-
సింగిల్ నెంబర్ లాటరీలు నిర్వహిస్తే కఠిన చర్యలు
కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : సింగిల్ నెంబర్ లాటరీ టికెట్ల విక్రయాలకు పాల్పడేవారిపై కఠిన చర్య లు తీసుకుంటామని బందరు డీఎస్పీ కె.వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. స్థానిక చిలకలపూడి పోలీస్స్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బందరు, అవనిగడ్డ సబ్-డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో సింగిల్ నెంబర్ లాటరీ టికెట్ల విక్రయాలు రహస్యంగా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. లాట రీల నిర్వాహకుల వలలోరోజువారీ కూలీలు, చేతివృత్తుల వారు, రిక్షా, భవన నిర్మాణ కార్మికులు, రోల్డుగోల్డు వర్కర్లు చిక్కుకుంటున్నట్లు ఆయన చెప్పారు. నిరుపేద, మధ్యతరగతి ప్రజల అత్యాశ, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లాటరీల నిర్వాహకులు టికెట్లను విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. లాటరీల కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని పేర్కొన్నారు. లాటరీ టికెట్లను కొనటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. బందరు, అవనిగడ్డ సబ్-డివిజన్లలో సింగిల్ నెంబర్ లాటరీ టికెట్లు అమ్మేవారిపై పోలీ సులు ప్రత్యేక నిఘా ఉంచుతారని తెలిపారు. లాటరీ వ్యాపారాలు జరుగుతున్నట్లు తెలిస్తే తక్షణమే ఆ సమాచారాన్ని నేరుగా సంబంధిత పోలీస్స్టేషన్కు తెలియజేయాలని ఆయన కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. లాటరీల నిర్వాహకులను అదుపులోకి తీసుకుని శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో చిలకలపూడి ఎస్హెచ్వో టి. సత్యనారాయణ, ఎస్సై లోవరాజు తదితరులు పాల్గొన్నారు. -
తీరంలో గస్తీ ముమ్మరం : ఎస్పీ
7 మెరైన్ బోట్ల ప్రారంభం ఒక్కో బోటులో 10 మంది నియామకం నెలకు రూ.1.65 లక్షల అద్దెకు ఏర్పాటు మచిలీపట్నం, న్యూస్లైన్ : తీరం వెంబడి మెరైన్ పోలీసుల ద్వారా గస్తీని ముమ్మరం చేయనున్నట్లు ఎస్పీ జె.ప్రభాకరరావు తెలిపారు. గిలకలదిండి మెరైన్ పోలీస్స్టేషన్ వద్ద సముద్రంలో గస్తీ తిరిగేందుకు సిద్ధం చేసిన ఏడు మెరైన్ బోట్లను ఆయన లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిలకలదిండి మెరైన్ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు బుల్లెట్ప్రూఫ్ బోట్లు ఉన్నాయన్నారు. ఇవి కాకుండా తమిళనాడు సరిహద్దు నుంచి దక్షిణ కోస్తా సరిహద్దు వరకు సముద్రంలో 24 గంటల పాటు గస్తీ నిర్వహించేందుకు ఏడు బోట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిలో నెల్లూరు జిల్లా శ్రీహరికోట, ఇసుకపల్లి మెరైన్ పోలీస్స్టేషన్లకు, ప్రకాశం జిల్లా కొత్తపేట, రామయ్యపేట మెరైన్ పోలీస్స్టేషన్లకు, గుంటూరు జిల్లా నిజాంపట్నం మెరైన్ పోలీస్స్టేషన్కు, కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం ఒర్లగొందితిప్ప, కోడూరు మండలం పాలకాయతిప్ప మెరైన్ పోలీస్స్టేషన్లకు ఒక్కొక్క బోటును కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాలకు కేటాయించిన బోట్లు సముద్రంలో ఆరు గంటల పాటు గస్తీ తిరగాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే 24 గంటల పాటు సముద్రంలోనే ఉండి విదేశీయులు, తీవ్రవాద చర్యలకు పాల్పడేవారి కదలికలపై ఆ సిబ్బంది నిఘా ఉంచుతారన్నారు. ఒక్కొక్క బోటులో పది మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. డీజీపీ బి.ప్రసాదరావు, హోంశాఖ సెక్రటరీ టీపీ దాస్, మెరైన్ ఐజీపీ శ్రీనివాసరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తీరంలో గస్తీని ముమ్మరం చేసేందుకు ఈ బోట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఒక్కొక్క బోటుకు నెలకు 1.65 లక్షల రూపాయలు అద్దె చెల్లించే విధంగా ఏడు సోనా బోట్లను అద్దెకు తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బందరు డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ పి.మురళీధర్, మెరైన్ సీఐ సత్యనారాయణ, మెరైన్ ఎస్సై రమణారెడ్డి, మచిలీపట్నం పోలీస్స్టేషన్ ఎస్సై శ్రీహరి, సిబ్బంది పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రజకులకు అండగా ఉంటాం
రాష్ట్రానికి కేంద్ర నిధులపై చర్చిద్దామా?
‘నీట్’ మాల్ ప్రాక్టీస్కు చెక్!
నేతన్నల బాధలు సీఎంకు కనిపించలేదా..?
ఎమ్మెల్యే నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం
ఓటుహక్కుపై ‘ఉపాధి’ కూలీలకు చైతన్యం
శ్రీమద్రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ
విద్యార్థులకు అభినందన
వేసవి పూట.. జలకాలాట
రోహిత్ కేసును పునర్విచారించాలి
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement