-
ఈ పాయింట్తో యాత్ర 2 ఉంటుంది: మహీ వి. రాఘవ్
'యాత్ర’కి, ‘యాత్ర 2’కి కథ పరంగా సంబంధం ఉండదు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి జీవితంలోని ఎత్తుపల్లాలనే ‘యాత్ర 2’లో చూపిస్తాం' అన్నారు డైరెక్టర్ మహీ వి. రాఘవ్. ఆయన దర్శకత్వంలో శివ మేక నిర్మించనున్న చిత్రం ‘యాత్ర 2’. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి (జూలై 8) సందర్భంగా ‘యాత్ర 2’ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భగా మహీ వి. రాఘవ్ మాట్లాడుతూ–'యాత్ర 2’లో 2009 నుంచి 2019 వరకు జగన్గారి జీవితాన్ని, ఆయన ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టే కొడుకు అనే పాయింట్తో ఈ సినిమా ఉంటుంది. పొలిటికల్ సినిమాలు చేయడమే రిస్క్. ఇలాంటి సినిమాలు ఎప్పుడు, ఏ టైమ్లో రిలీజ్ చేస్తామనేది ముఖ్యం. అందుకే ఎన్నికల టైమ్లో 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఏపీ ఓటర్లను తక్కువ అంచనా వేయొద్దు. ‘యాత్ర 2’తో ఓటర్లు ప్రభావితం అవుతారనుకోవద్దు. మా సినిమా చూసి ఎమోషనల్ అవుతారు. కానీ, వాళ్లకు నచ్చినవాళ్లకు ఓటు వేస్తారు. ‘యాత్ర 2’ని వైసీపీ వాళ్ల కోసమే తీస్తున్నామని అనుకున్నా పర్లేదు' అన్నారు. 'నిజ జీవితంలో ఉండే పాత్రలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ‘యాత్ర’ను అందరూ సపోర్ట్ చేశారు.. ‘యాత్ర 2’ మూవీని కూడా ఆదరించాలి' అన్నారు శివ మేక. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రేమించుకుందాం రా చైల్డ్ ఆర్టిస్ట్
‘ప్రేమించుకుందాం..రా’ , ‘సూర్యవంశం’, ‘మనసంతా నువ్వే’ వంటి సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన ఆనంద్ వర్ధన్ హీరోగా నటించిన తొలి చిత్రానికి ‘నిదురించు జహాపన’ అనే టైటిల్ను ఖరారు చేశారు. రోష్ని సాహోత, నవమి గయాక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో జి. వంశీకృష్ణ వర్మ, సామ్ జీ నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆనంద్ వర్ధన్ మాట్లాడుతూ– ‘‘సినిమా నాప్రాణం. మిమ్మల్ని (ప్రేక్షకులు) ఎంటర్టైన్ చేయడానికి జీవితాంతం సినిమాల్లోనే ఉంటాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా కథలో హీరో ఆరు నెలలు కంటిన్యూస్గా నిద్రపోతూనే ఉంటాడు. అందుకే ఆ టైటిల్ పెట్టాం. సముద్రం నేపథ్యంలో సాగే కథ ఇది’’ అన్నారు ప్రసన్న కుమార్. నటీమణులు రోష్ని సాహోత, నవమి గయాక్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడారు. -
ఆదిపురుష్ క్రేజీ అప్డేట్.. ప్రభాస్ మోషన్ పోస్టర్ రిలీజ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు మేకర్స్. అక్షయ తృతీయ సందర్భంగా ఆదిపురుష్ టీమ్ ప్రభాస్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. జై శ్రీరామ్ అంటూ సాగే లిరికల్ మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'మా బలమేదంటే మీ పై నమ్మకమే.. తలపున నువ్వుంటే సకలం మంగళమే... మహిమాన్విత మంత్రం నీ నామమే.' అంటూ సాగింది. చివర్లో జై శ్రీరామ్ నామస్మరణతో హోరెత్తించింది. హిందీ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ మోషన్ పోస్టర్లను ప్రభాస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'మీరు ఛార్ ధామ్ దర్శించుకోలేదా.. అయితే జై శ్రీరామ్ నామాన్ని జపించండి చాలు' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. గతంలో ఈ సినిమా టీజర్ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్ 16న రిలీజ్ చేస్తామని ఓం రౌత్ ప్రకటించారు. -
సుధీర్ బాబు ‘హంట్’ టైటిల్ మాది: హీరో నిక్షిత్
‘‘హంట్’ టైటిల్ని ముందు మేము రిజిస్టర్ చేయించాం. అయితే సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్పై రూపొందిన చిత్రానికి కూడా ‘హంట్’ టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ మార్చుకోమన్నా వారు పట్టించుకోవడం లేదు’’ అని ‘హంట్’ హీరో, దర్శకుడు నిక్షిత్ అన్నారు. నర్సింగ్ రావు నిర్మించిన చిత్రం ‘హంట్’. నిక్షిత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మోషన్ టీజర్ను విడుదల చేశారు. ఎమ్ఎస్ఆర్ట్స్ అధినేత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ– ‘‘శ్రీ క్రియేషన్స్ బ్యానర్పై ‘హంట్’టైటిల్ను 6 నెలల క్రితం ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేసుకున్నాం. ఇదే టైటిల్ని భవ్య క్రియేషన్స్ పెట్టుకుని, సినిమా విడుదల ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు’’ అన్నారు. ‘‘మా ‘హంట్’ ఆడియో రైట్స్ అమ్మటానికి ప్రయత్నం చేశాం.. కానీ, ‘హంట్’ పేరుతో వేరే చిత్రం కూడా ఉంది కాబట్టి మేము మీ చిత్రం కొనలేమని చెప్పారు. ఈ విషయంలో న్యాయం జరగాలి’’ అని నర్సింగ్ రావు అన్నారు. -
‘కెప్టెన్ మిల్లర్’గా ధనుష్.. మోషన్ పోస్టర్ విడుదల
Dhanush Captain Miller Movie Motion Poster Released: చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు ధనుష్ తాజాగా మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై టీజీ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కెప్టెన్ మిల్లర్' అనే టైటిల్ను నిర్ణయించారు. దీనికి రాఖీ, సాని కాగితం చిత్రాల ఫేమ్ అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్ను చిత్ర యూనిట్ ఆదివారం (జులై 4) విడుదల చేశారు. ఇది 1930 - 40 ప్రాంతంలో జరిగే పీరియడ్ కథా చిత్రంగా ఉంటుందని, తమిళం, తెలుగు, హిందీ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నిర్మాత టీజీ త్యాగరాజన్ మాట్లాడుతూ తమ సంస్థలో నిర్మించిన భారీ చిత్రాల్లో ఇది చోటు దక్కించుకుంటుందన్నారు. దర్శకుడు కథ చెప్పినప్పుడు తానూ, ధనుష్ చాలా ఆనందంగా ఫీలయ్యామన్నారు. ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, మదన్ కార్తీ మాటలు, శ్రేయోస్ కృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్నారని తెలిపారు. ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం హీరో విశాల్కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. Captain miller .. This is going to be so exciting. Super kicked to work with @ArunMatheswaran and my brother @gvprakash @SathyaJyothi pic.twitter.com/lS8OMSh4I9 — Dhanush (@dhanushkraja) July 2, 2022
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
లెక్క తేలింది.. పోరు మిగిలింది..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
Advertisement