-
పిల్లలకు ఉరేసి.. తల్లి ఆత్మహత్య..
జైలు నుంచి భర్త విడుదల కాలేదని మనస్తాపం చెందిన ఓ ఇల్లాలు.. కన్నబిడ్డలను చంపి.. తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నార్పల మండలం బండ్ల పల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మాధవి(24)కి ముదిగుబ్బ మండలం కొడవళ్లపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తో వివాహం జరిగింది. కొన్ని నెలల క్రితం భర్త ఓ హత్యకేసులో ఇరుక్కుని జిల్లా సబ్ జైలులో ఉన్నాడు. అప్పటి నుంచి మాధవి తన పుట్టింటి వద్దే ఉంటోంది. భర్త జైలు నుంచి విడుదల కావడం లేదనే మనస్తాపం చెందిన మాధవి.. బుధవారం ఉదయం తన ఇద్దరు పిల్లలకు ఉరేసి..తాను ఉరేసుకుంది. ఈ ఘటనలో కూతురు భాను (5)ప్రాణాలతో బయట పడగా.. కుమారుడు లోకేశ్వర్ రెడ్డి (3) మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం బాను ను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆశలు మునిగి శోకం మిగిలె..
నీట మునిగి ఆరుగురు పిల్లలు మృత్యువాత పడడంతో జిల్లాలో విషాదం అలుముకుంది. కన్నవారికి కడుపుకోత మిగిలింది. ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్న పిల్లలు సాయంత్రానికి లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేక ఆ తల్లిదండ్రులు విలపిస్తుంటే ఆ పల్లెలన్నీ శోకసంద్రమయ్యాయి. గుర్రంకొండ మండలం మర్రిమాకులపల్లెలో వినాయక నిమజ్జనం అనంతరం ఒంటిపై ఉన్న రంగులను కడుక్కునేందుకు చెరువులో దిగి లోకేశ్వర్ రెడ్డి (13), బాలాజీ రెడ్డి (13) నీట మునిగి చనిపోయారు. బి.కొత్తకోట మండలంలో టేకులపెంటలో ఆడుకుంటూ నీటిలో దిగి వెంకటేష్(7), ప్రదీప్ (6) దుర్మరణం పాలయ్యారు. వీరిద్దరూ అన్నాదమ్ములు. తంబళ్లపల్లె మండలం ఇట్నేనివారిపల్లె యానాదికాలనీకి చెందిన హరీష్బాబు(12) ఈత కోసం చెరువులో దిగి మృతి చెందాడు. వడమాలపేట మండలం కాయం ఎస్టీ కాలనీలో హేమంత్కుమార్(6) తోటి పిల్లలతో కలసి సమీపంలోని నీటిగుంటలో దిగాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. తోటి పిల్లలు బయటకు తీశారు. అప్పటికే చనిపోయాడు. గుర్రంకొండ, న్యూస్లైన్: వినాయుకుడి నివుజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. చెరువులో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన గుర్రంకొండ వుండలం వుర్రివూకులపల్లెలో ఆదివారం రాత్రి జరిగింది. సాయుంత్రం నిమజ్జనం కార్యక్రవుం ప్రారంభం కాగా గ్రావూనికి చెందిన పీ.చిన్నవుస్తాన్రెడ్డి కువూరుడు పీ.లోకేశ్వర్రెడ్డి(13), పీ.సురేందర్రెడ్డి కువూరుడు పీ.బాలాజిరెడ్డి(13)తో పాటు గ్రావూనికి చెందిన లోకేష్రెడ్డి చెరువు వద్దకు వుుదుగానే చేరుకున్నారు. ఒంటి పై ఉన్న రంగులను కడుక్కునేందుకు ముగ్గురూ ఒకేసారి చెరువులోకి ఈత కోసం దిగారు. వీరిలో లోకేశ్వర్రెడ్డి, బాలాజిరెడ్డి చెరువు పూడికలో చిక్కుకుపోయారు. లోకేష్రెడ్డి గట్టుకు చేరుకుని గ్రావుంలో కి పరుగులు తీశాడు. విషయం చెప్పడంతో గ్రామస్తులు కొందరు చెరువులోకి దిగి వారిద్దరినీ బయుటకు తీశారు. అప్పటికే ఇద్దరు చనిపోయూరు. ఈ ఇద్దరు విద్యార్థులు గుర్రంకొండలోని విశ్వభారతి హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. మృతితుల్లో బాలాజిరెడ్డి ఒక్కరే వుగ సంతానం కావడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. విషయుం తెలుసుకున్న ఎస్ఐ చలపతి సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తుచేశారు. కుంటలోదిగి ఇద్దరు చిన్నారుల మృతి : బి.కొత్తకోట: మండలంలోని అటవీ ప్రాంతం టేకులపెంటలో ఆదివారం సాయంత్రం ఇద్దరు చిన్నారులు నీట మునిగి చనిపోయారు. అదృష్టవశాత్తు నలుగురు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. బి.కొత్తకోట మండలం గట్టు గ్రామంలోని టేకులపెంటకు చెందిన బీ.వీరమ్మకు కురబలకోట మండలం చింతమాకులపల్లెకు చెందిన పెద్దిరాజుతో వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. పెద్దిరాజు నాలుగేళ్ల క్రితమే మృతి చెందాడు. ముగ్గురు పిల్లలతో వీరమ్మ చింతమాకులపల్లెలో ఉంటోంది. వీరమ్మ రెండు రోజుల క్రితం పిల్లలతో కలసి టేకులపెంటకు వచ్చింది. ఆదివారం సాయంత్రం వీరమ్మ పిల్లలు వెంకటేష్(7), ప్రదీప్(6), స్థానికులైన అంజనమ్మ, గౌతమి, అనంత, శివకుమార్ (వీరికి 3-5 సంవత్సరాల వయస్సు) కలిసి టేకులపెంటకు సమీపంలోని గుండాలకుంటలో నీళ్లలో దిగారు. వీరిలో వెంకటేష్, ప్రదీప్ నీటిలో మునిగిపోయారు. గౌతమి బురదలో చిక్కుకుపోయింది. శివకుమార్, అనంతలు నీటిలో మునిగిపోతూ కేకలు పెట్టారు. ఇదే సమయంలో స్థానికురాలైన రమణమ్మ అటువైపుగా వెళుతూ కేకలు విని కుంట వద్దకు చేరుకుంది. వెంటనే వెంకటరమణ అనే వ్యక్తికి విషయం చెప్పడంతో అతను కుంటలో దిగి పిల్లలందరినీ ఒడ్డుకు తీసుకొచ్చాడు. అప్పటికే వెంకటేష్, ప్రదీప్ మృతి చెందారు. ప్రాణం తీసిన ఈత సరదా తంబళ్లపల్లె : ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం బలిగొంది. తంబళ్లపల్లె సమీపంలోని ఇట్నేనివారిపల్లె యానాదికాలనీకి చెందిన టేకుమంద మల్లయ్య, మల్లీశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. హరీష్బాబు(12) ఎనిమిదో తరగతి, శ్రీహరి మూడవ తరగతి చదువుతున్నారు. వీరు ఈత కొట్టేందుకు గ్రామ సమీపంలోని అక్కమ్మచెరువు వద్దకు వెళ్లారు. ముందుగా హరిబాబు చెరువులోకి దిగాడు. ఎక్కువలోతు ఉండడంతో మునిగిపోయాడు. గమనించిన శ్రీహరి పరుగున వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. వెంటనే గ్రామస్తులు అక్కడకు చేరుకుని చెరువులో గాలించారు. చివరకు హరిబాబు మృతదేహాన్ని వెలికి తీశారు. గ్రామ సర్పంచ్ గీతారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఎం.కొండ్రెడ్డి సాయివిద్యామందిర్ కరస్పాండెంట్ కమలమ్మ తదితరులు బాలుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నీట మునిగి బాలుడి మృతి వడమాలపేట: తోటి పిల్లలతో కలసి నీటిగుంటలో దిగిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. వడమాలపేట మండలం కాయం ఎస్టీ కాలనీకి చెందిన సుబ్రమణ్యం, కల్పన కొడుకు హేమంత్కుమార్(6) తోటి పిల్లలతో కలసి సమీపంలోని నీటిగుంటలో దిగాడు. లోతైన ప్రదేశంలోకి వెళ్లడంతో ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. వెంటనే తోటిపిల్లలు గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పడంతో గ్రామస్తులు వెళ్లి హేమంత్కుమార్ను బయటకు తీశారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement