-
బెల్జియం, జర్మనీ మ్యాచ్ డ్రా
భువనేశ్వర్: డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం,మాజీ విజేత జర్మనీ జట్ల మధ్య మంగళవారం జరిగిన ప్రపంచకప్ హాకీ టోర్నీ లీగ్ మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. పూల్ ‘బి’లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో బెల్జియం ఓటమి అంచున నిలిచింది. అయితే ఆఖరి క్వార్టర్లో వెగ్నేజ్ (54వ ని.లో) చేసిన గోల్తో ‘డ్రా’తో బయటపడింది. అంతకుముందు జర్మనీ జట్టులో వెలెన్ నిక్లస్ (22వ ని.లో), టామ్ గ్రామ్బుష్ (52వ ని.లో) చెరో గోల్ చేయగా, సెడ్రిక్ చార్లియర్ 9వ నిమిషంలోనే బెల్జియంకు తొలి గోల్ అందించాడు. ఈ నెల 20న జరిగే ఆఖరి లీగ్తో క్వార్టర్స్ బెర్త్లు ఖరారవుతాయి. చివరి లీగ్ మ్యాచ్ల్లో జపాన్తో బెల్జియం, దక్షిణ కొరియాతో జర్మనీ తలపడతాయి. ఈ పూల్ లో జరిగిన మొదటి మ్యాచ్లో దక్షిణ కొరియా 2–1తో జపాన్పై గెలిచింది. కొరియా తరఫున లీ జంగ్ జన్ (8వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేశాడు. జపాన్ జట్టులో నగయొషి (1వ ని.లో) గోల్ సాధించాడు. అయితే జపాన్ 11 మందితో కాకుండా 12 మందితో ఆడటం వివాదం రేపింది. -
ఇదేనా ఆటతీరు.. మెరుపుల్లేవ్!
ఫిఫా వరల్డ్కప్లో భాగంగా బుధవారం గ్రూప్-ఎఫ్లో భాగంగా మొరాకో, క్రొయేషియా మధ్య జరిగిన మ్యాచ్ పేలవ డ్రాగా ముగిసింది. 2018 ఫిఫా వరల్డ్కప్లో రన్నరప్గా నిలిచిన క్రొయేషియా జట్టు ఈ మ్యాచ్లో పెద్దగా మెరవలేదు. క్రొయేషియా పలుసార్లు గోల్పోస్ట్పై దాడి చేసినప్పటికి మొరాకో డిఫెన్స్ పటిష్టంగా ఉండడంతో గోల్స్ కొట్టలేకపోయింది. తొలి హాఫ్ టైమ్లో ఇరుజట్లు గోల్స్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాయి. ఇక రెండో హాఫ్ టైంలోనూ అదే పరిస్థితి. అదనపు సమయంలోనే ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో చెరొక పాయింట్ కేటాయించారు. ఇక తమ తర్వాతి మ్యాచ్లో క్రొయేషియా..కెనడాతో ఆడనుండగా; మొరాకో బెల్జియంతో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: మరొక మ్యాచ్ ఓడితే అంతే సంగతి.. అర్జెంటీనా ప్రీక్వార్టర్స్ చాన్స్ ఎంత? Morocco and Croatia share the points. 🤝@adidasfootball | #FIFAWorldCup — FIFA World Cup (@FIFAWorldCup) November 23, 2022 -
ఆసియా కప్ ఫైనల్ రేసులో భారత్...
జకార్తా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. సూపర్–4 సెమీఫైనల్ లీగ్లో భాగంగా మలేసియాతో ఆదివారం జరిగిన మ్యాచ్ను భారత్ 3–3 గోల్స్తో ‘డ్రా’ చేసుకుంది. ఒకదశలో భారత్ 0–2తో వెనుకబడి ఆ తర్వాత తేరుకొని 3–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ మ్యాచ్ ముగియడానికి నాలుగు నిమిషాలు ఉందనగా టీమిండియా గోల్ సమర్పించుకొని విజయం సాధించాల్సిన చోట ‘డ్రా’తో సంతృప్తి పడింది. మలేసియా ప్లేయర్ రజీ రహీమ్ (12వ, 21వ, 56వ ని.లో) ‘హ్యాట్రిక్’ గోల్స్తో తమ జట్టుకు ఓటమి తప్పించాడు. టీమిండియా తరఫున విష్ణుకాంత్ సింగ్ (32వ ని.లో), సునీల్ (53వ ని.లో), జెస్ నీలమ్ సంజీప్ (55వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. మరో మ్యాచ్లో దక్షిణ కొరియా 3–1తో జపాన్ను ఓడించింది. ప్రస్తుతం పట్టికలో కొరియా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. రెండింటిలో ఓడిన జపాన్ ఫైనల్ రేసుకు దూరమైంది. మంగళవారం జరిగే చివరి రౌండ్ మ్యాచ్ల్లో జపాన్తో మలేసియా; కొరియాతో భారత్ తలపడతాయి. ఆఖరి మ్యాచ్లో జపాన్పై మలేసియా గెలిస్తే... భారత్–కొరియా మ్యాచ్లో నెగ్గిన జట్టు మలేసియాతో కలిసి ఫైనల్ చేరుతుంది. ఒకవేళ భారత్–కొరియా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే... భారత్, కొరియా, మలేసియా జట్లలో మెరుగైన గోల్స్ సగటు ఉన్న రెండు జట్లు ఫైనల్ చేరుకుంటాయి. -
Indian Super League: హైదరాబాద్, జంషెడ్పూర్ మ్యాచ్ ‘డ్రా’
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో భాగంగా గురువారం హైదరాబాద్, జంషెడ్పూర్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. జంషెడ్పూర్ తరఫున స్టీవర్ట్ (41వ నిమిషంలో) గోల్ చేసి జట్టుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. అయితే ఆట 56వ నిమిషంలో జావో విక్టర్ ఇచ్చిన పాస్ను ఎటువంటి పొరపాటు చేయకుండా గోల్ పోస్ట్లోకి పంపిన హైదరాబాద్ స్ట్రయికర్ ఒగ్బెచె స్కోరును 1–1తో సమం చేశాడు. ఆ తర్వాత గోల్ కోసం హైదరాబాద్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పటి వరకు హైదరాబాద్ మూడు మ్యాచ్లు ఆడగా ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్లో ఓడగా...ఇప్పుడు ‘డ్రా’ చేసుకుంది. -
ఇది ఆటంటే.. టెస్టు మజా ఏంటో చూపించింది
Cricketers Praise Test Cricket Entertainment.. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ముగిసిన తొలి టెస్టు ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈరోజుల్లో మూడు.. నాలుగు రోజుల్లో ముగిసిపోతున్న టెస్టు మ్యాచ్లకు విరుద్దంగా ఆట ఐదోరోజు ఆఖరివరకు సాగింది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం దిశగా సాగినప్పటికీ కివీస్ టెయిలెండర్ల అసాధారణ పోరాటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 52 బంతులపాటు ఓపికగా ఆడిన రచిన్ రవీంద్ర, ఎజాజ్ పటేల్లు కివీస్ను ఓటమి నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్లో ఉండే మజాను మరోసారి రుచి చూశామని పలువురు క్రికెటర్లు ట్విటర్లో స్పందించారు. డేవిడ్ వార్నర్..'' టెస్టు క్రికెట్ అంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఐదు రోజుల పాటు రెండు జట్లు ఎంతో కష్టపడి ఆడాయి. టీమిండియా విజయం కోసం శ్రమించినప్పటికి డ్రాతో ముగిసింది. అందుకే నాకు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇక ముంబై టెస్టుకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా.. యాషెస్ సిరీస్కోసం అంతకు మించి ఎదురుచూస్తున్నా'' వీరేంద్ర సెహ్వాగ్.. '' టెస్టు క్రికెట్ అంటే మజా వేరుగా ఉంటుంది. టి20, వన్డేలు సంప్రదాయ క్రికెట్ ముందు పనికిరావు. ఓటమి నుంచి తప్పించుకోవడానికి న్యూజిలాండ్ చాలా కష్టపడింది. టీమిండియా తృటిలో విజయం నుంచి దూరమవడం నిరాశ కలిగించింది. ఇక ముంబై టెస్టులోనే ఫలితం కోసం ఎదురుచూడాలి.'' వీవీఎస్ లక్ష్మణ్.. '' ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. న్యూజిలాండ్ ఓటమి నుంచి తృటిలో తప్పించుకుంది. రచిన్ .. ఎజాజ్లు టీమిండియా గెలుపుకు అడ్డుగోడగా నిలబడ్డారు. టీమిండియాకు గెలుపు దూరం కావడం నిరాశ కలిగించింది.''
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement