-
ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
► అంతా వీఐపీలే ► పత్తి గోదాంలో అడ్డా.. ► కేసు కాకుండా నేతల విఫలయత్నం ► కోర్టుకు వెళ్లొచ్చిన కొద్దిగంటలకే అరెస్టు వేములవాడ రూరల్ : మండలంలోని తిప్పాపురం గ్రామంలోని ఒక పత్తి గోదాంలో పేకాట ఆడుతున్న ఆరుగురుని సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. శ్రీలక్ష్మీబాలాజీ ట్రేడింగ్ కంపెనీకి చెందిన పత్తి గోదాంలో మంగళవారం కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడకు చేరుకున్నారు. పేకాట ఆడుతున్న వేములవాడ పట్టణానికి చెందిన కట్కం శ్రీనివాస్, తాటికొండ రాంబాబు, కట్కం శంకరయ్య, బుస్స కైలాసం, మోటూరి శ్రీనివాస్లతోపాటు ఫాజుల్నగర్ గ్రామానికి చెందిన బిక్కుమల్ల రమేశ్ను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.39,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వీరంతా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తూ, ప్రముఖులుగా చలామణి అవుతున్నవారే. విషయం తెలుసుకున్న పట్టణంలోని ప్రముఖ వ్యాపారులు పోలీస్స్టేషన్కు వచ్చారు. కేసు కాకుండా విడిపించాలని తీవ్రప్రయత్నాలు చేశారు. సీఐ శ్రీనివాస్ పైరవీలకు అవకాశం ఇవ్వకుండా కేసు నమోదు చేశారు. నాయకుల వత్తాసు పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన వారికి పట్టణానికి చెం దిన ప్రముఖ నాయకుడు, మాజీ ప్రజాప్రతినిధి వత్తాసు పలికాడు. అధికార పార్టీలో ఉన్న ఆ నాయకుడు పేకాటరాయుళ్లకు సమీప బంధువు కావడం, వారితో పలు వ్యాపార లావాదేవీలు ఉండడంతో కేసు నుంచి తప్పించాలని ప్రయత్నించాడు. పోలీస్స్టేషన్కు వచ్చిన ఆయన పోలీసులతో చేసిన సంధి ప్రయత్నం విఫలం కావడంతో ‘కేసు నమోదు చేశారు కనుక రాత్రికి ఇంటికి పంపించాలని’ ఒత్తిడి తీసుకువచ్చాడు. పత్తి మిల్లే అడ్డాగా.. రోజంతా పత్తి వ్యాపారం నిర్వహిస్తున్న ఈ మిల్లు ప్రముఖ నాయకులకు పేకాట అడ్డాగా కూడా మారినట్లు ఆరోపణ లు వస్తున్నాయి. వేములవాడ, సిరిసిల్ల ప్రధాన రోడ్డు పక్కన గల శ్రీలక్ష్మీబాలాజీ ట్రేడింగ్ కంపెనీకి చెందిన పత్తిగోదాం పేకాట రాయుళ్లకు అడ్డాగా మారింది. ఉదయం వ్యాపారం పత్తి వ్యాపారం... సాయంత్రం వేళ ఇందులో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పేకాటలో పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోరుున ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. కోర్టుకు వెళ్లొచ్చిన కొన్ని గంటలకే...? పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన వారిలో కొందరు మంగళవారం పేకాట కేసులోనే కోర్టుకు వెళ్లొచ్చారు. కొద్ది గంటలకే మళ్లీ పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కడం విశే షం. కోర్టుకు వెళ్లి, అక్కడి నుంచి నేరుగా మళ్లీ పత్తి గోదాం కు చేరుకుని పేకాట ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి అరెస్టు చేయడం పట్టణంలో చర్చనీయాంశమైంది. ఈ పేకాటరాయుళ్లలో తండ్రీకొడుకులు సైతం ఉండటం కొసమెరుపు. -
మూడుముక్కలాట
► పచ్చని కుటుంబాల్లో పేకాట చిచ్చు ► అనుమతి రమ్మీకి..ఆడుతోంది తీన్పత్తా ► తనిఖీలకు పూనుకోని పోలీస్శాఖ బలవుతున్న మధ్యతరగతి ► ఆట కోసం ఇతర జిల్లాల నుంచి రాక.. ► జిల్లాలో రిక్రియేషన్ క్లబ్ల పేరిట దందా పచ్చని కుటుంబాల్లో పేకాట చిచ్చు పెడుతోంది. మూడు ముక్కలాట మధ్యతరగతి కుటుంబాలను ముక్కలు చేస్తోంది. ప్రభుత్వ ఉక్కుపాదంతో పేకాట క్లబ్లు కొన్నాళ్లు మూతపడగా.. కొందరు కోర్టుకు వెళ్లి రిక్రియేషన్ క్లబ్ల పేరిట మళ్లీ పేకాట దందాకు తెరలేపుతున్నారు. దీంతో ఇతర జిల్లాలనుంచి ఇక్కడికి పేకాడేందుకు తరలివస్తున్నారు. ఇతర జిల్లాల్లో అనుమతివ్వని పోలీస్శాఖ మన జిల్లాలో మాత్రం పేకాట నిర్వహణకు తలుపులు బార్లా తెరవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. - కరీంనగర్ క్రైం పేకాటలో చిత్తవుతున్నవారి బాధలు చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్... తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పేకాట స్థావరాలు, క్లబ్లు మూసేయించాలని డీజీపీకి ఆదేశాలు జారీచేశారు. దీంతో క్లబ్లు, పేకాట స్థావరాలపై ఉక్కుపాదం మోపాలని ఆయా జిల్లాల ఎస్పీలకు డీజీపీ అనురాగ్శర్మ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు పలు జిల్లాల్లో పోలీసులు వాటి ని మూసివేయించారు. దీనిపై పలువురు వీటిపై కోర్టుకు వెళ్లారు. ఈక్రమంలో జిల్లాలో కొన్ని పేకాట క్లబ్లకుఅనుమతి ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోటాపోటీజిల్లాలో పేకాట క్లబ్లకు అనుమతులు మంజూరయ్యాయని కొంతకాలంగా ప్రచారం చేసుకున్న జి ల్లాలోని ఓ రిక్రియేషన్ క్లబ్ అనేక మందిని సభ్యులు గా చేర్చుకున్నారు. సభ్యత్వం కోసం అక్షరాల రూ. లక్ష వసూలు చేశారని సమాచారం. సభ్యులుగా చేరి న వారికి మాత్రమే పేకాట ఆడడానికి అనుమతిస్తా రు. కొత్తగా ఏర్పాటుచేసిన క్లబ్లో పేకాట ఆడడానికి మాత్రమే వచ్చే వారికి కోసం ప్రత్యేకంగా రూ.20 వేల నుంచి రూ.40 వేలు వసూలు చేసి సభ్యులుగా తీసుకుంటున్నారని తెలిసింది. ఈ విషయం పేకాటరాయుళ్లకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపిస్తుండడంతో జిల్లాతోపాటు వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల నుంచి అనేకమంది పేకాడేందుకు జిల్లాకు తరలివస్తున్నారు. వీరి రాకతో సదరు క్లబ్ కళకళలాడుతోంది. వీరికే అనుమతులెందుకు? రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్లను ప్రభుత్వం మూసేయించడంతో కొందరు నిర్వాహకులు, ఇతరులు కోర్టులను ఆశ్రయించారు. ఈక్రమంలో కోర్టు పలు నిబంధనలు పెట్టింది. దీంతో పేకాట క్లబ్లను నిర్వహించడం తమతో కాదంటూ అనేకమంది మూసివేశారు. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లోనే మూతపడగా.. జిల్లాలో అనుమతి రావడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని పోలీస్శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ పేకాట క్లబ్లకు అనుమతులు రాకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో మాత్రం కొందరు పోలీసు అధికారుల మద్దతుతోనే అనుమతులు మంజూరు చేశారని ప్రచారం జరుగుతోంది. పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టి పలువురి ఆత్మహత్యకు కారణమైన పేకాట క్లబ్లను మూసివేయాలనే డిమాండ్తో మహిళా సంఘాలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. నిబంధనలు తోసిరాజని... నిబంధనలను అమలు చేస్తున్నామంటూనే క్లబ్ నిర్వాహకులు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. రిక్రియేషన్ క్లబ్లో సభ్యులను మాత్రమే పేకాట ఆడుకోవడానికి అనుమతిస్తారు. రమ్మీ మాత్రమే ఆడాలి. క్లబ్లో రెండుసెంటర్లు ఏర్పాటు చే స్తున్నట్లు సమాచారం. ఒకటి నిబంధనల ప్రకారం సీసీ కెమెరాల కింద కొన్ని టేబుల్స్ నిర్వహిస్తుంటారు. ఇక్కడ రమ్మీ మాత్రమే ఆడుతారు. మరోటి క్లబ్ చివరలో రహస్యంగా ఏర్పాటుచేసిన సెంటర్లో రూ.5 వేలు, రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ తీన్పత్తా(మూడు ముక్కలాట) ఆడిస్తున్నారని తెలుస్తోంది. సెంటర్లో కొంతకాలం సీసీ కెమెరాల వద్ద ఆడిన వారిని.. సమస్యలు లేవని నిర్ధారించుకున్నాకనే రహస్య కేంద్రంలోకి అనుమతిస్తున్నారని సమాచారం. ఈ క్లబ్ నిర్వహణపై అనుమానం వ్యక్తం చేస్తున్న కొందరు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం. బయట సైతం కొన్నిచోట్ల మూడు ముక్కలాట జోరుగా సాగుతోంది. పోలీసులు దాడులు చేస్తున్నా... కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ ఆట కొనసాగిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలే సమిధలు పేకాటలో ఎక్కువగా బలవుతోంది మధ్యతరగతి ప్రజలే. మొదట వారికి కొంచెం లాభం వచ్చేట్లు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు. మరింతగా అప్పుచేసి ఆటలో పెడుతుండడంతో ఉన్నదంతా పోయి రోడ్డు మీద పడడంతోపాటు పలువురు తీరని అప్పులు చేస్తూ నష్టపోతున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చాలామంది బయటకు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకోవడమో... ఊరు విడిచి వెళ్లిపోవడమో చేస్తున్నట్లు సమాచారం. -
రూ. 100 కోట్లు చేతులు మారిన సొమ్ము
జిల్లా అంతటా జోరుగా కోడిపందేలు, పేకాట గోదావరి జిల్లాలను తలపించేలా భారీగా శిబిరాలు పోటెత్తిన పందెం రాయుళ్లు మచిలీపట్నం : సంక్రాంతి పండుగ మూడు రోజులు జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు భారీస్థాయిలో నిర్వహించారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను తలపిస్తూ ఈసారి జిల్లాలోనూ పందెం రాయుళ్లు పోటెత్తారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కోడిపందేల బరులు యథేచ్ఛగా కొనసాగాయి. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో యథేచ్ఛగా శిబిరాలు నిర్వహించారు. బరుల వద్దే బెల్టుషాపులనూ ఏర్పాటు చేశారు. పందెం రాయుళ్ల కోసం రెస్టారెంట్లను ఏర్పాటు చేసి బరుల వద్ద సకల సౌకర్యాలు కల్పించారు. కోడిపందేల పేరుతో ఏర్పాటు చేసిన బరుల్లో పెద్ద ఎత్తున పేకాట, జూదాలూ నిర్వహించారు. నేడూ కొనసాగనున్న పందేలు... భోగి రోజున ప్రారంభమైన ఈ బరులు ఆదివారం కొనసాగుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. జిల్లాలో పండుగ మూడు రోజుల పాటు కోడిపందేలు, పేకాట తదితరాల రూపంలో రూ.100 కోట్లకు పైగా చేతులు మారినట్లు అంచనా. గన్నవరం నియోజకవర్గంలోని అంపాపురంలో కోడిపందేలు, పేకాటను భారీస్థాయిలో నిర్వహించారు. సినీ నిర్మాతలు నల్లమలుపు బుజ్జి, ప్రసాద్ కోడిపందేలను తిలకించారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు, వత్సవాయిలో కోడిపందేలు కొనసాగాయి. పామర్రు నియోజకవర్గంలోని యలకుర్రు, కొమరవోలు, కనుమూరు, గూడపాడులో కోడిపందేలు, పేకాటజోరుగా సాగాయి. తిరువూరులోని కాకర్ల, ముష్టికుంట్ల, ఎ.కొండూరు మండలంలో రేపూడి, గంపలగూడెం మండలం తోటమూల ప్రాంతాల్లో కోడిపందేలు, పేకాట, గుండాటలు నిర్వహించారు. మచిలీపట్నం కేంద్రీయ విద్యాలయం వద్ద కోడిపందేలను మంత్రి కొల్లు రవీంద్ర వీక్షించారు. గాలిపటాలను ఎగురవేశారు. పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లులో యథేచ్ఛగా కోడిపందేలు, పేకాట జరిగాయి. కొల్లేటికోట, భుజబలపట్నం, భైరవపట్నం, కలిదిండి మండలం నాగన్నచెరువు తదితర ప్రాంతాల్లో భారీస్థాయిలో కోడిపందేలు నిర్వహించారు. మైలవరం మండలంలోని నాగులేరు, జి.కొండూరు మండలంలోని వెలగలేరు, ఇబ్రహీంపట్నంలో భారీస్థాయిలో బరులను ఏర్పాటు చేశారు. నూజివీడు నియోజకవర్గంలోని జనార్దనవరం, పోతిరెడ్డిపాలెం, జంగంగూడెం, ఈదర, శోభనాపురం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహించారు. పెడన నియోజకవర్గంలోని కొంకేపూడిలో కోడిపందేల కన్నా పేకాట శిబిరం జోరుగా కొనసాగింది. బంటుమిల్లి మండలం పెందుర్రులో భారీస్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. వెంకటాపురం, నడకుదురు, శ్రీకాకుళం, దిండి, సంగమేశ్వరం, సొర్లగొంది, జరుగువానిపాలెంలలో పేకాట, కోడిపందేల శిబిరాలను నిర్వహించారు. కృష్ణవరంలో ఘర్షణ... ఆగిరిపల్లి మండలం కృష్ణవరం కొమ్మూరు చెరువులో ఏర్పాటు చేసిన కోడిపందేల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. వీరబత్తిన జోషి అనే వ్యక్తి గాయాలపాలయ్యాడు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘర్షణ చెలరేగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బరిలో ఉన్న వారిని చెదరగొట్టారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
రూ. 300 కోట్లు కొక్కొరొకో
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి జిల్లాల్లో భోగి పండుగ రోజు మొదలైన కోడిపందేలు మకర సంక్రాంతి నాడు తారాస్థాయికి చేరుకుని కనుమరోజు రాత్రి పొద్దుపోయేవరకు జోరుగా సాగాయి. ఈ మూడు రోజులు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరాయంగా సాగిన పందేలలో సుమారుగా రూ.300 కోట్ల వరకు చేతులు మారాయని అంచనా. హైకోర్టు ఆదేశాలు, లోకాయుక్త ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలను దాటుకుని ప్రజా ప్రతినిధుల అండతో మొదలైన కోడిపందేలు ఎలాంటి ఆటంకాలూ లేకుండా జాతరల మాదిరిగా కొనసాగాయి. పందెం బరుల వద్దే పేకాట శిబిరాలు, మద్యం దుకాణాలు, బెల్టుషాపులు వెలిశాయి. కోడి పందేలు, పేకాటల్లో కోట్లల్లో డబ్బు చేతులు మారగా గుండాట, కోతాటల్లో లక్షల రూపాయలు చేతులు మారాయి. చేతులు మారిన రూ.300 కోట్లు ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఈ ఏడాది కోడిపందేలు జోరుగా సాగాయి. మూడు రోజుల్లో మొత్తంగా రూ.300 కోట్లు చేతులు మారినట్లు అంచనా. అందులో ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే సుమారుగా రూ.250 కోట్ల మేర పందేలు సాగినట్లు తెలుస్తోంది. ఎక్కువ బరులు ఏర్పాటైన చింతలపూడి నియోజకవర్గంలోనే సుమారు రూ.100 కోట్లకు పైబడి పందేలు, జూదాలు జరిగినట్టు సమాచారం. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పందేలకు అనుమతులివ్వక పోవడంతో సరిహద్దు ప్రాంతమైన చింతలపూడి నియోజకవర్గంపై ఆ ప్రభావం కనిపించింది. తెలంగాణకు చెందిన వేలాదిమంది కార్లు, బైకులపై ఈ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరులవైపు ప్రయాణం కట్టారు. తాడేపల్లిగూడెం పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన బరుల వద్ద రాయలసీమ ప్రాంతానికి చెందిన పందెంరాయుళ్లు అధిక సంఖ్యలో కనిపించారు. ఈ మూడురోజుల్లో జరిగిన పందేలలో సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి, సంగీత దర్శకుడు కోటి, నటుడు శివకృష్ణ, జబర్దస్త్ కార్యక్రమంలోని పలువురు నటులు పాల్గొన్నారు. మరో రోజు అనుమతికి యత్నాలు మూడు రోజులూ అనధికార అనుమతులతో జోరుగా పందేలు నిర్వహించిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ముక్కనుమ రోజైన ఆదివారం కూడా పందేలను నిర్వహించడానికి పోలీసు అధికారులతో సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఐతే పోలీసులు మాత్రం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. -
పేట్రేగిపోతున్న పేకాటరాయుళ్లు
* పల్లె పట్టణం తేడా లేకుండా కొనసాగుతున్న ఆట * వీరి కోసమే ప్రత్యేకంగా హోటళ్లు * బలవుతున్న కుటుంబాలు * నామమాత్రపు చర్యలకు పరిమితమవుతున్న పోలీసులు పరిగి: గ్రామాలు, పట్టణాలు అని తేడాలేకుండా పేకాట రాయుళ్లు విజృంభిస్తున్నారు. పేకాటకు బానిసలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. యువకులు, పేద, ధనిక తేడాలేకుండా అందరూ ఈ ఆట మత్తులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మండల పరిధిలోని సుల్తాన్పూర్, మల్లెమోనిగూడ, సయ్యద్పల్లి, రాఘవాపూర్ తదితర గ్రామాల్లో పేకాటరాయుళ్ల సంఖ్య అధికంగా ఉంది. గ్రామ శివారుల్లో పేకాట ఆడుతున్న వారి కోసమే కొన్ని హోటళ్లు వెలుస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువత.. పేకాట కుటుంబాలను చిద్రం చేయడమే కాకుండా కొందరి ప్రాణాలు కూడా బలిగొంటోంది. ఇటీవల పరిగిలో పేకాట ఆడేచోట తలెత్తిన వివాదంలో ఓ యువకుడు హత్యకు గురికాగా.. అదే కేసులో అనుమానితుడు ఆ వెంటనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి గొడవలు అనేకం చోటుచేసుకుంటునా బయటకు వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. దాబాలు, శివారుల్లోని చెట్లు, రచ్చబండలు, పాఠశాల వరండాలు పేకాట రాయుళ్లకు అడ్డాలుగా మారుతున్నాయి. నామమాత్రపు దాడులు గ్రామాల్లో పేకాటతో శాంతిభద్రతల సమస్య కూడా వచ్చి పడుతోంది. లక్షాధిపతులు బికారులుగా మారుతుండగా పేదలు భార్యల మెడల్లో ఉన్న పుస్తెలతాళ్లు అమ్ముకున్న సందర్భాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఇన్ని జరుగుతున్నా పేకాటను అరికట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినప్పుడు మాత్రం తూతూ మంత్రంగా పోలీసులు దాడులు జరిపి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలున్నాయి. పేకాట ఆడుతున్న వారిలో అధికులు బడానాయకులు, వ్యాపారస్తులు, ఉన్నతకుటుంబాలకు చెందిన వారుంటుండటంతో దాడులు చేసిన ప్రతిసారి పోలీసులపై కూడా తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో పోలీసులు కూడా పేకాట రాయుళ్లపై చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి పకడ్బందీ చర్యలు తీసుకుంటే తప్పా పేకాటకు స్వస్తి పలికే అవకాశం లేదని ప్రజలు చెబుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
Advertisement