-
వందేళ్ల వెలుగులకు పునాది
మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: జగదీశ్రెడ్డి • మా ప్రణాళికతోనే గృహాలకు 24 గంటలు, సాగుకు 9 గంటల విద్యుత్ • ఏపీ సీఎంకు జానారెడ్డి వంతపాడుతున్నారని విమర్శ • ఇప్పుడొచ్చిన వెలుగులన్నింటికీ పునాదులు మావే: జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి శాసనసభలో చెప్పారు. గత అరవైఏళ్ల నష్టాన్ని పూడుస్తూ.. వందేళ్ల వెలుగులకు పునాదులు వేస్తున్నామన్నారు. గృహాలకు 24 గంటలు, సాగుకు 9 గంటలు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు చర్యలు చేపట్టామ ని తెలిపారు. శనివారం అసెంబ్లీలో విద్యుత్ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో జగదీశ్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2 వేల మెగావాట్ల విద్యుత్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘కాకతీయ థర్మల్ ప్రాజెక్టు నుంచి 2,400 మెగావాట్లు, సింగరేణిలో 1,200, జూరాలలో 240, పులిచింతలలో 30 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేశాం. సోలార్ ద్వా రా వెయ్యి మెగావాట్లు, పవన విద్యుత్ ద్వారా 99 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నాం. మణు గూరు, కొత్తగూడెం, దామరచర్ల ప్రాజెక్టుల ద్వారా 5,880 మెగావాట్లు, ఎన్టీపీసీ 4,000, సౌర విద్యుత్ ద్వారా 2,200 మెగావాట్ల విద్యు దుత్పత్తికి పనులు మొదలయ్యాయి’ అని పే ర్కొన్నారు. టీఎస్ ఐపాస్తో పరిశ్రమల విద్యు త్ డిమాండ్ 2 వేల మెగావాట్లు పెరిగిందని, గత సెప్టెంబర్లో రాష్ట్రంలో అత్యధికంగా 8,484 మెగావాట్ల డిమాండ్ రికార్డయిందని తెలిపారు. ఎత్తిపోతల పథకాలకు 7,500 మెగా వాట్లు అవసరమని, ఆ మేరకు సరఫరా చేసే లా చర్యలు మొదలుపె ట్టామని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సెకను కూడా కరెంట్ పోని పరిస్థితి తెస్తామని చెప్పారు. విద్యుత్ శాఖలో పని చేస్తున్న 20 వేల మంది ఔట్సోర్సింగ్/కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీ కరించేందుకు సీఎం నిర్ణ యం తీసుకున్నారని.. ఇప్పటికే 1,175 మంది జేఎల్ఎంఈలను క్రమబద్ధీకరించారన్నారు. పక్క రాష్ట్ర సీఎంపై జానాకు ప్రేమ ప్రతిపక్ష నేత జానారెడ్డిపై జగదీశ్రెడ్డి విరుచు కుపడ్డారు. జానారెడ్డి పక్క రాష్ట్ర సీఎంకు వంత పాడుతున్నారని, ఆ రాష్ట్రం తెలంగాణపై చేసిన కుట్రలు మరిచి ప్రేమ కనబరుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని చీకట్లో ఉంచిన తోడు దొంగలు ఈ చర్చలో తలెత్తుకునే పరిస్థితి లేదని తెలిసి పారిపోయారని వ్యాఖ్యానించారు. ప్రణాళిక లేకుంటే గ్రిడ్లాప్రభుత్వం కూలుతుంది: జానారెడ్డి తెలంగాణ ఏర్పాటు తర్వాత అదనంగా ఒక్క యూనిట్ విద్యుదుత్పత్తి జరగలేదని... ఇటీవ ల అందుబాటులోకి వచ్చిన 2 వేల మె.వా. విద్యుత్కు తామే పునాదులు వేశామని జానారె డ్డి స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం దేశమంతా అవస రానికి మించి విద్యుత్ ఉంది. దానికి కారణం మేము, మా ప్రభుత్వాలు కాదా? మాహయాం లో మొదలుపెట్టిన విద్యుత్ కేంద్రాల్లోనే నేడు ఉత్పత్తి జరుగుతోంది’ అని పేర్కొన్నారు. సరైన ప్రణాళిక లేకుంటే గ్రిడ్ కుప్పకూ లినట్లే ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. రెండోమారు వాకౌట్ విద్యుత్ అంశంపై 40 నిమిషాలు మాట్లాడిన జానారెడ్డి.. అనంతరం సభ నుంచి మరోసారి వాకౌట్ చేశారు. ‘మా సభ్యులు సభలో లేనప్పుడు ఇంతకు మించి మాట్లాడటం సబబు కాదు. సభ గౌరవంగా జరగాలంటే కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి.’’ అని డిమాండ్ చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో సభలోనే ఉన్న ఉత్తమ్ కూడా బయటికి వెళ్లారు. మాట్లాడిందంతా మాట్లాడి, ప్రభుత్వం సమాధానం చెప్పే సమయంలో వాకౌట్ చేయడం సరికాదని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. ఒక్క యూనిట్ పెరగలేదు: బీజేపీ రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఒక్క యూనిట్ విద్యుత్ అదనంగా ఉత్పత్తి చేయలేదని బీజేఎల్పీ నేత కిషన్రెడ్డి పేర్కొన్నారు. 13 ఏళ్ల కనిష్ట ఉత్పత్తికి పడిపోయామని, వ్యవసాయ వినియోగం పడిపోయిందన్నారు. వ్యవసాయానికి 9 గంటలు ఇస్తున్నా మని చెబుతున్నా 6 గంటలకు మించి ఇవ్వడం లేదన్నారు. హైదరాబాద్లో భారీగా విద్యుత్ కోతలు హైదరాబాద్లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయని.. ఈ ఏడాది 6,518 బ్రేక్డౌన్లు నమోదయ్యాయని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశా రు. సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరగా.. ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగిరం చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోరారు. విద్యుత్పై చర్చకు ఒకే ఒక్కడు కాంగ్రెస్ సభ్యులు వారించినా సభకు వెళ్లి మాట్లాడిన జానా.. సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసినందున విద్యు త్పై చర్చలో పాల్గొనాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరిన సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి చాంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. వి ద్యుత్పై చర్చలో జానారెడ్డి పాల్గొనాలా? వద్దా అన్న అంశంపై చర్చ జరిగింది. విద్యుత్పై చర్చ ను బహిష్కరించాలని సభ్యులు సూచించారు. సభ్యుల ప్రతిపాదనను జానారెడ్డి వ్యతిరేకిం చారు. విద్యుత్ వంటి సమస్యపై మాట్లాడే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని, ప్రభుత్వా న్ని ఎండగట్టే అవకాశాన్ని వాడుకుందామని వ్యాఖ్యానించారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయా లను పట్టించుకోకుండానే సభలోకి వెళ్లి జానారెడ్డి మాట్లాడారు. తర్వాత వాకౌట్ చేశారు. -
'2018లో పుట్టిన పిల్లలకు కరెంటుకోత అంటే తెలియదు!'
మరో మూడేళ్ల తర్వాత.. అంటే 2018 సంవత్సరంలో పుట్టిన పిల్లలకు కరెంటు కోత అంటే ఏంటో తెలియనివ్వబోనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2017 నాటికి తెలంగాణలో రైతులకు 12 గంటల విద్యుత్ ఇస్తామని, అది కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. 2018 నాటికి తెలంగాణలో 23 వేల మెగావాట్ల మిగులు విద్యుత్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2019లోగా ప్రతి గ్రామానికి మంచినీరు అందిస్తామని, నీళ్లు ఇవ్వకుంటే 2019లో ఓట్లు అడిగేది లేదనే మాటకు కట్టుబడి ఉంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. జగిత్యాలను త్వరలోనే జిల్లాగా మారుస్తామని, జగిత్యాల జిల్లా ఏర్పాటు కోసం త్వరలోనే పాదయాత్ర చేస్తానని తెలిపారు. అర్హులై ఉండి ఇప్పటికీ పెన్షన్లు రానివాళ్లు ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకోవాలని, అలా చేస్తే 15 రోజుల్లోనే పెన్షన్ ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పారు.
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
Advertisement