-
రాప్తాడులో టీడీపీ కాకిగోల.. సాక్ష్యం ఇదిగో
-
చంద్రబాబు, పరిటాల ఫ్యామిలీపై తోపుదుర్తి షాకింగ్ కామెంట్స్
సాక్షి, అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు, పరిటాల ఫ్యామిలీపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. హింసా రాజకీయాలపై పరిటాల సునీత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కౌంటర్ ఇచ్చారు. కాగా, తోపుదుర్తి ప్రకాష్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పరిటాల అనుచరుడు జగ్గుతో నా తల్లిని తిట్టించారు. తల్లిని తిడితే కొడుకులకు బాధ ఉండదా?. జగ్గు వ్యాఖ్యలను ఏ టీడీపీ నేత కూడా ఖండించలేదు. ఎవరిది తప్పో.. ఎవరికి ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారు. కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికి ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 150 హత్యలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యేలు చెన్నారెడ్డి, మద్దెలచెర్వు నారాయణరెడ్డి కుటుంబాలను పరిటాల రవి చంపించారు. మద్దెలచెర్వు సూరిని చంపించింది పరిటాల సునీతే. మా సోదరుడు చందుని పరిటాల రవి చంపుతా అన్నారు. నన్ను చంపుతానని పరిటాల శ్రీరామ్ బెదిరిస్తున్నారు. హింసా రాజకీయాలపై పరిటాల సునీత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘బాబూ పరిటాల శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?’
రాప్తాడు రూరల్: ‘బాబూ శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?’ అని పరిటాల శ్రీరామ్ను కనగానపల్లి మండలం తగరకుంట గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు కూతురు రామాంజనమ్మ ప్రశ్నించారు. పరిటాల శ్రీరాములుకు కుడి భుజంగా ఉన్న తన తండ్రి బోయ రామాంజనేయులు అప్పట్లో పరిటాల శ్రీరాములుతో పాటు హత్యకు గురైన వైనాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. మంగళవారం తాను మాట్లాడిన వీడియో సందేశాన్ని ఆమె పత్రికలకు విడుదల చేశారు. సందేశంలోని అంశం ఆమె మాటల్లోనే... ‘మీ నాన్న పరిటాల రవీంద్ర, మీ అమ్మ పరిటాల సునీత మంత్రులుగా పని చేసిన సమయంలో తగరకుంట రామాంజనేయులు కుటుంబం మీకు గుర్తుకు రాలేదా? మీ తాత పరిటాల శ్రీరాములు కోసం మా నాన్న బోయ రామాంజనేయులు 1975లో ప్రాణాలిచ్చాడు. బాబూ శ్రీరామ్... మీ తాత కోసం మానాన్న ప్రాణాలిచ్చాడని ఈ రోజు గుర్తించావా? ఇన్నేళ్లలో ఈ మాట ఎప్పుడైనా చెప్పావా? ఏ రోజైనా మా గురించి ఆలోచించావా? మమ్మల్ని పకలరించావా? మాకేమైనా సాయం చేశావా? మా నాన్న చనిపోయినప్పుడు నేను అమ్మ కడుపులో ఉన్నా. నాకు జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ ఎన్ని కష్టాలు ఎదుర్కొందో మాకు తెలుసు. ఈ రోజు మీ స్థాయి ఎలా ఉందో... మాస్థాయి ఎలా ఉందో ఆలోచించు. మమ్మల్ని గుర్తించింది ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఒక్కరే. ఆయన ఎంతో సాయమందించారు. భూమి ఇప్పించారు. బోరు వేయించారు. ఈ రోజు ప్రకా‹Ùరెడ్డి అన్న రూ. 500 కోట్లు సంపాదించాడని అంటున్నావు. మీ తాత ఉన్నప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో జనాలకు తెలుసు. నువ్వు అక్రమంగా ఎంత సంపాదించావో, ప్రకాశ్రెడ్డి ఎంత సంపాదించారో ప్రజలకు తెలుసు. మీ నాన్న, మీ అమ్మ మంత్రులుగా పని చేశారు. బోయ కులస్తులను గుర్తించి ఏ ఒక్క పదవైనా ఇచ్చారా? తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి బోయ కులస్తులను గుర్తించి అనేక పదవులు ఇచ్చి ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ సొంత మండలం రామగిరిలో బోయ కులస్తులకు మీరు ఎన్ని పదవులు ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని బెదిరించి ఎంత సంపాదించావో అందరికీ తెలుసు. మీ అవినీతి అంతా ప్రజలకు తెలుసు’ అని స్పష్టం చేశారు. -
టీడీపీ నేత పరిటాల శ్రీరాంపై కేసు
-
‘పచ్చ’నోట్లు..కేరాఫ్ సిటీ!
సాక్షి, సిటీబ్యూరో: గత ఏడాది డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు.. ప్రస్తుతం జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ, రెండు రాష్ట్రాల లోక్సభ ఎన్నికలు.. పోటీ ఎక్కడైనా సరే ప్రజలను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ తనకు అవసరమైన డబ్బులో అత్యధికం హైదరాబాద్ కేంద్రంగానే తరలిస్తోంది. ఆ పార్టీ నేతలు, ప్రధాన అనుచరులకు సిటీ, శివారు ప్రాంతాల్లో వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. పెద్ద మొత్తాలను తరలించేందుకు హవాలా లావాదేవీలు కారణమనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్న రూ.60 కోట్లు, వరంగల్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.5.8 కోట్లు, తాజాగా రాజేంద్రనగర్ పోలీసులు గుట్టురట్టు చేసిన రూ.24 లక్షల రవాణా.. ఇవన్నీ తెలుగుదేశం పార్టీతో లింకు ఉన్నవే కావడం గమనార్హం. వ్యాపారాల ‘ముసుగు’లో తరలింపు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పరిటాల శ్రీరామ్కు అందించడానికని అనుమానిస్తున్న రూ.24 లక్షల నగదును సోమవారం రాత్రి రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. మియాపూర్లో నివసించే రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి వెంకట ప్రసాద్కు పటాన్చెరులో ఫ్యాక్టరీ ఉంది. దీంతో ఇతడు సమీకరించిన నల్లధనాన్ని తన డ్రైవర్కు ఇచ్చి పంపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ సంతోష్రెడ్డిని డబ్బుతో సహా పట్టుకున్న పోలీసులు.. ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ప్రసాద్ ఒక్కరే కాదు.. టీడీపీకి చెందిన అనేక మంది కీలక నాయకులకు హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు, వ్యాపారాలు ఉంటున్నాయి. వీరంతా ఎన్నికలతో పాటు కొన్ని కీలకమైన సందర్భాల్లో తమ నేతలను ‘ఆర్థికంగా ఆదుకుంటున్నారు’. ప్రలోభాలు, లంచాలకు అవసరమైన సొమ్మును తమ వ్యాపారాల ముసుగులో తరలించి వారికి అప్పగిస్తున్నారు. కొందరు దొంగ లెక్కలు చూపిస్తూ తీసుకువెళ్తుండగా మరికొందరు ఎలాంటి లెక్కలు లేకుండా తమ అనుచరులు, నమ్మినబంట్ల ద్వారా చేరాల్సిన చోటుకు తరలిస్తున్నారు. హవాలా రూపంలోనూ సరఫరా సిటీ కేంద్రంగా పనిచేస్తున్న కొందరు హవాలా వ్యాపారులను టీడీపీ వాడుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడకు డబ్బు పంపాల్సి ఉన్నా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిసీ హవాలా మార్గాన్ని ఆశ్రయిస్తోంది. ఆ పార్టీకి చెందిన నేతలు ఈ నగదు సరఫరాల్లో కీలక దళారులుగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అప్పట్లో జగిత్యాలకు రూ.60 లక్షలు పంపడానికి తెలంగాణ రాష్ట్ర తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్, జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్కుమార్ ప్రయత్నించారు. తన డ్రైవర్తో హవాలా వ్యాపారుల నుంచి ఈ మొత్తం తీసుకుని జనగాం పంపేలా పథకం వేశాడు. ఈ కేసులో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు నలుగురిని పట్టుకున్నారు. ఇలా చిక్కిన ఉదంతాలు అతి తక్కువేని, చాపకింద నీరులా ‘పచ్చనోట్ల’ ప్రవాహం జోరుగా సాగిపోతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ పోలీసులకు చిక్కిన రూ.5.8 కోట్లు కూడా అప్పట్లో తెలుగుదేశం, మహా కూటమి నేతలకు అందించడానికి తీసుకువెళ్తున్నవే కావడం గమనార్హం. పోలీసుల నిఘా ముమ్మరం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో నగరం నుంచి భారీగా డబ్బు అక్రమ రవాణా అవుతోందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తయ్యారు. ప్రధానంగా నగర వ్యాప్తంగా ఉన్న హవాలా, హుండీ వంటి అక్రమ ద్రవ్యమార్పిడి రాకెట్లపై డేగ కన్ను వేశారు. ఈ లావాదేవీలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాలు, మార్కెట్లలో మఫ్టీ పోలీసులను మోహరించారు. రాష్ట్ర, కమిషరేట్ల నిఘా అధికారులు సైతం విస్తృత సమాచారం సేకరిస్తున్నారు. మరోపక్క నియోజకవర్గాలు, కమిషనరేట్లు, నగరాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. లాడ్జిలు, హోటళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. నగరం నుంచి బయటకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని నిర్ణయించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement