-
అందుకేనా!.. ముషారఫ్ రాహుల్ని ప్రధానిగా చూడాలనుకుంది: బీజేపీ
పాక్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషారఫ్ మృతికి సంతాపం తెలుపుతూ కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ముషారఫ్ శాంతి కోసం శత్రువుగా మారిన నిజమైన శక్తి అని ఆయన అభివర్ణించారు. దీంతో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా శశిథరూర్పై విమర్శలతో విరుచుకుపడ్డారు. బాలాకోట్ దాడులను అనుమానించి సొంత ఆర్మీ చీఫ్ని గూండాగా పిలిచిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుంది ఫైర్ అయ్యారు. పైగా ముషారఫ్పై తెగ అభిమానం కురిపిస్తోందంటూ ధ్వజమెత్తారు. ముషారఫ్ ఒకప్పుడు భారతదేశానికి నిష్కళంకమైన శత్రువు కానీ 2002 నుంచి 2007 మధ్య శాంతికి నిజమైన శక్తిగా మారాడని శశిథరూర్ ట్విట్టర్లో అన్నారు. ఆ రోజుల్లో తాను యూఎన్లో ఉండగా ఏటా అతన్ని కలుసుకునేవాడినని చెప్పారు. అతను వ్యూహాత్మకంగా చాలా తెలివిగా వ్యవహరించేవాడని పేర్కొన్నారు. దీంతో షెహజాద్ ఒసామా బిన్ లాడెన్, తాలిబాన్లను ప్రశంసించే ముషారఫ్ రాహుల్ గాంధీని కూడా ప్రసంసించారంటూ నాటి సంఘటనను గుర్తు చేశారు. కార్గిల్ యుద్ధానికి కారకుడు, ఉగ్రవాదానికి మద్దతుదారుడు అయిన ముషారఫ్ని ప్రశంసించడానికి బహుశా అదేనా కారణం అంటూ విరుచుకుపడ్డారు. 2019లో లోక్సభ ఎన్నికలకు ముందు ముషారఫ్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను షెహజాద్ ప్రస్తావించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో రాహుల్ని ప్రధానిగా చూడాలనుకుంటున్నానని చెప్పారు. అంతేగాదు నిజాయితీగా చెప్పాలంటే.. భారత్ లేదా పాకిస్తాన్ కోసమో కాదు. నిజంగా శాంతి కావాలంటే మోదీ సాబ్ వద్దు అని అన్నారు. అలాగే తన తల్లి, అన్నయ్య, కొడుకు ఢిల్లీకి వెళ్లినప్పుడూ.. రాహుల్ గాంధీ తన కొడుకుని టీ తాగడానికి ఆహ్వానించారని చెప్పారు. అలాగే మన్మోహన్ సింగ్ తమ ముగ్గురిని భోజనానికి ఆహ్వానించారని అన్నారు. తాను భారత్తో క్రికెట్ని ప్రోత్సహించేవాడినని, దీంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పరిచే వాటిని తాను ప్రోత్సహిస్తానని ముషారఫ్ చెప్పుకొచ్చారు. కాగా అమిలోయిడోసిస్తో బాధపడుతున్న ముషారఫ్ దుబాయ్ ఆస్పత్రిలో ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. “Pervez Musharraf, Former Pakistani President, Dies of Rare Disease”: once an implacable foe of India, he became a real force for peace 2002-2007. I met him annually in those days at the @un &found him smart, engaging & clear in his strategic thinking. RIP https://t.co/1Pvqp8cvjE — Shashi Tharoor (@ShashiTharoor) February 5, 2023 (చదవండి: శునకానికి కుల ధృవీకరణ పత్రమా! కంగుతిన్న అధికారులు) -
నిర్మల్: టెన్నిస్ కోర్టుకు మళ్లీ వీఆర్ఏలు
సాక్షి,నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టర్ టెన్నిస్ ఆట వ్యవహారం విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. నిర్మల్ టెన్నిస్ కోర్టులో మళ్లీ వీఆర్ఏలకు డ్యూటీలు విధించారు. దీంతో వీఆర్ఏలు విధులకు హాజరయ్యారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ తాను టెన్నిస్ ఆడుతుంటే.. బంతులు అందించేందుకు ఏకంగా 21 మంది వీఆర్ఏలకు బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్ చర్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే తాజాగా గురువారం సైతం వీఆర్ఏలకు టెన్నిస్ కోర్టు వద్ద డ్యూటీలు విధించడం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. తమకు టెన్నిస్ కోర్టు వద్దే ప్రతి సాయంత్రం డ్యూటీలు విధించారని.. అందుకోసమే ఏం చేయాలో తెలియక ఇక్కడే విధులు నిర్వహస్తామంటున్నారు వీఆర్ఏలు. అయితే తాము టెన్నిస్ కోర్టుకు వచ్చేసరికి ఇంకా కలెక్టర్ టెన్నిస్ కోర్టు వద్దకు రాలేదని వీఆర్ఏలు పేర్కొన్నారు. ప్రతి రోజూ డే అంతా ఇక్కడే డ్యూటీ చేస్తామని అన్నారు. వెనకాల ఇద్దరు.. నెట్ మధ్యలో ఇద్దరం ఉంటామని చెప్పారు. ఈ రోజు టెన్నిస్ కోర్టుకు నలుగురు వీఆర్ఏలు వచ్చామని అన్నారు. సాయంత్రం స్పెషల్ డ్యూటీ టెన్నిస్ కోర్టులో వేస్తారని తెలిపారు. -
కలెక్టర్ టెన్నిస్ ఆట కోసం.. 21 మంది వీఆర్ఏలకు విధులు
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ వివాదంలో చిక్కుకున్నారు. కలెక్టర్ టెన్నిస్ ఆడుతుంటే బంతులు అందించేందుకు ఏకంగా 21 మంది వీఆర్ఏలకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లాలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. కలెక్టర్ టెన్నిస్ హెల్పర్లుగా 21 మంది పేర్లతో నిర్మల్ తహసీల్దార్ శివప్రసాద్ ఓ జాబితాను విడుదల చేశారు. ఆ జాబితా ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ రోజూ సాయంత్రం 5.30 గంటలకు నిర్మల్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వెనకే ఉన్న గ్రౌండ్లో సహచర అధికారులతో కలిసి టెన్నిస్ ఆడతారు. కలెక్టర్ టెన్నిస్ ఆడే సమయంలో కోర్టు వద్ద బంతులు అందించేందుకు రోజుకీ ముగ్గురు చొప్పున వారానికి 21 మంది వీఆర్ఏలకు తహసీల్దార్ ప్రత్యేక విధులు కేటాయించారు. వీరిపై పర్యవేక్షణకు మరో ఏడుగురు వీఆర్వోలను నియమిస్తూ సోమవారం డీ/777/2020 నంబర్తో ప్రత్యేక ప్రొసీడింగ్ జారీ చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం వివాదాస్పదమైంది. కలెక్టర్ ఆదేశాలతోనే తహసీల్దార్ ఈ జాబితా రూపొందించారా, లేక తహసీల్దారే అత్యుత్సాహంతో జాబితాను విడుదల చేశారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు వీఆర్ఏలకు విధులు అప్పజెప్పడంపై వివాదం చేలరేగడంతో వీఆర్ఏలను కలెక్టర్ వెనక్కి పంపారు. వీఆర్ఏలు లేకుండా బుధవారం గేమ్ ఆడారు. చదవండి: పొరుగు రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేయం: గంగుల కమలాకర్ -
ఇండో-పాక్ యుద్ధంపై ముషార్రఫ్ కీలక వ్యాఖ్యలు
యూఏఈ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు మళ్లీ ప్రమాద స్దాయికి చేరుకున్నాయని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. ఇరు దేశాల మధ్య అణ్వస్త్ర దాడి ఉండబోదని వ్యాఖ్యానించారు. తాము ఒక అణు బాంబుతో భారత్పై దాడి చేస్తే పొరుగు దేశం(భారత్) 20 అణు బాంబులతో తమను నాశనం చేస్తుందని చెప్పుకొచ్చారు. భారత్పై తొలుత తాము 50 అణుబాంబులతో విరుచుకుపడటమే దీనికి పరిష్కారమన్నారు. అలా చేస్తేనే భారత్ తిరిగి తమపై ప్రతిదాడి చేసే అవకాశం సన్నగిల్లుతుందన్నారు. కాగా పాకిస్తాన్తో మెరుగైన సంబంధాల కోసం ఇజ్రాయెల్ ఆసక్తి కనబరుస్తోందన్నారు. తమ దేశంలో రాజకీయ వాతావరణం సానుకూలంగా ఉంటే తాను పాకిస్తాన్కు తిరిగి వెళతానని దుబాయ్లో ఆశ్రయం పొందుతున్న ముషార్రఫ్ పేర్కొన్నారు. కాగా, 2001–08 మధ్యకాలంలో పాక్ అధ్యక్షుడిగా ఉన్న ముషార్రఫ్, అభిశంసన నుంచి తప్పించుకునేందుకు రాజీనామా చేశారు. చికిత్స పేరుతో దుబాయ్ వెళ్లిన ముషార్రఫ్ మళ్లీ పాక్కు రాలేదు. 2007లో రాజ్యాంగాన్ని రద్దుచేయడంతో ముషార్రఫ్పై దేశద్రోహం కేసు నమోదైంది. -
ధోనిని వాఘా సరిహద్దు నుంచి తెచ్చుకున్నాం!
ముంబయి: దాయాది పాకిస్థాన్తో ఆ దేశంలో జరిగిన 2005–06 ద్వై పాక్షిక సిరీస్ సందర్భంగా అప్పటి పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్కు తనకు మధ్య జరిగిన ఓ సరదా సంభాషణను భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘నాకు ఇప్పటికీ గుర్తుంది. 2006లో పాకిస్థాన్ టూర్ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ మ్యాచ్ తర్వాత ‘అతడిని ఎక్కడి నుంచి తీసుకువచ్చార’ని ధోనీ గురించి ముషారఫ్ అడిగాడు. దీంతో వాఘా సరిహద్దుల్లో నడిచి వెళ్తోన్న అతడిని మేం తెచ్చేసుకున్నాం’ అని తను సరదాగా సమాధాన మిచ్చినట్లు దాదా వెల్లడించారు. అలాగే ధోనీ ప్రస్తుత ఫామ్ గురించి మాట్లాడుతూ ‘ధోనీ ఒక ఛాంపియన్. టీ20 ప్రపంచ కప్ గెలిచిన దగ్గరి నుంచి అతడి కెరీర్ అద్భుతంగా సాగింది. అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నాం. ఎక్కడున్నాం. ఎంత వయసు, అనుభవం ఉంది.. అనేదాని కంటే మన ప్రదర్శనే కీలకం. లేకపోతే మన స్థానాన్ని ఇంకొకరు భర్తీ చేస్తారు’ అని గంగూలీ అన్నారు. అయితే 2019 ప్రపంచకప్లో పాల్గొనే భారత బృందంలో ధోనీ పేరు ఉంటుందా అని ప్రశ్నించగా.. ‘నేను సెలెక్టర్ను కాను. కానీ ఇప్పుడున్న బృందంలో 85–90 శాతం ప్రపంచ కప్లో ఆడే అవకాశం ఉంది’ అభిప్రాయపడ్డాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement