-
2011 వరల్డ్కప్ను భారత్కు అమ్మేశారు..
కొలంబో : 2011లో జరిగిన వన్డే క్రికెట్ వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయినట్లు శ్రీలంక మాజీ క్రీడాశాఖ మంత్రి మహిందానంద అలత్గమగే సంచలన ఆరోపణలు చేశారు. శ్రీలంకతో జరిగిన తుదిపోరులో ధోని నేతృత్వంలోని టీమిండియా వరల్డ్కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మరో పది బంతులు మిగిలి ఉండగానే టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని చేజిక్కించుకుంది. ఆ సమయంలో శ్రీలంక క్రీడా మంత్రిగా మహిందానంద ఉన్నారు. మహిందానంద 2010 నుంచి 2015 వరకు క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధనం-విద్యుత్ శాఖలో రాష్ట్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. (మళ్లీ జట్టులోకి క్రికెటర్ శ్రీశాంత్) ‘2011 వరల్డ్ కప్ మేము గెలవాల్సి ఉంది. కానీ, మ్యాచ్ను భారత్కు శ్రీలంకకు అమ్మేసింది. ఇన్నాళ్లు దేశం మేలు కోసం ఈ విషయం చెప్పలేదు. కానీ ఇప్పుడు నా బాధ్యతగా ఈ విషయాన్ని బయటపెడుతున్నా. ఆటగాళ్లను ఈ వ్యవహారంతో ముడిపెట్టడంలేదు. కొన్ని వర్గాలు దీని కోసం పని చేశాయి. నేనేం చెబుతాన్నానో దానికి కట్టుబడి ఉంటా’ అని తాజాగా శ్రీలంకకు చెందిన సిరాస టీవీతో మాట్లాడుతూ మహిందానంద సంచలన అరోపణలు చేశారు. (సచిన్ కెప్టెన్సీ వైఫల్యంపై మదన్లాల్ కామెంట్స్) ఇక ఇంతకు ముందే శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కూడా 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ అయిందని ఆరోపించాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ ఫైనల్లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడం తనను విస్మయపరిచిందని పేర్కొన్నాడు. ‘అప్పుడు నేను వ్యాఖ్యాతగా భారత్లోనే ఉన్నాను. ఆ ఓటమి నన్నెంతో వేదనకు గురిచేసింది. ఆ ఓటమిపై అప్పట్లోనే నాకు అనుమానం వచ్చింది. 2011 ఫైనల్లో శ్రీలంక ఆడిన తీరుపై మనం విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది' అని అప్పట్లో రణతుంగ వ్యాఖ్యానించాడు. 2011 వరల్డ్కప్ ఫైనల్పై గతంలో మరో శ్రీలంక క్రీడా మంత్రి దయాసిరి జయశేఖర కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. 2017లో మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ లేవనెత్తిన అంశాల ఆధారంగా ఆ వరల్డ్కప్ ఫిక్సింగ్పై విచారణ చేపట్టాలనుకుంటున్నట్లు దయాసిరి తెలిపారు. రణతుంగ ఆరోపణలు పనికిమాలినవిగా నాటి వరల్డ్కప్ భారత జట్టు సభ్యులు గౌతమ్ గంభీర్, ఆశీష్ నెహ్రా అప్పట్లోనే కొట్టిపారేశారు. అతడి ఆరోపణలకు ఆధారాలు చూపాలని సవాల్ కూడా విసిరారు.(అవన్నీ తప్పుడు వార్తలు: ఆఫ్రిది) రుజువులు చూపండి: మాజీ కెప్టెన్లు 2011 వరల్డ్కప్ను భారత్కు అమ్మేశారంటూ మహిందానంద చేసిన ఆరోపణలను మాజీ కెప్టెన్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధనే తోసిపుచ్చారు. మహిందానంద చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని ట్విటర్లో డిమాండ్ చేశారు. -
బ్యాడ్మింటన్లో మ్యాచ్ ఫిక్సింగ్
కౌలాలంపూర్: మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు తేలడంతో ఇద్దరు మలేసియా బ్యాడ్మింటన్ ఆటగాళ్లపై కెరీర్ ముగిసే విధంగా నిషేధం విధించారు. 31 ఏళ్ల తన్ చన్ సియాంగ్, మాజీ జూనియర్ ప్రపంచ చాంపియన్ 25 ఏళ్ల జుల్ఫాద్లి జుల్కిఫ్లిలు 2013 నుంచి క్రమం తప్పకుండా ఫిక్సింగ్కు పాల్పడినట్లు స్వతంత్ర దర్యాప్తు బృందం విచారణలో తేలింది. దీంతో సియాంగ్పై 15 ఏళ్లు, జుల్ఫాద్లిపై 20 ఏళ్లు నిషేధం విధించారు. దీంతో వాళ్ల కెరీర్కు పూర్తిగా తెరపడింది. వాళ్లు ఈ నిషేధ కాలంలో ఆటతో పాటు పరిపాలన, కోచింగ్, అధికారి, అభివృద్ధి పాత్రలకు కూడా దూరంగా ఉండాల్సిందేనని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) స్పష్టం చేసింది. బ్యాడ్మింటన్ చరిత్రలో ఫిక్సింగ్ ఉదంతంలో శిక్ష పడటం ఇదే తొలిసారి. బీడబ్ల్యూఎఫ్ నైతిక విలువల కమిటీ సియాంగ్కు రూ. 10 లక్షలు (15 వేల డాలర్లు), జుల్ఫాద్లికి రూ. 16.70 లక్షలు (25వేల డాలర్లు) జరిమానాగా విధించింది. -
ఫిక్సింగ్ కేసులో ఇద్దరి అరెస్ట్
లండన్: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో బయటపడిన మ్యాచ్ ఫిక్సింగ్కు సంబంధించి ఇద్దరు వ్యక్తులను లండన్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ ఏజెన్సీ మంగళవారం ప్రకటించింది. వీరిపై విచారణ కొనసాగుతోందని పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఫిక్సింగ్కు సంబంధించి పాక్ బోర్డు ఇప్పటికే ముగ్గురు క్రికెటర్లు షర్జీల్ ఖాన్, ఖాలిద్ లతీఫ్, నాసిర్ జంషెద్లను సస్పెండ్ చేసింది. -
అల్విరో పీటర్సన్ మ్యాచ్ ఫిక్సర్
దర్యాప్తు సాగుతుందన్న దక్షిణాఫ్రికా బోర్డు జోహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అల్విరో పీటర్సన్ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) వెల్లడించింది. 35 ఏళ్ల పీటర్సన్పై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. దేశవాళీ ఫ్రాంచైజీ టోర్నీలో హైవెల్డ్ లయన్సకు కెప్టెన్గా వ్యవహరించిన పీటర్సన్ మ్యాచ్ ఫిక్సర్ అని... 2015లో జరిగిన రామ్స్లామ్ టోర్నీలో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని సీఎస్ఏ తెలిపింది. అతనిపై ప్రొవిజనల్ సస్పెన్షన్ విధించామని, 14 రోజుల్లోగా స్పందించాలని నోటీసు కూడా జారీ చేశామని సీఎస్ఏ తెలిపింది. 2015లో పీటర్సన్ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఫిక్సింగ్పై కఠినంగా వ్యవహరిస్తోన్న సీఎస్ఏ ఇప్పటికే గులామ్ బొడి, జియాన్ సైమ్స్, మత్సిక్వె, ఎతీ ఎంబలాటి, సొలెకిలేలపై నిషేధం విధించింది. వీరంతా రామ్ స్లామ్ టోర్నీలో ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలొచ్చారుు. -
కెయిన్స్ ను ఎప్పటికీ క్షమించను: మెకల్లమ్
వెల్లింగ్టన్: తనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి అప్రతిష్టపాలు చేసిన క్రిస్ కెయిన్స్ ను ఎప్పటికీ క్షమించనని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ తేల్చి చెప్పాడు. 2008లో మ్యాచ్ను ఫిక్స్ చేస్తే భారీగా డబ్బులు అందుతాయని మెకల్లమ్కు కెయిన్స్ ఆశ చూపాడు. అరుుతే ఈ ఆఫర్ను తిరస్కరించిన తను 2011లో ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్కు సమాచారమందించాడు. అలాగే గతేడాది లండన్ కోర్టులో కెయిన్స్ పై జరిగిన విచారణలో మెకల్లమ్ సాక్షిగా హాజరయ్యాడు. ‘నేను చాలా జాలిగుణం కలిగిన వ్యక్తిని. నిజానికి తను జైలుకెళ్లవద్దనే కోరుకున్నాను. కానీ మరో రకంగా మాత్రం కెయిన్స్ ను ఎప్పటికీ క్షమించను. నన్ను చెడుగా చిత్రీకరించేందుకు తను పెద్ద ఎత్తున లాబీరుుంగ్ చేసి ఒత్తిడి తీసుకువచ్చాడు. అరుుతే ఇప్పుడు ఎవరి జీవితం వారిది. మేమెప్పుడూ కలుసుకోకూడదనే అనుకుంటున్నాను’ అని మెకల్లమ్ చెప్పాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement