-
నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోలు బంకులు బంద్
-
నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోలు బంకులు బంద్
- 24 గంటలపాటు బంకుల మూత - పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వ్యాట్ భారం తగ్గించాలని డీలర్ల డిమాండ్ విజయవాడ: పెట్రోలియం డీలర్లు ఆందోళన బాట పట్టారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం విధించిన నాలుగు శాతం వ్యాట్ భారాన్ని తగ్గించాలని డీలర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా బంకులన్నింటినీ బంద్ చేయాలని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ తీర్మానించింది. 24 గంటలపాటు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. వ్యాట్ భారాన్ని తగ్గించాలని కోరుతూ పలుమార్లు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చినా ఫలితం లేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ వివరించింది. టీడీపీ ప్రభుత్వం ఆరునెలలక్రితం రాష్ట్రంలో నాలుగు శాతం వ్యాట్ విధించటంతో లారీల యజమానులు తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి డీజిల్ కొనుగోలు చేస్తున్నారని, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 2,400 బంకుల్లో డీజిల్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు నరసింహారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆరునెలలుగా ఆంధ్రప్రదేశ్లో 40 శాతం మేరకు డీజిల్ అమ్మకాలు తగ్గిపోయి.. ఆ మేరకు పొరుగు రాష్ట్రాల్లో పెరిగాయని వివరించారు. సమస్య పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని నరసింహారావు హెచ్చరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement