-
పాత కక్షలతో మహిళ హత్య
ఆసిఫాబాద్ (ఆదిలాబాద్): మండలంలోని ఇప్పల నవగాంలో శుక్రవారం అర్ధరాత్రి పాత కక్షలతో వివాహిత ఇంజరి లక్ష్మి హత్యకు గురైంది. అదే గ్రామానికి చెందిన ఇంజరి బాపు, బద్ది రామయ్య గ్రామానికి చెందిన పటేల్ సోమయ్య వద్ద వ్యవసాయ పనులు చేసేందుకు రూ.10 వేలు అడ్వాన్సుగా తీసుకున్నారు. ఈ డబ్బుల్లో చెరో రూ.5 వేలు తీసుకున్నారు. ఈ క్రమంలో డబ్బులు తీసుకున్న మరుసటి రోజు నుంచి రామయ్య పనులకు వెళ్లడం లేదు. తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించడం లేదు. ఈ క్రమంలో తీసుకున్న డబ్బులు రామయ్య వారం రోజుల్లో తిరిగి చెల్లిస్తానని గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పుకుని చెల్లించలేదు, పనికి వెళ్లలేదు. దీంతో శుక్రవారం రాత్రి బాపు తన భార్య లక్ష్మితో కలిసి రామయ్య ఇంటికి వెళ్లాడు. విషయం మాట్లాడుతుండగా అక్కడే ఉన్న రామయ్య మేనల్లుడు ఆత్రం మహేశ్.. బాపు భార్య లక్ష్మి పొత్తి కడుపుపై పిడిగుద్దులు గుద్దుతూ, మెడ, తలపై దాడి చేశాడు. గొంతు నులిమి దాడి చేశాడు. దీంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లయ్య తెలిపారు. -
వెంటాడి గొంతుకోసి చంపిన బంధువులు
గూడూరు: పాత కక్షలు పురివిప్పాయి... అదను కోసం కాపుకాసిన బంధువులు మారణాయుధాలతో వెంటాడి.. అతి కిరాతకంగా చిన్న జయరామయ్య(30), డేగా పెద్ద జయరామయ్య (32) అనే ఇద్దరిని గొంతుకోసి, నరికి చంపిన దారుణ ఘటన గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇందిరానగర్లో ఆదివారం జరిగింది. ఈ జంట హత్యలతో ఆ ప్రాంతం భీతిల్లింది. వివరాల మేరకు.. పందులు మేపుకుంటూ జీవనం సాగించే దొమ్మరి సామాజిక వర్గానికి చెందిన సమీప బంధువులైన డేగా రామయ్య, డేగా చెంగయ్య కుటుంబాలకు పాత కక్షలు ఉండేవి. ఈ ఏడాది జూలై 5న డేగా చెంగయ్య కుమారుడు నారాయణ పందులను మేతకు తోలుకెళ్తున్నాడు. ఈ క్రమంలో డేగా రామయ్యతో కలిసి అతని తమ్ముడు చిన కోటయ్య, కొడుకులు చిన్న జయరామయ్య, పెద్ద జయరామయ్య, బాబు, కాపుకాసి నారాయణను హతమార్చారు. దీంతో పోలీసులు చిన్న, పెద్ద జయరామయ్యలు, బాబు, తండ్రి రామయ్య, చిన్నాన్న చిన్న కోటయ్యలైన ఐదుగురిపై హత్య కేసు నమోదు చేయడంతోపాటు, రౌడీ షీట్లు కూడా తెరిచారు. ఆ రెండు కుటుంబాల మధ్య మళ్లీ ఘర్షణలు పునరావృతమై హత్యలకు దారితీయకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా వారిని ఊరు విడిచి వెళ్లిపోవాలని చెప్పడంతో, వారు కోట మండలం విద్యానగర్కు కాపురం వెళ్లాపోయారు. ఈ క్రమంలో గత శుక్రవారం రామయ్య ఇల్లు కాలిపోవడంతో, చిన్న, పెద జయరామయ్యలు, సోదరుడు బాబు, వారి భార్యాపిల్లలు గూడూరుకు వచ్చారు. అదును చూసి హత్యచేశారు.. ఇదే అదును కోసం కాపుకాసి ఉన్న డేగా చెంగయ్య బంధవులు రమేష్, శీను, చింతాలు, కాంతారావుతో ఇంకొందరు మహిళలు.. ఇంటి పనులు చేసుకుంటున్న చిన్న జయరామయ్య, పెద్ద జయరామయ్యలతోపాటు, వారి కుటుంబ సభ్యులపై కారప్పొడి చల్లి దాడికి పాల్పడ్డారు. సోదరులు చిన్న పెద్ద జయరామయ్యలను విచక్షణా రహితంగా గొంతు కోసి, ముఖంపై కత్తులతో పోట్లు పొడిచి గుర్తుపట్టలేనంతగా హత్యచేశారు. ఈ దాడిలో సోదరులిద్దరూ మృతి చెందగా, పెద్ద జయరామయ్య భార్య చినక్క, అత్త పూజారి రామమ్మ తీవ్రంగా గాయపడ్డారు. అయితే సోదరులతోపాటు వచ్చిన బాబు అప్పుడే వెళ్లిపోవడంతో తప్పించుకున్నాడు. లేదంటే అతన్ని కూడా మట్టుపెట్టేవారని బంధువులు విలపించారు. పోలీసుల అదుపులో కొందరు నిందితులు ఈ మేరకు సమాచారం అందుకున్న గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబు, పట్టణ సీఐ టీవీ సుబ్బారావులతోపాటు ఎస్సై బాబి ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగినట్లు తెలుసుకున్న మృతుల బంధువులు అక్కడికి చేరుకుని మృత దేహాల వద్ద బోరున విలపించారు. తమ వారిని హత్య చేసిన వారిని కూడా చంపేస్తామంటూ బయలుదేరబోగా డీఎస్పీ వారిని వారించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి మృతుని భార్య చిన్నక్క నుంచి వివరాలు సేకరించారు. దారుణ హత్యలకు పాల్పడ్డ వారిలో కొందరు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. -
ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరికి కత్తిపోట్లు
ప్రకాశం జిల్లా : గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నారాయణరెడ్డి అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన రంగడు శుక్రవారం కత్తితో గాయపర్చాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. నారాయణరెడ్డి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు లాయర్ల హత్య
- కక్షిదారుడే కాల్చి చంపాడు - పాత కక్షలతో మరో లాయర్ హతం - రెండు హత్యలకు మద్యం మత్తే ప్రధాన కారణం చెన్నై, సాక్షి ప్రతినిధి : సరదాగా తీసుకున్న మద్యం ఇద్దరు లాయర్ల ప్రాణాలను హరించివేసింది. అసలు కారణం ఏదైనా మద్యం మత్తులో ఆవేశానికి లోనుకావడం నిండు ప్రాణాలను నిలువునా తీసింది. చంటిబిడ్డతో ఉన్న ఓ ఇల్లాలికి, నిండు గర్భిణిగా ఉన్న మరో ఇల్లాలికి భర్తల మరణం తీరనిశోకాన్ని మిగిల్చింది. చెన్నై అడయార్ వన్నాందురై ఎల్లయమ్మాళ్ కోవిల్ వీధికి చెందిన శ్రీనివాసన్ కుమారుడు కామేష్ (34) సైదాపేట కోర్టులో లాయర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తండయార్పేటకు చెందిన ఈశ్వరన్ (25)పై ఉన్న మూడు హత్య కేసులను కామేష్ వాదిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈశ్వరన్ తన కారులో లాయర్ కామేష్ను పుదుచ్చేరికి తీసుకెళ్లాడు. అక్కడ రాత్రి 7 గంటల వరకు ఇద్దరూ మద్యం సేవించి అర్ధరాత్రి చెన్నైకి బయలుదేరారు. కారును కామేష్ నడుపుతున్నాడు. ఈ సమయంలో ఈశ్వరన్ తన వద్దనున్న తుపాకీతో కామేష్ను కాల్చి పరారైనట్లు సమాచారం. కామేష్ తీవ్రరక్తస్రావంతో బాధపడుతూనే తండయార్పేటకు చెందిన సెల్వం అనే తన స్నేహితునికి ఫోన్లో సమాచారం ఇచ్చాడు. మరికొందరు స్నేహితులతో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న సెల్వం అడయార్లోని ఒక ప్రముఖ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే చికిత్స ఫలించక కామేష్ ప్రాణాలు వదిలాడు. భిన్న కథనాలు హత్యకు దారితీసిన వివరాల్లో భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. తనపై సాగుతున్న కేసుల విచారణకు కామేష్ మరింత సొమ్ము కోరడం, కేసును ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడాన్ని సహించలేకనే చంపివేసినట్లు నిందితుడు ఈశ్వరన్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. కారు నడుపుతున్న కామేష్ మార్గమధ్యంలో డివైడర్కు గీసుకున్నట్లు వాహనాన్ని పోనించడంతో సదరు కారు యజమాని కూడా అయిన ఈశ్వరన్ కోప్పడి హేళనగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరూ తీవ్రంగా ఘర్షణపడటం, ఈశ్వరన్ తన వద్దనున్న తుపాకీతో కామేష్ను కాల్చడం జరిగినట్లు మరో కథనంగా ఉంది. లాయర్ కామేష్ తన రక్షణార్థం తుపాకీ వెంటపెట్టుకు తిరుగుతాడని, పుదుచ్చేరి వెళ్లినపుడు ప్యాంటుకు వెనుకవైపు వీపులో తుపాకీని పెట్టుకుని కారును నడుపుతుండగా ప్రమాద వశాత్తు పేలినట్లు మూడో కథనం వినిపిస్తోంది. నిందితుడు ఈశ్వరన్ను అరెస్ట్ చేసి, లాయర్ ప్రాణాలు పోవడానికి కారణమైన తుపాకీని, ఈశ్వరన్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు కామేష్కు దీపా అనే భార్య, మేఘ అనే నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. లాయర్ ప్రాణం తీసిన మద్యం గొడవ బారులో మద్యం సేవనంలో జరిగిన గొడవ జమాల్ అహ్మద్ అనే లాయర్ ప్రాణాలను బలితీసుకుంది. దిండుగల్లు జిల్లా చెంబట్టికి చెందిన జమాల్ అహ్మమద్ (32), భార్య కభీషా (22) ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. జమాల్ అహ్మమద్ దిండుగల్లు కోర్టులో న్యాయవాది వృత్తిని నిర్వహిస్తున్నారు. గతంలో ఒక ముస్లిం సంఘం నేతగా ఉండి ప్రస్తుతం విడుదలై చిరుతైగళ్ కట్చిలో ఉన్నాడు. ఇతనిపై దాడులు, ఆస్తి పంచాయితీలు నిర్వహిస్తున్నట్లు అనేక పోలీస్ కేసులు ఉన్నాయి. జమాల్కు సిద్దయన్ కోట్టైకి చెందిన సెల్వకు మధ్య పాతకక్షలున్నాయి. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జమాల్ అహ్మద్ మద్యం సేవిస్తుండగా, ముగ్గురు స్నేహితులతో కలిసి సెల్వ అదే బారుకు మద్యం తాగేందుకు వచ్చాడు. ఇద్దరికీ మద్యం మత్తు బాగా ఎక్కడంతో గొడవపడ్డారు. రెండు వర్గాలను బార్ యజమాని బైటకు తరిమివేశాడు. బార్ బయట ఒంటరిగా నిల్చుని ఉన్న జమాల్ అహ్మద్పై సెల్వ తన ముగ్గురు స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. వారు కొట్టిన దెబ్బలకు జమాల్ స్పృహకోల్పోయి పడిపోవడంతో నిందితులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన జమాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చేపట్టింది. -
వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై టీడీపీ దాడి
వేటకొడవళ్లు, గొడ్డళ్లతో వెంటాడిన వైనం పొన్నూరు: పాతకక్షల నేపథ్యంలో చర్చలకు పిలిచి నిరాయుధులైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులపై పాతకక్షల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. వేటకొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో వెంటాడారు. ఈ సంఘటనలో వైఎస్సాఆర్సీపీ సానుభూతిపరులు ఐదుగురికి తలలు పగలగా, మరికొందరికి గాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని బ్రాహ్మణకోడూరు గ్రామంలో టీడీపీ కార్యకర్తలు, వైఎస్సాఆర్సీపీ సానుభూతిపరుల మధ్య గత కొంత కాలంగా చిన్నచిన్న ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో గ్రామంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని, ఈ మేరకు చర్చలకు రావాలని తెదేపా వర్గీయులు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులను ఆహ్వానించారు. తక్కువ కుటుంబాలు ఉన్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆదివారం చర్చలకు వెళ్లారు. చర్చలు ప్రారంభం కాకముందే టీడీపీకి చెందిన కూరపాటి శ్యామ్ తాను గతంలోనే హత్యలు చేశానని, పోలీసులు, జైళ్లు కొత్తేమీ కాదనీ, ఒక్కొక్కరిని లేపేస్తానంటూ రెచ్చగొట్టడంతో పాటు దాడికి దిగాడు. వ్యూహత్మకంగా జరిగిన ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు కూరపాటి పిచ్చయ్య, కూరపాటి సురేష్, కూరపాటి చిన్నబాబు, కూరపాటి నాగశేషు, కూరపాటి జయరాజు, కూరపాటి అశోక్రాజు, శ్రీరాం సుశీలరావు వేటకొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో వెంటాడారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మన్నవ నాగార్జునను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన్నవ నరసింహారావు, మన్నవ ఆదాం, దగ్గుమల్లి సుబ్బారావు, కనపర్తి సుబ్బారావుల తలలు పగిలాయి. దగ్గుమల్లి స్టాలిన్, జయదేవ్, సొంగా రాజు, ఉర్రా సుబ్బయ్య తదితరులకు స్వల్ప గాయాలైయ్యాయి. వీరందరూ నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యానగర్: టీడీపీ నాయకుల దాడిలో ఆదివారం తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ సానుభూతిపరునికి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. బ్రాహ్మణకోడూరు గ్రామానికి చెందిన మన్నవ నాగార్జున ఆటో డ్రైవర్గా పనిచేసుకుని జీవిస్తుంటాడు. తెదేపా కార్యకర్తలు శ్యామ్, మరో నలుగురు తనపై ఇనుపరాడ్డులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని బాధితుడు చెప్పాడు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు బాధితుడిని పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందనీ, అత్యావసర చికిత్సా విభాగంలో చికిత్సనందిస్తున్నామని అన్నారు. 24 గంటలు గడిస్తేగానీ ఏ విషయం చెప్పలేమని తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి సంబంధిత స్టేషన్కు తరలించనున్నామని ఔట్ పోష్టు సిబ్బంది తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement