఫౌండర్ డాక్టర్ మంజులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పదిమందిలో సేవాభావాన్ని పెంపొందించే ‘సిటీ ఆఫ్ చారిటీ’ కథనాలు ఎప్పటికీ కొనసాగుతాయి’’ అని అన్నారు. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ, ‘‘సేవ చేసే గుణమున్న ప్రతి ఒక్కరినీ సాక్షి అభినందిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న ఇంతమంది సహృదయుల్ని ఒక వేదికపై చూడడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. సాక్షి డెరైక్టర్లు వైఈపీ రెడ్డి, కేఆర్పీ రెడ్డి, పీవీకే ప్రసాద్, రాణిరెడ్డిలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
సేవకు ఆకాసమంత..
సమాజానికి ఉపయోగపడే ఏ కార్యక్రమానికైనా చేయూతనిస్తానని సినీనటి, ప్రత్యూష సపోర్ట్ వ్యవస్థాపకురాలు సమంత అన్నారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో బుధవారం హెపటైటిస్ బీపై అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రత్యూష సపోర్ట్ ఆధ్వర్యంలోని చిన్నారుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ సందర్భంగా సమంత మాట్లాడుతూ ప్రధాని మోదీకి తన మద్దతును తెలిపారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని, ముఖ్యంగా ఇటీవల ప్రారంభించిన ‘స్వచ్ఛభారత్’ తననెంతో ఆకట్టుకుందన్నారు. అందులో పాల్గొనాలని తననెవరూ ఆహ్వానించలేదని, పిలిస్తే తప్పకుండా పార్టిసిపేట్ చేస్తానని చెప్పారు. - సిటీప్లస్ -
శామ్స్(సమంత).. సపోర్ట్
ఆమె నవ్వితే యువ హృదయాలు ఉప్పొంగుతాయి. ఆమె కళ్లు చెమరిస్తే వేల వదనాలు చినబోతాయి. వెండితెరపై వెలిగే ఆమె... నిజంగా నవ్వుల యేరయ్యిందంటే ఓ నిరుపేద గుండె ఆరోగ్యంగా కదిలిందన్నట్టే. తెరవెనుక ఆమె కళ్లు చెమరించాయంటే అది ఓ చిన్నారి చివరి కోరిక విన్న సందర్భం అన్నట్టే. నిన్నగాక మొన్న పరిచయమైన యువ నటి సమాజం కోసం తపిస్తున్నారు. ‘నెలవంక’ంటూ అభిమానం కీర్తిస్తున్నా.. ‘నేల’ చూపులు చూస్తున్నారు. ఆర్తుల కోసం ఆగ ‘మేఘాల’ మీద దిగొస్తున్నారు. చూపులకు పక్కింటి అమ్మాయిలా అనిపించే ఆ చెన్నై చిన్నది.. దక్షిణాది వెండితెర మున్నెన్నడూ చూసి ఉండని ఓ సే‘వి’ంత. ఆమే సమంత. హృదయం ఆకాశమంత. సిటీలోని అనాథ చిన్నారులకు, అనారోగ్యం పాలైన అభాగ్యులకు ఆ అందాల నటి అందిస్తున్న సేవ తెలుసుకుంటే థాంక్యూ ‘శామ్స్’ (సమంత ముద్దుపేరు) అనకుండా ఉండలేం. సేవా పిపాసకు నేపథ్యం చెప్పమని సమంతను అడిగితే.. అది తను పుట్టిన ఊరి గొప్పతనమే అంటారు సమంత. ‘ఆ ఊరి పరిస్థితులు, అక్కడి వాతావరణం నామీద బాగా ప్రభావం చూపాయి. ఆకాశంలో విమానం కనిపిస్తే చాలు పరుగెడుతూ దానికి టాటాలు చెప్పేవాళ్లం. ఇప్పుడు ఏకంగా వాటిలోనే విహరిస్తున్నాం. అయితే అప్పటి కలలను, ఊహలను నేను మరచిపోలేదు. అందుకే ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఇద్దరు చిన్నారులు తాజ్మహల్ చూడాలనుంది అంటే వెంటనే వారిని విమానాల్లో తీసుకెళ్లి, చూపించి తీసుకొచ్చాం’ అంటూ వివరించారామె. ‘సపోర్ట్’ వెనుక.. సినీనటిగా కెరీర్ పీక్లో ఉండగా సమంత అనారోగ్యానికి గురై మూడునెలల పాటు సినిమాలకు దూరమయ్యారు. దాని నుంచి శరీరం కోలుకోవడం మామూలు విషయమే కాని అప్పటి స్థితి ఆమె మనసును ‘కొత్తగా’ మేలుకునేలా చేయడం విశేషం. అదే ప్రత్యూష సపోర్ట్ స్థాపనకు నాంది పలికింది. ‘ఒక్క సినిమా ఫ్లాప్ అయితే తలకిందులవుతుంది స్టార్డం, చిన్న తేడా వస్తే ఆసుపత్రి పాలు చేస్తుంది శరీరం. నచ్చింది తిని, నచ్చింది కట్టుకుని, నచ్చినట్టు జీవించడానికి సరిపోయే డబ్బు ఉంటే చాలు కదా. అంతకు మించి మన దగ్గర ఉందంటే అది మనది కానట్టే కదా. నాకు ఇంత డబ్బు, హోదా ఉన్నాయంటే దానికి అర్థం వాటిని సద్వినియోగం చేయమని దేవుడు చెబుతున్నట్టే అనిపించింది.’ అంటున్న సమంతను చూస్తుంటే ఆమెలో అమ్మ కనిపిస్తుంది. ‘మనం’ సినిమాలో మనల్ని మెప్పించిన యంగ్ మదర్ గుర్తొస్తుంది. నిజానికి ప్రత్యూష సపోర్ట్ ప్రారంభమై ఆర్నెల్లు మాత్రమే అయింది. ఒక స్వచ్ఛంద సంస్థ తనను తాను నిరూపించుకోవడానికి ఇది చాలా స్వల్ప సమయం. అయితే దీని వెనుక సమంత ఉండటమే సంస్థకు బోలెడంత పాపులారిటీని తెచ్చిపెట్టింది. ‘ప్రస్తుతం మా సంస్థకు అన్ని రకాలుగా గుర్తింపు వచ్చింది. దాతలు కూడా బాగా ముందుకు వస్తున్నారు. మరింత మందికి సాయం చేసేందుకు అవకాశం కలుగుతోంది’ అని ఆనందంగా చెప్పారు సమంత. అన్నీ బాగున్నప్పుడే చేయాలి.. సినిమా నటిగా ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న మీరు అప్పుడే సామాజిక బాధ్యత తలకెత్తుకోవడం అవసరమా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ...‘మనం శారీరకంగా, ఆర్థికంగా బాగున్నప్పుడే అనుకున్న మంచిపనులు చేయాలని నా ఉద్దేశం. తరాలకు సరిపడా సమకూర్చి పెట్టేసి, రిటైరయ్యాక సేవ అంటూ బయలుదేరడం నాకు సరైంది కాదనిపిస్తుంది. అందుకే లైమ్లైట్లో ఉండగానే మనసుకు నచ్చిన పనులు చేస్తున్నాను’అని చెప్పారు. పర్సనల్ లైఫ్ రెస్పాన్సిబుల్గా ఉండాలి.. తరచుగా సాహసోపేతమైన కామెంట్లతో వార్తల్లో ఉండే సమంత. నటీ నటుల పర్సనల్ లైఫ్ వారి వ్యక్తిగతం అని తను అనుకోవడం లేదని కుండబద్దలు కొట్టారు. సినిమా నటులను ప్రేక్షకులు, అభిమానులు కుటుంబసభ్యులుగా భావిస్తారని, ఆరాధిస్తారని.. అందుకే వారి లైఫ్స్టైల్ను అనుకరిస్తారని సమంత అభిప్రాయపడ్డారు. తాము నిజజీవితంలో అనుసరించే జీవనశైలి ప్రభావం అభిమానుల మీద తప్పకుండా ఉంటుందని, కాబట్టి ‘మా పర్సనల్ లైఫ్ మా ఇష్టం’ అనుకోవడం కుదరదని స్పష్టం చేశారు. తాము మంచి పనులు చేసినా, చెడ్డపనులు చేసినా జనం అనుసరించే ప్రయత్నం చేస్తారని ఆమె అన్నారు. ‘సపోర్ట్ ’చేస్తున్న విధమిదీ.. ఈ సంస్థ సమంత ఫౌండర్గా, వాలంటరీ ఆర్గనైజేషన్ నిర్వహణలో అనుభవమున్న డాక్టర్ మంజుల కోఫౌండర్గా గత ఫిబ్రవరిలో ఏర్పాటైంది. అప్పటి నుంచి తీవ్రమైన జబ్బులకు గురై శస్త్రచికిత్సలు అవసరమైన ఐదుగురు నిరుపేద చిన్నారులకు ఈ సంస్థ ఆపరేషన్స్ చేయించింది. ఇందులో కిడ్నీ ప్రాబ్లెమ్స్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం బ్లడ్కేన్సర్ తో బాధపడుతున్న పదినెలల వయసున్న బాబుకు చికిత్స చేయిస్తోంది. దీని కోసం బంజారాహిల్స్లోని రెయిన్బో ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే గత మూడునెలల నుంచి సిటీలోని ఆర్ఫన్ హోమ్లలో చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు అందించేందుకు లివ్లైఫ్ హాస్పిటల్తో కలసి పనిచేస్తోంది. నగరంలో నెలకు ఒక హోం చొప్పున వీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే మృత్యుముఖంలో ఉన్న చిన్నారుల చివరి కోరికలు తీర్చాలనే బాధ్యతను కూడా సంస్థ తీసుకుంది. తొలుత ఈ కార్యక్రమాల వ్యయమంతా సమంత వ్యక్తిగతంగా భరించారు. అయితే ఆ తర్వాత చాలామంది స్పందిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణకు పరిమితమైన ఈ సంస్థ సేవల్ని త్వరలోనే సమంత సొంతూరు చెన్నైకి కూడా విస్తరించనున్నారు. - ఎస్.సత్యబాబు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement