-
భూ సమీకరణకు కొత్త విధానం!
సాక్షి, హైదరాబాద్: నగర, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్ ) విధానాన్ని తీసుకురానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ భూ సమీకరణ విధానాలు, పద్ధతులపై రాష్ట్ర పురపాలక శాఖ అధ్యయనం చేపట్టింది. ఆ శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం ఒకటి గుజరాత్లో, కార్యదర్శి సి.సుదర్శన్రెడ్డి నేతృత్వంలోని మరో బృందం మహారాష్ట్రలో పర్యటించింది. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ల్యాండ్ పూలింగ్ విధానాలపై బృందాలు అధ్యయనం జరిపాయి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు (ఉడాలు)/డీటీసీపీ (డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్)లు నిర్వహిస్తున్న పాత్రను పరిశీలించాయి. ఈనెల 15లోగా ఈ బృందాలు పురపాలక శాఖకు తమ నివేదికలు సమర్పించనున్నాయి. వీటిని పరిశీలించి, నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త భూ సమీకరణ విధానాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. శాటిలైట్ టౌన్లు, పేద, బడుగు, బలహీన వర్గాలకు గృహ నిర్మాణ ప్రాజెక్టుల నిర్మాణం వంటి అవసరాల కోసం ఈ కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకొస్తోందని అధికారవర్గాలు తెలిపాయి. పురపాలికలు, ఉడాల ఆధ్వర్యంలోనే.. భూ సమీకరణ ద్వారా సేకరించిన భూముల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులను పురపాలికలు/ఉడాల ఆధ్వర్యంలోనే చేపట్టాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ప్రైవేటు డెవలపర్లు అభివృద్ధి చేస్తున్న నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా పైప్లైన్లు కొద్ది రోజుల్లోనే దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా పనులు పూర్తిగా పురపాలికలు/ఉడాల ఆధ్వర్యంలోనే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
సర్వం సీఆర్డీఏ గుప్పెట్లోనే!
ఏపీ అసెంబ్లీలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ బిల్లు ... ⇒ప్రాధికార సంస్థకు ఏ స్థిర, చరాస్తులనైనా సేకరించే అధికారం ⇒ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములనూ స్వాధీనం చేసుకోవచ్చు ⇒సేకరించిన వాటిని విక్రయించొచ్చు లేదా కాంట్రాక్టుకూ ఇవ్వొచ్చు సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన వేల ఎకరాల భూమిని భూసమీకరణ పథకం లేదంటే భూ సేకరణ చట్టం ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటునకు ఉద్దేశించిన బిల్లును పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భూ సమీకరణకు అంగీకరించని పక్షంలో 2013 భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బిల్లులోని సెక్షన్-126 కింద స్పష్టం చేశారు. నూతన రాజధాని ప్రాంతంలో ఏ స్థిర, చరాస్తులనైనా సేకరించే అధికారాన్ని ప్రాధికార సంస్థకు బిల్లులో కట్టబెట్టారు. స్థిర, చరాస్తులను కొనుగోలు చేయడం ద్వారా గానీ, మార్పిడి , కానుకలుగా , లీజుగా , తాకట్టు ద్వారా . సంప్రదింపుల ద్వారా గానీ... ఇలా వివిధ రూపాల్లో ప్రాధికార సంస్థ సేకరించవచ్చునని బిల్లులో స్పష్టం చేశారు. భూసమీకరణ పథకానికి అంగీకరించని భూ యజమానులతో ప్రాధికార సంస్థ తొలుత పరస్పర సంప్రదింపులు, అంగీకారం విధానంలో భూమిని సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందుకు కొన్ని నిబంధనలను, షరతులను విధిస్తారు. ఈ షరతులు, నిబంధనలకు భూ యజమానులు అంగీకరించిన పక్షంలో సంప్రదింపుల ద్వారా సెటిల్మెంట్ చేసుకోనున్నారు. ఈ విధానానికి కూడా అంగీకరించని పక్షంలో 2013 భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించాలని నిర్ణయించారు. ప్రాధికార సంస్థకు సీఎం చైర్మన్గాను, పురపాలక శాఖ మంత్రి వైస్ చైర్మన్గా ఉంటారు. బిల్లులోని ముఖ్యాంశాలు... రాజధాని నిర్మాణంకోసం అవసరమైన ఎటువంటి భూమినైనా సమీకరించడానికి లేదా రిజర్వ్ చేయడానికైనా 2013 భూ సేకరణ చట్టం కింద ప్రాధికార సంస్థకు అధికారం కల్పించారు. ఇది సాధ్యం కాని పక్షంలో 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పారదర్శకంగా సహాయ, పునరావాసం కల్పిస్తూ తగిన పరిహారాన్ని చెల్లిస్తారు. ప్రాధికార సంస్థ మొదట రాజధాని ప్రాంత భూమి అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేస్తుంది. భూ సమీకరణ పథకంకోసం, టౌన్ ప్లానింగ్ పథకం కోసం, ప్రజా అవసరాల సౌకర్యాల కల్పన కోసం అవసరమైన నిధుల కోసం ప్రాధికార సంస్థ, ప్రభుత్వం పరస్పర అంగీకారంతో ఆ ప్రాంతంలోని అభివృద్ధి చెందిన లేదా అభివృద్ధి చెందని ఎటువంటి భూమినైనా విక్రయించవచ్చునని బిల్లులో పేర్కొన్నారు. నిర్ధారించిన నిబంధనల మేరకు ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములను ప్రాధికార సంస్థ స్వాధీనం చేసుకోవచ్చును. అయితే జిల్లా కలెక్టర్ నిర్ధారించిన పరిహారాన్ని అసైన్డ్ భూములవారికి చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులనుంచి సేకరించే భూమికి నష్టపరిహారం చెల్లించకుండా వారు కోరితే మరో ప్రాంతంలో అభివృద్ధి హక్కుల బదిలీ (టీడీఆర్) చేయడానికి అభివృద్ధి హక్కు పత్రం (డీఆర్సీ) ఇవ్వవచ్చు. ప్రాధికార సంస్థ పేరుతో స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకుని తన వద్దే ఉంచుకోవడం లేదా విక్రయించడం లేదా కాంట్రాక్టుకు ఇచ్చే అధికారాన్ని బిల్లులో పొందుపరిచారు. అలాగే ప్రభుత్వం సేకరించిన ఏ భూమినైనా ప్రాధికార సంస్థ బదిలీ చేస్తుంది. అలాంటి భూమిని ఎటువంటి అవసరాలకైనా సంస్థ విక్రయించవచ్చునని బిల్లులో స్పష్టం చేశారు. భూ సమీకరణ పథకంలో వచ్చిన మొత్తం భూమిలో 50 శాతం మౌలిక సదుపాయాలకు వెచ్చిస్తారు. కొంత భూమిని మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వమే తమ వద్ద ఉంచుకుంటుంది. మిగిలినది రైతులకు ప్లాట్లు రూపంలో లేదా భూరూపంలో ఇస్తుంది. భూసమీకరణ పథకం మొత్తంలో వచ్చిన భూమిలో రహదారుల నిర్మాణానికి, ప్రజా సేవల కోసం 30 శాతం భూమిని రిజర్వ్ చేస్తారు. పాఠశాలలు, చికిత్సాలయాలు, ఇతర సామాజిక సేవల కోసం ఐదుశాతం, బలహీన వర్గాల గృహ నిర్మాణాల కోసం మరో ఐదుశాతం భూమిని రిజర్వ్ చేస్తారు. ప్రాధికార సంస్థ సొంతంగా గానీ లేదా భూమి యజమానులు దరఖాస్తు ద్వారా గానీ లేదా భూ సమీకరణ పథకంలో అభివృద్ధి చేసే ఏజెన్సీ ద్వారా గానీ భూసమీకరణ ప్రాంతాన్ని గుర్తించనున్నారు. భూసమీకరణ ప్రాంతాన్ని అధారిటీ ప్రకటించిన తరువాత పక్షం రోజుల్లోగా భూమి యజమానుల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఆహ్వానించాలి. ఈ ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేయాలి. అనంతరం భూసమీకరణ పథకాన్ని ప్రజలకు, యజమానులకు సమాచారం ఉండే తరహాలో ప్రాధికార సంస్థ నోటిఫై చేయాలి. నిర్ధారించిన సమయంలోగా ప్రతీ భూమి యజమానికి భూ సమీకరణ యాజమాన్య ధృవపత్రాలను ప్రాధికార సంస్థ జారీ చేయాలి. భూసమీకరణకు 62 మంది అధికారులు రాజధాని నిర్మాణానికి భూముల సమీకరణపై సర్కారు వేగం పెంచింది. శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఆర్డీఏ బిల్లుపై సోమవారం చర్చ జరగనుంది. మరోవైపు భూసమీకరణ(ల్యాండ్పూలింగ్)కు అధికారులను నియమించారు. తొలిదశలో 29 గ్రామాల్లో 30 వేల ఎకరాలు సేకరించాలని సర్కారు నిర్ణయించింది.సమీకరణ కోసం 62 మంది అధికారులను నియమించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సాక్షి ఆఫీస్లో టీ20 ట్రోఫీ.. పీయూష్ చావ్లా సందడి (ఫొటోలు)
ఆప్ను అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: సీఎం కేజ్రీవాల్
విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్
రాష్ట్రపతి భవనంలో గదులెన్ని? లోపల ఏ విద్యాలయం ఉంది?
Play Offs లోకి ఆర్సిబీ
‘ఖర్గే చెప్పినా.. నా పోరాటం ఆగదు’
ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
తప్పక చదవండి
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement