-
అలా చేస్తే వినియోగదారుల పరిధిలోకి రారు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బ్యాంకు సర్వీసులను ’వ్యాపార అవసరాల’కు ఉపయోగించుకునే వ్యక్తులను ‘వినియోగదారు’గా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వినియోగదారు పరిధిలోకి రావాలంటే.. తాను స్వయం ఉపాధి ద్వారా జీవిక పొందేందుకు మాత్రమే బ్యాంకు సేవలను ఉపయోగించుకున్నట్లు రుజువు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. వ్యాపార లావాదేవీలను వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం పరిధిలోకి రానివ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఓ సవరణ చేసిందని సుప్రీంకోర్టు తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు–శ్రీకాంత్ జి మంత్రి ఘర్ మధ్య ఓవర్డ్రాఫ్ట్ వివాదానికి సంబంధించిన కేసులో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శ్రీకాంత్.. సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. -
మహిళకు భారీ షాక్.. అకౌంట్లో ఏకంగా రూ.7400 కోట్లు!
వాషింగ్టన్: వంద రూపాయాలు డ్రా చేద్దామని వెళ్లిన వ్యక్తికి తన ఖాతాలో ఏకంగా వేల కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిస్తే.. ఎలా ఉంటుంది.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. ఆ సంతోషంలో నిజంగానే హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇదే అనుభవం ఎదురయ్యింది ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళకు. 20 డాలర్లు డ్రా చేద్దామని ఏటీఎంకు వెళ్లింది. అయితే ఆమె అకౌంట్లో సరిపడా మొత్తం లేవని.. ఇప్పుడు 20 డాలర్లు డ్రా చేస్తే అది ఓవర్డ్రాఫ్ట్ కిందకు వస్తుందని మెసేజ్ వచ్చింది. పర్లేదు అనుకుని డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు. సదరు మహిళ అసలు తన బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో చెక్ చేయగా.. దిమ్మ తిరిగే బొమ్మ కనిపించింది. ఏకంగా తన ఖాతాలో బిలయన్ డాలర్లు(7400 కోట్ల రూపాయలు) ఉన్నట్లు చూపింది. ఇది చూసి ఆ మహిళకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది. వెంటనే బ్యాంక్కు వెళ్లి విషయం చెప్పగా.. వారు కూడా చెక్ చేశారు. ఆమె అకౌంట్లోకి ఇంత మొత్తం ఎలా వచ్చిందో వివరించారు. వాస్తవానికి సదరు మహిళ అకౌంట్లో నెగిటివ్ బిలియన్ డాలర్ల సొమ్ము ఉంది. మోసాలను నివారించడానికి ఈ పద్దతిని ఉపయోగిస్తారు. అనుమానాస్పదంగా తోచిన వ్యక్తి అకౌంట్ను లాక్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది అని తెలిపారు. ఫలితంగా సదరు మహిళ 20 డాలర్లను కూడా డ్రా చేసుకోలేకపోయింది అని వివరించారు. చదవండి: ఆన్లైన్ క్లాసులని ఫోన్ ఇస్తే ఏకంగా.. -
ఆర్బీఐ రుణ చికిత్స!
ముంబై: కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలను ఆదుకునేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. వ్యక్తులు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎస్ఎంఈలు) తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు మరింత సమయం ఇచ్చింది. రుణాలను రెండేళ్ల కాలానికి పునరుద్ధరించుకునే అవకాశం కల్పించింది. టీకాల తయారీ సంస్థలు, ఆస్పత్రులు, ల్యాబొరేటరీలు, కరోనా సంబంధిత ఆరోగ్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్య రంగం కింద రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులను అనుమతించింది. ఇందు కోసం బ్యాంకులకు ప్రత్యేకంగా రూ.50,000 కోట్ల లిక్విడిటీని(నిధుల లభ్యత) అందించనుంది. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద రాష్ట్ర ప్రభుత్వాలు నిధు లు పొందేందుకు ఉద్దేశించిన నిబంధనలను వచ్చే సెప్టెంబర్ 30వరకు సడలించింది. ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు కార్యక్రమం(జీ–సాప్) కింద 2 వారాల్లో రూ.35,000 కోట్లకు ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఆర్బీఐ మధ్యంతర నిర్ణయాలను ఆయన బుధవారం ప్రకటించారు. మారటోరియం కాదు.. రుణ పునరుద్ధరణే వాస్తవానికి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణ సంస్థలు ఒక్క విడత రుణ మారటోరియంను మూడు నెలలకు కల్పించాలని ఆర్బీఐని ఇటీవలే కోరాయి. కానీ, ఒక్క విడత రుణ పునరుద్ధరణకు.. అది కూడా రూ.25 కోట్ల వరకు రుణాలకే అవకాశం కల్పిస్తూ ఆర్బీఐ నిర్ణయించింది. గతేడాది రుణ మారటోరియం ముగిసిన తర్వాత రుణాల పునరుద్ధరణ అవకాశాన్ని వినియోగించుకోని వాటికే ప్రస్తుతం ఈ సదుపాయం రెండేళ్ల కాలానికి లభిస్తుంది. 2021 మార్చి వరకు స్టాండర్డ్ ఖాతాలుగా (సక్రమంగా చెల్లింపులు చేస్తున్న) ఉన్న వాటికి ఈ వెసులుబాటు పరిమితం. 90 శాతం రుణ గ్రహీతలు ఇందుకు అర్హత సాధిస్తారని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంచనా. రూ.50,000 కోట్ల సాయం.. ఆరోగ్య సేవలు, సదుపాయాల రంగంలో ఉన్న కంపెనీలకు రూ.50,000 కోట్లతో ఆన్ట్యాప్ లిక్విడిటీ విండోను ఆర్బీఐ ప్రకటించింది. కంపెనీలు దరఖాస్తు చేసుకుంటే బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం దీనికింద లభిస్తుంది. రెపో రేటుపై, మూడేళ్ల కాల వ్యవధికి రుణాలు అందిస్తామని.. ఈ విండో 2022 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని శక్తికాంతదాస్ చెప్పారు. బ్యాంకులు ఈ పథకం కింద టీకాల తయారీ కంపెనీలు, టీకాల దిగుమతి దారులు, సరఫరాదారులు, వైద్య పరికరాలు, ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, పాథాలజీ ల్యాబ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల తయారీదారులు, సరఫరాదారులు, కరోనా సంబంధిత ఔషధ దిగుమతిదారులు, లాజిస్టిక్స్ సంస్థలకు తాజా రుణాలను మంజూరు చేయవచ్చు. వీటిని ప్రాధాన్య రంగ రుణాలుగా ఆర్బీఐ పరిగణిస్తుంది. ఈ పథకం కింద మంజూరు చేసే రుణాలతో ప్రత్యేక పుస్తకాన్ని బ్యాంకులు నిర్వహించొచ్చు. బ్యాంకులు తమ దగ్గర మిగులుగా ఉన్న నిధులను కరోనా రుణ పుస్తక పరిమాణం స్థాయిలో ఆర్బీఐ వద్ద ఉంచడం ద్వారా.. రెపో రేటు కంటే 0.25% తక్కువగా వడ్డీని పొందొచ్చు. రూ.35,000 కోట్లతో జీ–సెక్యూరిటీలు ఈ నెలలోనే రూ.35,000 కోట్లతో ప్రభుత్వ సెక్యూరిటీలను (జీ–సెక్లు) ఆర్బీఐ కొనుగోలు చేయనుంది. ఆర్బీఐ గత నెలలోనూ రూ.25,000 కోట్లకు జీ–సెక్లను కొనుగోలు చేయడం గమనార్హం. పదేళ్ల ప్రభుత్వ బాండ్ల ఈల్డ్ను 6 శాతంలోపునకు తీసుకొచ్చే లక్ష్యంతో, ప్రభుత్వ వృద్ధి కార్యక్రమాలకు మద్దతునిచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఆర్బీఐ తీసుకొచ్చింది. జీ–సెక్ ఈల్డ్స్ తగ్గితే ప్రభుత్వానికి ఉపశమనం లభించినట్టే. కేవైసీ విషయంలో ఇబ్బంది పెట్టొద్దు బ్యాంకులు, నియంత్రిత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు 2020 డిసెంబర్ చివరికి కేవైసీ (కస్టమర్ గురించి తెలుసుకోవడం) వివరాలను అప్డేట్ చేయని కస్టమర్ల విషయంలో కఠిన చర్యలకు దిగొద్దని ఆర్బీఐ కోరింది. ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు ఈ అవకాశం కల్పించింది. అలాగే, వీడియో కేవైసీకి అనుమతించింది. 250 మందితో క్వారంటైన్ కేంద్రం కరోనా సంక్షోభంలో కీలక కార్యకలాపాలకు విఘాతం కలగకుండా ఆర్బీఐ ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 250 మంది సిబ్బంది ఈ కేంద్రంలోనే ఉంటూ కీలక కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు శక్తికాంతదాస్ తెలిపారు. ఎస్ఎఫ్బీలకు 10వేల కోట్లు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు (ఎస్ఎఫ్బీలు) ప్రత్యేక దీర్ఘకాలిక రెపో ఆపరేషన్స్ విండో (ఎస్ఎల్టీఆర్వో)ను సైతం దాస్ ప్రకటించారు. ‘‘ప్రస్తుత కరోనా తీవ్రతతో ఎక్కువగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు మరింత మద్దతు అందించేందుకు ప్రత్యేకంగా మూడేళ్ల కాల వ్యవధిపై రూ.10,000 కోట్లకు ఎస్ఎల్టీఆర్వో నిర్వహించాలని నిర్ణయించాం. రెపో రేటుకే ఎస్ఎఫ్బీలకు ఈ నిధులు అందిస్తాం’’ అని దాస్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే, రూ.500 కోట్ల వరకు ఆస్తులు కలిగిన సూక్ష్మ రుణ సంస్థలకు ఎస్ఎఫ్బీలు అందించే రుణాలను ప్రాధాన్యరంగ రుణాలుగా పరిగణిస్తామని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. భవిష్యత్తుపై ఎంతో అనిశ్చితి భవిష్యత్తు ఆర్థిక వృద్ధిపై ఎంతో అనిశ్చితి నెలకొందన్నారు దాస్. తాజా సంక్షోభాన్ని ఎదుర్కోగల బలమైన మూలాలపై భారత్ ఉందని అభిప్రాయపడ్డారు. వృద్ధి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు అంగీకరించారు. ‘‘భారత్ బలంగా కోలుకునే క్రమంలో సానుకూల వృద్ధిలోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ కర్వ్ వంగిన కొన్ని వారాల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరోనా కారణంగా ఏర్పడే పరిస్థితులను ఆర్బీఐ అనుక్షణం పరిశీలిస్తూ అవసరం ఏర్పడితే అన్ని రకాల వనరులను, అసాధారణ సాధనాలను ఆచరణలోకి తీసుకొస్తుంది’’ అని శక్తికాంతదాస్ చెప్పారు. సాధారణ నైరుతి రుతుపవనాలతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉపశమిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డిమాండ్ తగ్గుదల కొంతే... డిమాండ్పై లాక్డౌన్ల ప్రభావం గతేడాదితో పోలిస్తే మోస్తరుగానే ఉంటుందని శక్తికాంతదాస్ అన్నారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ తాత్కాలికంగా తగ్గిపోవచ్చని, ముఖ్యంగా రిటైల్, ఆతిథ్య రంగాల్లో ఈ పరిస్థితులు ఉంటాయని చెప్పారు. మొత్తం మీద కీలక గణాంకాలు మిశ్రమ సంకేతాలను ఇస్తున్నట్టు పేర్కొన్నారు. సకాలంలో సరైన నిర్ణయాలు ఆర్బీఐ ప్రకటించిన నిర్ణయాలను నిపుణులు, పరిశ్రమ వర్గాలు ఆహ్వానించాయి. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను విసురుతున్న క్రమంలో సకాలంలో సరైన నిర్ణయాలను ప్రకటించినట్టు పేర్కొన్నాయి. ఆరోగ్యసంరక్షణ, అనుబంధ రంగాలు పెరిగిన డిమాండ్తో, సరఫరా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రూ.50వేల కోట్లతో ఆన్టాప్ లిక్విడిటీని ప్రకటించడం ఎంతో ఉత్సాహాన్నిచ్చేదిగా సీఐఐ పేర్కొంది. ‘చిన్న వ్యాపార సంస్థలు, ఫైనాన్షియల్ సంస్థలు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న భారాన్ని ఆర్బీఐ చాలా వరకు గుర్తించింది. వారికి మద్దతుగా చర్యలను ప్రకటించింది. లకి‡్ష్యత వర్గాలను ఉద్దేశించిన చర్యలు ప్రస్తుత తరుణంలో ఎంతో అనుకూలమైనవి’ అని అసోచామ్ వ్యాఖ్యానించింది. పలు రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను తగ్గించే లక్ష్యంతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అనూహ్యమైన నిర్ణయాలు ప్రకటించారు. ప్రకటించిన చర్యలు వినూత్నంగా ఉన్నాయి. కరోనా సంబంధిత ఆరోగ్య సదుపాయాల కల్పనకు రూ.50,000 కోట్ల ప్రత్యేక నిధి ప్రకటించడం అన్నది ఆర్థిక ఆరోగ్యమే కాదు, ప్రజారోగ్యం ఎదుర్కొంటున్న సమస్యలపైనా దృష్టి పెట్టినట్టుంది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ సరైన సమయంలో ప్రకటించిన లిక్విడిటీ చర్యలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న వర్గాలకు ఉపశమనం కల్పిస్తాయి. వ్యక్తులు, చిన్న పరిశ్రమలకు నిధులు లభించేలా చేస్తాయి. – శక్తి ఏకాంబరం, కోటక్ మహీంద్రా బ్యాంకు గ్రూపు ప్రెసిడెంట్ దిగజారుతున్న పరిస్థితులకు స్పందనగా ఆర్బీఐ.. వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థలు తీసుకున్న రూ.25 కోట్ల వరకు రుణాలను ఒక్కసారి పునరుద్ధరించుకునే అవకాశాన్నిచ్చింది. గతేడాది ఇచ్చిన మారటోరియంతో పోలిస్తే ఈ చర్య చిన్నదే. పునరుద్ధరించుకునే రుణాల పరిమాణం తక్కువగానే ఉంటుంది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత దిగజారే అవకాశం ఉందని ఈ చర్యలు తెలియజేస్తున్నాయి. – మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ -
ఆ కస్టమర్లకు ఐసీఐసీఐ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: పండుగ సీజన్ లో దిగ్గజ బ్యాంకులు ఖాతాదారులకు బంపర్ ఆఫర్ లను ప్రకటిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ మేజర్ ఎస్బీఐ హోంలోన్ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తే ప్రయివేటు బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ నెలవారీ వేతనం పొందే ఉద్యోగులకు మరో ఆఫర్ ప్రకకటించింది. సాలరీడ్ కస్టమర్ల కోసం ఓవర్ డ్రాఫ్ట్ , టర్మ్ లోను పేరుతో రెండు ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్షణ అవసరాల కోసం టర్మ్ లోన్, పెళ్లి, విద్య, వైద్యఖర్చులు, విదేశీ ప్రయాణం తదితర వ్యక్తిగత అత్యవసర ఖర్చులు నిమిత్తం ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద నగదు పొందవచ్చని బ్యాంక్ తెలిపింది. ఈ తాజా ఆఫర్ లో ఖాతాదారులు ఆస్తుల తనఖా ద్వారా 5 లక్షలనుంచి కోటి రూపాయల వరకు రుణం పొందవచ్చు. మొత్తం అమౌంట్ లో కనీసం 10 శాతం టర్మ్ లోనుగాను, గరిష్టంగా 90 శాతం ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొంది. టర్మ్ లోన్ తీసుకుంటే వడ్డీ నెలవారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ లో అయితే రుణం తీసుకున్న సొమ్ము, రోజులు ఆధారంగా వడ్డీ వసూలు చేస్తారు. అదేవిధంగా, రివర్స్ స్వీప్ సౌకర్యం కూడా అందుబాటులోఉందని బ్యాంక్ తెలిపింది. సేవింగ్స్ ఖాతాలో అందుబాటులో వున్న అదనపు నిధులను ఓవర్డ్రాఫ్ట్ ఖాతాలోకి జమచేయనున్నట్టు పేర్కొంది. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఉద్యోగస్తుని సేవింగ్స్ ఖాతాకు లింక్ చేస్తారు. అంతేకాదు చాలాసులువుగా వీటిని ఆఫర్ చేస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. దీంతో వారు వాడుతున్న ఖాతానుంచే అవసరమైన సందర్భాల్లో కావాల్సిన సొమ్మును స్వీకరించవచ్చన్నమాట. అలాగే తమ దగ్గర హోం లోన్ లేని ఉద్యోగులు ముఖ్యంగా కార్పొరేట్ రుణగ్రహీతలు కావాలంటే.. తమ ఖాతాను బదిలీ చేసుకోవచ్చని కూడా సూచించింది. -
ఔషధంలా వాడితే మంచిదే!
ఓవర్ డ్రాఫ్ట్... వెంకట్ మొబైల్కు తన బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ‘మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థ నుంచి క్రమం తప్పకుండా ఆరు నెలలుగా వేతనం మీ ఖాతాలో జమ అవుతోందా? అయితే... ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యం కోసం మా బ్రాంచ్ మేనేజర్ని సంప్రదించండి.’ ఇదీ ఆ మెసేజ్ సారాంశం. దీంతో వెంకట్ ఆలోచించటం మొదలెట్టాడు. చివరకు తన ఆఫీసులో ఆర్థికాంశాలపై అవగాహన ఉన్న స్నేహితుడు రామును దీని గురించి అడిగాడు. రాము ఏం చెప్పాడనేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేకం... ఉద్యోగులకైతే వేతనాన్ని బట్టే ఓవర్డ్రాఫ్ట్ సౌలభ్యం ఆస్తులు, ఎఫ్డీలు, బీమా పాలసీలు తనఖా పెట్టి కూడా మిగిలిన రుణాలతో పోల్చితే వడ్డీ రేటు తక్కువే విత్డ్రా చేసుకున్న మొత్తానికే వడ్డీ కనక ఉత్తమం ఈ రుణంతో రిస్కు చేస్తే మాత్రం ఇబ్బందులే!! వినియోగించుకున్న డబ్బుపైనే వడ్డీ... ఉదాహరణకు మీకు రూ.6 లక్షలు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని మంజూరు చేశారనుకుందాం. ఆ మేరకు డబ్బు మొత్తాన్ని మీ చేతికివ్వటం జరగదు. అలాగని వారి దగ్గరే ఉంచుకోరు కూడా. ఇది మీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమిటంటే... రూ.6 లక్షలనేది మీ రుణ పరిమితి. అక్కడి వరకూ మీరు ఉపయోగించుకోవచ్చన్న మాట. అందులో మీరు ఎంత వినియోగించుకున్నారో.. అంత మొత్తానికే వడ్డీరేటు పడుతుంది. ఎప్పటికప్పుడు ఈ ప్రాతిపదికనే వడ్డీని కట్టాల్సి ఉంటుంది. అంటే ఒక్కసారే కాకుండా.. మీ అవసరాన్ని బట్టి కావాల్సినప్పుడు డబ్బు విత్డ్రా చేసుకుంటూ.. అంతే మొత్తానికి వడ్డీ చెల్లించే వెసులుబాటు ఇక్కడ లభిస్తుంది. అత్యవసర సమయాల్లో... మనలో ప్రతి ఒక్కరికీ ఒకో సమయంలో డబ్బు అవసరం పడుతుంది. సిద్ధంగా ఉంటే సరే. లేదంటే ఎక్కడన్నా... అప్పు పుడుతుందా? అని చూస్తాం. క్రెడిట్ కార్డు వాడాలా..! దానిపై లిమిట్ అయిపోతే రుణం తీసుకోవాలా? లేకపోతే బ్యాంక్లో పర్సనల్ లోన్ దొరుకుతుందా? ఇవన్నీ చూస్తాం. ఇంత చేసినా మనకు కావాల్సిన మొత్తానికి కొంత అటు, ఇటు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఓవర్డ్రాఫ్ట్ సౌలభ్యం గురించి తెలిసిన వారికి ఈ దారి కొండంత అండలా కనిపిస్తుంది. చాలా మందికి దీని గురించి తెలియకపోవడమే ఇక్కడ సమస్య. తనఖాతో తక్కువ వడ్డీపైనే... మీకు వస్తున్న వేతనం ప్రాతిపదికగా... లేదా మీరేదైనా ఆస్తిని తనఖా పెట్టిన సందర్భంలో స్వల్పకాలానికి బ్యాంకు రుణాన్ని మంజూరు చేస్తుంది. మిగిలిన వివిధ రకాల రుణాలతో పోలిస్తే దీని వడ్డీ రేటు తక్కువే ఉంటుంది. గృహం, జీవిత బీమా పాలసీ, బ్యాంక్ స్థిర డిపాజిట్లు, షేర్లు, బాండ్లు వంటి వాటిని ఆస్తులుగా ఇక్కడ పరిగణించవచ్చు. ఇక్కడ మీరు తనఖాగా బ్యాంకు దగ్గర ఏం పెట్టారన్న విషయంపైనే వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. వడ్డీలు ఎలా ఉంటాయి...? ఆస్తిని తనఖా పెట్టి తీసుకున్న రుణమైతే వడ్డీరేటు సంవత్సరానికి 12 నుంచి 14 శాతం వరకూ ఉంది. ఒకవేళ స్థిర డిపాజిట్లను తనఖాగా పెట్టారనుకుందాం. ఇందులో 70 శాతం వరకూ రుణంగా లభిస్తుంది. గృహ తనఖాపై విధించే వడ్డీరేటుకన్నా... తక్కువ వడ్డీరేటు ఉంటుంది. స్థిర డిపాజిట్ పథకంపై చెల్లించే వడ్డీరేటుకన్నా ఒకశాతం వడ్డీని మాత్రమే బ్యాంకు అదనంగా వసూలు చేస్తుంది. అంటే మీకు స్థిర డిపాజిట్పై వచ్చే వడ్డీ 9 శాతం అయితే మీ నుంచి వసూలు చేసేది 10 శాతం ఉంటుంది. ఓవర్డ్రాఫ్ట్ వాడుకునే ముందు ఇవి గుర్తుంచుకోండి... * ఓవర్డ్రాఫ్ట్ కేవలం అత్యవసరాలకు ఉద్దేశించిన ఒక సౌలభ్యం. * ఈ రుణంతో తీవ్ర ఒడిదుడుకులతో కూడిన స్టాక్స్, కమోడిటీల్లో పెట్టుబడులు పెట్టొద్దు. * మీ ఓవర్డ్రాఫ్ట్పై వడ్డీని సకాలంలో సక్రమంగా చెల్లించండి. * సకాలంలో ఓవర్డ్రాఫ్ట్ మొత్తాన్ని బ్యాంకుకు జమ చేసేయండి. * ఒకవేళ మీరు చెల్లించలేకపోతే... మీరు తనఖాగా ఉంచిన ఆస్తిని బ్యాంక్ లిక్విడేట్ చేసుకునే ప్రమాదం ఉంటుంది. * మరిన్ని అంశాలను స్పష్టంగా మీ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ను అడిగి తెలుసుకోండి. రుణ మంజూరు ఎలా...? ఉదాహరణకు మీరు మీ ఇంటిని తనఖాగా ఉంచి ఓవర్డ్రాఫ్ట్ తీసుకుంటున్నారనుకోండి. ఆస్తి విలువ రూ.10 లక్షలు అనుకుందాం. ఇందులో 50 నుంచి 60 శాతం వరకూ ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం లభిస్తుంది. ఒకవేళ మీరు గనక అదే బ్యాంకులో రుణం తీసుకుని ఉంటే... దానిని తిరిగి సరిగా చెల్లించారా లేదా? మీ పునఃచెల్లింపుల సామర్థ్యం ఎంత? వంటి అంశాలను కూడా బ్యాంక్ పరిగణనలోకి తీసుకుంటుంది. ఆయా అంశాల ప్రాతిపదిన ఓవర్డ్రాఫ్ట్ సౌలభ్యం ఇస్తుంది. ఉద్యోగికి వేతనం విషయంలోనూ ఇలాంటి అంశాలనే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగులకైతే వేతనాన్ని బట్టే... ఇక మీరు వేతన జీవి అనుకోండి. మీ నెలవారీ వేతనంపై బ్యాంకు తాత్కాలిక ఓవర్డ్రాఫ్ట్ సౌలభ్యాన్ని కల్పిస్తుంది. మీకు నెలకు రూ.50వేలు వేతనం ఉంటే రూ.25 వేల వరకూ ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్నిచ్చే అవకాశముంది. మీ అవసరం, గతంలో మీ రుణ చెల్లింపు సామర్థ్యం... అదే ఖాతాలో మీరు పని చేస్తున్న సంస్థ నుంచి వేతన జమ... వంటి అంశాలపై కూడా ఈ పరిమితి ఆధారపడి ఉంటుంది. పర్సనల్ లోన్కన్నా తక్కువ రుణ రేటుకు ఓవర్డ్రాఫ్ట్ దొరుకుతుందనేది గమనార్హం. ఓవర్డ్రాఫ్ట్కు చేయాల్సిందేంటి? మీకు ఎంత వేగంగా రుణం మంజూరవుతుందనేది మీరు తనఖా పెట్టే ఆస్తిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఆస్తిని తనఖాగా ఉంచితే... దానికి విలువ కట్టడం, దాన్ని వెరిఫై చేయటం వంటివి ఆలస్యమవుతాయి కనక కొంత సమయం పడుతుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ల వంటివైతే వెంటనే మంజూరవుతుంది. ఈ రుణాల ఫీజుల విషయానికొస్తే 0.5 శాతం నుంచి రూ.25,000 వరకూ ఉంటాయి. మీరు పెట్టిన తనఖా ప్రాతిపదికన ఓవర్డ్రాఫ్ట్ పునః చెల్లింపు గడువు ఆధారపడి ఉంటుంది. దీనిని బ్యాంక్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement