-
రూ. 158 కోట్ల వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ స్కామ్
ఆన్లైన్ మోసాలకు అంతం లేకుండా పోతోంది. ముఖ్యంగా నిరుద్యోగులనే మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. పార్ట్టైమ్ జాబ్ పేరుతో రూ.కోటి మోసం వెలుగు చూసిన మరుసటి రోజే మరో భారీ స్కామ్ బయటపడింది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటూ అమాయకులను మోసం చేసి రూ.158 కోట్ల స్కామ్కి పాల్పడిన ముఠాను బెంగళూరు సిటీ పోలీసులు పట్టుకున్నారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన అమీర్ సోహైల్, ఇనాయత్ ఖాన్, ముంబైకి చెందిన సయ్యద్ అబ్బాస్ అలీ, మిథున్ మనీష్ షా, నైనా రాజ్, సతీష్, మిహిర్ శశికాంత్ షా, హైదరాబాద్కు చెందిన నయాజ్, ఆదిల్ పట్టుబడ్డారు. మరో ఇద్దరు అనుమానితులను పట్టుకోవాల్సి ఉంది. ఇలా మోసగించారు.. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ల ముసుగులో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫారమ్ల ద్వారా సందేహాస్పద ఫోన్ నంబర్లతో అమాయకులకు ఈ ముఠా చేరువయ్యారు. యూట్యూబ్ వీడియోలకు లైక్ కొట్టడం, యాప్ను ఇన్స్టాల్ చేయడం వంటి సులువైన పనులను అప్పగించి పూర్తయ్యాక డబ్బులిస్తామని నమ్మించారు. ఇలా నమ్మినవారితో కొద్దికొద్దిగా డబ్బులు తీసుకున్నారు. బాధితులు తమ డిజిటల్ వాలెట్లు వివిధ దశల్లో క్రెడిట్ అవుతున్నట్లు చూడగలిగినప్పటికీ, ఆ డబ్బు డ్రా చేసుకుకోవడానికి ప్రయత్నించే వరకు మోసం బయటపడలేదు. తమ డిజిటల్ ఖాతాలు నకిలీవని, స్కామ్కు గురయ్యారని వారు గ్రహించి బాధితులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా విచారణ ప్రారంభించారు. రూ. 18.5 లక్షలు పోగొట్టుకున్నట్లు విద్యారణ్యపురకు చెందిన బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీబీ అధికారులు 30 బ్యాంకు ఖాతాల్లో రూ.62.8 లక్షలను స్తంభింపజేశారు. తదుపరి దర్యాప్తులో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సిఆర్పి) ద్వారా 28 రాష్ట్రాల్లో నమోదైన 2,143 సైబర్ క్రైమ్ కేసుల్లో దీని వెనుక ఉన్న అనుమానితుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. కర్ణాటకలో నమోదైన మొత్తం 265 కేసుల్లో బెంగళూరు లోని 14 పోలీస్ స్టేషన్లలోనే 135 కేసులు నమోదయ్యాయి. -
ఇదో కొత్తతరహా మోసం.. జాగ్రత్త: సజ్జనార్
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు కొత్త నేరాలకు తెరలేపారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పార్సిళ్ల పేరుతో వారు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. దర్యాప్తు సంస్థల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాను మొదలెట్టారని... మీ పేరిట ఫెడెక్స్లో డ్రగ్స్ పార్సిల్ ఉందంటూ బెదిరింపులకు దిగుతున్నారని హెచ్చరించారు. నకిలీ ఐడీ కార్డులు, పార్సిళ్ల ఫొటోలను వాట్సాప్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. భయపడినవారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ పార్శిల్ అనగానే భయపడిపోయి అడిగినంత డబ్బులు సమర్పించుకోవద్దన్నారు. దర్యాప్తు సంస్థల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. మీ పేరిట ఫెడెక్స్లో డ్రగ్స్ పార్సిల్ ఉందంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నకిలీ ఐడీ కార్డులు, పార్సిళ్ల ఫొటోలను వాట్సాప్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. భయపడిన వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి… pic.twitter.com/l30JmmPCeS — V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 2, 2024 -
ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఆశపడితే మొదటికే మోసం! బ్యాంక్ మేనేజర్కి జరిగింది ఇదే..
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్లైన్, సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. సామాన్యులే కాకుండా బ్యాంక్ మేనేజర్ వంటి అవగాహన ఉన్న ఉన్నత ఉద్యోగులు కూడా ఈ మోసాల బారిన పడుతున్నారు. రూ.లక్షల్లో డబ్బును పోగొట్టుకుంటున్నారు. పుణేలో ఓ బ్యాంక్ మేనేజర్ ఇలాగే ఆన్లైన్ టాస్క్ల మోసానికి గురయ్యారు. మొదట ఫారమ్లను నింపడం, వీడియోలను చూడటం వంటి చిన్న చిన్న టాస్క్లను ఇచ్చిన మోసగాళ్లు పూర్తయిన తర్వాత వెంటనే అతని బ్యాంక్ ఖాతాకు డబ్బును జమ చేశారు. బాధితుడు వారిని విశ్వసించడం ప్రారంభించిన తర్వాత "టాస్క్ యాక్టివేషన్ ఫీజు" అడగడం ప్రారంభించారు. ఇలా రూ. 15 లక్షలకు పైగా అతని నుంచి రాబట్టారు. బాధితుడు ఆన్లైన్ వారిచ్చిన 27 టాస్క్లను పూర్తి చేసినా వాటికి డబ్బు మాత్రం చెల్లించలేదు. పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో ఎర టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో స్కామర్లు బ్యాంక్ మేనేజర్కు ఎర వేశారు. ఈ మేరకు బాధితుడి ఫోన్కు మెసేజ్ పంపించారు. ఇది నిజమేనని నమ్మిన బ్యాంక్ మేనేజర్ స్కామర్లను సంప్రదించాడు. ఖాళీ సమయంలో ఇంటి నుంచి పని చేయడం ద్వారా అద్భుతమైన రాబడి వస్తుందని వారు ఆయన్ను నమ్మించారు. తర్వాత ఒక గ్రూపులో నమోదు చేసుకోవాలని చెప్పి టాస్క్లు ఇవ్వడం ప్రారంభించారు. మొదట్లో కొన్ని టాస్క్లు పూర్తి చేసిన కొంత డబ్బు వచ్చింది. ఆ తర్వాత టాస్క్లను యాక్టివ్ చేయడానికి బాధితుడి నుంచి డబ్బు తీసుకోవడం ప్రారంభించారు. మొదట్లో వెంటనే డబ్బు అలా ఒక టాస్క్లో భాగంగా అతన్ని 27 విమాన టిక్కెట్లు బుక్ చేయమని అడిగారు. ఈ టాస్క్ను యాక్టివేట్ చేయడానికి రూ. 10,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ డబ్బును డిపాజిట్ చేసి టాస్క్ పూర్తి చేసిన బాధితుడి బ్యాంకు ఖాతాలో రూ. 16,321 జమయ్యాయి. దీని తరువాత టాస్క్ల యాక్టివేషన్ కోసం బ్యాంక్ మేనేజర్ వారికి డబ్బు పంపడం ప్రారంభించాడు. వారిచ్చిన 27 టాస్క్లు పూర్తి చేశాడు. వాటి మీద వచ్చిన సొమ్మును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించగా మరో మూడు టాస్క్లు పూర్తి చేయాల్సి ఉంటుందని స్కామర్లు అతనికి చెప్పారు. అంతే కాదు వాటిని యాక్టివేట్ చేసేందుకు మరో రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని కోరారు. దీంతో మోసపోయానని గ్రహించిన బ్యాంక్ మేనేజర్ పోలీసులను ఆశ్రయించాడు. -
'క్రెడిట్ కార్డు' కోసం.. ఫోన్కు మెసేజ్ వచ్చిందా.. జర జాగ్రత్త! లేదంటే..
సాక్షి, మహబూబాబాద్: క్రెడిట్ కార్డు బ్లాక్ అయిపోతోంది.. వెంటనే అప్ డేట్ చేసుకోవాలని ఓ వ్యక్తి ఫోన్కు మెసేజ్ వచ్చింది. దీనిని చూసి ఆందోళనకు గురైన బాధితుడు వెంటనే తనకొచ్చిన మెసేజ్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి అప్డేట్ చేశాడు. అనంతరం ఫోన్కు ఓటీపీ రాగా టైప్ చేశాడు. అప్డేట్ అయిన తర్వాత నిమిషాల వ్యవధిలో రూ.64 వేలు ఖాతా నుంచి మాయమయ్యాయి. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఈ నెల 3వ తేదీన మానుకోట పట్టణంలో జరిగింది. జిల్లా కేంద్రంలోని కంకరబోర్డు కేజీఆర్ కాలనీకి చెందిన చీదరి సతీష్ కుమార్ ఫోన్కు ఈ నెల 3వ తేదీన క్రెడిట్ కార్డు బ్లాక్ అయిపోతుంది.. వెంటనే అప్ డేట్ చేసుకోవాలని ఓ గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్ పంపించాడు. ఇందుకు స్పందించిన సతీష్కుమార్ వెంటనే ఆ మెసేజ్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి యూనియన్ బ్యాంక్ ప్రొఫార్మా రాగానే అప్ డేట్ చేశాడు. ఆ వెంటనే అతడి ఫోన్కు ఒటీపీ వచ్చింది. దానిని టైప్ చేసిన తర్వాత అప్ డేట్ అయింది. నిమిషాల వ్యవధిలో బాధితుడి ఖాతా నుంచి రూ.64 వేలు డెబిట్ అయినట్లు సమాచారం వచ్చింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ వై.సతీష్ ఆదివారం తెలిపారు. ఇవి చదవండి: కారులో బయలుదేరిన కొన్ని నిమిషాలకే.. విషాదం! -
లాభాల వలవేసి.. డబ్బు లాగేసి..
కర్నూలు: ముచ్చటైన ఆఫర్లు.. కళ్లెదుటే లాభాలు.. చుట్టుపక్కల వాళ్లను జతచేస్తే బోనస్లు, ఇన్సెంటివ్లు. అకౌంట్లోకి తేరగా వచ్చి పడుతున్న డబ్బును చూసి అందరికీ ఆశ కలిగింది. ఒకరిని చూసి మరొకరుగా చేరుతుండటంతో కొత్త స్కీమ్లు తెరపైకి వచ్చాయి. రూ.100 కడితే రూ.2 వేల ఆదాయం వస్తుండటంతో కంపెనీకి విస్తృత ప్రచారం లభించింది. కొత్త అకౌంట్ల సంఖ్య పెరగడంతోపాటు వ్యాపారం రూ.కోట్లకు చేరింది. అంతా సజావుగా సాగుతున్నట్టు అనిపించినా ఒకానొక రాత్రి ఆ కంపెనీ చీకట్లో కలిసిపోయింది. లబోదిబోమంటున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్లేస్టోర్లో పుట్టుకొచ్చి .. ప్లేస్టోర్ వేదికగా పుట్టుకొచ్చిన కెనడియన్ సోలార్ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఆన్లైన్ కార్యకలాపాలను ప్రారంభించింది. ఐదు నెలల కాలంలో అందమైన ఆఫర్లతో వేలాది మందిని బుట్టలో వేసుకుంది. కాఫీ తాగుతున్న విదేశీ యువతి ఫొటోను డీపీగా పెట్టుకుని 97904 01505, 44 7467 135 221 నంబర్లతో వాట్సాప్ చాటింగ్ ద్వారా ఖాతాదారులకు కంపెనీ దగ్గరైంది. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లతో ఒకరి తర్వాత ఒకరు లాభాలకు ఆకర్షితులయ్యారు. మొదట్లో డబ్బు చెల్లించడమే తరువాయి.. వెంటవెంటనే డబ్బు వస్తుండటంతో నమ్మకంతోపాటు ఖాతాదారుల సంఖ్య కూడా పెరిగిపోయింది. కొత్త స్కీమ్లతో విస్తరణ మొదట 45 రోజుల స్కీమ్తో ఈ కంపెనీ ప్రారంభమైంది. ఆ తర్వాత నెల రోజులు.. 15 రోజులు.. 10 రోజులు.. 3 రోజులు.. చివరగా ఒక్క రోజు కాల వ్యవధితోనూ స్కీమ్లు నడిపింది. 45 రోజుల స్కీమ్లో డబ్బు డిపాజిట్ చేసిన వాళ్లకు వెనువెంటనే ఖాతాల్లోకి డబ్బు చేరుతుండటం.. ఆ వివరాలను చూసి మరికొందరు ఆ స్కీమ్లలో చేరడం జరిగిపోయింది. పది రోజుల స్కీమ్లో ఒకసారి రూ.47 వేలు కడితే.. 10 రోజుల వరకు రోజూ రూ.21,374 చొప్పున అకౌంట్లలో జమ చేస్తారు. ఒక్క రోజు స్కీమ్ (ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్)లో రూ.13,500 చెల్లిస్తే అదే రోజు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత రూ.29,700 చెల్లిస్తామని కంపెనీ నమ్మబలికింది. రెఫర్ చేస్తే బోనస్ ఖాతాదారులను ఆకట్టుకునేందుకు చైన్ లింకును తెరపైకి తెచ్చింది. ఒకరికి లింకు పంపిస్తే బోనస్ను నిర్ణయించింది. ఆ లింకు డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తి రూ.13,500 చెల్లిస్తే.. చేర్పించిన వ్యక్తికి రూ.1,800 బోనస్, 700 పాయింట్లు, అదనంగా రూ.600 సబ్సిడీ బోనస్ కలిపి రూ.3,500 చెల్లిస్తుంది. ఇలా జాయిన్ చేసిన వారి వివరాలను వాట్సాప్ చాట్లో నమోదు చేస్తే ఒక ప్రోమో కోడ్ వస్తుంది. ఆ కోడ్ను తమ వద్దనున్న యాప్లో రివార్డు కాలమ్లో ఎంటర్ చేయగానే బోనస్ మొత్తం అకౌంట్లో జమ అవుతుంది. చీకట్లో కలిసిపోయింది. నమ్మకమే పెట్టుబడిగా ఏర్పాటైన ఈ కంపెనీ చీకట్లో కలిసిపోయింది. ఎంతగా అంటే.. ప్లే స్టోర్లో కూడా సమాచారం లేకుండాపోయింది. చివరకు సెల్ఫోన్ల నుంచి కూడా యాప్ దానంతటదే డిలీట్ అయ్యిందంటే కంపెనీ నిర్వాహకుల తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. స్పందన’లో ఫిర్యాదు కెనడియన్ సోలార్ యాప్లో డబ్బులు డిపాజిట్ చేస్తే రెట్టింపు మొత్తం తిరిగి ఇస్తామని చెప్పి మోసం చేశారని కర్నూలు నగరం బుధవారపుపేటకు చెందిన అర్ఫత్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్కు ఈ నెల 17న స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. రూ.2.85 లక్షలు ఆన్లైన్లో డిపాజిట్ చేస్తే రూ.13 లక్షలు చెల్లిస్తామని నమ్మించి మోసం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement