-
ముగ్గురు తీవ్రవాదులు అరెస్ట్ : భారీగా సైనైడ్ స్వాధీనం
చెన్నై: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) ఆత్మాహుతి దళానికి చెందిన ముగ్గురు తీవ్రవాదులు శ్రీలంకకు పారిపోతూ సోమవారం రాత్రి పోలీసులకు పట్టుబడ్డారు. తమిళనాడులోని రామనాథపురం వద్ద సముద్రం మార్గంలో ముగ్గురు వ్యక్తులు రహస్యంగా శ్రీలంకకు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు మదురై-రామనాథపురం జాతీయ రహదారిలో వాహనాల తనిఖీ చేపట్టారు. రామనాథపురం ఉచ్చిపులి పోలీస్స్టేషన్ పరిధిలోని రోడ్డులో కారును నిలిపి ఉన్న ముగ్గురిని పోలీసులు అనుమానించి విచారణ జరిపారు. వారు ఎల్టీటీఈ ఉగ్రవాదులని తేలడంతో కారును స్వాధీనం చేసుకున్నారు. కృష్ణకుమార్ (39), రాజేంద్రన్ (44) శశికుమార్ (30) అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణకుమార్ చేతి సంచిలో 75 సైనైడ్ గుళికలు, 300 గ్రాముల సైనైడ్, 4 జీపీఎస్ పరికరాలు, 8 సెల్ఫోన్లు ఉన్నాయి. అలాగే రూ.42 వేల భారత కరెన్సీ, రూ.19 వేల శ్రీలంక కరెన్సీని కనుగొన్నారు. కృష్ణకుమార్ను రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి విచారించగా.. అతను ఎల్టీటీఈ ప్రభాకరన్కు బంధువు అని, ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించినట్లు తెలుసుకున్నారు. తుదిపోరు సమయంలో శ్రీలంక నుంచి పారిపోయి 2008లో తమిళనాడుకు చేరుకున్నట్టు విచారణలో తెలిసింది. తిరుచ్చిరాపల్లి కేకే నగర్లో అద్దె ఇంటిలో ఉంటూ ఇరుగూ పొరుగు వారితో డ్రైవర్నని పరిచయం చేసుకున్నాడు. అలాగే శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈకి చెందిన రాజేంద్రన్ తమిళనాడులో ఉంటూ శ్రీలంకకు తరచూ సముద్ర మార్గంలో గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్టు తెలిసింది. శ్రీలంకలోని తమ సానుభూతిపరులను సమీకరించి మళ్లీ ఆత్మాహుతి దళాలను సిద్ధం చేసి ఎల్టీటీఈని బలోపేతం చేయడం కోసమే భారీ ఎత్తున సైనైడ్తో వారు ముగ్గురు బయలుదేరినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శశికుమార్, రాజేంద్రన్లను అరెస్ట్ చేసిన పోలీసులు, కృష్ణకుమార్ను మాత్రం రహస్య ప్రదేశంలో ఉంచి విచారణను కొనసాగిస్తున్నారు. -
రాజపక్సకు భారతరత్న ఇవ్వాలి: స్వామి
న్యూఢిల్లీ: ఎల్టీటీఈ ఉగ్రవాదులను నిర్మూలించటంలో విజయం సాధించిన శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సకు భారతరత్న ఇవ్వాలని బీజేపీ నేత సుబ్రమణ్యంస్వామి కోరారు. ఈమేరకు ప్రధాని నరేంద్రమోదీకి ఆయన ఓ లేఖ రాశారు. టైగర్లను తుదముట్టించటాన్ని భారత్లో జాతీయ భద్రతకు శుభ పరిణామంగా భావించాలన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement