-
‘మేరా మహబూబ్నగర్ మహాన్’
సాక్షి, స్టేషన్ మహబూబ్నగర్: సర్వమత సహనానికి ప్రతీకగా విరాజిల్లిన మహబూబ్నగర్ పట్టణం ఆవిర్భవించి మంగళవారం నాటికి 128 ఏళ్లు అవుతుంది. గంగా జమునా తహజీబ్కు ఆలవాలంగా ప్రముఖులచే కీర్తించబడుతున్న ఈ ప్రాంతంలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించేవని, చుట్టూర ఉన్న అడవుల్లో పాలుగారే చెట్లు అధికంగా ఉండేవని, అందుకే ఈ పట్టణంలోని కొంత భాగాన్ని పాలమూరు అనే వారని వేర్వేరు కథనాలు ఉన్నప్పటికీ.. ఖండాంతరాలు మహబూబ్నగర్ను ఆసిఫ్ జాహి వంశస్థుడైన 6వ నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ బహద్దూర్ పేరు మీద నామకరణం చేశారు. గతంలో రుక్మమ్మపేట, చోళవాడి, పాలమూరుగా పిలవబడిన ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఆసిఫ్జాహి రాజులు 1890 డిసెంబర్ 4వ తేదీన మహబూబ్నగర్గా మార్చారని చరిత్రకారులు పేర్కొన్నారు. శాతవాహన, చాళుక్యరాజుల పాలన అనంతరం గోల్కొండ రాజుల పాలన కిందకి వచ్చింది. 1518 నుంచి 1687 వరకు కుతుబ్షాహి రాజులు, అప్పటి నుంచి 1948 వరకు ఆసిఫ్జాహి నవాబులచే పాలించబడింది. భారత స్వాతంత్య్రానంతరం 1948 సెప్టెంబర్ 18వ తేదీన నైజాం సారథ్యంలోని హైదరాబాద్ రాష్ట్రాన్ని జాతీయ స్రవంతిలో కలిపిన సందర్భంగా ఇక్కడ ఉన్న భవంతులను, భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తుంది. నిజాం భవనాలే.. నిజాం పాలనలో నిర్మించబడిన భవనాలను జిల్లాకేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తున్నారు. వాటిలో అత్యధిక భవంతులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ప్రజాహిత కార్యక్రమాలకు అందుబాటులో కొనసాగుతున్నాయి. కలెక్టరేట్ సముదాయ భవనం, తహసీల్దార్ కార్యాలయం, జిల్లా కోర్టుల సముదాయం, జిల్లా ఎస్పీ కార్యాలయం, మైనర్ ఇరిగేషన్ ఈఈ ఆఫీస్, ఫారెస్టు ఆఫీసెస్ కాంప్లెక్స్, పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం, ఆర్అండ్బీ అతిథి గృహం, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, డీఈఓ, ఆర్అండ్బీ ఈఈ, జిల్లా జైలు, వన్టౌన్ పోలీస్స్టేషన్, బ్రాహ్మణవాడిలోని దూద్ఖానా, పాత పోస్టల్ సూపరింటెండెంట్, షాసాబ్గుట్ట హైస్కూల్, మోడల్ బేసిక్ హైస్కూల్, జిల్లా రైల్వేస్టేషన్ తదితర భవనాలు ప్రముఖ చోటును సంపాదించాయి. -
చిన్నారుల కోసం ఓ రాజభవనం
అనాథ పిల్లల కోసం నిజాం ప్రభువు ఏర్పాటు చేసిన అందమైన ప్యాలెస్ విక్టోరియా మెమోరియల్ హోమ్ అండ్ ఇండస్ట్రియల్ స్కూల్. నగరంలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్కు ఎదురుగా 64ఎకరాల విస్తీర్ణంలో ఉందా ప్యాలెస్. మార్నింగ్వాక్కు వెళ్లే ఏ కొద్ది మందికో తప్ప నూరేళ్లకు పైబడిన చరిత్ర ఉన్న ఆ ప్యాలెస్ గురించి చాలా మందికి తెలియదు. అక్కడ బాలబాలికలు కష్టాలు మరచి హాయిగా చదువుకుంటున్నారు. ఆ రోజుల్లో ఈ ప్రాంతం దట్టమైన అడవిలా ఉండేది. ఆరో నిజాం ప్రభువు మీర్ మహబూబ్ అలీ 1890లో తన వేసవి విడిదిగా ప్యాలెస్ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణ దశలో ఉన్నప్పుడే అటుగా వచ్చిన నిజాం ప్రభువుకు ఏదో దుశ్శకునం ఎదురై అశుభ సూచకంగా తోచింది. నిర్మాణం పనులు వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. విక్టోరియా స్మృత్యర్థం... 1902... ఇంగ్లండ్లో విక్టోరియా మహారాణి మరణించిన తొలి రోజులు. ఆమె స్మృత్యర్థం ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్న ఆనాటి బ్రిటిష్ రె సిడెంట్ సర్ డేవడ్ బార్ ఓరోజున వేటకు ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడి విశాలమైన ఆ అసంపూర్తి ప్యాలెస్ను చూసిమెమోరియల్కు అనువైనదని భావించాడు. ఆ తరువాత నిజాంను కలిసి ఆ భవనాన్ని తమకు అప్పగించాలని కోరాడు. బ్రిటిష్ పాలకులతో మంచి సంబంధాలున్న ఆరో నిజాం వెంటనే అందుకు అంగీకరించడమే కాదు... సగంలోఆగిపోయిన నిర్మాణం పనులను పూర్తి చేసి విక్టోరియా మహారాణి మెమోరియల్ స్థాపనం కోసం బ్రిటిష్ వారికి అప్పజెప్పినట్లు ఆధారాలున్నాయి. ఆ ప్యాలెస్లో చారిటబుల్ సంస్థగా ఆస్పత్రి లేదా అనాథ ఆశ్రమం ఏర్పాటు చేయాలని బ్రిటిష్ రెసిడెంట్ సర్ డేవిడ్ బార్ ప్రతిపాదించారు. తరువాత అనాథ బాలల విద్యాసంస్థ ఏర్పాటుకే మొగ్గు చూపారు. అప్పటికే 54 మంది విద్యార్థులతో వరంగల్లో నడుస్తున్న అనాథాశ్రమాన్ని హైదరాబాద్కు తరలించి తాత్కాలికంగా చాదర్ఘాట్లోని ఓ బిల్డింగ్లో నిర్వహించారు. ప్యాలెస్ నిర్మాణం పూర్తయిన తరువాత 1905 జనవరి 1న ‘విక్టోరియా మెమోరియల్ హోం ఫర్ ది ఆర్ఫన్స్’కు తరలించారు. అనాథలు కాదన్న నెహ్రూ... భారతదేశానికి స్వాత్రంత్యం సిద్ధించాక విక్టోరియా మెమోరియల్ హోమ్ బాధ్యత రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోకి వచ్చింది. ఈ నూరు సంవత్సరాల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్, విజయలక్ష్మీ పండిట్, దుర్గాబాయ్ దేశ్ముఖ్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా ఒకరేమిటి... ఎంతో మంది ప్రముఖులు హోమ్ను సంద ర్శించారు. 1953 జనవరి 19న భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా ఈ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా 20 నిమిషాలు ఆ చిన్నారులతో ముచ్చటించిన ఆయన... చదువు, ఆటపాటల్లో ముందున్న ఆ పిల్లలను అనాథలనడం సరికాదని... సంస్థ పేరులో ఉన్న ఆర్ఫన్స్ అన్న పదం తొలగించాలని సూచించారు. నెహ్రూ సూచనల మేరకు విక్టోరియా మెమోరియల్ హోమ్ అండ్ ఇండస్ట్రియల్ స్కూల్గా మారింది. నాడు పండిట్ నెహ్రూ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన చేవ్రాలుతో విజిటర్స్ బుక్లో నేటికి భద్రంగా ఉన్నాయి. అన్నింటా ముందే... ఐదేళ్ల నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు ఇక్కడ ఆశ్ర యమిస్తారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పది వరకు రెండు సెక్షన్లలో సుమారు 900 మంది చదువుతున్నారు. ఆ తరువాత ఇంటర్మీడియట్ కోసం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కాలేజీల్లో ఇక్కడి విద్యార్థులకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి ఏటా ఉత్తీర్ణత 80 నుంచి 85 శాతం ఉంటోంది. ఇక్కడ చదువుతోపాటు ప్రింటింగ్ టెక్నాలజీ, టైలరింగ్, ఎలక్ట్రిషియన్, కార్పెంటరీ వంటి ఉపాధి కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తున్నారు. ఈ విద్యార్థులు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సీసీల్లోనూ ముందే ఉన్నారు. అనేక జాతీయ స్థాయి క్రీడల్లో అవార్డులు అందుకున్నారు. విద్యార్థులు సాధించిన పతకాలు, ట్రోఫీలతో స్కూల్లోని గదుల గోడలు నిండిపోయాయి. ఈ పాఠశాలలో డ్రాపవుట్ అనే మాటే వినపడదు. భోజన, వసతి సౌకర్యాలతో పాటు యూనిఫాం, వైద్యం కూడా సాంఘిక సంక్షేమ శాఖే అందిస్తోంది. ఈ పిల్లలకు ఎవరైనా సాయం చేయాలనుకుంటే నగదు కాకుండా దుప్పట్లు, టవల్స్, సబ్బులు, దుస్తులు... ఇలా వస్తు రూపంలో ఇవ్వాలని స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. సంప్రదించాల్సిన ఫోన్ 040-24045144. - మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement