-
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త బ్రేక్.. 5 నిముషాల సమయం
న్యూఢిల్లీ: టీ బ్రేక్, లంచ్ బ్రేక్ అంటే మనకి తెలుసు. ఇప్పుడు కేంద్ర కార్యాలయాల్లో ఇంకో కొత్త బ్రేక్ రాబోతోంది. అదే యోగా బ్రేక్.. పనిలో వచ్చే ఒత్తిళ్లను జయించి రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు పని చేస్తారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యోగా బ్రేక్ ప్రవేశపెట్టింది. ఒక అయిదు నిమిషాల సేపు ఉద్యోగులు అన్నీ మర్చిపోయి ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఆయుష్ శాఖ వై–బ్రేక్ యాప్ అనే యాప్ని రూపొందించింది. అందులో యోగా, ప్రాణాయామం ఎలా చేయాలో 5 నిమిషాల వీడియో ఉంటుంది. యోగా బ్రేక్ సమయంలో వై–బ్రేక్ యాప్లో చూపించినట్టుగా ఉద్యోగులు చేస్తే సరిపోతుంది. ఈ నెల 30 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ యోగా బ్రేక్ తీసుకోవాలని సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బందికి కూడా యోగా బ్రేక్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఆ యాప్లో ఏముంది ? పని చేసే ప్రాంతాల్లో 5 నిమిషాల సేపు రిలాక్స్ అవడానికి ఏమేం చెయ్యాలన్న దానిపై 2019లోనే కేంద్రం యోగా నిపుణులతో ఒక కమిటీ వేసింది. వారి సూచనల మేరకు ఈ 5 నిమిషాల యోగా ప్రోటోకాల్ను రూపొందించారు. గత ఏడాది జనవరిలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతాలలో దీనిని ఒక పైలెట్ ప్రాజెక్టులా ప్రారంభించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 5 ని.ల యోగా ప్రోటోకాల్ని తప్పనిసరి చేశారు. ఈ నెల 1న కేంద్రం వై–బ్రేక్ యాప్ని ప్రారంభించింది. -
2 పరుగులు చేస్తే చాలు... ముందు లంచ్ చేసి రండి!
119 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో భారత్ స్కోరు 19 ఓవర్లు ముగిసేసరికి 117/1... మరో 2 పరుగులు చేస్తే చాలు గెలుపు సొంతమవుతుంది. ఇరు జట్ల ఆటగాళ్లు పెవిలియన్కు వెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చు. ధావన్ స్టాన్స్ తీసుకునేందుకు సిద్ధమవుతున్న వేళ అంపైర్లు ఒక్కసారిగా ‘లంచ్’ అని ప్రకటించేశారు. దాంతో కోహ్లి, దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ ఆశ్చర్యానికి లోనయ్యారు. వారిద్దరు అంపైర్లతో ఏదో చెప్పబోయినా రూల్స్ అంటే రూల్స్ అంటూ వారు తిరస్కరించడంతో చేసేదేమీ లేక ఆటగాళ్లు మైదానం వీడారు. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. రిఫరీ తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోకుండా రాతియుగం లాంటి నిబంధనలు అమలు చేయడం ఏమిటని మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలు విరుచుకు పడ్డారు. అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించడం... దక్షిణాఫ్రికా ఓటమి ఖాయం కావడంతో మరో రెండు పరుగుల కోసం వేచి చూడకుండా ప్రేక్షకులు మైదానం వీడటం కనిపించింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కేవలం 32.2 ఓవర్లకే ముగియడంతో భారత్ ఆడే సమయంలో లంచ్ విరామం ప్రకటించాల్సింది. 15 ఓవర్లు ముగిశాక మరో 26 పరుగులు చేయాల్సిన సమయంలోనే లంచ్ సమయం అయింది. నిజానికి ఈ సమయంలోనే బ్రేక్ ఇస్తే ఇంతగా విమర్శలు రాకపోయేవేమో! అయితే అంపైర్లు ఫలితాన్ని ఆశిస్తూ మరో 15 నిమిషాలు పొడిగించారు. ఆపై 4 ఓవర్లలో భారత్ 24 పరుగులు చేయగలిగింది. దాంతో మరో మాటకు తావు లేకుండా ఆటను నిలిపేశారు. 45 నిమిషాల విరామం తర్వాత వచ్చీ రాగానే భారత్ గెలవలేదు. షమ్సీ వేసిన 20వ ఓవర్లో ధావన్ పరుగులేమీ చేయకపోవడంతో అది ‘మెయిడిన్’ అయింది. ఆ తర్వాత తాహిర్ ఓవర్ మూడో బంతికి కోహ్లి రెండు పరుగులు తీసి లాంఛనం పూర్తి చేశాడు. 5/22 చహల్ కెరీర్ అత్యుత్తమ బౌలింగ్. తొలిసారి ఐదు వికెట్లు పడగొట్టిన చహల్... దక్షిణాఫ్రికాపై భారత్ తరఫున రెండో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. 1999లో సునీల్ జోషి (5/6) ప్రదర్శన మొదటి స్థానంలో ఉంది. 118 సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు. 2009లో ఆ జట్టు ఇంగ్లండ్పై 119 పరుగులు చేసింది. 9 తొమ్మిదేళ్ల తర్వాత తుది జట్టులో డు ప్లెసిస్, డివిలియర్స్ లేకుండా దక్షిణాఫ్రికా మ్యాచ్ ఆడింది. లంచ్ ప్రకటించక ముందు నిండుగా... ప్రకటించాక ఖాళీగా... -
సో మచ్ టు సే...సంతోషం
సినిమా వెనుక స్టోరీ - 3 లంచ్ బ్రేక్. బెనర్జీ, దశరథ్ ఇద్దరూ భోంచేస్తున్నారు. మధ్యలో ఏవో పిచ్చాపాటీ కబుర్లు. ‘‘నీ దగ్గర కథలేమైనా ఉన్నాయా?’’ యథాలాపంగా అడిగారు బెనర్జీ. ‘‘ఓ... చాలా ఉన్నాయ్ సార్. మీరు చేతులు వాష్ చేసుకు రండి. ఇప్పటికిప్పుడు ఓ కథ చెప్తా’’ అన్నాడు దశరథ్.‘నువ్వు-నేను’ షూటింగ్ స్పాట్ అది. తేజ డెరైక్టర్. దశరథ్ అసిస్టెంట్ రైటర్ కమ్ అసోసియేట్ డెరైక్టర్. నటుడు బెనర్జీకి ఇండస్ట్రీలో పరిచయాలెక్కువ. టాలెంట్ను ఎంకరేజ్ చేసే గుణమున్నవాడు కాబట్టి, దశరథ్ని తీసుకెళ్లి నిర్మాతలు కేఎల్ నారాయణ, ఎస్. గోపాలరెడ్డిలకు పరిచయం చేశాడు. వాళ్లిద్దరూ కలసి పెట్టిన దుర్గా ఆర్ట్స్ టాప్ బేనర్. ‘క్షణక్షణం, హలో బ్రదర్, దొంగాట, ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు’ అన్నీ సూపర్ హిట్సే. వాళ్లు మంచి స్టోరీ కోసం వెతుకుతున్నారు. దశరథ్ వచ్చాడు... ‘వన్ హౌస్’ కథ చెప్పాడు. సింగిల్ సిట్టింగ్లో ఓకే. స్మాల్ బడ్జెట్... సింగిల్ లొకేషన్... థర్టీ డేస్ షూటింగ్... హీరో తరుణ్ ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. కాల్ షీట్స్ ఫుల్ టైట్. ఫోర్ మంత్స్ తర్వాతే షూటింగ్ పెట్టుకోవాలి. అందుకే మధ్య మధ్యలో ‘నువ్వు-నేను’ వర్క్కు అటెండ్ అవుతున్నాడు దశరథ్. కేఎల్ నారాయణ, గోపాలరెడ్డిలకు ఈ సినిమాతో పాటు ఇంకో సినిమా కూడా లైన్లో ఉంది. నాగార్జున డేట్స్ రెడీ. కానీ కథే లేదు. ఎవరెవరో రైటర్స్ వస్తున్నారు... చెబుతున్నారు... వెళుతున్నారు. దశరథ్ దగ్గర ఓ యాక్షన్ కథ ఉంది. ఈ ఇద్దరికీ చెప్పాడు. నచ్చేసింది. స్థలం దొరికితే ఇల్లు కట్టడం ఎంతసేపు! నాగార్జున దగ్గరకు కథ వెళ్లింది. అంతా ఓకే. కానీ డైలమా. షాజీ కైలాస్ డెరైక్షన్లో ‘శ్రీరామ్’ అనే యాక్షన్ సినిమా కమిటయ్యాడు నాగ్. ఒకేసారి రెండు యాక్షన్ సినిమాలంటే కష్టం. ‘‘ఏదైనా ఫ్యామిలీ కథ ఉంటే చూడమనండి’’ చెప్పాడు నాగ్. హీరో చెప్పాడంటే ఇక తిరుగేముంది! దశరథ్, రైటర్ గోపీమోహన్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరూ ఓ రెస్టారెంట్లో కూర్చున్నారు. ‘‘గోపీ! ఇది మనకు గోల్డెన్ చాన్స్. నాగార్జున గారికి అర్జంట్గా మంచి ఫ్యామిలీ కథ చేయాలి మనం’’ చెప్పాడు దశరథ్ ఉద్వేగంగా. ఇద్దరూ ఏవేవో అనుకున్నారు. ఆ రాత్రి దశరథ్కి నిద్ర పట్టలేదు. నాగ్కి మంచి కథ చేయాలి. ‘హమ్ దిల్ దే చుకే హై సనమ్’ హిందీ సినిమా గుర్తొచ్చింది. అందులో అజయ్ దేవగణ్ క్యారెక్టరైజేషన్ ఎక్స్లెంట్. అలా ఉండాలి నాగ్ క్యారెక్టరైజేషన్. బుర్రలో లైట్స్ ఆన్. వారంలో లైన్ రెడీ. నాగ్కి చెబితే ఫ్లాట్. ఎస్... తనకు రైట్ టైమ్లో రైట్ సబ్జెక్ట్. పూర్తి స్క్రిప్టు చేయమని నాగ్ ఆదేశం.దశరథ్ ఆ పనిలో ఉన్నాడు. మొత్తానికి బౌండ్ స్క్రిప్ట్ రెడీ. నాగ్ మళ్లీ విన్నాడు. కానీ ఏం మాట్లాడలేదు. నచ్చలేదా? దశరథ్లో డౌట్. ‘నువ్వు - నేను’ కోసం ‘గాజువాక పిల్లా...’ పాట షూట్ చేస్తున్నారు. బోలెడంత మంది స్టూడెంట్స్... హంగామా. దశరథ్ చాలా బిజీగా ఉన్నాడు. అసోసియేట్ కదా! ‘‘ప్లీజ్ కాల్ మీ అర్జంట్’’ అంటూ గోపాలరెడ్డి దగ్గర నుంచీ పేజర్ మెసేజ్. లంచ్ బ్రేక్లో కాల్ చేశాడు దశరథ్. ‘‘కంగ్రాట్స్! నాగార్జున గారికి కథ బాగా నచ్చేసింది. నిన్నే డెరైక్ట్ చేయమంటున్నారు’’ చెప్పారు గోపాలరెడ్డి. దశరథ్ ఉలిక్కిపడ్డాడు. ‘‘ఏంటి సార్... మీరనేది?’’ ‘‘అవును దశరథ్! నాగార్జునగారు ఆగస్టు నుంచి డేట్లు కూడా ఇచ్చేశారు. నువ్వు రెడీ అవ్వు’’ అన్నారు గోపాలరెడ్డి. దశరథ్కి కాళ్లూ చేతులూ ఆడడం లేదు. ఏదో అనుకుంటే, ఇంకేదో అవుతోంది. తనకిది నిజంగా బంపర్ ఆఫరే! మరి తరుణ్ సినిమా? ‘‘లేదు లేదు... తరుణ్తో మేం మాట్లాడతాం. నీకేమీ ఇబ్బంది ఉండదు’’ అని గోపాలరెడ్డి భరోసా ఇచ్చారు. అయినా దశరథ్లో టెన్షన్ తగ్గలేదు. ‘‘సార్..! నాగార్జున లాంటి పెద్ద హీరోతో ఇప్పటికిప్పుడు సినిమా అంటే కష్టం. నా వల్ల కాదు. కథ వరకూ తీసుకోండి... ఇచ్చేస్తాను’’ అని చెప్పేశాడు.నాగార్జున దాకా వెళ్లింది విషయం. ఆయనకు దశరథ్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్. తానెంతమంది కొత్త డెరైక్టర్లను చూడలేదు! మొదట్లో ఇలానే బెరుకు ఉంటుంది. ‘‘దశరథ్ రియల్ ప్రాబ్లమేంటో కనుక్కోండి’’ - మళ్లీ నాగ్ ఆదేశం. ‘‘నా మీద నాకు కాన్ఫిడెన్స్ రావాలి. నవంబర్ అయితే ఓకే. ఈలోగా నేనూ రెడీ అవుతా’’ అని చెప్పేశాడు దశరథ్. నాగ్ లాంటి స్టార్ హీరో అన్నాళ్లు ఆగుతాడా? కానీ ఆగాడు. కథ అంతలా నచ్చేసింది మరి. టైటిల్ కూడా బాగా కుదిరింది. ‘సంతోషం’. గోపీమోహన్ పెట్టాడు. ఇద్దరు హీరోయిన్లు కావాలి. ‘లగాన్’ ట్రయిలర్ రిలీజైంది ఫ్రెష్గా. ‘రాధా కైసాన జలే...’ అంటూ హీరోయిన్ గ్రేసీసింగ్ కవ్విస్తోంది. గ్రేసీ అయితే గ్రేస్ఫుల్గా ఉంటుందనిపించింది దశరథ్కు. ఈలోగా ‘లగాన్’ రిలీజై, బ్లాక్బస్టర్ అయిపోయింది. గ్రేసీకి పెద్ద క్రేజ్. అంత సులువుగా డేట్లు దొరుకుతాయా? దొరికేశాయ్. కథ నచ్చేసింది మరి! మరి ఇంకో హీరోయిన్? రకరకాల ఆప్షన్లు. ఈ వెతుకులాట ఇలా ఉండగా పబ్లిసిటీ డిజైనర్ కృష్ణ ఆఫీసుకెళ్లాడు దశరథ్. ఏదో పోస్టర్ డిజైన్ చేస్తున్నాడు కృష్ణ. ఉషాకిరణ్ మూవీస్ వాళ్ల సినిమా ‘ఇష్టం’. హీరోయిన్ కొత్తమ్మాయి. క్యూట్గా ఉంది. కొత్తావకాయలా ఉంది. కానీ మరీ టీనేజ్ గాళ్లా కనబడుతోంది. నాగ్ పక్కన సూటవుతుందా? ఫొటోసెషన్ పెట్టారు. అంతా ఓకే. సెకండ్ హీరోయిన్గా శ్రీయ సెలక్ట్. ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఇంట్రస్టింగ్ యాక్టర్ ఎవరైనా కావాలి. ప్రభుదేవా పేరు సూచించారు గోపాలరెడ్డి. అతనుంటే సెకండాఫ్లో మంచి డాన్స్ సాంగ్ కూడా పెట్టొచ్చని ఐడియా. ప్రభుదేవా ఓకే అన్నాడు. త్రివిక్రమ్, చంద్రసిద్ధార్థ్, ఆర్పీ పట్నాయక్, దశరథ్, సునీల్... వీళ్లంతా ఓ గ్యాంగ్. సోమాజీగూడా ‘ట్రైలక్’ రెస్టారెంట్... వీళ్ల అడ్డా. అక్కడే వీళ్ల కెరీర్కు బీజాలు పడ్డాయి మరి. ఆర్పీ, దశరథ్ అక్కడే కూర్చుని పాటల గురించి మాట్లాడుకునేవారు. చంద్రసిద్ధార్థ్ రాగానే ‘‘ చందూ బాయ్..! పదండి గండిపేటకు వెళ్దాం’’ అని తొందరపెట్టేసేవారు. ఆ గ్యాంగ్లో చంద్రసిద్ధార్థ్ ఒక్కడికే కారు. మిగతా వాళ్లందరికీ బైక్లు. ఆ ట్రావెలింగ్లోనే మ్యూజిక్ సిట్టింగ్స్. ఓ సిట్యుయేషన్లో ఇంగ్లిషు పాట పెడదామనుకున్నారు. ఆర్పీ ఏదో ట్యూన్ చెబుతున్నాడు. కారు డ్రైవ్ చేస్తున్న చంద్రసిద్ధార్థ్ చాలా క్యాజువల్గా ‘సో మచ్ టు సే...’ అంటూ పాడేస్తున్నాడు. ‘‘ఈ పాట ఎందులోది?’’ అడిగాడు ఆర్పీ. ‘‘నువ్వు కట్టిన ట్యూన్కి నేను క్యాజువల్గా లిరిక్ చెప్పానంతే’’ అని భుజాలెగరేశాడు చంద్రసిద్ధార్థ్. ఆర్పీ చిన్నపిల్లాడిలా సంబరపడిపోతూ ‘‘చందూ గారూ..! ఈ ఇంగ్లిషు పాట మీరే రాయలి’’ అన్నాడు. అలా డెరైక్టర్ చంద్రసిద్ధార్థ్తో ఆ ఇంగ్లిషు పాట రాయించేశారు స్క్రిప్ట్ బాగా వచ్చింది. కానీ క్లైమాక్స్ ఏదో కొడుతోంది. డైలాగ్స్లో ఇంకా ఏదో నింపాలి. దశరథ్కి త్రివిక్రమ్ గుర్తొచ్చాడు. చిన్న మీటింగ్. క్లైమాక్స్ ప్యాట్రన్ చెప్పాడు దశరథ్. పెన్నూ పేపర్ పట్టుకోకుండా త్రివిక్రమ్ ఒక ఫ్లోలో డైలాగులు చెప్పేశాడు. అదిరింది... క్లైమాక్స్ అదిరింది. దశరథ్కి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. 2001 నవంబర్ 15. ఊటీలో ఫస్ట్ షాట్ తీశారు. షూటింగ్ స్పీడ్గా సాగుతోంది. నాగార్జున, గ్రేసీసింగ్ మీద పాట. రాజు సుందరం కొరియోగ్రఫీ. ఆర్పీ వేడివేడిగా పాట చేసుకొచ్చాడు. ‘‘గల గల గోదారిలా... కిలకిలా రావే చెలి...’’ అంటూ పాట ప్లే అవుతోంది.రాజు సుందరం మొహం చిట్లించాడు. ‘‘ఛా... ఇదేం పల్లవి... నాకు నచ్చలేదు...’’. దశరథ్ గుండెల్లో రాయిపడింది. ఇదేంట్రా బాబూ... కొరియోగ్రాఫర్కి కూడా పాట నచ్చాలా? ఏం చెయ్యాలి? తప్పదు. రాజు సుందరం టాప్ కొరియోగ్రాఫర్ కదా! ఆర్పీకి, దశరథ్కి ఒకటే రూమ్. ఇద్దరూ రాత్రంతా నిద్రపోలేదు. కొత్త పల్లవి కావాలి. లిరిక్ రైటర్ కులశేఖర్కి కాల్ చేస్తే అవుటాఫ్ కాలింగ్ ఏరియా. ఇద్దరూ ఆ మాటా ఈ మాటా అనుకుంటూ పల్లవి రాసేశారు. ‘‘దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా షాజహాన్ తిరిగొచ్చినా తాజ్మహల్ రాసిచ్చినా ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా...’’ రాజు సుందరం పల్లవి విని అదిరిందన్నాడు. సునీల్ ఫ్రెండు కాబట్టి మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. కానీ ఏదో కొడుతోంది. సునీల్తో అదే చెప్పాడు దశరథ్. ‘‘అయితే ఓ పని చేద్దామా? నేను ప్రభుదేవాకు డాన్సు నేర్పించే సీన్ క్రియేట్ చెయ్. బల్బు పెడుతున్నట్టు, ట్యాప్ తిప్పుతున్నట్టు స్టెప్స్ నేర్పిస్తా... ఎలా ఉంది ఐడియా’’ అన్నాడు సునీల్. అందరికీ నచ్చేసింది. అప్పటికప్పుడు అనుకుని అప్పటికప్పుడు తీసేశారు సీన్. 2002 మే 9. ‘సంతోషం’ రిలీజ్. సూపర్హిట్ టాక్. ఇది కలో, నిజమో దశరథ్కి ఇంకా అర్థం కావడం లేదు. ఏదో ట్రాన్స్లోనే ఉన్నాడతను. వరసపెట్టి ఫోన్లు.. మెసేజ్లు... గ్రీటింగ్స్... బొకేలు... ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో లంచ్ చేస్తున్నాడు దశరథ్. ఫోన్ మోగింది. ‘‘కంగ్రాట్స్’’... అవతల మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఆయన చెప్పాడంటే తిరుగే ఉండదు. దశరథ్ మనసు నిండిపోయింది... సంతోషంతో! - పులగం చిన్నారాయణ మీ ఫ్యూచర్ టీచర్: ‘నేను ఒక మనిషిని చంపాను’ ఈ వాక్యాన్ని భవిష్యత్ కాలం లో చెప్పండి. చింటూ: మీరు జైలుకు వెళతారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఠి నాగార్జునకు ‘సంతోషం’తో ఉత్తమ నటునిగా నంది అవార్డు లభించింది. చిరంజీవి (‘ఇంద్ర’ సినిమా)తో కలసి ఈ పురస్కారాన్ని పంచుకున్నారు. ఇలా ఇద్దరు నటులకు కలిపి, ఉత్తమ నటునిగా నంది అవార్డు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైమ్. తరుణ్తో చేద్దామనుకున్న ‘వన్ హౌస్’ స్క్రిప్టుతో ఆ తర్వాత గోపీమోహన్ డెరైక్షన్ చేయాలనుకున్నారు. ఉదయ్కిరణ్ను హీరోగా అనుకున్నారు. కుదర్లేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement