-
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది
టాలీవుడ్కి చెందిన మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. మూడు రోజుల క్రితమే శుభకార్యం జరగ్గా.. తాజాగా ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫొటోలు చూస్తుంటేనే వివాహం చాలా గ్రాండ్గా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు బ్యూటీకి అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతకీ ఎవరీ హీరోయిన్? పెళ్లి కొడుకు ఎవరో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్) ముంబయి బ్యూటీ నటాషా దోషి.. మలయాళ సినిమాలతో నటిగా కెరీర్ ప్రారంభించింది. 2012-17 మధ్య నాలుగు చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. 2018లో 'జై సింహా' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్దగా ఆడలేదు. దీంతో ఈమెకు మరో రెండు చిత్రాల్లో మాత్రమే అవకాశమొచ్చింది. శ్రీకాంత్ 'కోతలరాయుడు'లో హీరోయిన్గా, కల్యాణ్ రామ్ 'ఎంతమంచి వాడవురా' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. 2020 తర్వాత సినిమాల్ని పక్కనబెట్టేసిన నటాషా దోషి.. పూర్తిగా సైలెంట్ అయిపోయింది. కానీ గతేడాది జూలైలో మనన్ షా అనే వ్యాపారవేత్త నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. త్వరలోనే పెళ్లి ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ ఏడాది జనవరి 31న కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకుంది. కానీ దాదాపు నెల తర్వాత ఇప్పుడు తనకు మ్యారేజ్ అయిన విషయాన్ని బయటపెట్టింది. ఈ క్రమంలోనే అందరూ నటాషా దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు. (ఇదీ చదవండి: సీక్రెట్గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ) -
Natasha Doshi Latest Photos: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జై సింహా హీరోయిన్ ఫోటోలు
-
బాలయ్య హీరోయిన్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ, నయనతార నటించిన చిత్రం 'జై సింహా'. ఈ చిత్రంలో మరో నటి హీరోయిన్గా కనిపించింది. మలయాళ చిత్రం మాంత్రికన్తో ఎంట్రీ ఇచ్చిన ముంబయి ముద్దుగుమ్మ నటాషా దోషి ఆ తర్వాత తెలుగులో కోతల రాయుడు చిత్రంలో నటించింది. తాజాగా ఈ ముంబయి భామ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వెల్లడించింది. ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. 'ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో నటాషా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నట్లు తెలుస్తంది. ఇది చూసిన నటాషా ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. (ఇది చదవండి: ఆ దర్శకుడికి కలిసొచ్చిన హీరోయిన్.. దక్షిణాదిలోనే భారీ రెమ్యునరేషన్!) అమ్మ కుట్టి పాటకు అదరగొట్టింది జై సింహా చిత్రంతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నటాషా. ఈ చిత్రంలో సినిమాలో 'అమ్మ కుట్టి' పాటకు స్టెప్పులతో అదరగొట్టింది. అంతకుముందు మలయాళంలో నాలుగు సినిమాల్లో నటించింది. జైసింహా తర్వాత శ్రీకాంత్ సరసన 'కోతల రాయుడు'లో కనిపించింది. అంతే కాకుండా కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'ఎంత మంచివాడవురా' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లో మెరిసింది. (ఇది చదవండి: 'సౌందర్య చనిపోలేదు.. ఆ రూపంలో ఇంకా బతికే ఉంది') View this post on Instagram A post shared by Natasha Doshi (@natashadoshi) -
స్టైలిష్ రాయుడు
శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కోతలరాయుడు’. డింపుల్ చోపడే, నటాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధీర్ దర్శకత్వం వహిస్తున్నారు. అవారు సదానంద్ కిషోర్, కోలన్ వెంకటేశ్ నిర్మించారు. రెండు పాటలు మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. శనివారం శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను వెల్లడించారు టీమ్. ‘‘ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ అలరిస్తుంది. సుధీర్ అద్భుతంగా తెరకెక్కించారు’’ అని శ్రీకాంత్ అన్నారు. ‘‘దర్శకుడిగా ‘రయ్.. రయ్’ నా తొలి చిత్రం. ఇది రెండోది. ఈ చిత్రంలో శ్రీకాంత్ స్టైలిష్గా కనిపిస్తారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. డీజే వసంత్ మంచి సంగీతాన్ని అందించారు. కెమెరామేన్ బుజ్జి విజువల్స్ బాగా వచ్చాయి. ఈ సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు సుధీర్బాబు. పోసాని కృష్ణమురళి, పృథ్వీ, చంద్రమోహన్, జయప్రకాష్రెడ్డి, మురళీశర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. -
కోతల రాయుడు
శ్రీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘కోతల రాయుడు’. ‘కృష్ణాష్టమి’ ఫేమ్ డింపుల్ చోపడే, ‘జై సింహా’ ఫేమ్ నటాషా దోషి కథానాయికలు. ‘జయహే’ సినిమాని తెరకెక్కించిన సుధీర్ రాజు దర్శకత్వంలో వెంకటరమణ మూవీస్ బ్యానర్లో ప్రొడక్షన్ నం. 1గా కొలన్ వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్లో ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఈ నెల 16న మా సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రాజమండ్రి, బెంగుళూరులో అధిక భాగం చిత్రీకరణ జరపనున్నాం. ఆగస్టు చివరి వారంలో షూటింగ్ పూర్తి అవుతుంది’’ అన్నారు. షాయాజి షిండే, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, ‘సత్యం’ రాజేష్, పృథ్వీ, చంద్రమోహన్, సుధ, హేమ, శ్రీలక్ష్మీ, జయవాణి, తాగుబోతు రమేష్ ముఖ్య పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు సంగీతం: డి.జె. వసంత్, కెమెరా: సతీష్. జి, సహ నిర్మాత: సిరాజ్ వి. వెంకట్ రావు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement