-
ఆమ్వేకు భారీ షాక్ ! రూ.757 కోట్ల ఆస్తులు ఎటాచ్
మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీ ఆమ్వేకు భారీ షాక్ తగిలింది, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆ కంపెనికి చెందిన రూ.757 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎటాచ్ చేసింది. ఇందులో స్థిర, చర ఆస్తుల విలువ రూ.411 కోట్లు ఉండగా మిగిలిన రూ.346 కోట్ల నగదును ఎటాచ్ చేసింది. ఆమ్మేకు చెందిన దుండిగల్లో ఉన్న ఫ్యాక్టరీ, ఫర్నీచర్, మెషినరీలతో పాటు ఈ కంపెనీకి చెందిన 36 బ్యాంకు ఖాతాలను ఈడీ ఎటాచ్ చేసింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత డిసెంబరులో ఈ కంపెనీలకు కొత్త నియమ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు అందిస్తున్న పొడక్టులన్నీ కూడా రెగ్యులర్ మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల కంటే అధిక ధరతో ఉండటం, ఈ వ్యాపారంలో భాగస్వాములకు అధిక మొత్తంలో కమిషన్లు అందివ్వడం తదితర వ్యవహరాలపై అనేక విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎల్ఎంలో అతి పెద్ద సంస్థ అయిన ఆమ్వేకు భారీ షాక్ ఇచ్చింది ఈడీ. ED has provisionally attached assets worth Rs. 757.77 Crore belonging to M/s. Amway India Enterprises Private Limited, a company accused of running a multi-level marketing scam. — ED (@dir_ed) April 18, 2022 చదవండి: ఆమ్వే, ఓరిఫ్లేమ్, టప్పర్వేర్.. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు షాక్ ! -
ఆమ్వే, ఓరిఫ్లేమ్, టప్పర్వేర్.. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు షాక్ !
Direct Selling New Guidelines In India 2021: నేరుగా విక్రయాలు సాగించే కంపెనీలు (డైరెక్ట్ సెల్లింగ్) పిరమిడ్, నగదు చలామణి పథకాలను నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం నోటిఫై చేసింది. దీంతో 90రోజుల్లోగా కొత్త నిబంధనలను కంపెనీలు అమల్లో పెట్టాలి. ఈ కంపెనీలు తాము విక్రయించే ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలి. టప్పర్వేర్, ఆమ్వే, ఒరిఫ్లేమ్ ఇవన్నీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలే. ఈ కంపెనీల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వీటి వలన ఆర్థిక, వినియోగదారుల మార్కెట్లో పోంజి స్కీమ్స్ అరికట్టవచ్చని నిపుణులు అంటున్నారు. ఆహ్వానిస్తున్నాం ప్రభుత్వం విధించిన నూతన నిబంధనలు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఆహ్వానించాయి. డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ చైర్మన్, ఆమ్వే ఇండియా, కార్పోరేట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ రజత్ బెనర్జీ స్పందిస్తూ.. ప్రభుత్వం విధించిన నూతన నిబంధనలు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్పై ఆధారపడి దేశంలో 70 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, ఇందులో సగం మంది మహిళలే అన్నారు. ప్రభుత్వం రెండేళ్లుగా ఈ విధానంపై అధ్యయనంపై చేసి తాజా నిబంధనలు రూపొందించిందన్నారు. దీని వల్ల డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్పై ఉన్న అపోహలు తొలగిపోతాయని ఆశిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కీలక నిబంధనలు ఇలా - డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు పిరమిడ్ తరహా నగదు చెల్లింపు పథకాలను అమలు చేయకూడదు - ఆమ్వే వంటి కంపెనీలు తమ ఉత్పత్తులను ఈ కామర్స్ సైట్లలో అమ్ముకోవచ్చు. అయితే కన్సుమర్ ప్రొటెక్షన్ రూల్స్ - 2020( ఈ కామర్స్) నిబంధనలు పాటించాలి - డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న సంస్థలను నియంత్రించేందుకు సమర్థవంతమైన వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలి. - డైరెక్ట్ సెలింగ్ వ్యాపారంలో ఉన్న కంపెనీలు ఇండియాలో కచ్చితంగా ఒక రిజిస్ట్రర్ ఆఫీసును భౌతికంగా కలిగి ఉండాలి - వారి ఉత్పత్తుల నాణ్యతకు అమ్మందారులు బాధ్యత వహించాలి చదవండి:ఆర్బీఎల్ బ్యాంకు ఖాతాదారులకు అండగా ఆర్బీఐ -
సన్ పరివార్ కేసు: విచారణ ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: సన్పరివార్ కేసు విచారణను సైబరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈడీకి పోలీసులు లేఖ రాశారు. 2018లో వెలుగులోకి వచ్చిన రూ.150 కోట్ల సన్పరివార్ కేసులో ఆ సంస్థ సీఈవో రవీందర్ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే పటేల్గూడ సర్పంచ్ నితీషా సహా ఆరుగురు అరెస్టయ్యారు. 14వేల మంది డిపాజిటర్ల నుంచి రూ.150 కోట్లు వసూలు చేశారు. ఇప్పటివరకు రూ.50 కోట్ల వరకు పోలీసులు సీజ్ చేశారు. వివిధ బ్యాంకు ఖాతాలు, ఆస్తుల రూపంలో రూ.16కోట్లు గుర్తించారు. అమీన్ పూర్ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమీన్పూర్ ఎంపీపీ దేవనాథ్ సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కొంత మంది రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
గేమింగ్ స్కామ్లో మల్టీలెవల్ మార్కెటింగ్...!
సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్ వ్యాపారం పేరుతో సంస్థల్ని రిజిస్టర్ చేసుకుని, కలర్ ప్రెడిక్షన్ గేమ్ ముసుగులో బెట్టింగ్ దందా నిర్వహించిన బీజింగ్ టీ పవర్ కంపెనీ మల్టీ లెవల్ మార్కెటింగ్కు పాల్పడినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ పంథాలోనే అనేక మంది కొత్త ‘కస్టమర్ల’ను ఆకర్షించినట్లు తేల్చారు. ఈ స్కామ్ మొత్తం విలువ రూ.2 వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ సౌత్ ఈస్ట్ ఏసియా ఆపరేషన్స్ హెడ్ యాన్ హూపై ప్రైజ్ చిట్స్ అండ్ మనీసర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్ కింద ఆరోపణలు జోడించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు సమాచారం అందించారు. సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన యాన్ హూతో పాటు ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్లను తదుపరి విచారణ కోసం వారం రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ దర్యాప్తు అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం నాలుగు రోజులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఈ విచారణ ప్రారంభం కానుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్లు.. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు యాన్ హూపై ప్రైజ్ చిట్స్ అండ్ మనీసర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్ కింద ఆరోపణలు జోడించారు. ప్రాథమికంగా ఈ కేసుల్ని కుట్ర, మోసంతో పాటు తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని సెక్షన్ల కింద నమోదు చేశారు. ఈ గ్యాంగ్ వారిని అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన యువత సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫోన్లు చేస్తున్నారు. తాము కూడా ఆ గేమ్ వల్లో పడి భారీగా నష్టపోయామని చెబుతున్నారు. జమ్మూకశ్మీర్కు చెందిన ఓ యువకుడు తన తల్లి వైద్యం కోసం దాచిన రూ.2.5 లక్షల్ని ఈ గేమ్లో నష్టపోయానని, ఆ మొత్తం తిరిగి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాడు. అయితే తెలంగాణలో మాదిరిగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ గేమింగ్ నిషేధం కాదు. దీంతో ఆయా చోట్ల కేసులు నమోదు చేయడం సాధ్యం కావట్లేదు. గత వారం నుంచి ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులకు సంబంధిం చిన 30 బ్యాంకు ఖాతాలు గుర్తించి ఫ్రీజ్ చేశారు. వీటికి సంబంధిం చిన స్టేట్మెంట్స్ అందించాల్సిందిగా ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు. అవన్నీ అందిన తర్వాతే ఆర్థిక లావాదేవీలపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని చెప్తున్నారు. కీలక నిందితుల కోసం గాలింపు.. ఇక ఈ–కామర్స్ పేరుతో ఢిల్లీలో ఆ సంస్థల్ని రిజిస్టర్ చేయించిన గుర్గావ్ వాసులే ఈ ఖాతాలను తెరిచారని తేలింది. తాము చైనా ఈ–కామర్స్ యాప్స్ మానిటర్ చేస్తుంటామని, ఆ ఆదాయం ఈ ఖాతాల్లోకి వస్తుందని బ్యాంకు, పేమెంట్ గేట్వేస్ నిర్వాహకుల్ని నమ్మించారు. అయితే వీటిని నిర్వహించింది మాత్రం యాన్ హూ సహా ఆయా కంపెనీల్లోని చైనా డైరెక్టర్లే కావడం గమనార్హం. ఈ స్కామ్లో కీలక నిందితులుగా ఉన్న ఢిల్లీ వాసులు రాహుల్, హేమంత్ల కోసం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రాథమికంగా ఈ స్కామ్ రూ.1,100 కోట్లని భావించినా... ఇప్పటి వరకు లభించిన ఆధారాల మేరకు ఈ మొత్తం రూ.2 వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నగదు లావాదేవీలు డాకీ పే, లింక్ యూ పే యాప్ ద్వారా జరిగినట్లు చెప్తున్నారు. దీంతో వీరికి నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. 20 మందిని చేరిస్తే రూ.500 ఈ గేమ్లోకి కొత్తవారు నేరుగా ప్రవేశించడానికి వీలు లేదు. ఇప్పటికే ఈ గేమ్ ఆడుతున్నవారు లేదా దళారులు ఇచ్చే రిఫరల్తో మాత్రమే ఇందులోకి ఎంటర్ అయ్యే వీలుంటుంది. ఇలా రిఫరల్ కోడ్ ఇవ్వడం, ఒక వ్యక్తి మరికొందరిని చేర్చడం మల్టీ లెవల్ మార్కెటింగ్ కిందికే వస్తుందని పోలీసులు చెప్తున్నారు. ఇక దీనికోసం పనిచేసే దళారులు.. ఓ వ్యక్తిని యాప్లోకి ఇన్వైట్ చేసిన తర్వాత కనీసం రూ.200 రీచార్జ్ చేసుకోమంటారు. ఇలా 20 మందిని ఆకర్షించి వారితో రూ.200 చొప్పున రీచార్జ్ చేయిస్తే వీరు రూ.500 కమీషన్ పొందుతున్నారు. ఇలా మనీ సర్క్యులేషన్ దందా నిర్వహిస్తున్నారు. -
మోసపోయి.. మోసం చేసి..
సాక్షి, హైదరాబాద్: మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన ‘క్యూనెట్’సంస్థ మాదిరిగానే అక్రమాలకు పాల్పడిన మరో సంస్థ ‘సెర్ఫా’బాగోతం బట్టబయలైంది. క్యూనెట్ సంస్థలో చేరి నష్టపోయిన బాధితుడే సెర్ఫా సంస్థ యజమానిగా అవతారమెత్తి దేశవ్యాప్తంగా మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్నాడు. నగరంలోని మియాపూర్ వాసి ఫిర్యాదుతో సైబరాబాద్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం పోలీసులు బుధవారం వలపన్ని నిందితుడ్ని పట్టుకున్నారు. నాడు మోసాలకు బాధితుడు.. నేడు సూత్రధారి శ్రీకాకుళం పొందూరు మండలం తానెం గ్రామానికి చెందిన బక్కి శ్రీనివాసరెడ్డి బీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగరీత్యా 2012లో హైదరాబాద్ వచ్చాడు. ఈక్రమంలో క్యూనెట్ సంస్థలో చేరి రూ.13 లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. దీంతో 2018లో క్యూనెట్ సంస్థ తరహాలోనే విశాఖపట్టణంలో సెర్ఫా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆఫీస్ ప్రారంభించి మల్టీ లెవల్ మార్కెటింగ్ మొదలెట్టాడు. దీని బ్రాంచ్ ఆఫీసును నగరంలోని కూకట్పల్లిలో ప్రారంభించిన బక్కి శ్రీనివాస్రెడ్డి అనతి కాలంలోనే లక్షలు సంపాదించవచ్చంటూ తన మాయమాటలతో విద్యార్థులు, గృహిణులు, నిరుద్యోగులను ఆకర్షించాడు. తన కంపెనీలో చేరే వినియోగదారులు డీడీ ద్వారా కంపెనీ బ్యాంక్ ఖాతాకు డబ్బులు చెల్లించాలని, ఆ తర్వాత యూజర్నేమ్, పాస్వర్డ్ ఇస్తామని నమ్మపలికాడు. రూ.12,000 చెల్లించి సభ్యుడిగా చేరితే రూ.1,000, మరో ఇద్దరిని చేర్పిస్తే రూ.4,000 కమీషన్ వస్తుం దని ఆశచూపాడు. సంస్థలో చేరిన వారికి వెకేషన్ టూర్ ప్యాకేజీలు, నాసిరకమైన వాచ్లు, నాణ్యతలేని హెల్త్, డైటరీ, బ్యూటీ ఉత్పత్తులు ఇచ్చేవారు. వాస్తవానికి హోల్సేల్ మార్కెట్లో లభించిన ధరకు పదింతలు రేట్లు చెప్పి వీటిని వారి చేతికి అంటగట్టేవారు. కమీషన్ వస్తుందన్న ఆశతో ఈ కంపెనీలో చేరిన సభ్యులు మరికొంతమందిని ఈ సంస్థలో చేర్పించారు. ఇలా తెలుగు రాష్ట్రాలతోపాటుగా కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, చత్తీస్గఢ్, ఢిల్లీ, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్తో పాటు లక్షద్వీప్ అండ్ అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఈ కంపెనీలో ఐదువేల మంది వరకు సభ్యులుగా చేరారు. నగరవాసి ఫిర్యాదుతో.. అప్పటివరకు సెర్ఫా సంస్థ కార్యకలాపాలు సాఫీగానే సాగిపోవడంతో ఏ ఇబ్బందిలేకుండా పోయింది. అయితే ఈ కంపెనీలో సభ్యురాలిగా చేరిన నగరంలోని మియాపూర్వాసి కన్నెకంటి తులసి సంస్థ మోసాలపై కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెర్ఫా డొంకంతా కదిలింది. సైబరాబాద్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం పోలీసులు రంగంలోకి దిగి సంస్థ యజమాని శ్రీనివాస్రెడ్డిని వలపన్ని కూకట్పల్లిలోని అతడి కార్యాలయంలోనే అరెస్టు చేశారు. కార్యాలయాన్ని సీజ్ చేయడంతో పాటుగా కంప్యూటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సంబంధమున్న ఇతర నిందితుల్ని కూడా అరెస్టు చేయాల్సి ఉందని సైబరాబాద్ పోలీసుల కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement