-
మూడ్ కనిపెట్టలేకపోయిన 2004 సర్వే
‘మూడ్ ఆఫ్ ది నేషన్’ అంటూ ఒక జాతీయ ఆంగ్ల పత్రిక ప్రతి ఆర్నెల్లకోసారి సర్వే ఫలితాలను ఇస్తుంటుంది. సాధారణంగా – ఆగస్టులో ఒకసారి, ఫిబ్రవరిలో రెండోసారి. ఈ ఏడాది ‘ఫిబ్రవరి సర్వే’ కాస్త ముందుగానే వచ్చింది. (మొన్న చూసే ఉంటారు.) ఇది ఎన్నికల సంవత్సరం కనుక ఈ సర్వే అన్నది కొందరి కోసం ‘ముందస్తు’ ఏర్పాటు కావచ్చు. సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయంటే – లోక్సభలో మోదీకి తిరుగు ఉండదని, ఆంధ్రప్రదేశ్లో టీడీపీదే దుమ్ముదుమారం అనీ!! ఇకనేం, 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినంత రేంజ్లో ఈ సర్వే ఫలితాలను బాబు గారి రెండు ప్రధాన పత్రికలు తమ ఫ్రంట్ పేజీల్లో ప్రముఖంగా ప్రచురించాయి. ఒక్కసారి 20 ఏళ్లు వెనక్కు వెళితే కనుక – 2004లో ఇదే పత్రిక ఇదే విధమైన సర్వే ఫలితాలను ఇచ్చింది. వాజ్పేయి విజయ ఢంకా మోగించబోతున్నారని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సైకిల్ దూకుడు మీద ఉందని రాసింది. సర్వేను తాము ఎంత శాస్త్రీయంగా జరిపిందీ ఆ వివరాలు కూడా ఇచ్చింది. ‘‘ముఖ్యమంత్రుల ప్రజాదరణ స్థాయి తెలుసుకునేందుకు 19 రాష్ట్రాలలో మేము జరిపిన సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా రెండోసారి జాతీయ స్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రిగా అవతరించారు’’ అని ఆ సర్వే రాసింది. (రెండో స్థానం ములాయం సింగ్ యాదవ్, మూడో స్థానంలో ఇద్దరు.. నరేంద్రమోదీ, షీలా దీక్షిత్). అంతకు ముందు ఆగస్టులో (2003) జరిపిన సర్వేలో రాష్ట్ర ప్రజాదరణలో 10వ స్థానంలో ఉన్న చంద్రబాబు ఫిబ్రవరి కల్లా 3వ స్థానానికి చేరుకున్నారని సర్వే నివేదించింది! ఆయన పాలన ‘అసాధారణం’ అన్నవారు 10 శాతం, ‘బాగుంది’ అన్నవారు 49 శాతం, ‘ఒక మోస్తరు’ అన్నవారు 29 శాతం ఉంటే, ‘అధ్వాన్నం’ అన్నవారు 11 శాతం మంది ఉన్నారు. అసలేమీ చెప్పని వారు 1 శాతం మంది. ఇక్కడితో సర్వే ముగియలేదు. రహదారులు, పాఠశాల విద్య, మంచి నీళ్లు.. ఈ సెగ్మెంట్ల నాణ్యతలో కర్ణాటక, కేరళ, తమిళనాడుల కంటే ఆంధ్రప్రదేశే ముందుందని చంద్రబాబు పాలనకు మార్కులు వేసింది. అయితే ఆయన ఫెయిల్ అయ్యారు! ఆ సర్వే ఫెయిల్ అయింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఎదురులేని పాలకుడు అని శ్లాఘించి, అధికారంలోకి వచ్చీ రాగానే నవతరం భాష మాట్లాడుతున్న చంద్రబాబు ప్రజల ఆలోచనా దృక్పథాన్ని ఆధునికత వైపు మళ్లించే ప్రయత్నం చేశారని కీర్తించిన 2004 నాటి సర్వే ఒక విషయాన్నయితే ఉన్నది ఉన్నట్లు రాసింది. అది చంద్రబాబు విజన్ గురించి. తూర్పు ఆసియా దేశాల పద్ధతులను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి కలలు కంటున్న స్వర్ణాంధ్ర ప్రదేశ్, విజన్–2020 బెడిసికొట్టే ప్రమాదం ఉందని తనైతే రాయలేదు కానీ, విమర్శకులు అంటున్నారని మాత్రం వ్యాఖ్యానించింది. కేవలం సమాచార సాంకేతిక విజ్ఞానం మీద, బయో టెక్నాలజీ మీదా ఆధారపడి చంద్రబాబు ఈ కలన్నీ కంటున్నారని విమర్శకుల భావన. ‘‘ఈ కలలు సమాచార సాధనాలను, విదేశీ అధినేతలను, విదేశీ వాణిజ్య వేత్తలను ఆకట్టుకుని ఉండొచ్చు కానీ, కేవలం వాటి ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని భావించకూడదు. అవి ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం మీదా, పేదరికాన్ని తొలగించడం మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాయి..’’అని ఆర్థిక, సామాజిక నిపుణులను ఉటంకిస్తూ సర్వే పేర్కొంది. వ్యవసాయం, పేదరికం అన్నది చంద్రబాబు విజన్లోనే లేవు. ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయానికి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డి.బి.టి). ద్వారా ఈ ఐదేళ్లలో 4 కోట్ల, 58 లక్షల 37 వేల 727 మంది లబ్దిదారులకు 1 లక్షా 81 వేల 460 వందల కోట్ల రూపాయలను బదిలీ చేసింది. నాన్ డి.బి.టి. కింద 1 కోటీ 10 లక్షల 18 వేల 982 మంది లబ్దిదారులకు 85 వేల 312 కోట్ల రూపాయలను అందించింది. ఆ సంగతి సర్వేలు చెప్పకపోవచ్చు. వాస్తవం ఏమిటన్నది ప్రతి లబ్దిదారునికీ తెలుసు. -
Mood of the Nation: ఎన్డీఏ కూటమికి నితీశ్ దెబ్బ!
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి బిహార్ సీఎం నితీశ్ కుమార్ దెబ్బకొట్టేలా కన్పిస్తున్నారు. ఎన్డీఏ సంకీర్ణం నుంచి నితీశ్ కుమార్ బయటకు వెళ్లిపోవడం దెబ్బేనని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ వెల్లడించింది. ఇప్పటికిప్పుడు (ఆగస్టు 1) లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 307 సీట్లు సాధిస్తుందని పోల్ ఆధారంగా వెల్లడైంది. అయితే బీజేపీతో నితీశ్ తెగతెంపులు చేసుకోవడంతో ఎన్డీఏ సాధించే సీట్ల సంఖ్య తగ్గుతుందని పేర్కొంది. 2024 లోక్సభ ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉంది. ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ చెక్కు చెదరలేదని పోల్లో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ ఆయనే ప్రధానమంత్రి అవుతారని తేల్చింది. ఎన్డీఏకు 307, యూపీఏకు 125 సీట్లు వచ్చే అవకాశముంది. ఇతరులు 111 స్థానాలు దక్కించుకుంటారని అంచనా. సీ-ఓటర్తో కలిసి ఆగస్టు 1 వరకు ఇండియా టుడే ఈ పోల్ నిర్వహించింది. అయితే ఇప్పుడు నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు కాబట్టి ప్రత్యక్షంగా 21 సీట్లు తగ్గుతాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిహార్లో ప్రత్యర్థులను ఎదుర్కొని బీజేపీ ఏమేరకు ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలి. (క్లిక్: ప్లీజ్ వదిలేయండి.. ఆ విషయం మళ్లీ అడగకండి) -
ఎన్నికలొస్తే... కేంద్రంలో మళ్లీ బీజేపీయే
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా వరుసగా మూడోసారి కూడా ప్రజలు నరేంద్ర మోదీనే కోరుకుంటున్నారని సీ ఓటర్– ఇండియా టుడే సంయుక్త సర్వే తేల్చింది. నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే) సీట్ల సంఖ్య 350 నుంచి 296కు పడిపోతుందని చెప్పింది. ఎంపీల సంఖ్య 303 నుంచి 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలోనే ఉందని తేల్చింది. అయితే జాతీయ స్థాయిలో మోదీకి, బీజేపీకి ఆదరణ చెక్కుచెదరకున్నా... రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ ఏ ఒక్క సీఎంకు పూర్తిస్థాయి ప్రజాదరణ కనిపించడం లేదు. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క సీఎం కూడా సంతృప్తకర పాలన అంశంలో సగం మార్కు అయిన 50 శాతాన్ని దాటలేకపోవడం గమనార్హం. అలాగే ఐదు రాష్ట్రాల సీఎంలపైనా 34 శాతం మంది ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉండటం గమనార్హం. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగింటిలో బీజేపీ సీఎంలే ఉన్నారు. పాలన సంతృప్తకర స్థాయిలో ఉందనే అంశంలో ఐదు రాష్ట్రాల్లో పోల్చినపుడు 49 శాతం అనుకూల ఓట్లతో అందరికంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్యే ఆధిక్యంలో ఉన్నారు. విశేషమేమిటంటే వ్యతిరేకతలోనూ ఆయనే టాప్. దేశంలో అన్నింటికంటే పెద్ద రాష్ట్రమైన యూపీ, 2.13 కోట్ల ఓటర్లున్న పంజాబ్లతో కలిపి మొత్తం ఐదు రాష్ట్రాల్లో 18.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సర్వే దేశ జనాభాలో మొత్తం 12.8 శాతం మంది అభిప్రాయాలను ప్రతిఫలిస్తుందనుకోవచ్చు. ► ఎవరు చేశారు: (మైక్, రిసీవర్ ఫోటోస్) సీ ఓటర్– ఇండియా టుడే టీవీ సంయుక్త సర్వే ► ఎక్కడ చేశారు: ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో. ► సర్వే శాంపిల్ (ఎంతమందిని ఇంటర్వ్యూ చేశారో చెప్పే సంఖ్య): 60,141 ► తొలిదశలో: 20,566 (ఆగస్టు 16, 2021– జనవరి 10– 2022 మధ్య) ► మలిదశలో: 39,575 (గత మూడు వారాల్లో) ఎలా చేశారు: కరోనా నేపథ్యంలో ప్రత్యక్షంగా చేయకుండా టెలి ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. ప్రేమించు లేదా ద్వేషించు ఐదు రాష్ట్రాల సీఎంలతో పోల్చిచూసినపుడు అనుకూలత– వ్యతిరేకతల్లో యూపీ సీఎం యోగియే టాప్లో ఉన్నారు. అంటే కరడుగట్టిన హిందూత్వ వాదిగా పేరుపడ్డ యోగిని ప్రేమించే వాళ్లు ఎంత అధికంగా ఉన్నారో... ద్వేషించే వాళ్లూ అధికాంగానే ఉన్నట్లు లెక్కని ఇండియా టుడే ఎడిటోరియల్ డైరెక్టర్ రాజ్ చెంగప్ప, ఇతరు నిపుణులు అభిప్రాయపడ్డారు. సామర్థ్యాన్ని శంకించే వారు సొంత పార్టీలోనే ఎక్కువ కాంగ్రెస్కు ఈ వైల్డ్కార్డ్ బాగానే పనిచేస్తోంది. అయితే పంజాబ్ సీఎంగా చరణ్జిత్ సింగ్ చన్నీ సామర్థ్యాన్ని శంకించే వారిలో బయటివారికంటే సొంత పార్టీలోనే ఎక్కువగా ఉన్నారు. -
మన్మోహన్ కన్నా మోదీ సర్కార్ బెటర్..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఏర్పడిన అసాధారణ ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని ‘ఇండియా టుడే – కార్వీ’ సంయుక్తంగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే తేల్చింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రకటించిన లాక్డౌన్ కారణంగా గత 4 దశాబ్దాల్లో తొలిసారి భారత్ ఆర్థికమాంద్యం బారిన పడింది. పారిశ్రామిక రంగం, సేవల రంగం వృద్ధి నిలిచిపోయింది. నిరుద్యోగం ప్రబలింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్థిక రంగాన్ని ప్రభుత్వం సమర్దవంతంగా నిర్వహించిందని ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ వెల్లడించింది. ఆర్థిక రంగంలో మోదీ ప్రభు త్వ తీరు అద్భుతంగా ఉందని సర్వేలో పాల్గొన్న వారిలో 20%, బావుందని 46%, సాధారణంగా ఉందని 21% అభిప్రాయ పడ్డారు. కరోనా, లాక్డౌన్ల కారణంగా తమ ఆర్థిక పరిస్థితి దిగజారిందని 12% ప్రజలు పేర్కొన్నారు. 2020 జనవరిలో జరిగిన మూడ్ ఆఫ్ ది నేషన్లో కరోనా, లాక్డౌన్ల వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారిందని 27% ప్రజలు వెల్లడించడం గమనార్హం. మన్మోహన్ కన్నా బెటర్.. ఆర్థిక రంగ నిర్వహణలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కన్నా మోదీ సర్కారు మెరుగ్గా వ్యవహరించిందని 47% ప్రజలు తెలిపారు. 36% మాత్రం యూపీఏ ప్రభుత్వంతో సమానంగా ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు ఉందన్నారు. ఆర్థిక రంగ నిర్వహణలో యూపీఏతో పోలిస్తే ఎన్డీఏ పనితీరు అత్యంత దారుణంగా ఉందని 13% ప్రజలు పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక రంగ ఉద్దీపన పథకాలతో తమ ఆర్థిక పరిస్థితిలో మార్పేంలేదని 43%, పరిస్థితి దిగజారిందని 20%, సానుకూల మార్పు వచ్చిందని 35% ప్రజలు తెలిపారు. -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏకు 321 సీట్లు!
న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో చైనా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు, దేశవ్యాప్తంగా కరోనా, అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థ.. ఇలా అసాధారణ వరుస సవాళ్లను ఎదుర్కొన్న ఏ ప్రభుత్వ ప్రజాదరణ అయినా సహజంగానే తగ్గుముఖం పడుతుంది. కానీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ ప్రజాదరణ మాత్రం ఈ అసాధారణ సవాళ్లలోనూ చెక్కు చెదరలేదని, ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుందని ‘ఇండియా టుడే –కార్వీ’ జరిపిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంఓటీఎన్)’ సర్వే తేల్చింది. మెజారిటీ మార్క్ను దాటి 43% ఓట్లతో 321 స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని తేల్చింది. గత సంవత్సరం ఆగస్ట్ నెలలో జరిపిన సర్వేలో ఎన్డీఏ 316 సీట్లు గెలుచుకుంటుందని తేలగా, దానిపై మరో ఐదు స్థానాలు అధికంగానే గెలుస్తుందని ప్రస్తుత సర్వే పేర్కొనడం విశేషం. అయితే, 2019 ఎన్నికల్లో ఎన్డీఏ గెల్చుకున్న 357 సీట్ల కన్నా ఈ నెంబర్ తక్కువగానే ఉండటం గమనార్హం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విపక్ష యూపీఏ కూటమి 93 సీట్లు గెల్చుకుంటుందని ఈ ఎంఓటీఎన్ సర్వే పేర్కొంది. ప్రాంతాల వారీగా తీసుకుంటే, హిందీ, హిందుత్వ రాజకీయాలు బలంగా ఉన్న ఉత్తర భారతదేశంలో ఎన్డీఏ అత్యధికంగా 104 సీట్లను, పశ్చిమ భారతదేశంలో 85 సీట్లను, తెలివైన పొత్తులతో తూర్పు భారతంలో 100 స్థానాలను గెల్చుకుంటుందని ఈ సర్వే తేల్చింది. దక్షిణ భారత్లో మాత్రం ఆశించిన ఫలితాలను సాధించలేదని, అక్కడ 32 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. పార్టీల వారీగా చూస్తే బీజేపీ మరొకసారి సొంతంగా మెజారిటీ సాధిస్తుందని, మెజారిటీ మార్క్ అయిన 272ని దాటి 291 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ 51 సీట్లు మాత్రమే సాధిస్తుందంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు గెల్చుకున్న విషయం తెలిసిందే. మోదీపై విశ్వాసం కరోనాపై పోరుకు అనూహ్య లాక్డౌన్ ప్రకటన, కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో నిలవడం, వలస కూలీల సంక్షోభం, కనిష్ట స్థాయికి జీడీపీ, ప్రబలిన నిరుద్యోగం, లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా దూకుడు.. తదితర అంశాల్లో విమర్శలు వచ్చినప్పటికీ.. ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం సడలలేదని సర్వేలో తేలింది. ఎంఓటీఎన్ సర్వేలో పాల్గొన్నవారిలో 74% మంది మోదీ ప్రధానిగా అత్యుత్తమ పనితీరు చూపారని ప్రశంసించారు. వరుసగా ఏడో సంవత్సరం అధికారంలో ఉన్న నేతకు ఈ స్థాయిలో ప్రజాదరణ లభించడం అరుదైన విషయమే. అలాగే, ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై 66% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యుత్తమ ప్రధాని రేసులోనూ మోదీ చాలా ముందున్నారు. దేశ అత్యుత్తమ ప్రధానిగా 38% రేటింగ్తో మోదీ తొలి స్థానంలో నిలిచారు. తరువాతి స్థానాల్లో వరుసగా అటల్ బిహారీ వాజ్పేయి(18%), ఇందిరాగాంధీ(11%), జవహర్లాల్ నెహ్రూ(8%), మన్మోహన్ సింగ్(7%) ఉన్నారు. అయితే, దక్షిణ భారత్లో మోదీ హవా, బీజేపీ ప్రభావం అంతగా కనిపించలేదు. ప్రధానిగా మోదీ పాపులారిటీ దక్షిణ భారతదేశంలో 63 శాతం ఉంది. ముస్లింలలో 38% మోదీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం సాధించిన రెండు గొప్ప విజయాలుగా సర్వే తేల్చినవి ఆరెస్సెస్ అజెండాకే సంబంధించినవి కావడం విశేషం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement