-
ఐదో రోజూ అదే జోరు
ఆరంభ లాభాలను కోల్పోయినప్పటికీ, గురువారం స్టాక్ మార్కెట్ లాభపడింది. ప్రపంచ మార్కెట్లు పతనమైనా, మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఆర్బీఐ కొత్త నిబంధనలు రుణాలు తీసుకున్నవాళ్లకు కరోనా కల్లోల కాలంలో ఊరటనివ్వనున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించడం, డాలర్తో రూపాయి మారకం విలువ 48 పైసలు పుంజుకొని 73.82కు చేరడం సానుకూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 253 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 40 పాయింట్ల లాభంతో 39,113 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 11,559 పాయింట్ల వద్దకు చేరింది. వరుసగా ఐదో రోజూ ఈ సూచీలు లాభపడ్డాయి. షాంఘై సూచీ లాభాల్లో ముగియగా, ఇతర ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. అందరి కళ్లూ పావెల్ ప్రసంగంపైననే.. జాక్సన్ హోల్ సింపోజియమ్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ చేసే గురువారం రాత్రి ప్రసంగంపైననే ఇప్పుడు అందరి కళ్లు ఉన్నాయి. ఆయన ప్రసంగంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే నిర్ణయాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ► ఈ ఏడాది డిసెంబర్ వరకూ స్టాంప్ డ్యూటీని 3 శాతం మేర తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో రియల్టీ షేర్లు దూసుకుపోయాయి. డీఎల్ఎఫ్ 10%, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, గోద్రేజ్ ప్రొపర్టీస్, ఓబెరాయ్ రియల్టీ, సన్టెక్ రియల్టీ తదితర షేర్లు 7% లాభపడ్డాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 7 శాతం లాభంతో రూ.605 వద్ద ముగిసింది. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్త నిబంధనలు
తణుకు అర్బన్: సర్కారు ఆస్పత్రుల్లో వైద్యులు ఎవరు.. సిబ్బంది ఎవరు.. ఏ వైద్యుడు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నారు.. ఎవరు లేరు.. ఏ రోగానికి ఎవరిని సంప్రదించాలి అనే వివరాలు ఇకపై సులభంగా తెలుసుకునే వీలు కలగనుంది. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాల మేరకు వైద్యవిధాన పరిషత్, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వైద్యులు, సిబ్బందికి డ్రెస్కోడ్తోపాటు విధి విధానాలను ప్రకటించారు. ఈ నెల 1 నుంచి ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వైద్యశాఖ అధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులకు ఆకుపచ్చ రంగు, ఉద్యోగులకు నీలం రంగు, టెక్నికల్ స్టాఫ్కు ఎరుపు రంగు, ఫోర్త్ క్లాస్ సిబ్బందికి పసుపు రంగు, మినిస్టీరియల్ సిబ్బందికి గోల్డెన్ పసుపు రంగుల్లో నేమ్ బోర్డులను అందజేశారు. మార్గదర్శకాలు ఇవే ♦ వైద్యుడి నుంచి సిబ్బంది వరకు యూనిఫాం వేసుకోవాల్సిందే. అంటే డ్రెస్ కోడ్ తప్పక పాటించాలి. ♦ తమ హోదా, పేరు తెలిపే నేమ్ బోర్డును డ్రెస్పై ఛాతీ ప్రదేశంలో అమర్చుకోవాలి. ♦ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉండాల్సిందే. ♦ వైద్యుడు అందుబాటులో ఉన్నారా లేరా అనేది ఇన్/అవుట్ బోర్డు ఆస్పత్రి ముఖద్వారంలో ఉండాలి. ♦ షిఫ్ట్ల ప్రకారం విధుల్లో ఉండే ఉద్యోగులు నిబంధనల ప్రకారం ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు ఉండాలి. ♦ క్లాస్ ఫోర్ ఉద్యోగులు షిఫ్ట్లు కాకపోతే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండాలి. ♦ కాల్ డ్యూటీ విధులు నిర్వర్తించే వైద్యులు, నర్సులకు ఉదయం ఒక గంట ఆలస్యమైనా అనుమతి ఉంటుంది. ♦ ఉదయం 9.15 గంటలు దాటిన తరువాత విధులకు హాజరైన వైద్యులు, సిబ్బందికి సగం రోజు ఆబ్సెంట్ వేస్తారు. ♦ వరుసగా మూడు ఆబ్సెంట్లకు ఒక సీఎల్ (క్యాజువల్ లీవ్) పోతుంది. ప్రయోజనాలివే.. విధుల్లో ఉండాల్సి వైద్యులు తాపీగా రావడం, వచ్చి బయటకు వెళ్లడం వంటి కారణాలతో జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోను రోగులు వైద్యసేవల కోసం వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. కొత్త మార్గదర్శకాల కారణంగా ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు ఏ సమయంలో రోగులు ఆస్పత్రికి వెళ్లినా వైద్యసేవలు అందుతాయి. వైద్యులు, ఉద్యోగులు యూనిఫాంలో ఉండి నేమ్బోర్డు ధరించడం వలన వారు ఎవరు అనే విషయం తెలుస్తుంది. ఇన్/అవుట్ బోర్డు ద్వారా ఏ డాక్టరు అందుబాటులో ఉన్నారనేది సులువుగా అర్ధమవుతుంది. సీసీ కెమెరాలు కలెక్టరేట్కు అనుసంధానం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలో అందుబాటులో ఉండాలనే నిబంధన 80 శాతం మంది పాటించడంలేదనేది వైద్యాధికారుల ఆరోపణ. ఆయా ఆస్పత్రుల వైద్యాధికారులు సమయానికి రావాల్సి ఉందని హెచ్చరిస్తుంటే తమ సామాజిక వర్గాల నాయకులను వెంటబెట్టుకుని పోరాటం చేస్తున్నారని, ఈ కారణంగా వైద్యాధికారులు చూసీచూడనట్లు ఉండాల్సి వస్తోందనేది ప్రధాన విమర్శ. దీనికి చెక్ పెట్టేందుకు కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇప్పటికే ఆస్పత్రుల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను కలెక్టరేట్కు అనుసంధానం చేయించారు. బయోమెట్రిక్ హాజరు వేసి జారుకునే వారి వివరాలు సేకరించేందుకు ఆస్పత్రుల సీసీ పుటేజీలను కలెక్టర్ స్వయంగా పరిశీలిస్తున్నారు. దీంతో ఎవరు ఏంటి అనేది తెలుసుకుని నేరుగా పనిష్మెంట్ ఇవ్వనున్నట్టు సమాచారం. నిబంధనలు పాటించాల్సిందే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యశాఖలో, వైద్యవిధాన పరిషత్లో అమలులోకి తెచ్చిన నూతన నిబంధనలను వైద్యులు, సిబ్బంది పాటించాల్సిందే. అందరూ యూనిఫాం ధరించాలి. నేమ్ బోర్డు కనిపించేలా అమర్చుకోవాలి. సమయపాలన తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కె.శంకరరావు, డీసీహెచ్ఎస్, ఏలూరు నిబంధనలు పాటించకపోతే చర్యలు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వైద్యశాఖలో వస్తున్న మార్పులను వైద్యులు, సిబ్బంది పాటించాలి. గతంలో మాదిరిగా వచ్చాం.. వెళ్లాం.. అంటే ఇక కుదరదు. డ్రెస్ కోడ్తోపాటు వైద్యసేవల్లో కూడా సమయపాలన అనుసరించాలి. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీఎంహెచ్ఓ, ఏలూరు -
హెచ్–1బీ స్టూడెంట్ వీసాపై కొత్త నిబంధనలు
-
హెచ్–1బీ స్టూడెంట్ వీసాపై కొత్త నిబంధనలు
వాషింగ్టన్: అమెరికాలో మాస్టర్ డిగ్రీ, ఇతర ఉన్నత విద్యల్ని అభ్యసించిన విదేశీ విద్యార్థులకు జారీ చేసే హెచ్–1బీ వీసాలపై కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. విద్యార్థులు డిగ్రీ తీసుకునే సమయానికి ఆ విద్యాసంస్థకు.. యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యుషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉంటేనే ‘స్టూడెంట్ హెచ్–1బీ’ వీసాకు అర్హుడని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం(యూఎస్సీఐఎస్) స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది 65 వేల హెచ్–1బీ, అమెరికాలో ఉన్నత విద్య చదివిన వారికి అదనంగా 20 వేల హెచ్–1బీ వీసాలు జారీ చేస్తారు. కాలిఫోర్నియాకు చెందిన లీనా ఆర్ కామత్ తనకు హెచ్–1బీ వీసా(అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన వారికిచ్చే) కేటగిరీలో ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించాలని దరఖాస్తు చేయగా... ఇమ్మిగ్రేషన్ విభాగం తిరస్కరించింది. డిగ్రీ తీసుకునే సమయానికి అతను చదివిన ఇంటర్నేషన్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి హయ్యర్ ఎడ్యుకేషన్ గుర్తింపు లేదని పేర్కొంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement