-
రాజకీయ విరాళాల స్వీకరణకు సరైన విధానమే
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల విధానం లోపభూయిష్టంగా ఉందంటూ, వాటి కొనుగోళ్లను ఆపాలంటూ గతంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై శుక్రవారం కేంద్రప్రభుత్వం స్పందించింది. ‘ రాజకీయ పార్టీలు విరాళాలు స్వీకరించేందుకు వినియోగిస్తున్న ఈ బాండ్ల వ్యవస్థ అత్యంత పారదర్శకమైంది. లెక్కల్లో లేని, నల్లధనం ఎంత మాత్రం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు చేరబోదు’ అని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సుప్రీంకోర్టులో స్పష్టంచేశారు. ‘ ప్రతిసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాండ్ల తంతు మొదలవుతోంది. తమకు వచ్చిన విరాళాల ఖాతాల ప్రతీ లావాదేవీ సమగ్ర సమాచారాన్ని రాజకీయ పార్టీలు స్పష్టంగా వెల్లడించట్లేవు. బాండ్ల విక్రయం ఆపండి’ అని పిటిషన్ వేసిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ ఎన్జీవో తరఫున హాజరైన లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. విస్తృత ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలిస్తే బాగుంటుందని మరో పిటిషనర్ తరఫున వాదిస్తున్న లాయర్ కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. దీంతో బాండ్ల ద్వారా పార్టీలు విరాళాలు పొందేందుకు అనుమతిస్తున్న చట్టాలను సవాల్ చేస్తున్న అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయాలా వద్దా అనేది డిసెంబర్ ఆరో తేదీన ఖరారుచేస్తామని సుప్రీం బెంచ్ పేర్కొంది. దాతల పేర్ల విషయంలో గోప్యత పాటించాలని కేంద్ర ప్రభుత్వం, పేర్లు బహిర్గతం చేయాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం.. సుప్రీంకోర్టులో గతంలో భిన్న వాదనలు లేవనెత్తాయి. -
మీడియాకు చిక్కిన ఏక్నాథ్ షిండే.. పరుగే పరుగు!
ముంబై: మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారును కూలదోయడానికి ప్రయత్నిస్తున్న శివసేన పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్నాథ్ షిండే (58) మీడియా కంటపడ్డారు. గుజరాత్లోని సూరత్ విమానాశ్రయంలో ఆయన మీడియాకు చిక్కారు. తమ మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి అసోంలోని గువాహటికి వెళుతుండగా వారిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. గుజరాత్ పోలీసులు, కేంద్ర బలగాలు వారికి రక్షణగా నిలిచాయి. ఏక్నాథ్ షిండేతో సహా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు విలేకరులు విఫలయత్నం చేశారు. మీడియాను తప్పించుకునేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు పరుగందుకున్నారు. అయితే తమకు మెజారిటీ ఉందని ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, శివసేన ఎమ్మెల్యేలను గొర్రెల మందను తరలించినట్టుగా సూరత్ విమానాశ్రయం నుంచి గుజరాత్ పోలీసులు తరలించారని ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీ ట్వీట్ చేసిన వీడియోను షేర్ చేస్తూ ఈ కామెంట్ చేశారు. Gujarat Police herding the Maharashtra Shivsena MLAs like sheep at Surat airport! https://t.co/Kts1SbzoJL — Prashant Bhushan (@pbhushan1) June 22, 2022 మనసు మార్చుకున్న ఎమ్మెల్యేపై దాడి శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఒకరు మనసు మార్చుకుని సూరత్ హోటల్ నుండి బయలుదేరడానికి ప్రయత్నించాడని సీనియర్ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేది ట్వీట్ చేశారు. అతడిని దాడి చేయాలని ఇతర ఎమ్మెల్యేలను ఏక్నాథ్ షిండే ఉసిగొల్పారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన గుజరాత్ పోలీసుల రక్షణలో ఆసుపత్రిలో ఉన్నారని పేర్కొన్నారు. స్వాతి చతుర్వేది ట్వీట్పై ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ.. మహారాష్ట్ర ఎమ్మెల్యేలను సూరత్ హోటల్లో బంధించడం కిడ్నాప్ కంటే తక్కువేమీ కాదని వ్యాఖ్యానించారు. అధికార క్రీడలో ఎమ్మెల్యేలు అమ్ముడుపోడమే కాదు.. అపహరణకూ గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (క్లిక్: ఏక్నాథ్ షిండే తిరుగుబాటు వెనక బలమైన కారణాలు!) -
వ్యాక్సిన్ వ్యతిరేక ట్వీట్లు.. ధీటైన రిప్లై.. షాకిచ్చిన ట్విటర్
వ్యాక్సిన్లను పరీక్షించకుండానే జనాలపై ప్రయోగిస్తున్నారని, యువతపై ప్రతికూల ప్రభావం పడుతోందని, మరణాలు సంభవిస్తున్నాయని న్యాయకోవిదుడు ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లు తీవ్రదుమారాన్ని రేపాయి. అంతేకాదు వ్యాక్సిన్ పనితీరుపై తనకు అనుమానాలు ఉన్నాయని, పొరపాటున కూడా వ్యాక్సిన్ తీసుకోబోనని ఆయన కామెంట్లు కూడా చేశాడు. ఈ నేపథ్యంలో కేంద్రం, ట్విటర్ రెండూ.. ఆయనకు ధీటుగానే బదులిచ్చాయి. న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లపై సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లు విమర్శలకు దారితీశాయి. కరోనా వ్యాక్సిన్ల పనితీరును పరిశీలించకుండానే నేరుగా ప్రజలకు వేస్తున్నారని, దీనివల్ల యువత ప్రమాదం బారినపడుతోందని ఆయన కామెంట్లు చేశాడు. దీనిపై సెంటర్ కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా తీవ్రంగా స్పందించాడు. కరోనా వ్యాక్సిన్ల భద్రతను, సమర్థతను తప్పుబట్టడం సరికాదని అరోరా వ్యాఖ్యానించాడు. ‘‘వ్యాక్సిన్ వికటించిన తొలి మరణం వివరాలను కూడా మేం ప్రజలకు అందుబాటులో ఉంచాం. అంతేకాదు డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాల ప్రకారం.. వ్యాక్సిన్ వికటించిన ఘటనలపై దర్యాప్తు కూడా జరిపిస్తున్నాం. ప్రజల్లో జ్వరాలు, నొప్పులు తప్పించి ప్రతికూల ప్రభావం చూపించిన కేసులు, సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఐసీయూలో, చావు అంచున ఉన్నవాళ్లపై కూడా వ్యాక్సిన్లు సానుకూల ప్రభావం చూపిస్తున్నాయి కదా. ఈ విషయాలేవీ ఆయనకు కనబడడం లేదా? ఎందుకు గుర్తించడం లేదు? అని అరోరా బదులిచ్చాడు. షాకిచ్చిన ట్విట్టర్ ఇక తప్పుడు సమాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్విటర్.. ప్రశాంత్ భూషణ్ వ్యవహారంలో త్వరితగతిన స్పందించింది. ఆయన ట్వీట్లు తప్పుడు దారి పట్టించేవిగా ఉన్నాయని నోటిఫికేషన్ ఇచ్చింది. అంతేకాదు వ్యాక్సిన్ భద్రతపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నాయో చూడండని సూచించాయి. ఈ మేరకు త్వరలోనే ఆయన ట్వీట్లను ట్విటర్ తొలగించే ఆస్కారం కూడా లేకపోలేదు. పేపర్ కట్టింగ్తో మొదలు.. పదిరోజుల వ్యాక్సిన్ తీసుకున్న 45ఏళ్ల మహిళ మరణించడం.. ఆమె మృతికి వ్యాక్సిన్ కారణమని ఆమె భర్త ఆరోపించడం నేపథ్యంగా ఓ పేపర్లో కథనం పబ్లిష్ అయ్యింది. ఆ కట్టింగ్ను, వ్యాక్సిన్ పనితీరు వ్యర్థం అనే ఓ వెబ్ ఆర్టికల్ను తన ట్విటర్లో పోస్ట్ చేసిన ప్రశాంత్ భూషణ్.. యువత మీద, కరోనా నుంచి కోలుకున్న వాళ్ల మీద పరీక్షించకుండానే వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చారంటూ విమర్శలకు దిగారు. కరోనాతో చనిపోయే అవకాశాలు మాత్రమే యువతకు ఉండేవని, కానీ, వ్యాక్సిన్తో ఆ అవకాశాలు మరింత ఎక్కువయ్యాయని తీవ్ర కామెంట్లతో మరో ట్వీట్ చేశాడు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు సహజంగా ఇమ్యూనిటీని సంపాదించుకుంటున్నారని, అలాంటి వాళ్ల ఇమ్యూనిటీని కూడా వ్యాక్సిన్ దెబ్బతీస్తోందని కామెంట్లు చేశాడు. A lot of people including friends & family have accused me of promoting Vaccine hesitancy, let me clarify my position. I am not anti Vaccine per se. But I believe it is irresponsible to promote universal vaccination of experimental&untested vaccines esp to young & Covid recovered https://t.co/SVHwgyZcvU — Prashant Bhushan (@pbhushan1) June 28, 2021 చదవండి: రూపాయి జరిమానా.. సరిపోతుందా? -
జరిమానా చెల్లించిన ప్రశాంత్ భూషణ్, కానీ...
సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్కు కోర్టు ఒక రూపాయి జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఆయన సోమవారం రూపాయిని సుప్రీంకోర్టులో డిపాజిట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేను ఈ రోజు సుప్రీంకోర్టుకు రూ.1 చెల్లించాను. అంతమాత్రానా నేను కోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించినట్లు కాదు. నేను దీని మీద రివ్యూ పిటిషన్ వేస్తాను’ అని తెలిపారు. ఈసారి ఈ కేసుపై మరొక బెంచ్తో విచారణ జరిపించాలని ఆయన తన పిటిషన్లో కోరారు. న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నించిన కేసులో ఆయనను దోషిగా తేల్చిన సుప్రీం కోర్టు ఆయనకు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. క్షమాపణ చెప్పాలని ధర్మాసనం ఆదేశించగా ఆయన నిరాకరించారు. దాంతో ఆయనకు సుప్రీం కోర్టు జరిమానా విధించింది. అది చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సి వుంటుందని కోర్టు తెలిపింది. దీంతో ఆయన ఈరోజు తనకు విధించిన జరిమానా రూ.1 ను డిపాజిట్ చేశారు. సెప్టెంబర్ 15 కల్లా జరిమానాను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. లేకపోతే మూడు నెలలపాటు జైలుకు వెళ్లాల్సి వుంటుందని కూడా తెలిపింది. ఇక ప్రశాంత్ భూషణ్ 2009లో గతంలో కొంతమంది సుప్రీంకోర్టు జడ్జీలు అవినీతిపరులు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణ కోసం ప్రస్తుతం సుప్రీం కోర్టు ముందు ఉంది. చదవండి: జరిమానా కట్టేందుకు సిద్ధం : భూషన్ -
కోర్టుధిక్కార నేరాలు ఇంకా అవసరమా?
భారత సంవిధానం ఆర్టికల్ 19(1)(ఎ)లో పౌరులందరికీ వాక్ స్వాతంత్య్రం ఉన్నా కోర్టు ధిక్కారం చేస్తే శిక్ష విధించే అధికారం కోర్టులకు ఉందంటున్నది. న్యాయ స్థానాల తీర్పులను సమం జసంగా విమర్శించవచ్చునని, వారికి వ్యక్తిగత దురుద్దేశాలను ఆపాదించకుండా అభిప్రాయ వ్యక్తీ కరణ చేయవచ్చునని కోర్టు ధిక్కార చట్టం వివరిం చింది. రంజన్ గొగోయ్ లైంగిక వేధింపుల కేసును వేగంగా ముగించి బాధితురాలిని బయటకు గెంటి ప్రధాన న్యాయమూర్తిని నిర్దోషిగా ప్రకటించి నప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులతో సహా చాలా మంది మౌనంగా ఉండడం కూడా భావవ్యక్తీకరణ హక్కు వినియోగమే. ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడకూడదు. కానీ ఎవరిష్టం వచ్చినట్టు వారు నోరుమూసుకుని ఉండొచ్చు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం సివిల్ పర మైన తప్పిదం. న్యాయమూర్తి వ్యతిరేక తీర్పు చెప్పి నందుకు కోపించి, కోర్టులోనే చెప్పు విసరడం, తిట్టడం, అరవడం పైపైకి వెళ్లడం కోర్టు ధిక్కార నేరాలు. కోర్టుకిచ్చిన ప్రమాణ పత్రాలలో చేసిన వాగ్దానాలు అమలు చేయకపోయినా కోర్టు ధిక్కా రమే. వీటితో పాటు నిందాత్మక విమర్శలు అనే నేరం మరొకటి ఉంది. మామూలు కేసుల విచారణ నింపాదిగా దశాబ్దాల పాటు సా..ఆ..ఆ..గుతుంది. కానీ రాజ్యాంగ అధికారాలను వినియోగించి పెద్ద న్యాయస్థానాలు కోర్టు ధిక్కారం కేసులు స్వీకరిస్తే, శరవేగంగా జరుగుతాయి. దీన్ని సమ్మరీ హియ రింగ్ అంటారు. కోర్టు ధిక్కారం కేసులో పెద్దగా రుజువు చేయవలసిన అంశాలేమీ ఉండవు. నింది తుడు చేసిన వ్యాఖ్యానాలు ప్రింట్లోనో, వీడియో లోనో, సోషల్ మీడియాలోనో భద్రంగా ఉంటాయి. అబద్ధాలు చెప్పి రేప్లు హత్యలు చేయలేదని చెప్పు కోవచ్చేమో కాని ‘కోర్టు ధిక్కారమా నాకు తెలి యదు, నేను చేయలేదు’ అని తప్పించుకోలేరు. ప్రశాంత్ భూషణ్తోపాటు కోర్టుధిక్కారం కేసులో ట్విట్టర్ కంపెనీవారు కూడా నిందితులు. క్షమాపణతో వారు బయటపడ్డారు. అయితే రెండు ట్వీట్లను వారు మళ్లీ ప్రచారంలో పెట్టకూడదు. ట్వీట్ కవులు, వాట్సాప్ విద్వాంసులకు ఇచ్చిన తీవ్ర మైన హెచ్చరిక సుప్రీంకోర్టు తాజా తీర్పు. సుప్ర సిద్ధ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రెండు ట్వీట్లు ఆయనను దాదాపు జైలుకు పంపేవే. రూపాయి జరిమానాతో ఆయనకు జైలు తప్పిపోయింది. సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జీల న్యాయస్థానం ప్రశాంత్ భూషణ్ నేరం చేశారని అందుకు ఆయన శిక్ష అనుభవించాల్సిందేనన్నది. ఒకవేళ ఆ రూపాయి చెల్లించకపోతే మూడు నెలలు సాధారణ జైలు జీవితం గడపాలని నిర్దేశించింది, బయటికి వచ్చిన తరువాత మూడు సంవత్సరాల పాటు సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేయకూడదని నిషేధిం చింది. వీటికన్నా రూపాయి చెల్లించడం నయమని తెలిసి తమ ఉత్తర్వును వెంటనే పాటిస్తారని సుప్రీంకోర్టు చాలా కరెక్టుగా అంచనా వేసింది. కోర్టు ధిక్కారం చేసిన నేరగాళ్లందరినీ అంతే దయతో చూస్తుందని గ్యారంటీ లేదు. కొందరు ప్రముఖు లకు ఎక్కువ సమానత సమర్థనీయం అంటారు. ప్రశాంత్ భూషణ్ అన్నటువంటి మాటలే ఇదివరకు కేరళ ముఖ్యమంత్రి నంబూద్రిపాద్ మాట్లాడారు. సుప్రీంకోర్టు యాభైరూపాయల జరిమానాతో ముగించింది. మన తెలుగు నేత శివశంకర్ కేంద్రంలో న్యాయశాఖ మంత్రి ఓ అడుగు ముందుకు వేసి ‘‘ఫెరా ఉల్లంఘించే వారికి, వధువు లను తగలబెట్టేవారికి, జమీందార్లకి మన సుప్రీం కోర్టు స్వర్గం వంటిది’’ అన్నారు. కానీ అది ఒక అభిప్రాయం, విమర్శ అనీ, కోర్టు ధిక్కారం ఎంత మాత్రం కాదని సుప్రీంకోర్టు వదిలేసింది. శివశంకర్ అన్నారుకదా అని మనమెందుకు రాయకూడదని ఫేస్బుక్, ట్విట్టర్లలో టకాటకా కామెంట్లు కొడితే చకచకా కటకటాలకు పోవలసి వస్తుంది. రాజ ద్రోహ, కోర్టు ధిక్కార నేరం వంటి ఈ భయానక శాసనాలు బ్రిటిష్ పాలకులకు అవసరమయ్యాయి. బ్రిటన్తో సహా అనేక దేశాలు ఈ నేరాలను తీసేసి నాగరికు లయ్యారు. మనమే ఇంకా రాజభక్తితో ఈ నేరాలను బతికించి స్వేచ్ఛాజీవులుగా మరణిసు ్తన్నాం. పౌరసమాజం– ఈ అన్యాయ, బానిస, భయానక, అప్రజా స్వామిక నేర శాసనాలను సంవిధానపు పునాదుల నుంచి నిర్మూ లించేందుకు ఉద్యమాలు నిర్మించాల్సిందే. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement