-
22 నుంచి డైట్ సెమిస్టర్ పరీక్షలు
ఒంగోలు సెంట్రల్: జిల్లాలోని మైనంపాడు డైట్ డీఈఐడీడీ సెమిస్టర్, మూడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 22 నుంచి నిర్వహిస్తారని జిల్లా విద్యాశాఖాధికారి సుభద్ర తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 4.3 గంటల వరకు, మూడో సెమిస్టర్ పరీక్షలు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. అందుకు సంబంధించిన హాల్ టికెట్స్ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. విద్యార్థులలో నైపుణ్యం పెంపుదలకు ప్రేరణ పోటీలు ● జిల్లా విద్యాశాఖాధికారి డి సుభద్ర ఒంగోలు సెంట్రల్: విద్యార్థుల్లో నైపుణ్యం, పోటీతత్వం పెంచేందుకు ప్రేరణ పోటీలు ఉపయోగపడతాయని జిల్లా విద్యాశాఖాధికారి డీ సుభద్ర అన్నారు. జవహర్ నవోదయ విద్యాలయంలో శుక్రవారం జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవాలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి డీ సుభద్ర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. పరిశీలకులు మాధవీలత మాట్లాడుతూ ప్రేరణ పోటీల లక్ష్యాలను వివరించారు. పోటీల్లో ఎంపికై న విద్యార్థులకు గుజరాత్లోని వాద్ నగర్లో ఐదు రోజుల పాటు రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నవోదయ ప్రిన్సిపాల్ కే రామిరెడ్డి మాట్లాడుతూ నాయకత్వ, సృజనాత్మకత లక్షణాలు పాఠశాల స్థాయి నుంచే అలవడుతాయని చెప్పారు. 76 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ ప్రోగ్రామింగ్ అధికారి ఎం రమేష్, అసిస్టెంట్ ప్రోగ్రాం మానిటరింగ్ అధికారి సీహెచ్ మాధవీలత పాల్గొన్నారు. -
తాగి..తూగి
యర్రగొండపాలెం: టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు నామినేషన్ దాఖలు సందర్భంగా శుక్రవారం పట్టణంలో మద్యం ఏరులై పారింది. నామినేషన్కు ముందు పట్టణంలో టీటీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలకు ముందుగానే మద్యం కేసులతోపాటు డబ్బులు కూడా ఇచ్చారు. వారికి మాంసంతో కూడిన భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. పట్టణంలో ఏ సందులో చూసిన తెలుగు తమ్ముళ్లు మద్యం తాగుతూ కనిపించారు. బ్రాందీ షాపుల వద్ద క్యూ కట్టారు. ఫూటుగా మద్యం తాగిన వీరు ర్యాలీలో చిందులు తొక్కారు. ర్యాలీలో పాల్గొన్నవారి సంఖ్య అంతంత మాత్రమే అయినా పచ్చ నేతలు మాత్రం నియోజకవర్గం అంతా తమ వెనకే నడుస్తుందన్న బిల్డప్ ఇచ్చారు. తాగిన మైకంలో వారు పట్టణంలో ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ తో హల్చల్ చేశారు. ఒక ద్విచక్ర వాహనంపై త్రిపురాంతకం మండలంలోని మానేపల్లికి చెందిన ముగ్గురు మితిమీరిన వేగంగా నడుపుతూ రామసముద్రానికి సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బోల్తాపడ్డారు. ఈ సంఘటనలో బైరెడ్డి నరసింహారెడ్డి, పోట్ల మల్లికార్జునరెడ్డిలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని యర్రగొండపాలెంలోని టీడీపీ నాయకుడు మన్నె రవీంద్రకు చెందిన వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయించారు. గాయపడిన వారిలో బైరెడ్డి నరసింహారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. ఆ వైద్యశాలలో ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిసింది. యర్రగొండపాలెంలో ఏరులై పారిన మద్యంకనిపించని కూటమి జెండాలు.. టీడీపీ ర్యాలీలో కూటమి జెండాలు కనిపించలేదు. ర్యాలీని రక్తికట్టించటానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాలు ఏర్పాటు చేసి జనసమీకరణ చేశారు. వారు అనుకున్న మేరకు కార్యకర్తలు రాకపోయినా స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్నీ పచ్చజెండాలే కనిపించాయి కానీ జనసేన, బీజేపీలకు చెందిన జెండాలు కనిపించలేదు. ఈ సందర్భంగా స్థానిక కొలుకుల సెంటర్లో కాన్వాయ్పై నుంచి ఎరిక్షన్బాబు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తమ ప్రసంగాల్లో టీడీపీ కార్యకర్తలతోపాటు జనసేన, బీజేపీలకు చెందిన కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారని, ఎమ్మార్పీఎస్ తమకు మద్దతు ఇస్తుందని ఆయా పార్టీలకు చెందిన నాయకులను మాత్రం పరిచయం చేశారు. -
పేదలకు విద్య, వైద్యం అందించటమే లక్ష్యం
ఒంగోలు సబర్బన్: పేదలకు విద్య, వైద్యం సంతృప్తిగా అందించటమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 58 నెలల పాలనలో ముందుకు సాగిందని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఈ మేరకు బాలినేని మన ఒంగోలు–మన వాసన్న కార్యక్రమంలో భాగంగా బాలాజీ నగర్లో శుక్రవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరాం నాగభూషణంతో కలిసి అగ్రహారం గేటు అవతల బత్తులవారికుంట, బ్రాహ్మణ బజారు, వార్డు సచివాలయం వీధి, మిట్టమీద, దత్తాత్రేయ కాలనీ, అరవ కాలనీలలో నుంచి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బాలినేనికి స్థానికులు హారతులు, పూల వర్షంతో, గుమ్మడి కాయలు దిష్టి తీసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ సామాన్యులు అనారోగ్యం పాలైతే ఆర్ధిక స్థోమత లేనప్పుడు అప్పులు చేసి మరీ కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఆ పరిస్థితికి చరమగీతం పాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని రకాల వ్యాధులకు ఆరోగ్య శ్రీలో అవకాశం కల్పించటంతో పాటు ఆరోగ్య శ్రీ ఖర్చు దాదాపు రూ.25 లక్షల వరకు ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అదేవిధంగా విద్య విషయంలో కూడా సీఎం వైఎస్ జగన్ ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంతో పాటు నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని గుర్తు చేశారు. వాటితో పాటు అమ్మ ఒడి పేరుతో పిల్లలను పనికి పంపకుండా బడికి పంపేందుకు ఆర్థిక సాయం చేయటం కూడా మరెక్కడా లేదన్నారు. చిన్నారులకు బూట్ల నుంచి దుస్తులు, సాక్సులు, టై అందజేసి విద్యను ప్రోత్సహిస్తున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను గడప ముంగిటకే తీసుకొచ్చి పరిపాలనను గ్రామాల్లోనే కొనసాగించారని చెప్పారు. ఒంగోలు నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానన్నారు. రానున్న ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించి ఆరోసారి గెలిపించి తనచేత సిక్సర్ కొట్టించాల్సిన బాధ్యత ఒంగోలు నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటి వద్ద బాలినేని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరాం నాగభూషణం, డివిజన్ అధ్యక్షుడు పోట్లూరి భాస్కర్, అడపాల రాము, వాకా కృష్ణారెడ్డి, గొర్రెపాటి శ్రీనివాసరావు, బొట్ల సుబ్బారావు, తమ్మినేని మాధవి, నారాయణ, తోటకూర రాజేష్, వంశీకృష్ణ, వెంకటేశ్వర్లు, సురేష్, కుమార్, ఇసాకు, ఏసు, విజయ్, వంశీ, పాజర్ల నాగరాజు, అశోక్ బాబు, సుబ్బయ్య, బాల గురవయ్య, పురిణి ప్రభావతి, లక్ష్మయ్య, గుర్రాల రామ్మోహన్తో పాటు పలువురు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఒంగోలు నగరంలోని 16వ డివిజన్లో ‘మన ఒంగోలు–మన వాసన్న’ -
టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన
● నిద్ర నటిస్తున్న ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం మార్కాపురం: మార్కాపురం పట్టణంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన టీడీపీ బైక్, ఎన్నికల ర్యాలీలో కోడ్ ఉల్లంఘన జరిగింది. పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సిన ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం నిద్ర నటిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు పచ్చ పాతం చూపిస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మార్కాపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల అధికారి నుంచి 65 బైక్లకు మాత్రమే అనుమతి తీసుకోగా, బైక్ ర్యాలీలో సుమారు 150కి పైగా బైక్లు పాల్గొన్నాయి. పట్టణంలోని పాత బస్టాండ్, నాయుడు వీధి, తేరు బజారు, మెయిన్ బజారుతో పాటు పట్టణమంతా హారన్లు మోగిస్తూ ర్యాలీ నిర్వహించినా ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం ఏమీ పట్టనట్లుగా వ్యవహరించారు. బృందానికి నాయకత్వం వహిస్తున్న వెలిగొండ ప్రాజెక్టులోని అధికారి తీరు విమర్శలకు తావిస్తోంది. కేవలం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేసే ర్యాలీలు, బహిరంగ సభలపై ఫోకస్ పెడుతూ కేసులు నమోదు చేస్తున్న ఆ అధికారి, టీడీపీ నేతలపై ప్రేమ చూపిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. బైక్ ర్యాలీలో అనుమతి కంటే ఎక్కువ వాహనాలు ఉన్నా ఆ అధికారికి కోడ్ ఉల్లంఘన కనిపించటం లేదా అని పలువురు విమర్శిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
వైఎస్సార్ సీపీ గెలుపు తథ్యం
సంతనూతలపాడు (చీమకుర్తి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర జన ప్రభంజనం సృష్టిస్తూ దూసుకెళ్తోందని, రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు తథ్యమని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున, బాపట్ల పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి అన్నారు. సంతనూతలపాడు పంచాయతీ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో శుక్రవారం వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మోదుగుల మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారని.. చంద్రబాబు తన పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని చెప్పారు. మళ్లీ ఈ ఎన్నికల్లో ఉత్తుత్తి వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ముందుకొస్తున్నారని ఎద్దేవా ఏశారు. సీఎం జగన్ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగార్జునను, ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్ను గెలిపించాలని కోరారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉందని, పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈనెల 24 న చీమకుర్తిలో తాను నామినేషన్ వేస్తానని, నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మారెళ్ళ బంగారు బాబు, ఎంపీపీ బీ విజయ, జెడ్పీటీసీలు దుంపా రమణమ్మ, వేమా శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బొల్లినేని కృష్ణయ్య, సొసైటీ ప్రెసిడెంట్ దుంపా యలమందారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, పేర్నమిట్టలోని 6 డివిజన్ల కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జేసీఎస్ కన్వీనర్లు, చీమకుర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, పీఏసీఎస్ త్రి మెన్ కమిటీ సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, పాల్గొన్నారు. సంతనూతలపాడులో విజయం సాధించి జగనన్నకు బహుమతిగా ఇస్తాం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ కార్యాలయం ప్రారంభం -
ఆశీర్వదించి అండగా నిలవండి
గిద్దలూరు రూరల్: ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించి అండగా నిలిస్తే గిద్దలూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కేపీ.నాగార్జునరెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కేపీ.నాగార్జునరెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా పట్టణంలోని ఆయన నివాస గృహం వద్ద నుంచి రాచర్ల రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా ప్రత్యేక వాహనంలో బయలుదేరారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా వారితో కలిసి ఊరేగింపుగా వచ్చారు. దీంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు మరింత ఉత్సాహంగా ముందుకు కదిలారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నాగార్జునరెడ్డిలు కలిసి జయరామ్ లాడ్జి వద్ద వాహనం దిగి అక్కడ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కేపీ.నాగార్జునరెడ్డి మీడియాతో మాట్లాడారు. జగనన్న మీ పై నమ్మకంతో గిద్దలూరు అభ్యర్థిగా నిలబెట్టారని, నియోజకవర్గ ప్రజలు తనను ఎమ్మెల్యేగా, చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆకాంక్షించారు. కేపీ.నాగార్జునరెడ్డి, ఆయన సతీమణి కుందురు కల్పన విడివిడిగా రెండు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి డి.నాగజ్యోతికి అందజేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, వైస్ చైర్మన్లు ఆర్.డి.రామకృష్ణ, కాతా దీపికా, ఎంపీపీ కడప లక్ష్మి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్సార్ సీపీ నాయకులు కామూరి రమణారెడ్డి, మాజీ సర్పంచి శివాపురం సురేంద్రకుమార్, మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, వేమిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఆర్ఐ మురళి, కావేటి ఈశ్వర్నాయుడు, చేరెడ్డి శ్రీకాంత్రెడ్డి, పర్చూరి నాగేశ్వరరావు, డా.భూమా నరసింహారెడ్డి, పాలుగుళ్ల నరసింహారెడ్డి, రాష్ట్ర గౌడసంఘం నాయకుడు కంచర్ల కోటయ్యగౌడ్, ఎదురు శ్రీనివాసరెడ్డి, పెండ్యేల కిరణ్, గర్రె చిరంజీవి, వైఎస్సార్ సీపీ జిల్లా క్రిష్టియన్ మైనారిటీ నాయకుడు గోన రంజిత్ కుమార్, కాపు నాయకుడు ముద్దర్ల శ్రీను పాల్గొన్నారు. గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేపీ నాగార్జునరెడ్డి నామినేషన్ దాఖలు పాల్గొన్న ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి -
మంచి ముహూర్తం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు అర్బన్: నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు శుక్రవారం ఏకాదశి మంచి రోజు కావడంతో జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒంగోలు పార్లమెంట్కు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 15 నామినేషన్లు వచ్చాయి. జిల్లాలో అధికార వైఎస్సార్ సీపీ, టీడీపీకి చెందిన పలువురు అభ్యర్థులు, స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. జనసంద్రమైన గిద్దలూరు: వైఎస్సార్ సీపీ గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా మార్కాపురం ఎమ్మెల్యే కేపీ.నాగార్జున రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో నిర్వహించిన భారీ ర్యాలీలో ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి కుందురు నాగార్జున రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కుందురు కల్పన కూడా వైఎస్సార్ సీపీ తరఫున మరో సెట్టు దాఖలు చేశారు. కొండపిలో మంత్రి ఆదిమూలపు తరుఫున.. కొండపి అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తరఫున కొండపి నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు కొండపి తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఏ.కుమార్కు మధ్యాహ్నం 12.25 గంటలకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ నామినేషన్ను ప్రపోజ్ చేసిన వారిలో రాష్ట్ర వైఎస్సార్సీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎన్నాబత్తిన వెంకటేశ్వర రావు(చిన్నా), రాష్ట్ర నాయకులు డాకా పిచ్చిరెడ్డి, కొండపి జెడ్పీటీసీ సభ్యురాలు మారెడ్డి అరుణ కుమారి రెడ్డి, పొన్నలూరు జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ వెంకటేశ్వర్లు ఉన్నారు. అసెంబ్లీకి పలువురు నామినేషన్లు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు, పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీడీపీ తరుఫున యర్రగొండపాలెం అసెంబ్లీ అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్ బాబు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దర్శి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా లక్ష్మీ గొట్టిపాటి ఒక సెట్టు నామినేషన్ వేశారు. సంతనూతలపాడు అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా బొమ్మాజి నిరంజన్ విజయ కుమార్ ఒక సెట్టు, కొండపి అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున డోలా కుటుంబ సభ్యులు డోలా రాజేశ్వరి కూడా ఒక సెట్టు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గిద్దలూరు అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. గిద్దలూరుకు స్వతంత్ర అభ్యర్థులు లక్ష్మీ రామ నాయక్ ముదావత్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున జువ్వాది పవన్ కుమార్, మార్కాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా పొట్టి వెంకట సుబ్బారావు, ఒంగోలు అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా బుట్టి రమేష్ బాబు, స్వతంత్ర అభ్యర్థిగా మన్నం సుధీర్ కుమార్లు నామినేషన్లు దాఖలు చేశారు. తొలిరోజు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు 8 అసెంబ్లీ స్థానాలకు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో రెండు రోజులు కలిపి మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయి. అశోక్రెడ్డిపై దొమ్మీ కేసు.. వాహన దగ్ధం, దొమ్మీ..ట్రెస్పాస్ కేసులు.ఇవీ గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి చరిత్ర. అశోక్రెడ్డిపై గిద్దలూరు పోలీస్స్టేషన్లో పలు సెక్షన్ల కింద ఉన్నాయి. అలాగే బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదై ఉంది. అశోక్రెడ్డి వద్ద రూ.3.50 లక్షల నగదు, భార్య పుష్పలీలా వద్ద రూ.6.68 లక్షల నగదు చేతిలో ఉన్నట్లు ఆఫిడవిట్లో చూపించారు. అశోక్రెడ్డి పేరుపై రూ.3.93 కోట్లు, భార్య పేరుపై రూ.2.59 కోట్లు చరాస్తులు చూపించారు. ఇద్దరి వద్ద సుమారు రూ.4.40 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.స్వామికి ఉంది డొక్కు కారేనట మరుగుదొడ్ల సొమ్మును భారీగా కాజేసిన కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజస్వామికి 2013 మోడల్ మారుతి కారు మాత్రమే ఉందని ఆఫిడవిట్లో పొందుపరిచాడు. తన దగ్గర రూ.1.26 లక్షల నగదు, తన భార్య వద్ద రూ.27 వేల నగదు మాత్రమే ఉన్నట్లు చూపించాడు. భార్యభర్తల పేరుపై రూ.47 లక్షల విలువైన చరాస్తులు, సుమారు రూ.35 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు చూపించాడు. స్వామిపై వివిధ పోలీస్స్టేషన్లలో 9 కేసులు నమోదై ఉన్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారీగా సొమ్ము కాజేసిన స్వామి..ఎన్నికల ఆఫిడవిట్లో చూపిన వివరాలు చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. -
నాడు కానిస్టేబుల్.. నేడు బాస్
ఒంగోలు సబర్బన్: గతంలో చిరు ఉద్యోగిగా ఉన్న వ్యక్తి నేడు దేశ అత్యున్నత సివిల్ సర్వీసెస్లో ప్రతిభ చాటాడు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్–2023 లో ఉత్తమ ర్యాంకు సాధించిన ఎం.ఉదయ్ కృష్ణా రెడ్డి గతంలో సాధారణ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించాడు. కానీ పట్టుదలతో నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు. సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా ఫలితాల్లో 780వ ర్యాంకు సాధించిన ఉదయ్ కృష్ణా రెడ్డిది సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం గ్రామం. ఈ సందర్భంగా ఎస్పీ గరుడ్ సుమిత్ సునిల్ స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో శుక్రవారం ఉదయ్ కృష్ణా రెడ్డిని సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ నేటి యువత ఉదయ్ కృష్ణా రెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తాను 2013 నుంచి 2018 వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు పోలీస్ స్టేషన్, రామాయపట్నం మైరెన్ పీఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించానన్నారు. ఐఏఎస్ సాధించిన రేవు ముత్యాల రాజును స్పూర్తిగా తీసుకొని సివిల్స్కు సిద్ధమయ్యానన్నారు. అందుకోసం 2018లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టుదలతో చదివానన్నారు. తన చిన్నప్పుడే తల్లి దండ్రులు చనిపోయారని, నాయనమ్మ రమణమ్మ తనను తీర్చిదిద్దారని చెప్పారు. -
మాయా ఉందీ.. మంత్రం ఉందీ!
పొదిలి రూరల్: గత సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న టీడీపీకి మళ్లీ ఊపిరి పోయడానికి ఆ పార్టీ నాయకులు ఫేక్ చేరికలను నమ్ముకుంటున్నారు. ఇప్పటీకే టీడీపీతో ఉన్న వారికే మళ్లీ పచ్చ కండువాలు కప్పుతున్నారు. సొంత ప్రయోజనాలు కోసం అధికార వైఎస్సార్ సీపీ వంచన కొన్నేళ్లు గడపిన వారిని కూడా నిస్సిగ్గుగా పార్టీలోకి చేర్చుకుంటున్నారు. వారిని వైఎస్సార్సీపీ నాయకులుగా చూపించి వలస వచ్చేస్తున్నారంటూ ఫోటోలు తీయించి ప్రచారం చేసుకుంటున్నారు. పొదిలి మండలంలోని టీ సల్లూరు, ఏలూరు, ఉప్పలపాడు, తలమళ్లలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మాగుంట శ్రీనివాసరెడ్డి, కందుల నారాయణరెడ్డి గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టి–సల్లూరు, ఏలూరు, ఉప్పలపాడు, గోగినేనివారిపాలెంలో ఎవరూ ఏ పార్టీలో చేరలేదు. కానీ తలమళ్లలో మాత్రం 100 కుటుంబాలు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరాయంటూ గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ సంబంరాలు చేసుకున్నారు. తలమళ్లలో మొత్తం 1500 మంది ఓటర్లున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 460 ఓట్ల మోజార్టీ వచ్చింది. తలమళ్ల పంచాయతీకి పక్కనున్న ఉప్పలపాడు చెందిన ఉలవా గోపి నిన్నటి వరకు వైఎస్సార్సీపీలో ఉండి, పార్టీ ద్వారా ప్రయోజనం పొందాడు. అవసరం తీరాక తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన సామెతగా ఇటీవల చంద్రబాబు నాయుడు మార్కాపురం వచ్చినప్పుడు ఆయన సమక్షంలో టీడీపీలో చేరాడు. సొంత ప్రయోజనాల కోసం వైఎస్సార్ సీపీ పంచన కొన్నేళ్ళు గడిపిన ముప్పరాజు శ్రీను.. ఎప్పటి నుంచో టీడీపీతో అంట కాగుతున్న ఇప్పుడు పార్టీ మారినట్లు నిస్సిగుగా చెబుతున్నారు. ఉలవా గోపి తన బలం నిరుపించుకోనే దానికి ఇటువంటి గోబెల్స్ ప్రచారానికి తెరలేపాడు. ఆయనకు అంతబలం ఉంటే స్వంత పంచాయతీ అయిన ఉప్పలపాడు, గోగినేనివారిపాలెంలో పార్టీలో చేర్పించాలి. అలా కాకుండా తలమళ్ళ పంచాయతీలోని ఫిర్దౌసినగర్లో చేరికలకు ప్రోత్సహించాడు. ఎందుకుంటే అక్కడ ఉన్న వారు చాలా నిరుపేదలు. వారిని మాయ మాటలతో పార్టీలో చేర్చాలనుకున్నాడు. కానీ ఆయన మాటలను నమ్మలేదు. వారిలో 10 మందిని ప్రలోభాలకు పెట్టి చేర్చుకున్నారు. ఆ 10 మందితో పాటు ఆదే పార్టీలో ఉన్న కొంతమందికి కండువాలు కప్పి ఫొటోలు తీయించి 100 కుటుంబాలు చేరినట్లుగా గొబెల్స్ ప్రచారం చేసుకోని సంబరపడుతున్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఘూటుగా స్పందించింది. దమ్ముంటే 100 కుటుంబాలు పేర్లు బయట పెట్టి నిరూపించాలని నేతలు సవాల్ విసిరారు. పార్టీతో సంబంధం ఉన్న వారికే మళ్లీ పచ్చ కండువాలు ప్రలోభాలతో 10 మందిని చేర్చుకుని..100 కుటుంబాలు అంటూ గోబెల్స్ ప్రచారం టీడీపీ తీరుపై అంతా విస్మయం -
కనిగిరిలో అధికారుల ఓవరాక్షన్
కనిగిరి రూరల్: ఎన్నికల నిబంధనల పేరుతో కనగిరిలో అధికారులు ఓవరాక్షన్ చేశారు. సీ విజిల్ యాప్లో టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుపై కనీస అవగాహన లేకుండా ఏకంగా వైఎస్సార్ సీపీ కార్యాలయంలోకి వచ్చి సమావేశాలు పెట్టొందంటూ దబాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం కనిగిరిలోని రామయ్యనాయుడు హాస్పిటల్ సెంటర్లో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆ పార్టీ డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముందుగా వచ్చిన పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతుండగా ఎంసీసీ నోడల్ అధికారి(మున్సిపల్ కమిషనర్), స్క్వాడ్ అధికారి(సీడీపీఓ) పోలీసులతో సహా వచ్చారు. ‘ఎక్కువ మందితో సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారు. ఇంతమంది గుంపుగా ఉండొద్దు. పర్మిషన్ తీసుకోవాలి’ అని ఒక అధికారి, ఎన్నికల నిబంధనావళి ప్రకారం రిటర్నింగ్ అధికారి ఆఫీసుకు 200 మీటర్ల లోపు పార్టీ కార్యాలయం ఉందని ఇంకో అధికారి రగడ చేశారు. సీఐ, ఎస్సైలు కూడా ఎన్నికల నామినేషన్ ముగిసేంత వరకు కార్యాలయం తలుపులు తీయవద్దంటూ హుకుం జారీ చేశారు. ప్రశ్నించిన నేతలు.. నీళ్లు నమిలిన అధికారులు వైఎస్సార్ సీపీ కార్యాలయానికి కార్యకర్తలు రాకూడదని ఏ నిబంధనల ప్రకారం చెబుతున్నారని అధికారులను ఆ పార్టీ నేతలు, పీడీసీసీబీ చైర్మన్ వైఎం ప్రసాద్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్ ప్రశ్నించారు. ఆర్వో కార్యాలయానికి పార్టీ ఆఫీస్ 200 మీటర్ల బయటే ఉందని, కావాలంటే కొలతలు వేసుకోవాలని చెప్పారు. తమ కార్యాలయంలో ముఖ్యులతో సమావేశం నిర్వహణకు అనుమతి తీసుకోవాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, టీడీపీ నేతల ఫిర్యాదుతో పార్టీ ఆఫీసు వద్దకు రావడం సరికాదన్నారు. నిబంధనలు చెప్పాలంటూ వైఎస్సార్ సీపీ నేతలతోపాటు అక్కడే ఉన్న విలేకర్లు ప్రశ్నించడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో వచ్చామంటూ అధికారులు ముక్తాయించి వెనుదిరిగారు. ఆర్వోకు ఫిర్యాదు నిబంధనల పేరుతో తమ కార్యాలయం వద్దకు వచ్చి కొందరు అధికారులు అనవసరం రాద్ధాంతం చేయడంపై వైఎస్సార్ సీపీ నేతలు ఎస్కే అబ్దుల్ గఫార్, పీడీసీసీబీ చైర్మన్ గఫార్, జెడ్పీటీసీ కస్తూరిరెడ్డి, చింతం శ్రీను తదితరులు ఆర్డీఓ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.జాన్ ఇర్విన్కు ఫిర్యాదు చేశారు. కనీస అవగాహన లేకుండా నిబంధనల పేరు చెప్పి రచ్చ చేయడంపై తీవ్ర అభ్యతరం తెలిపారు. నిజంగా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కొలతలు వేసి చూపాలని, టీడీపీ నేతల ఫిర్యాదుతో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం ఎన్నికల నిబంధనల పేరుతో కనిగిరిలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయ ప్రాంగణంలోని ఎంపీడీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, ట్రెజరీ, ఐసీడీసీఎస్ కార్యాలయాలకు ప్రజలతోపాటు ఉద్యోగులు కూడా వెళ్లకుండా అడ్డుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 200 మీటర్ల దూరం నిబంధన పేరుతో ప్రధాన రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో డిపో వద్ద నుంచి పట్టణంలోకి వచ్చేందుకు వృద్ధులు, మహిళలు చంటి పిల్లలతో నానా అవస్థలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని నిబంధనలు ఇప్పుడే ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో అత్యుత్సాహం? ఏకంగా వైఎస్సార్ సీపీ కార్యాలయంలోకి వచ్చి సమావేశాలు పెట్టొద్దంటూ హల్ చల్ ఆర్వో కార్యాలయానికి 200 మీటర్ల లోపు ఉందని, అనుమతి లేదని వితండవాదం కనీస అవగాహన లేకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు -
ఇంటి దొంగలకు అరదండాలు
ఒంగోలు సబర్బన్: నగరంలో సంచలనం సృష్టించిన ఏటీఎంలలో నగదు నింపే వాహనంలో అపహరణకు గురైన కేసును ఒంగోలు పోలీసులు 20 గంటల్లోనే చేధించారు. రోజు గడవకు ముందే నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్)ఎస్వీ శ్రీధర రావు నేతృత్వంలోని బృందం గురువారం సాయంత్రం నుంచే రంగంలోకి దిగి అత్యంత వేగంగా కేసును ఛేదించారు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ జిల్లా పోలీస్ కార్యాలయంలోని గెలాక్సీ భవన్లో శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏటీఎంలలో నగదు నింపే క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ (సీఎంఎస్కు చెందిన వాహనం గురువారం మధ్యాహ్నం కర్నూలు రోడ్డులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు కాంపౌండ్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చింది. సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ సిబ్బంది వివిధ బ్యాంకుల నుంచి మొత్తం రూ.68 లక్షలు నగదు వాహనం (ఏపీ16 టీడీ 7552)లో ఉంచి దాన్ని అక్కడే ఆపి గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు భోజనం చేయటానికి పెట్రోల్ బంకు వెనక్కు వెళ్లారు. భోజనం చేసి వచ్చి చూసే సరికి వాహనం వెనుక తాళం తీసి ఉండటాన్ని గమనించారు. దీంతో లోపల నగదు అపహరణకు గురైనట్లు సిబ్బంది గుర్తించి మేనేజర్ గుజ్జుల వెంకట కొండారెడ్డికి తెలపడంతో ఆయన తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫింగర్ ప్రింట్ నిపుణులు వచ్చి ఆధారాలు సేకరించారు. గాలింపు చేపట్టిన నాలుగు ప్రత్యేక బృందాలు ఏఎస్పీ (క్రైమ్స్) ఎస్వీ శ్రీధర రావు ఆధ్వర్యంలో ఒంగోలు తాలూకా సీఐ భక్తవత్సల రెడ్డి అపహరణకు గురైన నగదును పట్టుకోవటానికి ప్రత్యేకంగా నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేర్పాటు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. సీఎంఎస్ సంస్థలో పనిచేస్తున్న, పనిచేసి మానేసిన సిబ్బందిపై అనుమానం కలిగింది. పెట్రోలు బంకులోని సీసీ ఫుటేజీ ఆధారంగా నగదు అపహరించిన వ్యక్తులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సంస్థలో పనిచేసి మానేసిన సంతనూతలపాడు మండలం కామేపల్లివారి పాలెం గ్రామానికి చెందిన సన్నమూరు మహేష్ బాబును శుక్రవారం ఉదయం పేర్నమిట్ట శివారులోని ఎన్ఎస్పీ కెనాల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న రూ.66 లక్షల నగదుతో పాటు అతని ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నగదు అపహరణకు సహకరించిన.. పోలీసులకు ఫిర్యాదు చేసిన గుజ్జుల వెంకట కొండారెడ్డి, రాచర్ల రాజశేఖర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంస్థ మేనేజర్గా పని చేస్తూనే సంస్థకు చెందని నగదు అపహరించడం గమనార్హం. సిబ్బందిని అభినందించిన ఎస్పీ కేసును అత్యంత వేగంగా చేధించినందుకు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ పోలీస్ అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఏఎస్పీ శ్రీధర రావు, ఒంగోలు డీఎస్పీ ఎం.కిషోర్ బాబు, ఒంగోలు తాలూకా సీఐ భక్తవత్సల రెడ్డి, సీసీఎస్ ఎస్సై టి.విజయ కృష్ణ, సైబర్ సెల్ సీఐ సూర్య నారాయణ, తాలూకా ఎస్సైలు పున్నారావు, విజయ కుమార్, మద్దిపాడు ఎస్సై మహేష్, ఏఎస్సై టి. బాలాంజనేయులు, నాగేశ్వరరావు, సురేష్ బాబు, రమేష్ బాబుతో పాటు పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ పోలీస్ నగదు రివార్డులు, ప్రశంస పత్రాలు అందజేశారు. 20 గంటల్లో భారీ నగదు కేసు ఛేదించిన పోలీసులు ఏటీఎంలలో నగదు నింపే వాహనంలో అపహరణకు గురైన నగదు రూ.66 లక్షలు స్వాధీనం వాహనంలో పనిచేసే ఉద్యోగులే సూత్రధారులు రోజు గడవక ముందే అదుపులోకి నిందితులు వివరాలను వెల్లడించిన ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ -
ఆది నుంచి ఉగ్రది దొడ్డిదారే
కనిగిరి రూరల్: ‘టీడీపీ నాయకుడు ఉగ్రది ఆది నుంచి దొడ్డి దారే. అతనికి మళ్లీ తగిన గుణపాఠం చెప్పి అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా ఇంటికే పరిమితం చేయాలని వైఎస్సార్సీపీ రీజనల్ డిప్యూటీ కో ఆర్డినేటర్, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్గఫార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నేత ఉగ్ర నరసింహారెడ్డి ఇటీవల ఒక కార్యక్రమంలో పింఛన్లపై అహంకారపూరితంగా మాట్లాడడన్నారు. వైఎస్సార్ సీపీ అభిమానులంతా మరోసారి ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి వైఎస్సార్ సీపీ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వివరించి ఓటును అభ్యర్థించాలన్నారు. క్షేత్ర స్థాయిలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవాలన్నారు. బూత్ల వారీగా సమష్టి ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. పార్టీ శ్రేణులంతా సమష్టిగా పనిచేసి దద్దాల నారాయణను ఎమ్మెల్యేగా, చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందాం అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెడ్డి కార్పొరేషన్ చైర్మన్, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు చింతలచెరువు సత్యన్నారాయణరెడ్డి, పీడీసీసీబీ చైర్మన్ వైఎం ప్రసాద్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చింతంగుంట్ల సాల్మన్ రాజు, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, గాయం సావిత్రి, రామన తిరుపతిరెడ్డి, అత్యాల జఫన్య, జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, వాసవీసత్ర సముదాయ జాతీయ అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు, ఎస్ మోహన్రెడ్డి, ఎస్కే జిలాని, లక్ష్మీ మోహన్, వైస్ చైర్మన్లు పులిశాంతి గోవర్ధన్రెడ్డి, ఆర్ మాణిక్యరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయండి ఉగ్రకు మరోసారి గుణపాఠం చెప్పాలి వైఎస్సార్ సీపీ రీజనల్ డిప్యూటీ కో ఆర్డినేటర్ టీజేఆర్ సుధాకర్బాబు -
వైఎస్సార్ సీపీని గెలిపిస్తేనే అభివృద్ధి
టంగుటూరు: అన్ని వర్గాల అభివృద్ధి వైఎస్సార్ సీపీతోనే సాధ్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కొండపి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మండలంలోని మర్లపాడు గ్రామంలో మంత్రి పల్లె పల్లెకు సిద్ధం శుక్రవారం నిర్వహించారు. పార్టీ నాయకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టి ఓటు బ్యాంకుగా వాడుకుంటే, సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి వచ్చిన తర్వాత వారు సామాజకంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేశారన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నవరత్నాల్లో భాగస్వాములను చేశారన్నారు. ఎన్నికల కమిషన్కు వలంటీర్లపై ఫిర్యాదు చేసి.. అవ్వా తాతలకు ఇంటి వద్ద పింఛను రానివ్వకుండా, సచివాలయాల వద్ద తీసుకునేలా చేశారన్నారు. అలా మండుడుటెండకు రాష్ట్రంలో 30 మంది ముసలి వారిని బాబు పొట్టన పెట్టుకున్నాడన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపిస్తేనే కొండపి నియోజకవర్గంలో అభివృద్ధిలో ముందుకెళ్తుందని చెప్పారు. రెండు దఫాలుగా టీడీపీ ఎమ్మెల్యే స్వామి ఉన్నారని.. నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. ఎంపీగా చెవిరెడ్డి భాస్కరరెడ్డికి, ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు మల్లవరపు రాఘవరెడ్డి, జెడ్పీటీసీ మన్నం అరుణకుమారి, సర్పంచ్ తాళ్ళూరి ఆశీర్వాదం, సింగమనేని బ్రహ్మయ్య, ఈదర అమర్నాథ్, బొల్లి నేని వెంకటేశ్వర్లు, బుర్రా రవి, బత్తుల రవణయ్య, బత్తుల మంగమ్మ, కొర్లపాటి శ్రీను, మేకా పోలయ్య, బుర్రా వెంకటేశ్వర్లు, మన్నం వెంకయ్య, అంగలకుర్తి మహేష్, కొమ్ము కోటేశ్వరరావు, రామపాటి లక్ష్మయ్య, కొమ్ము శ్రీను, రాయపాటి పురుషోత్తం, దేవదాసు, గుంటు యోహాను, బొట్ల సుబ్బారావు, పాటుబండ్ర బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. మంత్రి, కొండపి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మర్లపాడులో పల్లె పల్లెకు సిద్ధం -
టీడీపీ ప్రచారంలో కాంట్రాక్టు ఉద్యోగి
కొమరోలు: కాంట్రాక్టు ఉద్యోగులు టీడీపీ జెండాలు మోస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మొన్న కొమరోలు మండలంలోని అక్కపల్లెలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా మరోసారి మల్లారెడ్డిపల్లెలో ఇదే ఘటన చోటుచేసుకుంది. కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో కాంట్రాక్టు కంప్యూటర్ ఆపరేటర్గా శన్నుబాబు పనిచేస్తున్నాడు. ఇటీవల ఎన్నికల ప్రచారం నిమిత్తం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పర్యటించగా శన్నుబాబు ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ప్రచారంలో పాల్గొన్నాడు. వారం రోజుల క్రితమే శన్నుబాబు కుటుంబసభ్యులను టీడీపీలోకి చేరారు. సంబంధిత అధికారులు శన్నుబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కంభంలో... కంభం: కందులాపురం పంచాయతీ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న చింతన బోయిన శ్రీనివాసులు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. శుక్రవారం సాయంత్రం టీడీపీ నాయకులు కాంట్రాక్ట్ ఉద్యోగి శ్రీనివాసులు నివాసం ఉండే ప్రాంతంలో ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో టీడీపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అదే సమయంలో పార్టీ కార్యాలయానికి వచ్చిన శ్రీనివాసులు..సుమారు గంట పాటు అక్కడే ఉన్నాడు. కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ బహిరంగా టీడీపీ నాయకులతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నా అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వలంటీరూ.. ఇదేం తీరు! మార్కాపురం: పట్టణంలో శుక్రవారం సాయంత్రం టీడీపీ బైక్ ర్యాలీ జరిగింది. అయితే మార్కాపురం మండలం గోగుల దిన్నె (కంది వారి పల్లి) గ్రామానికి చెందిన పల్లపోలు వెంకట శ్రీనివాస్ రెడ్డి అనే వలంటీర్ ఈ ర్యాలీలో పాల్గొని బాబుకు వీరవిధేయుడినంటూ హంగామా చేశాడు. -
No Headline
ఏపీ ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల ఒంగోలు సెంట్రల్: జిల్లాలోని ఆరు మోడల్ స్కూళ్లలో 2024–25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రవేశ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి డీ సుభద్ర తెలిపారు. ప్రవేశ పరీక్ష ఈనెల 21న ఉదయం పది నుంచి 12 గంటలకు వరకు నిర్వహిస్తారన్నారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని చెప్పారు. హాల్ టికెట్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. సంబంధిత ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఒంగోలులో భారీ చోరీ ఏటీఎం వాహనం నుంచి రూ.64 లక్షలు లూటీ! ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో పట్టపగలే దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం సెంటర్లలో నగదు నింపే వాహనం నుంచి చాకచక్యంగా రూ.64 లక్షలు కాజేశారు. ఈ సంఘటన ఒంగోలు ఆర్టీసీ డిపో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. డిపో సమీపంలో కర్నూలు రోడ్డులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద పక్కనే ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో నగదు నింపేందుకు సీఎమ్ఎస్ సంస్థకు చెందిన వాహనం వచ్చింది. పెట్రోల్ బంక్ ఆవరణలో వాహనాన్ని నిలిపిన సిబ్బంది.. ఆఫీస్ రూమ్లో భోజనం చేసి తిరిగి వచ్చే సరికి సీఎమ్ఎస్ వాహనం తలుపులు తెరిచి ఉన్నాయి. రూ.64 లక్షలు చోరీ అయ్యాయ ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని ఏఎస్పీ(క్రైమ్స్) శ్రీధరరావు, డీఎస్పీ కిషోర్బాబు, తాలూకా సీఐ భక్తవత్సలరెడ్డి పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. పోలీసు సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పదంగా సంచరించిన ఓ వ్యక్తిని గురించారు. కాగా.. పట్టపగలు పెట్రోలు బంకు వద్ద జన సంచారం ఉన్న ప్రాంతంలో నగదు చోరీ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కనిగిరి గడ్డ వైఎస్సార్ సీపీ అడ్డా..
కనిగిరి రూరల్: ‘‘మనమంతా సమష్టిగా, సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా పనిచేద్దాం.. కనిగిరి కొండపై వైఎస్సార్ సీపీ జెండాను మళ్లీ ఎగురేద్దాం.. కనిగిరి గడ్డ వైఎస్సార్ సీపీ అడ్డా.. వైఎస్ జగన్ మోహన్రెడ్డిని మళ్లీ సీఎం చేసుకుందాం’’ అని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం రాత్రి పార్టీ నేతలతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి బాబురావు మాట్లాడుతూ టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా 2024లో కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డేనన్నారు. సంక్షేమ లబ్ధిదారులంతా వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి అండగా ఉన్నారని తెలిపారు. కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ నేత చేసే జిమ్మిక్కులను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. సామాజిక న్యాయంలో భాగంగానే వైఎస్సార్ సీపీ కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా దద్దాల నారాయణ యాదవ్ను సీఎం ప్రకటించినట్లు చెప్పారు. సీఎం జగన్ తనకు ఎంతో మంచి అవకాశాలు కల్పించారని, తానే వెళ్లలేదని స్పష్టం చేశారు. దద్దాల నారాయణను ఎమ్మెల్యేగా, చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీసీసీబీ చైర్మన్ వైఎం ప్రసాద్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, జెడ్పీటీసీ కస్తూరిరెడ్డి, వైస్ చైర్మన్లు పులి శాంతి గోవర్ధన్రెడ్డి, ఆర్ మాణిక్యరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్రెడ్డి, వాసవీ సత్ర సముదాయ జాతీయ అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ జిలాని, కౌన్సిలర్లు చింతం శ్రీను, ఎస్కే ఫయాజ్, ఎస్కే సందాని, గడ్డ మస్తాన్వలి, పెన్నా ఏడుకొండలు, ఎస్కే ఖాజా, సయ్యద్ రిజ్వానా ఖాలక్, ఎస్కే బజాజ్ బుజ్జీ, ఏఎంసీ డైరక్టర్లు బొట్టు శ్రీను, రహిమాన్, పార్టీ యూత్ పట్టణ, మండల అధ్యక్షుడు డాక్టర్ రసూల్, మాలీ యాదవ్, నాయకులు పిల్లి లక్ష్మీ నారాయణరెడ్డి, ఎం వెంకటేశ్వరరెడ్డి, డీ మాలకొండారెడ్డి, మూలే గోపాల్రెడ్డి, మన్సూర్, కే రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కనిగిరి కొండపై వైఎస్సార్ సీపీ జెండా ఎగరేద్దాం మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు -
ఐదేళ్లలో జనరంజక పాలన
ఒంగోలు సబర్బన్: రాష్ట్రంలో గడచిన ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనరంజక పాలన సాగించారని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బాలినేని మన ఒంగోలు–మన వాసన్న కార్యక్రమంలో భాగంగా బాలాజీ నగర్లో గురువారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని బాలినేని చేపట్టారు. 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరాం నాగభూషణంతో కలిసి అగ్రహారం గేటు అవతల సుగుణారావు కాలనీ నుంచి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి బాలాజీ నగర్ మొత్తం పర్యటించారు. ఈ సందర్భంగా బాలినేనికి స్థానికులు హారతులు, పూల వర్షంతో, గుమ్మడి కాయలు దిష్టి తీసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి, మరోపక్క సంక్షేమం రెండూ రైలు పట్టాల మాదిరిగా సీఎం వైఎస్ జగన్ కొనసాగించారన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సీమలకు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలతో పరిపాలనను గ్రామాల్లోనే కొనసాగించారన్నారు. ఒంగోలు నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించి ఆరోసారి గెలిపించి తనచేత సిక్సర్ కొట్టించాల్సిన బాధ్యత ఒంగోలు నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటి వద్ద బాలినేని వివరించారు. సీఎం వైఎస్ జగన్ నవరత్నాల పథకం ద్వారా నిరుపేదలైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు వచ్చేలా చేసి ఆదుకున్నారన్నారు. నగరంలో ఇళ్లులేని నిరుపేదలకు 25 వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందని, వచ్చిన వెంటనే 25 వేల మందికి ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్, ఏఎంసీ చైర్మన్ కొఠారు రామచంద్రరావు, కార్పొరేటర్ శ్రీరాం నాగభూషణం, డివిజన్ అధ్యక్షుడు పోట్లూరి భాస్కర్, అడపాల రాము, వాకా కృష్ణా రెడ్డి, టీ రాజేష్, పురిణి ప్రభావతి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో ఎవరూ చేయని విధంగా అభివృద్ధి సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా గడప ముంగిటకే పాలన ఒంగోలును ఎంతగానో అభివృద్ధి చేశా... 16వ డివిజన్లో మన ఒంగోలు–మన వాసన్న కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినేని -
65 మంది వలంటీర్లు మూకుమ్మడి రాజీనామా
ఒంగోలు సబర్బన్: నగరంలోని వలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ మేరకు ఆయా డివిజన్లలోని వార్డు సచివాలయాల అడ్మిన్లకు తమ రాజీనామా పత్రాలు అందజేశారు. అనంతరం మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి వారి మద్దతు బాలినేనికి ప్రకటించారు. రాజీనామాలు చేసిన వారిలో 46వ డివిజన్కు చెందిన వాలంటీర్లు 25 మంది, 23వ డివిజన్ వలంటీర్లు 17 మంది, 8వ డివిజన్ క్రిస్టియన్ పాలెంకు చెందిన వార్డు సచివాలయం వలంటీర్లు 23 మంది ఉన్నారు. బాలినేని వలంటీర్లకు ధైర్యాన్ని ఇచ్చి, ఏ అవసరమైనా తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. చంద్రబాబు కుట్రలకు వలంటీర్లు బలయ్యారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తొలి సంతకం వలంటీర్ల నియామకంపైనే పెడతానని ప్రకటించిన విషయాన్ని బాలినేని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో పాటు స్థానిక కార్పోరేటర్లు పాల్గొన్నారు. -
చంద్రబాబు విఫల నాయకుడు
పొదిలి రూరల్ : చంద్రబాబు 2014–19 వరకు తన పాలనలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా విఫలమయ్యాడని వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ రీజినల్ డిప్యూటీ కో–ఆర్డినేటర్, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు విమర్శించారు. పొదిలిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో మోదీ, చంద్రబాబు, పవన్కళ్యాణ్లు తిరుపతి నుంచి విశాఖ వరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి వరాల జల్లు కురిపించారని గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని, ప్రపంచ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులిస్తామని చెప్పి ఎన్నికల ప్రచారం చేశారని తెలిపారు. విభజన హామీలైన స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టు, రైల్వే జోన్, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం.. లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 2014లో ఓట్లడిగి అధికారంలోకి వచ్చినట్టు చెప్పారు. కానీ చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చినపాపాన పోలేదన్నారు. మీ హామీలపై ఎక్కడైనా చర్చించడానికి సిద్ధమని సవాల్ చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు అదనంగా డబ్బులు ఇస్తామని అబద్ధపు మాటలు చెబుతున్నారే తప్ప.. కొత్త పథకాలేవని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పగలరా.. అంటూ నిలదీశారు. మతాలు, కులాల పేరుతో రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిన వ్యక్తి చంద్రబాబని మండిపడ్డారు. అన్నదమ్ములుగా ఉన్న మాల, మాదిగల మధ్య వర్గీకరణ పేరుతో చిచ్చుపెట్టారని, బీసీలకు, కాపులకు గొడవ పెట్టాడని దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లాలో దళితుల భూముల లాక్కుంది, విశాఖ జిల్లాలో దళిత మహిళను అవమాన పరిచింది మీరు కాదా అని ప్రశ్నించారు. స్థానిక టీడీపీ అభ్యర్థి బహిరంగ సభలో మీరు ఓట్లు వేయకపోతే చచ్చిపోతానని చెప్పడమంటే.. ఓటమిని అంగీకరించడమేనన్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఒంగోలు పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ అభ్యర్థులు గెలుస్తారని సుధాకర్బాబు స్పష్టం చేశారు. 2014–19లో ఒక్క హామీనీ నెరవేర్చలేదు మళ్లీ జన్మభూమి కమిటీలను పెడతాననే దమ్ముందా? ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు -
వ్యయ పరిశీలకునిగా దూకే బిశ్వాస్
ఒంగోలు అర్బన్: జిల్లాకు ఎన్నికల వ్యయ పరిశీలకునిగా దూకే బిశ్వాస్ నియమితులయ్యారు. గురువారం ప్రకాశం భవనంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ను మర్యాద పూర్వకంగా కలిశారు. బిశ్వాస్ జిల్లాలో ఒంగోలు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకునిగా వ్యవరించనున్నారు. నేడు జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవాలు ఒంగోలు సెంట్రల్: జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవాలు శుక్రవారం జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డీ సుభద్ర తెలిపారు. స్కూల్ స్థాయి విజేతల వివరాలు తప్పనిసరిగా ప్రేరణ పోర్టల్లో నమోదు చేసి వారి స్కూల్ డైస్ కోడ్తో లాగిన్ అయి ఆన్లైన్ చేయాలని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. విజేతల వివరాలన్నింటినీ సంబంధిత ప్రధానోపాధ్యాయుల ధ్రువీకరణతో పంపాలని చెప్పారు. స్టూడెంట్, ఎస్కార్ట్ టీచర్లు ఐడెంటిటీ కార్డుతో సహా శుక్రవారం ఉదయం 9 గంటలకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. డ్రాయింగ్ పోటీల్లో పాల్గొనే వారు డ్రాయింగ్ కలర్స్, ప్యాడ్ మొదలైనవి వారి వెంట తెచ్చుకోవాలన్నారు. ఇతర వివరాలకు మండల విద్యాశాఖాధికారిని, సమగ్రశిక్ష వారిని సంప్రదించాలని కోరారు. జిల్లా విద్యాశాఖాధికారి డీ సుభద్ర -
గంట మోగింది..
● నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారి దినేష్కుమార్ ● జిల్లాలో పార్లమెంట్, 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్లు షురూ ● భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామినేషన్ ● కనిగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి దద్దాల నారాయణ ఒక సెట్ నామినేషన్ దాఖలు ● అఫిడవిట్ దాఖలు చేయని టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి సార్వత్రిక సంగ్రామానికితొలిరోజు 13 నామినేషన్లు దాఖలుగురువారం దశమి, తొలి రోజు మంచి ముహూర్తం కావడంతో జిల్లా వ్య్ప్తాంగా 13 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో పార్లమెంట్ నియోజకవర్గానికి నాలుగు, అసెంబ్లీ నియోజకవర్గాలకు తొమ్మిది నామినేషన్లు సమర్పించారు. పార్లమెంట్కు సంబంధించి ప్రస్తుత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన సతీమణి మాగుంట గీతాలత విడివిడిగా చెరొక నామినేషన్ వేశారు. అయితే పార్టీ ఇచ్చే బీ–ఫాం, ఏ–ఫాంలు కానీ, అఫిడవిట్ కాని అందచేయకుండానే నామినేషన్లు వేశారు. వీరి తోపాటు స్వతంత్ర అభ్యర్థులుగా బూచి ఏడుకొండలు, బొడ్డు క్రాంతి కుమార్ కూడా నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. సాక్షిప్రతినిధి, ఒంగోలు: సార్వత్రిక ఎన్నికలు–2024లకు నగారా మోగింది. ఈ ఎన్నికలకు సంబంధించి గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు గురువారం కలెక్టర్ ఏఎస్.దినేష్ కుమార్ నోటిఫికేషన్ను ప్రకాశం భవన్లో విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదలతో పాటుగా నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఒంగోలు పార్లమెంట్తో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించారు. కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విధులు నిర్వర్తిస్తారు. ఒంగోలు పార్లమెంట్కు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఒంగోలులోని ప్రకాశం భవన్లో తమ నామినేషన్ పత్రాలు సమర్పించాల్సి ఉంది. అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీచేయాలనుకునే అభ్యర్థులు ఆయా నియోజకవర్గ కేంద్రంలో తమ నామినేషన్లను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు సమర్పించాల్సి ఉంది. దర్శిలో బూచేపల్లి నామినేషన్: దర్శి అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద రెడ్డి వైఎస్సార్ సీపీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి అభిమానులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారితో ర్యాలీగా వెళ్లి దర్శి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు సమర్పించారు. బూచేపల్లి శివప్రసాద రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు, బూచేపల్లి సతీమణి నందిని కూడా వైఎస్సార్సీపీ తరఫున రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఏఆర్ఓ వద్ద దాఖలు చేశారు. అదేవిధంగా కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ తరఫున దద్దాల నారాయణ యాదవ్ ఒక సెట్ నామినేషన్ను కనిగిరి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఒంగోలు శాసనసభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఎ.శంకర్రెడ్డి, గిద్దలూరులో ఈవీ సురేష్ బాబు, కొండపిలో శ్రీపతి సతీష్, ఎస్ఎన్పాడులో కై కాల వెంకటరావు, దర్శిలో మీనా మంచా, పుట్లూరు కొండారెడ్డి నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. నోటిఫికేషన్ విడుదల ఒంగోలు అర్బన్: సార్వత్రిక ఎన్నికలకు గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. 26వ తేదీ పరిశీలన, 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు. నామినేషన్లు జరిగే సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల దూరం వరకు అభ్యర్థికి సంబంధించిన మూడు వాహనాలను మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. అభ్యర్ధితోపాటు నామినేషన్ దాఖలుకు ఆర్ఓ వద్దకు అభ్యర్థి సహా ఐదుగురిని మాత్రమే అనుమతించారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఒంగోలు లోక్సభ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ వ్యవహరించారు. -
నగర నడిబొడ్డు దిగ్బంధం
ఒంగోలు సబర్బన్: ఎన్నికల నిబంధనల పేరుతో నగరంలో తీవ్ర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగర నడిబొడ్డు ప్రకాశం భవన్, చర్చి సెంటర్లను పూర్తిగా దిగ్బంధించడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఎటువంటి ముందస్తు సూచనలు చేయకుండానే పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ఒక పక్క భానుడి ప్రతాపం, మరోపక్క పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ పత్రాల స్వీకరణలో భాగంగా నగరానికి కేంద్ర బిందువును పోలీసులు పూర్తిగా ఇనుప బారికేడ్లతో మూసేశారు. కనీసం పోలీసులు ముందస్తుగా నగర ప్రజలకు సూచనలు కూడా చేయకుండా రాత్రికి రాత్రి అష్ట దిగ్బంధం చేయటంతో గురువారం ఉదయం నుంచి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాహనదారులు ఇక్కట్లు చెప్పేవీ కావు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలకు ఒంగోలు నగర పోలీసులు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారు. గతంలో ఎన్నికల సందర్భంగా ప్రకాశం భవన్ ముందు, ఆర్డీఓ కార్యాలయం ముందు ట్రాఫిక్ ఆంక్షలు విధించేవారు. కానీ ప్రస్తుతం మాత్రం పోలీసులు నగరంలోని ప్రధాన రహదారులను దిగ్బంధించారు. ట్రంకురోడ్డును మిరియాలపాలెం సెంటర్ వరకు మూసేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటు చర్చి సెంటర్ నుంచి మిరియాలపాలెం వరకు దుకాణాలను పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు రోడ్డును పూర్తిగా ఇనుప బారికేడ్లతో మూసేశారు. అటు సీవీఎన్ రీడిండ్ రూము నుంచి హెచ్సీఎం కాలేజీ వైపు వచ్చే రోడ్డును కూడా మూసేయంతో అటు ప్రజలు, ఇటు వాహన దారుల ఇక్కట్లు వర్ణణాతీతంగా మారింది, చర్చి సెంటర్ నుంచి ఇటు రైల్వేస్టేషన్కు వెళ్లే కలెక్టర్ బంగ్లా రోడ్డును రాకపోకలకు నిలువరించారు. మిరియాలపాలెం సెంటర్ వరకు ఉన్న దుకాణాలు, హెచ్సీఎం సెంటర్ నుంచి సీవిఎన్ రీడిండ్ రూమ్ వరకూ ఉన్న వ్యాపారస్తులు కూడా దుకాయాలను మూసేశారు. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ నుంచి ఏబీఎం కాలేజీ మీదుగా వెళ్లే వన్వే ట్రాపిక్ రోడ్డు కాస్తా టూ వే రోడ్డుగా మారడంతో తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రకాశం భవనంలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం కార్యాలయానికి వెళ్లేందుకు, తిరిగి బయటకు వచ్చేందుకు ఇక్కట్లు పడ్డారు. తాము ప్రకాశం భవనంలో పనిచేస్తున్నామని చెప్పినా విధుల్లో ఉన్న సిబ్బంది కనికరించకపోవడంతో వారంతా చుట్టూ తిరిగి కార్యాలయాలకు చేరుకోవాల్సి వచ్చింది. ఎన్నికల నిబంధనల పేరుతో పోలీసులు నగర ప్రజలకు మొదటి రోజే చుక్కలు చూపించారు. ఇప్పటికై నా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ట్రాఫిక్ చక్ర బంధం నుంచి నగర ప్రజలను కాపాడాలని వేడుకుంటున్నారు. నామినేషన్ల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు విధింపు ముందస్తు సూచనలు చేయకుండానే.. -
జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి
● రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కొండపి (మర్రిపూడి): జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కొండపి అభ్యర్థి ఆదిమూలపు సురేష్ అన్నారు. మండలంలోని గొడుగులపాలెం, దాసిరెడ్డిపాలెం, ముక్కోడిపాలెం గ్రామాల్లో గురువారం పల్లె పల్లెకు సురేష్ అన్న సిద్ధం కార్యక్రమంలో పాల్గొని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు అమలవుతాయన్నారు. టీడీపీ అధికారం కోసం కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని, ఆ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. 2014 టీడీపీ అధికారంలోకి ఉన్న సమయంలో ప్రజలకు ఒక్కటంటే ఒక్క పనిచేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా లేదన్నారు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలను అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. 2024 ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ కోటిలింగయ్య, జేసీఎస్ కన్వీనర్ మురళి, కొండపి సొసైటీ అధ్యక్షుడు ఉపేంద్ర చౌదరి, మండల నాయకులు బొక్కిసం సుబ్బారావు, హరినారాయణ, శేఖారెడ్డి, నారాయణ, కొర్నేలు, వెంకటాద్రి, వేముల రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రమేష్, చింతల వెంకటేశ్వర్లు, సత్యం పంతులు, నరాల చిన్నబ్బాయి యామవరపు వసంతరావు తదితరులు పాల్గొన్నారు. 10 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరిక కొండపిలో రజక సంఘ నాయకుడు యామవరపు వసంతరావు ఆధ్వర్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ సమక్షంలో 10 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరారు. మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
చంద్రబాబు బూటకపు మాటలు నమ్మొద్దు
● వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ పెద్దదోర్నాల: చంద్రబాబు బూటకపు హామీలను నమ్మితే ప్రజలు మునిగిపోతారని వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మండల పరిధిలోని రామచంద్రకోట, కడపరాజుపల్లె, జమ్మిదోర్నాల, హసానాబాద గ్రామాల్లో గురువారం మన ఊరికి మన చంద్రశేఖరన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఆయా గ్రామాల్లో ప్రతి గడపకు వెళ్లి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. జగన్మోహనరెడ్డి అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తుంచుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి తెచ్చుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను అభ్యర్థించారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు వెన్నుపోటు రాజకీయాల్లో దిట్టన్నారు. తన రాజకీయ స్వలాభం కోసం సొంత మామనే మోసం చేసిన వ్యక్తి అని విమర్శించారు. అలాంటి వ్యక్తి పేదల ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను అందించడంలో బాబు విఫలమయ్యారన్నారు. బాబు హయాంలో రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు. తన స్వార్థ రాజకీయాల కోసం ఇతర పార్టీలతో జతకట్టడం ఆయన నైజమని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాభివృద్ధిని ఆయన ఏనాడూ పట్టించున్న పాపానపోలేదన్నారు. జగనన్న అధికారంలోకి వచ్చాక రాష్ట్రాభివృద్ధిని పట్టాలెక్కించారని చెప్పారు. పేదల బాగు కోసం ఎన్నో సంక్షేమ పథకాలను గడప వద్దకే తెచ్చి ఆర్థికాభివృద్ధికి అండగా నిలిచారని పేర్కొన్నారు. అనంతరం గ్రామాల్లోని మహిళలతో మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. టీడీపీకి ఓటు వేస్తే మరోసారి మోసపోయినట్లేనని, సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసుకున్నట్టేనని వివరించారు. రానున్న ఎన్నికల్లో తనతో పాటు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సర్పంచ్లు చిత్తూరి హారిక, దర్శనం యేహాన్, కొంగరి వెంకట్రామయ్య, నాయకులు వెన్నా వెంకిరెడ్డి, వెన్నా కాశిరెడ్డి, వెన్నా మల్లారెడ్డి, గుండారెడ్డి వెంగళరెడ్డి, తాతిరెడ్డి సుబ్బారెడ్డి, గోనుగుంట్ల నాగేఽశ్వరరావు, సింగా నాగేశ్వరరావు, వట్టి శ్రీనివాసరెడ్డి, బత్తినేని రామకృష్ణ, ఒంటేరు నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యురాలు చిన్న ఆవులక్క, ఒంటేరు పెద్ద ఆవులయ్య, మాజీ జెడ్పీటీసీ అమిరెడ్డి రామిరెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్, దూదేకుల కార్పొరేషన్ డైరక్టర్ దూదేకుల కాశింపీరా, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మా యల్లేష్, మైనారిటీ సెల్ జిల్లా ప్రదాన కార్యదర్శి దూదేకుల రసూల్, పవన్కుమార్, యక్కంటి వెంకట్వేశ్వరరెడ్డి, చంద్రకాంత్నాయక్ జోగి వెంకటనారాయణ తదిదతరులు పాల్గొన్నారు. -
దర్శి రూపురేఖలు మార్చేస్తాం
దర్శి: దర్శి నియోజకవర్గాన్ని మేమిద్దరం కలసి అభివృద్ధి చేసి రూపురేఖలు మారుస్తామని వైఎస్సార్ సీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గురువారం దర్శి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదట రాజంపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా హాజరైన వేలాది మంది ప్రజానీకంతో కలసి ర్యాలీగా దర్శికి చేరుకున్నారు. దారిపొడవునా క్రేన్ల సాయంతో భారీ గజమాలలు వేసి హారతులిచ్చి దుశ్శాలువాలు కప్పి, పూలుచల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. డప్పు వాయిద్యాల మధ్య కార్యకర్తల నినాదాలతో దర్శి పట్టణం మారుమోగింది. ప్రజలందరి ఆశీర్వాదాలు తీసుకుని నామినేషన్కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా హాజరైన భారీ జనసందోహాన్ని ఉద్దేశించి చెవిరెడ్డి మాట్లాడుతూ దర్శి ప్రాంతానికి బూచేపల్లి కుటుంబం 20 ఏళ్లుగా చేస్తున్న సహాయ సహకారాలే శివప్రసాద్రెడ్డి ని గెలిపిస్తాయన్నారు. ఎక్కడా అవినీతి మచ్చలేని వ్యక్తి, సేవచేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన శివప్రసాద్రెడ్డి లాంటి వ్యక్తులను గెలిపించుకుంటేనే నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. నామినేషన్కు వచ్చి ఎర్రని ఎండలో తమకోసం ఎదురు చూస్తూ ఉన్న వేలాది మంది జనసందోహాన్ని చూస్తుంటే బూచేపల్లి కుటుంబం పై నియోజకవర్గ ప్రజలకు ఎంతటి మమకారం ఉందో అర్థమవుతోందన్నారు. చంద్రగిరిని అభివృద్ధి చేసినట్లుగా మేమిద్దరం కలసి దర్శి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పార్టీలకతీతంగా పథకాలు అందించారని..మీకు మేలు జరిగితేనే నాకు ఓటెయ్యండనే దమ్మున్న నాయకుడుగా దేశ చరిత్రలో ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే ఉన్నారన్నారు. బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ‘రా కదలిరా’ అంటే జనాలు రావడం లేదు కానీ కరువు మాత్రం వస్తుందని దర్శి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. రైతులను, మహిళలను మోసం చేయడమే చంద్రబాబు అజెండా అని తెలిపారు. 2014లో ఇచ్చిన 600 హామీలు అటకెక్కించి ప్రజలు ప్రశ్నిస్తారని ఆన్లైన్లో కూడా లేకుండా చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా ప్రజలకు ఇచ్చిన మాట కోసం హామీలను 99 శాతం అమలు చేసి ప్రజా సంక్షేమమే లక్ష్యం గా పాలన అందించిన ఏకై క నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంతంలో చెరువులన్నింటికీ నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఆయన సహాయ సహకారాలతో దొనకొండ ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పేదలకు, పెత్తందారులకు జరుగుతున్న ఈ యుద్దంలో సీఎం వైఎస్ జగన్ పేదల పక్షాన నిలబడ్డారన్నారు. దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దీవెనలతో దర్శి ప్రజల ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ దాఖలు చేశానన్నారు. మా కుటుంబం పై ప్రేమతో దర్శి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. ఇంతటి అభిమానాన్ని పంచుతున్న మీకు సేవ చేయడమే లక్ష్యంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, ఎంపీపీ సుధాఅచ్చయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, వ్యవసాయ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, నెడ్ కాప్ డైరెక్టర్ సానికొమ్ము తిరుపతిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు పాల్గొన్నారు. జనసంద్రంగా దర్శి పట్టణం బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామినేషన్కు వేలాదిగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ముందుగా రాజంపల్లి గ్రామంలో మూసీ నది తీరాన ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం జరిగిన ర్యాలీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారిపొడవునా భారీ గజమాలలతో బూచేపల్లికి స్వాగతం పలికారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాజంపల్లి గ్రామంలో ప్రత్యేక టీం నృత్యాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొత్తరెడ్డి పాలెం గ్రామానికి చేరుకున్న సందర్భంగా మహిళలు హారతులిచ్చారు. బూచేపల్లిని ఆశీర్వదించండి మంచి వ్యక్తి నా తమ్ముడు మీ శివన్న ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆశీర్వదించండి.. సేవలందిస్తా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డిసాధారణ కార్యకర్తలా బైక్ పై వచ్చిన చెవిరెడ్డి: నామినేషన్ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి సామాన్య కార్యకర్తగా ర్యాలీలో పాల్గొన్నారు. తెల్లలుంగీ, చొక్కా ధరించి మోటారు సైకిల్పై వచ్చారు. తనతోపాటు వచ్చిన కార్యకర్తలు అభిమానులతో కరచాలనం చేస్తూ భాస్కరరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న చెవిరెడ్డిని బూచేపల్లి గమనించి వాహనంపైకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి మేరుగు నాగార్జున, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
టీవీ స్టార్లు కూడా ఎక్కడా తగ్గట్లేదుగా! (ఫొటోలు)
గాజాలో జరుగుతోంది మారణహోమం కాదు: జో బైడెన్
IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
రైతులూ.. జాగ్రత్త! విత్తనాల కొనుగోలులో.. ఆఫర్లు చూశారో?
RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?
'లూసిఫర్2'లో మాఫియా డాన్గా మోహన్లాల్ లుక్ రివీల్
సైక్లింగ్తో మెకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ప్రమాదాలకు చెక్!
రామోజీ ఈ వయసులో ఇదేం పని... ఇప్పటికైనా మారకపోతే..
కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
తప్పక చదవండి
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- వారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్పుత్
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
Advertisement