-
రవితేజ బ్లాక్బస్టర్ మూవీ.. 20 ఏళ్ల తర్వాత సీక్వెల్!
నటుడు జయం రవి కథానాయకుడిగా నటించిన చిత్రం ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి. మోహన్రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆసిన్ హీరోయిన్గా నటించారు. జయం రవికి తల్లిగా నదియా కనిపించారు. అయితే ఎడిటర్ మోహన్ నిర్మించిన ఈ చిత్రం 2004లో రిలీజై సూపర్ హిట్గా నిలిచింది. తెలుగులో రవితేజ నటించిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రానికి రీమేక్గా తెరకెక్కించారు. తెలుగులో 2003లో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. తాజాగా ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి చిత్రానికి సీక్వెల్ను తెరకెక్కించడానికి దర్శకుడు మోహన్రాజా సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ తాజా సమాచారం. దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇందులో నటి నదియా పాత్ర కూడా ఉంటుందని సమాచారం. అయితే ఆమెనే ఎంపిక చేస్తారా? అదే విధంగా హీరోయిన్గా ఎవరు నటిస్తారు? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆసిన్ సినిమాలకు దూరంగా ఉంది. కాగా ప్రస్తుతం మోహన్ రాజా, జయం రవి హీరోగా తనీ ఒరువన్ చిత్రానికి సీక్వెల్ 'తని ఒరువన్- 2' తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఎం.కుమరన్ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. కాగా మోహన్రాజా తమిళంలో చిత్రం చేసి చాలా గ్యాప్ వచ్చింది. 'ఎమ్ కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి' తెలుగు సినిమా 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి'కి రీమేక్ అయినప్పటికీ.. తమిళ అభిమానులను ఆకట్టుకునేలా మోహన్ రాజా అనేక మార్పులు చేశారు. ఈ చిత్రం తమిళనాడులో పెద్ద హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రకాష్రాజ్, ఐశ్వర్య, వివేక్, జనకరాజ్, వెన్నిర ఆడై మూర్తి ముఖ్య పాత్రలు పోషించారు. -
ధృవ సినిమాకు సీక్వెల్ రెడీ.. టీజర్ విడుదల కానీ..
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్హిట్ చిత్రం 'ధృవ'. ఇందులో హీరోయిన్గా రకుల్ నటించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 2016లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ను అందుకుంది. కోలీవుడ్లో డైరెక్టర్ మోహన్రాజా తెరకెక్కించిన 'తనీ ఒరువన్'కు రీమేక్గా ఇది విడుదలై తెలుగు వారిని అలరించింది. తాజాగ ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో సినీ నటి వరలక్ష్మి శరత్కుమార్కు నోటీసులు) చాలా రోజుల నుంచి ఈ సినిమాకు సీక్వెల్ కావాలంటూ మెగా ఫ్యాన్స్ నుంచి భారీగానే డిమాండ్లు వచ్చాయి. అయితే ఈ సీక్వెల్ తమిళ సినిమాకు మాత్రమేనని తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో టీజర్ను కూడా మేకర్స్ విడుదుల చేశారు. కానీ తెలుగులో కూడా చెర్రీతోనూ చర్చలు జరిపే ఉంటారని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో ఇదే దర్శకుడు మోహన్ రాజా పనిచేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గాడ్ ఫాదర్' సినిమాతో మెగా ఫ్యామిలీకి మోహన్ రాజా దగ్గరయ్యారు. ఆ సమయంలోనే ధృవ సినిమాకు సీక్వెల్ కథను వినిపించారని సమాచారం. మరి తెలుగు సీక్వెల్పై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో వస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమాతో రామ్ చరణ్ బిజీగా ఉన్నారు. -
బన్నీ ఫోన్ చేసి నాతో 21 నిమిషాలు మాట్లాడారు..
-
గాడ్ ఫాదర్ సినిమా చూసి అల్లు అర్జున్ ఏమన్నాడంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన గాడ్ఫాదర్ మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. నయనతార, సల్మాన్ ఖాన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం ప్రధాన బలంగా మారింది. ఊహించినదానికంటే ఎక్కువే కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలు సైతం సంతోషంగా ఉన్నారు. తాజాగా గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా సినిమా సక్సెస్ను మీడియాతో పంచుకున్నారు. పలువురు సెలబ్రిటీలు ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారని తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నాకు మొదట రామ్చరణ్ ఫోన్ చేశాడు. అంతేకాక ఉదయం ఆరు గంటలకే నా దగ్గరకు వచ్చి అరగంటసేపు మాట్లాడారు. ఇది చాలు నాకనిపించింది. అల్లు అర్జున్ నాతో 21 నిమిషాలు మాట్లాడారు. పిచ్చెక్కించేశారు, సినిమా లడ్డూలా ఉందన్నారు. సాయిధరమ్ తేజ్ అయితే ఏకంగా ఆఫీస్కే వచ్చేసి అభినందించారు' అని చెప్పుకొచ్చాడు మోహన్ రాజా. చదవండి: గరికపాటి వివాదంపై స్పందించిన చిరంజీవి సినిమా ఛాన్స్ అని ఇంటికి పిలిచి..: నటి -
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ టైటిల్ వెనుక ఇంత కథ ఉందా?
ఒక సినిమా జనాల్లోకి వెళ్లడానికి టైటిల్ చాలా ఉపయోగపడుతుంది. కొన్ని టైటిల్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తాయి. అలాంటి వాటిల్లో ‘గాడ్ ఫాదర్’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం..మలయాళ సూపర్ హిట్ లూసీపర్కి తెలుగు రీమేక్. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదదలైన ఈ చిత్రం.. సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ సినిమా టైటిల్ చిరంజీవి స్టార్డమ్కి చక్కగా సరిపోయింది. అయితే మొదట ఈ సినిమాకు వేరే టైటిల్ అనుకున్నారట. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ టైటిల్ని సూచించారట. తాజాగా ఈ విషయాన్ని తమన్ ఓ ఇంటర్వూలో తెలిపారు. (చదవండి: సినిమా ఛాన్స్.. ఇంటికి పిలిచాడు.. దర్శకుడి బాగోతం బయటపెట్టిన నటి) ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ అంతా సర్వాంతర్యామి వర్కింగ్ టైటిల్తో పూర్తయింది. ఈ సినిమా కథని హీరో డార్క్లో నుంచి జరుపుతున్నాడు. అది మనకు తెలియదు. అన్ని సీన్స్లో బ్రహ్మా(చిరంజీవి) ఉండరు. కానీ ఆయన గురించే మాట్లాడుకుంటారు. అందుకే నాకు దేవుడిలా అనిపించాడు. ఇంగ్లీష్ టైటిల్ పెడితే బాగుంటుదనిపించి ‘గాడ్ ఫాదర్’ సూచించాను. సెంటిమెంట్ పరంగా కూడా కలిసిసొస్తుందని చిరంజీవికి ఊరికే చెప్పాను. గతంలో మీరు నటించిన గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు టైటిల్స్ లెటర్ జీ(G )తో మొదలయ్యాయి. బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి అని చిరంజీవితో అనడంతో.. ఆయన కూడా ఓకే చెప్పేశాడు’అని తమన్ చెప్పుకొచ్చాడు. అయితే గాడ్ ఫాదర్ టైటిల్ విషయంలో హాలీవుడ్ నుంచి అభ్యంతరం వ్యక్తం అయిందట. దీంతో నిర్మాతలకు వారి నుంచి అనుమతి తీసుకున్నారట. సినిమా విడుదలక వారం ముందు ఓన్ఓసీ లభించినట్లు నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement