-
వరి @ రూ.3,010
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో బుధవారం ధాన్యానికి (ఆర్ఎన్ఆర్ పాతరకం) రికార్డుస్థాయిలో ధర రూ. 3,010లు పలికింది. ఈ సీజన్ ప్రారంభమైన నాటినుంచి ధాన్యానికి అత్యధికంగా ధర పలకడం ఇదే తొలిసారి. మద్దతు ధర రూ.2,060 ఉండగా, మద్దతుకు మించే ధర రావడం విశేషం. కాగా, మార్కెట్ కు బుధవారం 1,778 బస్తాల ధాన్యం అమ్మకానికి రాగా, గరిష్ట ధర రూ.3,010, కనిష్ట ధర రూ.2,219 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. -
బావిలోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, మహబూబాబాద్/కేసముద్రం/ఇల్లెందు: వాళ్లంతా గిరిజనులు.. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతున్నారు. చదువుకున్న కొడుకుకు ఉపాధి కల్పించేందుకు కొత్త లారీ కొన్నారు. తనతోపాటు తన బంధువు కూడా లారీ కొనడంతో ఆ సంబురంలో బంధువులతో కలసి దైవదర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావిలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. డ్రైవర్, తల్లి, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు లచ్చీరాం తండా సమీపంలో చోటుచేసుకుంది. కారు అదుపుతప్పడంతో...: మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన బానోత్ భద్రునాయక్ (39) తన దూరపు బంధువు జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి తండాకు చెందిన మధు కుటుంబ సభ్యులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా వద్ద పండుగ చేశారు. పండుగకు భద్రునాయక్, భార్య హచ్చాలి (35), కుమార్తె సుమలతతోపాటు 18 నెలల మనవడు దీక్షిత్తో కలసి టేకులపల్లికి చెందిన తన బావమరిది గుగులోత్ బిక్కి నాయక్ కారులో వెళ్లారు. అన్నారం షరీఫ్ దర్గాలో బంధువులతో కలసి దర్శనం చేసుకున్నారు. భోజనాలు చేశారు. తిరిగి టేకులపల్లికి వస్తుండగా అదే పండుగకు వచ్చిన మహబూబాబాద్ పట్టణం భవానీ నగర్ తండాకు చెందిన గుగులోత్ లలిత (45), ఆమె కుమారుడు సురేష్ (15) లిఫ్ట్ అడిగి కారులో ఎక్కారు. అయితే కారు కేసముద్రం మండల కేంద్రం లచ్చీరాం తండా సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడింది. ఈ ప్రమాదంలో భద్రునాయక్, అతని భార్య హచ్చాలి, లలిత, ఆమె కుమారుడు సురేష్ నీటిలో మునిగి మరణించారు. ముందు సీట్లో ఉన్న డ్రైవర్ బిక్కు, భద్రునాయక్ కుమార్తె సుమలత, ఆమె 18 నెలల కుమారుడు దీక్షిత్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద వార్త తెలియగానే మహబూబాబాద్ డీఎస్పీ సైదయ్య ఆధ్వర్యంలో పోలీసులు, గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకొని రెండు గంటలపాటు శ్రమించి క్రేన్ సాయంతో బావిలోంచి కారును బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బావిలో పడిన కారును బయటకు తీస్తున్న దృశ్యం నీటిలో అరగంట తేలుతూ.. కేసముద్రం బైపాస్ రోడ్డును కొత్తగా వేస్తున్నారు. కంకర పోసి ఉండటంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే నిండు కుండలా ఉన్న వ్యవసాయ బావిలో పడింది. అయితే కారు అద్దాలు మూసి ఉండటంతో దాదాపు అరగంటపాటు బావిలో కారు తేలుతూ ఉంది. క్రమంగా లోపలకు నీరు చేరుతుండటంతో కారులో ఉన్నవారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కారు బావిలో పడిన శబ్ధం రావడంతో అటువైపు మూత్ర విసర్జనకు వెళ్తున్న ఎస్వీవీ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు బుర్రి రంజిత్, నూనావత్ సిద్దూలు ప్రాణాలకు తెగించి బావిలోకి దూకారు. కారు అద్దాన్ని పగలగొట్టి సుమలత, ఆమె కుమారుడు దీక్షిత్ను, డ్రైవర్ బిక్కును కాపాడారు. అప్పటికే కారులోకి నీరు ప్రవేశించి కారు మునిగిపోతుండగా హచ్చాలిని, భధ్రులను స్థానికుల సాయంతో బయటకు తీశారు. కానీ అప్పుటికే భద్రు మృతి చెందగా కొనఊపిరితో ఉన్న హచ్చాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. వెనుక సీట్లో ఉన్న లలిత, ఆమె కుమారుడు సురేష్లు కారులోనే మృతిచెందారు. -
మహబూబాబాద్ : కేసముద్రం వద్ద బావిలోకి దూసుకెళ్లిన కారు
-
ఒకేరోజు జననం.. ఒకేరోజు మరణం
సాక్షి, ఉమ్మడి వరంగల్: వారిద్దరూ ఒకే రోజు జన్మించారు. బంధుత్వంలో ఆప్యాయంగా మెలిగారు. అయితే వారి మరణం కూడా ఒకేరోజు జరగడం విధి విచిత్రం. మహబూబాబాద్ జిల్లాలో కొన్ని గంటల వ్యవధిలోనే వియ్యపురాళ్లు ఒకరి వెంట, మరొకరు మృతి చెందారు. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దుల బజారుకు చెందిన జానపాటి మల్లమ్మ (85) కుమార్తె అచ్చమ్మను, ఇదే గ్రామానికి చెందిన పంకు యాకమ్మ (85) కుమారుడైన యాకయ్యకు ఇచ్చి వివాహం చేశారు. మల్లమ్మ, యాకమ్మ ఇద్దరి ఇళ్లూ పక్కపక్కనే ఉండడం విశేషం. బంధుత్వంలో వారిద్దరూ అప్యాయంగా ఉండేవారు. శనివారం తెల్లవారుజామున మల్లమ్మ గుండెపోటుతో మృతి చెందింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యాకమ్మ, మల్లమ్మ మృతదేహం వద్ద విలపించింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆమె కూడా గుండెపోటుతో మృతి చెందింది. గంటల వ్యవధిలోనే వియ్యపురాళ్లు ఇద్దరూ మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఇదిలా ఉండగా మల్లమ్మ, యాకమ్మలు కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే రోజు జన్మించినట్లు స్థానికులు తెలిపారు. చదవండి: ప్రేమ పేరుతో మోసం తిరుపతిలో నిందితుడి అరెస్టు -
ఒక్క ఫోన్కాల్తో పీటలపై ఆగిన పెళ్లి; బావా.. ఎంత పని చేస్తివి!
సాక్షి, మహబూబాబాద్ రూరల్: మరికొద్ది గంటల్లో జరగాల్సిన పెళ్లి అంతలోనే వచ్చిన ఓ ఫోన్కాల్తో పీటల మీదే ఆగిపోయింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని కేసముద్రం మండలం పరిధి గ్రామానికి చెందిన వధువుకు బయ్యారం మండలం పరిధిలో గల వరుడితో వివాహం నిశ్చయమైంది. బుధవారం ఉదయం 10 గంటలకు కురవి మండల కేంద్రంలో వివాహం జరిపేందుకు పెద్దలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెళ్లి మరికొద్ది గంటల్లో ఉందనగా వధువు అక్క భర్త వరుడి తండ్రికి ఫోన్చేసి వివాహం ముచ్చట్లు మాట్లాడాడు. బాబాయ్ పెళ్లి ఎక్కడ, ఎలా రావాలి, ఏర్పాట్లు ఎలా చేశారని మంచి చెడు అడిగి తెలుసుకున్నాడు. కాగా, మంగళవారం ప్రధానం వేడుక జరగగా పెళ్లి కుమార్తె వరుడి ఇంట్లో ఉంది. అదే క్రమంలో పెళ్లి కుమార్తె అక్కడే ఉందా అని అడిగాడు. దీంతో వరుడి తండ్రి ఫోన్ను నూతన వధువుకు ఇచ్చాడు. ఆమె బావ మాట్లాడుతూ నిన్న నేను అలిగి ప్రధానం సమయంలో నీతో ఫొటో ఎందుకు దిగలేదో తెలుసా.. నీ మీద కోపంతో నేను ఫొటో దిగలేదని మాట్లాడాడు. ఆ మాటలను కాల్ రికార్డ్లో విన్న పెళ్లి కుమారుడు తనకు ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని మొరాయించాడు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు నివాసం ఉంటుండగా వారు పోలీసులను ఆశ్రయించారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ పోలీసులు నూతన వరుడికి కౌన్సెలింగ్ ఇచ్చినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అతడు ఆమెను పెళ్లి చేసుకోనని పట్టుబట్టాడు. టౌన్ సీఐ సతీష్ను వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. చదవండి: సరూర్ నగర్ హత్య: ‘కాపాడమని కాళ్లు పట్టుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు’
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రచారంలో భారతమ్మ..!
బాబే భూబకాసురుడు
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు కేతిరెడ్డి సవాల్
రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
ఆస్పత్రిలో హీరోయిన్.. మత్తు మందు.. బాధ తట్టుకోలేకపోతున్నా!
కవితకు బిగ్ షాక్...నో బెయిల్
మళ్లీ సీఎం జగనే.. బాపట్ల రేపల్లె సిద్ధం (ఫొటోలు)
టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు
ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- Parvathipuram: ఎన్ఆర్ఐకు ఎదురుగాలి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement