-
యాక్సిస్ గూటిలో సిటీ రిటైల్
న్యూఢిల్లీ/ముంబై: విదేశీ సంస్థ సిటీబ్యాంకు రిటైల్ బిజినెస్ కొనుగోలు పూర్తయినట్లు ప్రయివేట్ రంగ దేశీ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తాజాగా పేర్కొంది. దేశీయంగా సంస్థాగత క్లయింట్ల బిజినెస్ను మినహాయించిన డీల్ ప్రకారం తుదిగా రూ. 11,603 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. గతేడాది మార్చిలో యాక్సిస్ తొలిసారిగా కొనుగోలు అంశాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా 2.4 మిలియన్ సిటీ కస్టమర్లను యాక్సిస్ పొందింది. డీల్ కుదిరే సమయానికి ఈ సంఖ్య 3 మిలియన్లుగా నమోదైనట్లు యాక్సిస్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌధురి తెలియజేశారు. తమ ఖాతాదారులుగా మారిన సిటీ కస్టమర్ల బ్యాంక్ ఖాతాలు, చెక్ బుక్కులు, ప్రొడక్టు లబ్ధి తదితరాలు యథావిధిగా కొనసాగనున్నట్లు వివరించారు. మొత్తం 8.6 మిలియన్ కార్డులతో నాలుగో పెద్ద క్రెడిట్ కార్డుల సంస్థగా నిలుస్తున్న యాక్సిస్ మరో 2.5 మిలియన్ క్రెడిట్ కార్డులను జత చేసుకుంది. తద్వారా మూడో ర్యాంకుకు చేరింది. రూ. 4 లక్షల కోట్ల రిటైల్ బుక్ కలిగిన యాక్సిస్ సిటీబ్యాంక్ ఇండియాకు చెందిన 3 మిలియన్ కస్టమర్లతోపాటు.. 18 పట్టణాలలోగల 7 కార్యాలయాలు, 21 బ్రాంచీలు, 499 ఏటీఎంలను సొంతం చేసుకుంది. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంమేరకు సిటీ బ్రాండును 18 నెలలపాటు యాక్సిస్ బ్యాంక్ వినియోగించుకోనుంది. -
హెచ్డీఎఫ్సీ మెగా విలీనం!
సుమారు ఎనిమిదేళ్లుగా ఊహిస్తున్న అతిపెద్ద కార్పొరేట్ విలీనానికి తాజాగా అడుగు పడింది. ఫైనాన్షియల్ రంగ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ ట్విన్స్ ఒక్కటికానున్నాయి. రెరా అమలు తదుపరి ఇటీవల స్పీడందుకున్న గృహ రుణ రంగంలోని అవకాశాలను మరింత సమర్థవంతంగా అందిపుచ్చుకునేందుకు రెండు సంస్థలు విలీనానికి తెరతీశాయి. వెరసి హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ) విలీనంకానుంది. సంయుక్త సంస్థ ఆస్తుల విలువ దాదాపు రూ. 18 లక్షల కోట్లుకాగా.. డీల్ విలువ 40 బిలియన్ డాలర్లుగా నిపుణులు పేర్కొంటున్నారు. న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగంలో నంబర్ వన్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో దేశీయంగా అతిపెద్ద గృహ రుణ కంపెనీ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనంకానుంది. ఇది దేశ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద విలీనంకాగా.. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరింత భారీ రూపాన్ని సంతరించుకోనుంది. 42:25 నిష్పత్తిలో విలీనాన్ని చేపట్టనున్నట్లు రెండు సంస్థలూ వెల్లడించాయి. అంటే హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారుల వద్దగల ప్రతీ 25 షేర్ల స్థానే 42 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు జారీ కానున్నాయి. రెండు సంస్థలు ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ డీల్ పూర్తయితే హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పబ్లిక్ వాటాదారుల వాటా 100 శాతానికి చేరనుంది. దీనిలో ప్రస్తుత హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారులకు 41 శాతం వాటా లభించనుంది. విలీనానికి ఆర్బీఐ తదితర నియంత్రణ సంస్థలనుంచి అనుమతులు లభించవలసి ఉంది. అనుబంధ సంస్థలు హెచ్డీఎఫ్సీ హోల్డింగ్స్, హెచ్డీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్స్ సైతం విలీనంలో భాగంకానున్నాయి. విలీనం తదుపరి హెచ్డీఎఫ్సీ విలీనంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్తగా గృహ రుణ పోర్ట్ఫోలియోను నిర్మించుకోనుంది. కస్టమర్ల సంఖ్యను సైతం భారీగా పెంచుకోనుంది. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ మొత్తం రూ. 6.23 లక్షల కోట్ల ఆస్తులను కలిగి ఉంది. ఇదే సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆస్తులు రూ. 19.38 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 6.8 కోట్ల కస్టమర్ బేస్ను కలిగి ఉంది. దీర్ఘకాలిక రుణాలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణమైన విభిన్న చౌక వ్యయాలతోకూడిన మూలధన అవకాశాలను కలిగి ఉంది. ఈ విలీనంతో బ్యాంకుకు మరింత విలువ చేకూరనున్నట్లు హెచ్డీఎఫ్సీ పేర్కొంది. భారీ బ్యాలన్స్షీట్, నెట్వర్త్ ద్వారా బ్యాంక్ లబ్ది పొందనున్నట్లు తెలియజేసింది. మౌలిక రంగం తదితర అతిభారీ రుణాల అండర్రైటింగ్కు వీలు చిక్కడం తోపాటు.. దేశ ఆర్థిక వ్యవస్థలోకి అత్యధికంగా రుణాలు విడుదలయ్యేందుకు దారి ఏర్పడనున్నట్లు అభిప్రాయపడింది. గృహ రుణ విడుదల సులభతరం కానున్నదని, ఇందుకు బ్యాంకుకున్న 6.8 కో ట్ల కస్టమర్ల బేస్ దన్నునివ్వనున్నదని వివరించింది. పలు బ్రాంచీలు మధ్య, అల్పాదాయ వర్గాలకు గృహ రుణాలు మంజూరు చేయడంలో హెచ్డీఎఫ్సీ ఎంతో ముందుంది. అందుబాటు ధరల గృహాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా కంపెనీ పలు రుణాలు విడుదల చేసింది. 6,342 బ్రాంచీల ద్వారా దేశవ్యాప్తంగా 3,000 నగరాలు, పట్టణాలలో కార్యకలాపాలు విస్తరించింది. విలీనం ద్వారా ఈ పంపిణీ వ్యవస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో భాగం కానుండటంతో గృహ రుణ మంజూరీ మరింత విస్తరించనుంది. మార్టిగేజ్ పోర్ట్ఫోలియోతోపాటు, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పంపిణీ వ్యవస్థ చేజిక్కనుండటంతో బ్యాంక్ భారీగా బలపడనుంది. వెరసి రెండు సంస్థల మధ్య విలీ నం పలు విధాల లబ్ది చేకూర్చనుంది. రూ. 18 లక్షల కోట్లు సంయుక్త సంస్థ బ్యాలన్స్షీట్ రూ. 17.87 లక్షల కోట్లకు చేరనున్నట్లు హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. నెట్వర్త్ రూ. 3.3 లక్షల కోట్లను తాకనున్నట్లు తెలియజేశారు. బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థ(ఎన్బీఎఫ్సీ)ల మధ్య నిబంధనలు క్రమబద్ధీకరించడంతో నియంత్రణ సంస్థల మధ్యవర్తిత్వ అవసరాన్ని తగ్గించినట్లు వివరించారు. ఇది రెండు సంస్థల విలీన నిర్ణయంలో ఒక కీలకాంశంగా నిలిచినట్లు వెల్లడించారు. గత మూడు వారాలుగా విలీన చర్చలు జరుగుతున్నాయని, నిబంధనలకు అనుగుణంగా మొండిబకాయిల గుర్తింపు తదితర పలు అంశాలను సరైన విలువలో మదింపు చేయవలసి వచ్చిందని తెలియజేశారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా ప్రాధాన్యతా రంగ రుణ విడుదల తప్పనిసరికాకపోగా.. లయబిలిటీల కోసం చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్) లేదా నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)ని నిర్వహించవలసిన అవసరంకూడా లేదని పేర్కొన్నారు. దీంతో ఆస్తి, అప్పుల సమన్వయానికి ఆర్బీఐ నుంచి గడువును కోరవలసి వచ్చినట్లు వెల్లడించారు. విలీనానికి నియంత్రణ సంస్థలు అనుమతిస్తాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. విలీనంతో హెచ్డీఎఫ్సీ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావమూ ఉండబోదని స్పష్టం చేశారు. ఆర్బీఐ నోటిఫికేషన్తో.. ఎనిమిదేళ్ల క్రితమే బీజం ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్తో హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మధ్య విలీనానికి దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే బీజం పడినట్లు తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు, చౌక ధరల గృహాలకు రుణాలు సమకూర్చేందుకు వీలుగా దీర్ఘకాలిక బాండ్ల జారీకి బ్యాంకులను అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ 2014 జూలైలో నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా ఈ మార్గంలో సమీకరించిన నిధులకు బ్యాంకులు ఎస్ఎల్ఆర్ లేదా సీఆర్ఆర్ను నిర్వహించవలసిన అవసరంలేదంటూ పేర్కొంది. అంతేకాకుండా ఈ నిధులను ప్రాధాన్యతా రంగ రు ణ లక్ష్యాలకు తప్పనిసరిగా కేటాయించవలసిన అవస రంలేదని స్పష్టం చేసింది. దీంతో అప్పట్లో హెచ్డీఎఫ్సీ ద్వయం మధ్య విలీన అంశం చర్చకు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే వీటిని రెండు సంస్థల కీలక అధికారులు తోసిపుచ్చారు! అయితే ఎనిమిదేళ్ల అనంతరం ఇది కార్యరూపం దాల్చడం ప్రస్తావించదగ్గ విషయం! 1994 నుంచీ..: హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1994 నుంచీ విడిగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆదిత్య పురీ నేతృత్వంలో బ్యాంక్ కార్యకలాపాలు 1994లో ప్రారంభమయ్యాయి. దీపక్ పరేఖ్ కోరికమేరకు విదేశీ బ్యాంకింగ్ దిగ్గజం సిటీని వీడిన పురీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు పగ్గాలు చేపట్టారు. బ్యాంకులో మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీకి 21% వాటా ఉంది. 2020 అక్టోబర్లో శశిధర్ జగదీశన్ బ్యాంక్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. బ్యాంక్ నంబర్ టూ ఎస్బీఐ తదుపరి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ మదింపు మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీని విలీనం చేసుకోనున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దేశీయంగా అతిపెద్ద బ్యాంకుల్లో రెండో ర్యాంకులో నిలవనున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తాజాగా పేర్కొంది. తొలి స్థానంలో పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) కొనసాగనున్నట్లు తెలియజేసింది. అయితే విలీన సంస్థ మరో ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ పరిమాణంకంటే రెట్టింపు స్థాయికి చేరనున్నట్లు వివరించింది. విలీనంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. 15 శాతం మార్కెట్ వాటాతోపాటు, డైవర్సిఫైడ్ ఆదాయాన్ని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం బ్యాంక్ మార్కెట్ వాటా 11 శాతంగా నమోదైనట్లు తెలిపింది. పోర్ట్ఫోలియోలో మార్టిగేజ్ రుణాల వాటా ప్రస్తుత 11 శాతం నుంచి మూడోవంతుకు చేరనున్నట్లు వివరించింది. హెచ్డీఎఫ్సీకి భారీ సంఖ్యలోగల కస్టమర్ల ద్వారా లబ్ది పొందనున్నట్లు పేర్కొంది. చౌకలో నిధుల సమీకరణకు వీలు చిక్కుతుందని తెలియజేసింది. కాగా, బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న రెండో రివర్స్ మెర్జర్ ఇది. ఇంతక్రితం ఐసీఐసీఐ లిమిటెడ్ సైతం ఐసీఐసీఐ బ్యాంకులో విలీనమైంది. 2001 అక్టోబర్లో అనుబంధ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకులో మాతృ సంస్థ ఐసీఐసీఐ లిమిటెడ్ కలిసింది. దిగ్గజాల మధ్య... ఇది రెండు సమాన దిగ్గజాల మధ్య జరుగుతున్న విలీనం. హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. రెరా అమలు, గృహ రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా, చౌక ధరల గృహాలకు ప్రభుత్వ తోడ్పాటు దీనికి దోహదం చేస్తున్నాయి. –దీపక్ పరేఖ్, చైర్మన్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ గ్లోబల్ స్థాయికి... తాజా విలీనంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంతర్జాతీయ ప్రమాణాలతో చూసినా భారీ సంస్థగా ఆవిర్భవించనుంది. తద్వారా బ్యాంకులో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులకు మరింత వీలు చిక్కనుంది. రెండు సంస్థల మధ్య విలీనం 12–18 నెలల్లో పూర్తికావచ్చు. –కేకి మిస్త్రీ, వైస్చైర్మన్, సీఈవో, హెచ్డీఎఫ్సీ షేర్ల దూకుడు రెండు సంస్థల మధ్య విలీన వార్తల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఊపందుకుంది. ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ షేరు 9% ఎగసి రూ. 2,676 వద్ద నిలిచింది. ఒక దశలో గరిష్టంగా 19% దూసుకెళ్లి రూ. 2,934ను తాకింది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 10% జంప్చేసి రూ. 1,654 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1,722 వరకూ ఎగసింది. తద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 9,18,591 లక్షలను కోట్లను తాకగా.. హెచ్డీఎఫ్సీ మార్కెట్ విలువ రూ. 4,85,691 కోట్లను అధిగమించింది. సంయుక్తంగా చూస్తే రూ. 14 లక్షల కోట్లను దాటడం ద్వారా ఆర్ఐఎల్, టీసీఎస్ సరసన చేరింది! -
లక్ష్మీ విలాస్ విలీన స్కీమ్పై రగడ
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ను (ఎల్వీబీ) డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో విలీనం చేసే అంశం కొత్త మలుపు తిరిగింది. ఈ విలీన స్కీమ్పై స్టే విధించాలంటూ ఎల్వీబీ ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, వాటాదారైన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ .. బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాయి. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం, డీబీఎస్ బ్యాంక్లను ప్రతివాదులుగా పేర్కొన్నాయి. అయితే, విలీనంపై స్టే విధించడానికి న్యాయస్థానం నిరాకరించింది. ‘విలీనంపై స్టే విధించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 14నకు వాయిదా వేస్తున్నాం. అప్పట్లోగా ప్రతివాదులు (ఆర్బీఐ, ఎల్వీబీ, డీబీఎస్ బ్యాంక్ ఇండియా) తమ అఫిడవిట్లు దాఖలు చేయాలి‘ అని జస్టిస్ నితిన్ జమ్దార్, జస్టిస్ మిలింద్ జాదవ్తో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విలీనంతో తాము రూ. 188 కోట్లు నష్టపోనున్నట్లు కేసు విచారణ సందర్భంగా ఇండియాబుల్స్ వాదించింది. అయితే, ప్రజలు, డిపాజిటర్లు, ఎల్వీబీ ఉద్యోగుల విస్తృత ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో విలీన నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆర్బీఐ తరఫు న్యాయవాది రవి కదమ్ తెలిపారు. నవంబర్ 27 నుంచే విలీనం అమల్లోకి రానుండగా, సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, విలీన పథకంలో భాగంగా సుమారు రూ. 320 కోట్ల విలువ చేసే టియర్2 బాండ్లను కూడా రైటాఫ్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. పథకం ఏంటంటే..: విలీనానికి సంబంధించిన తుది స్కీమ్ ప్రకారం ఎల్వీబీ పెయిడప్ షేర్ క్యాపిటల్ మొత్తం రైటాఫ్ చేయనున్నారు. దీంతో వాటాదారులకు దక్కేదేమీ లేదన్న నేపథ్యంలోనే తమ పెట్టుబడంతా కోల్పోనున్న ప్రమోటర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా.. చట్టపరమైన చర్యలపై దృష్టి పెట్టారు. ప్రమోటర్ గ్రూప్నకు ఎల్వీబీలో 6.8% వాటాలు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ ఆఖరు నాటికి ఎల్వీబీలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్కు 4.99%, ప్రొలిఫిక్ ఫిన్వెస్ట్కు 3.36%, శ్రేయి ఇన్ఫ్రాకు 3.34%, ఎంఎన్ దస్తూర్ అండ్ కో సంస్థకు 1.89%, క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ 1.82%, క్యాప్రి గ్లోబల్ అడ్వైజరీ సర్వీసెస్ 2%, బయాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 1.36%, ట్రినిటీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్కు 1.61% వాటాలు ఉన్నాయి. -
ఐదో అతిపెద్ద బ్యాంక్ యూబీఐ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంక్ల విలీనం (అమాల్గమేషన్) తర్వాత దేశంలో ఐదో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్గా యూబీఐ అవతరించిందని ఎండీ అండ్ సీఈఓ రాజ్కిరణ్ రాయ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం యూబీఐకు దేశవ్యాప్తంగా 9,500 బ్రాంచీలు, 13,500 ఏటీఎంలు, 120 మిలియన్ల మంది కస్టమర్లున్నారని పేర్కొన్నారు. ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంక్ల వినియోగదారులు తమ డెబిట్ కార్డ్లను యూబీఐ ఏటీఎంలలో వినియోగించినా సరే ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని చెప్పారు. కస్టమర్ల ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, డెబిట్, క్రెడిట్ కార్డ్లు, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ పోర్టల్స్లో ఎలాం టి మార్పులు ఉండవని.. గతంలో మాదిరిగానే వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. నగదు ఉపసంహరణ, నిల్వ, బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి బేసిక్ సర్వీస్లను మూడింట్లో ఏ బ్యాంక్లోనైనా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. -
దేశీ బ్యాంకింగ్ రంగానికి నవోదయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మెగా విలీనంపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. దేశీ బ్యాంకింగ్ రంగానికి ఇది నవోదయంగా అభివర్ణించింది. ‘మరింత పటిష్టమైన, భారీ పీఎస్బీలు ఇంకా మెరుగైన ప్రత్యేక పథకాలు, మరింత వేగంగా రుణ ప్రాసెసింగ్ సేవలను కస్టమర్లకు అందించగలుగుతాయి. అవసరాలకు అనుగుణంగా ఇంటివద్దకే బ్యాంకింగ్ సేవలను విస్తరించగలుగుతాయి‘ అని ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం.. మ్రైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేసింది. నాలుగు పీఎస్బీల్లో ఆరు పీఎస్బీల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా పరమైన లాక్డౌన్ అమలవుతున్న తరుణంలో పీఎస్బీల విలీనం యథాప్రకారం అమల్లోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, విలీనం చేసుకున్న యునైటెడ్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్కు దేశవ్యాప్తంగా ఉన్న శాఖలన్నీ తమ బ్రాంచీలుగా సేవలు అందిస్తున్నాయని పంజాబ్ నేషనల్ బ్యాంకు వెల్లడిం చింది. తమ బ్యాంకుకు ఇకపై 11,000 పైచిలుకు శాఖలు, 13,000 పైగా ఏటీఎంలు, ఒక లక్ష మంది పైగా ఉద్యోగులు, రూ. 18 లక్షల కోట్ల పైచిలుకు వ్యాపారం ఉంటుందని పీఎన్బీ ఎండీ ఎస్ఎస్ మల్లికార్జునరావు తెలిపారు. మెగా విలీనంలో భాగంగా.. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు.. యూనియన్ బ్యాంక్లో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు.. ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకును విలీనం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
వెళ్తూ వెళ్తూ...!
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
కేకేఆర్తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement