-
తెలుగు: ఎప్పుడు? ఎక్కడ? ఎలా?
ఒక విధంగా చూస్తే గాథాసప్తశతి తెలుగు భాషలోని ప్రథమ వాఙ్మయం- మౌఖికం. హాలుడు ఆ గాథలలోని సౌందర్యానికి ముగ్ధుడై వాటిని ప్రాకృత భాషలోనికి (రాజభాషలోనికి) ఆర్యావృత్తాలలోనికి అనువదించి ఉంటాడు. సింధూ నది ప్రాంతం నుండి ద్రావిడులు దక్షిణాదికి వలస వచ్చారని చరిత్ర చెప్పుతూ ఉంది. మరి వారు వలస రాకపూర్వం దక్షిణ భారతదేశమంతా జనశూన్యంగా ఉండినదా? జనావాసాలూ, జనాలూ లేనే లేరా? ఉండుంటే వారికొక భాష ఉండదా? వారి భాష ఏమైంది?దాక్షిణాత్య జనులు దక్షిణ భారతదేశం లోనే ఆవిర్భవించార నడమే సహజ సిద్ధాంతం. దక్షిణ భారతదేశంలో మొట్ట మొదట వెలసిన ప్రముఖ ఆదిమానవులు నివాసం ఏర్పాటు చేసుకొన్న తుంగభద్రా, కృష్ణానదీ తీర పర్వతారణ్యాలే రామాయణంలో చెప్పబడిన కిష్కింధ. రామునికి కిష్కింధలోనే జనావాసాలు కనబడ్డాయి. కిష్కింధ సమీపంలో ఋశ్య మూకమూ, మాల్యవంతమూ అనే కొండల పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఇప్పుడు కూడ హంపి వద్ద ఉన్న రెండు కొండలకు ఆ పేర్లే ఉన్నాయి. కిష్కింధలో నివాసం చేసుకొని ఉండినవారే రామాయణంలో చెప్పబడిన వానరులు. వారే ఆధునిక చరిత్రకారులు చెబుతున్న ద్రావిడులు. వాల్మీకి ఈ వానరులకు తోకలున్నట్లు వర్ణించినాడు కానీ అది కావ్య సౌందర్యానికే కావచ్చు. వారు మామూలు కోతులైతే వాల్మీకి వారిని అంతటి బృహత్కాయులుగా, శక్తిమంతులుగా వర్ణించి ఉండడు. అలా వర్ణిస్తే అది హాస్యాస్పదమౌతుంది. కాబట్టి వారు నిస్సం దేహంగా బృహత్కాయులైన, అనాగరికులైన ఆదిమానవులే. వారు మాట్లాడుతూ ఉండిన భాషే మూల దక్షిణ భారతభాష. ఆధునిక చరిత్రకారులు చెప్పే మూల ద్రావిడ భాష. ఉత్తరాది వారి నాగరికత దక్షిణాది నాగరికత కంటే చాలా ప్రాచీనమైనది. దక్షిణాదిలో భాషలు ఇంకా శైశవ దశలో ఉండగానే ఉత్తరాది వారి సంస్కృతంలో గొప్ప వాఙ్మయమే- వేదాలు- వెలిసింది. దక్షిణాదిలో ఒక పరిపాలనా వ్యవస్థ లేని కాలంలోనే ఉత్తరాదిలో రాజు, మంత్రులు, సేనాధిపతి, సైన్యమూ, పన్నులు, ఉద్యోగులు మొదలైన పాలనా వ్యవస్థ ఏర్పడింది. శ్రీరాముడు వనవాసం నెపంతో దక్షిణాదికి వచ్చి గోదావరీ తీరంలో నిలవడమూ, ఖరదూషణాదులను చంపడమూ, అందుకు ప్రతీకారంగా రావణుడు సీతను అపహరిం చడమూ, రామలక్ష్మణులు కిష్కింధ వాసులతో సఖ్యం చేసుకోవడమూ, వారి సాయంతో లంకకు వెళ్ళి రావణుని వధించి తిరిగి అయోధ్యకు చేరుకోవడమూ భారతదేశ చరిత్రలో అతి ముఖ్యమైన ఘట్టం. ఇది ఒక విధంగా రాజకీయ వ్యవస్థ లేని దక్షిణ భారతదేశాన్ని ఆర్య సంస్కృతి లోనికి లాగుకొనే ప్రయత్నం. రాజకీయ, సాంస్కృతిక దండయాత్ర. దక్షిణాదిలో మూలద్రావిడ భాష ఇంకా పరిపక్వమూ, వాఙ్మయ నిర్మాణ సమర్థమూ కాకముందే సంస్కృత భాష దక్షిణాదిపైన ఉప్పెనలా విరుచుకుపడింది. ఉత్తరాదికి సమీపంలో ఉన్న నేటి తెలుగు కన్నడ ప్రాంతాల మీద సంస్కృత ప్రభావం ఎక్కువగా పడింది. సంస్కృతం ఆధిక్యత క్రింద అచ్చమైన మూల ద్రావిడ పదాలు అనేకం మాయమై పోయాయి. భాష యొక్క మూల లక్షణాలైన క్రియా పదాలు, సర్వనామాలు మొదలైనవి మాత్రం ఎలాగో చెక్కుచెదరకుండా నిలిచాయి. తెలుగు కన్నడ ప్రాంతాలకు దక్షిణంగా ఉండిన తమిళ ప్రాంతం పైన సంస్కృత భాషా ప్రభావం అంతగా పడలేదు. తమిళం మూలద్రావిడ భాషకు దగ్గరగా నిలబడింది. తెలుగు, కన్నడం ఇంచుక దూరంగా జరిగిపోయాయి. ఇవికాక మూల ద్రావిడ భాష నుండి అనేక చిన్న చిన్న భాషలు చీలిపోయాయి. ఈ రీతిగా దక్షిణాది భాషలలో విభిన్నత్వం ఏర్పడటానికి చాలా కాలమే పట్టి ఉండవచ్చు. దాక్షిణాత్య భాషల వారు తమకంటూ ఒక లిపిని తయారుచేసుకొన్న సందర్భంలో తెలుగు భాష మాట్లాడేవారు తమ ఉచ్చారణకు అవసరమైన ముప్పై ఆరు అక్షరాలనేకాక సంస్కృత పదాల ఉచ్చారణకు అవసరమైన మరో ఇరవై అక్షరాలను కలుపుకొని తమ వర్ణ సమామ్నాయాన్ని రూపొందించుకొన్నారు. ఇక లిపి విషయానికొస్తే దక్షిణాది లిపులు కూడా బ్రాహ్మీలిపి నుండి పరిణమించినవే అంటున్నారు కొందరు భాషాశాస్త్రవేత్తలు. కానీ అది అంత సమర్థనీయంగా కనిపించదు. క్రీ.శ.575లో వేయబడిన కలిమెళ్ళ ధనంజయుని తొలితెలుగు శాసనంలోనూ, క్రీ.శ.848లో వేయబడిన అద్దంకి పండరంగని తొలి తెలుగు పద్యశాసనంలోనూ ఉన్న అక్షరాలను పరిశీలిస్తే ఆ శాసనాల లిపికీ బ్రాహ్మీలిపికీ పెద్దగా పోలికలు కనబడడం లేదు. న, ణ, డ మొదలైన మూడు నాలుగు అక్షరాలు మాత్రం నాగరి లిపిని పోలి ఉన్నాయి. తక్కినవన్నీ స్వతంత్రమైన లిపిగానే కనబడుతూ ఉన్నాయి. మాటలు సద్యఃస్ఫురణతో హఠాత్తుగా పుట్టుకొస్తాయి. మాటలు పుట్టడానికి అవసరమే తప్ప ప్రయత్నం అవసరం లేదు. లిపి అట్లా కాదు. లిపి వ్యాప్తి చెందాలంటే పరస్పర అంగీకారంతో అక్షర రూపాన్ని సృష్టించడం, జ్ఞాపకం పెట్టుకోవడం, పునఃప్రయోగం మొ దలైన అనేకాంశాలు అవసరమౌతాయి. మౌఖిక వాఙ్మయం వ్యక్తిగత సృష్టి- లిపి సామూహిక సృష్టి. బహుశా తెలుగు లిపికి ఈ విధమైన రూపకల్పన, అధికార ముద్ర శాతవాహనుల కాలం చివరి నుండి విష్ణుకుండినుల కాలం మధ్య ఏర్పడి ఉండవచ్చు. విష్ణుకుండినుల కాలంలోనూ తరువాత ఆంధ్రదేశాన్ని ఏలిన రాజులకాలం లోనూ తెలుగు లిపి పరిపుష్టంగా శాసనాలలో కనబడుతూ ఉంది. తెలుగువాడైన శాతవాహన రాజైన హాలుడు క్రీ.శ. మొదటి శతాబ్దంలో గ్రామీణ ప్రజలు పాడుకుంటూ ఉండిన ఏడు నూర్ల గాథలను ‘గాథాసప్తశతి’ పేరుతో సంకలనం చేశాడు. ఆ గాథలన్నీ ప్రాకృత భాషలో ఉన్నాయి. గ్రామీణ ప్రజలకు ప్రాకృత భాషతో పని ఏమి? వారు ఆ గాథలను తెలుగులోనే రచించి ఉంటారు. ఒక విధంగా చూస్తే ఇదే తెలుగు భాషలోని ప్రథమ వాఙ్మయం- మౌఖికం. హాలుడు ఆ గాథలలోని సౌందర్యానికి ముగ్ధుడై వాటిని ప్రాకృత భాషలోనికి (రాజభాషలోనికి) ఆర్యావృత్తాల లోనికి అనువదించి ఉంటాడు. ఆనాడే గనుక తెలుగు భాషకు లిపి ఉండుంటే, హాలుడు ఆ గాథలను తెలుగులోనే యథాతథంగా తెలుగు గ్రామీణులు రచించిన ఛందస్సులోనే గ్రంథస్థం చేసి ఉండుంటే, తెలుగు భాషను రాజభాషగా చేసుకొని ఉండుంటే, ఈనాడు భారతఖండంలో తెలుగు యొక్క ప్రాబల్యమూ, తెలుగు వారి యొక్క కవితా వైభవమూ ఎంతో ఉజ్జ్వలంగా ఉండేవి. (చరిత్ర, తెలుగు, సంస్కృతం మీద సాధికారత ఉన్న కరణం బాలసుబ్రహ్మణ్య పిళ్ళె ‘తెలుగు: ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా?’ చిరుపొత్తం రాశారు. అందులోని కొన్ని భాగాలే పై వ్యాసం.) -
బోయకొట్టములు పండ్రెండు
ఇప్పుడేం చదువుతున్నారు? - కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్లె ‘... ప్రభు పండరంగు బంచిన సామంత పదువతో బోయ కొట్టము ల్వండ్రెండు గొని వేంగినాటి గొఱల్బియ త్రిభువనాంకుశ బాణ నిల్పి. కట్టెపు దుర్గంబు కడు బయల్సేసి కందుకుర్బెజవాడ గావించె మెచ్చి...’ ఇవి దాదాపు పన్నెండు వందల ఏళ్ల క్రితం... ఇంకా ఇప్పటి రూపం తీసుకోని చాళుక్య తెలుగు లిపిలో, గుండ్లకమ్మ నదీతీరాన అద్దంకి (అణ్దెక్కి) వేయి స్తంభాల ఆలయ పరిసరాల్లో లభించిన ఓ శిలా శాసనంలోని పద్యపాదాలు. ఎవరీ పండరంగడు? ఎక్కడివీ బోయకొట్టములు? ఈ ‘కట్టెపు దుర్గంబు’ కథాకమామిషు ఏమిటి?’ అందునా ఈ శాసనం పద్యరూపంలో ఉండటమేమిటి? ఆదికవిగా పిలవబడుతున్న నన్నయకు పూర్వం పద్యమెలా ఉండేది? దేశి కవిత ఏమిటి? తెలుగు మాతృభాష కాని ఓ మహరాజు తెలుగువారిని తెలుగు పద్య సృష్టికి ప్రేరేపించడమేమిటి? వీటన్నింటికీ అంగీకారయుక్తమైన జవాబులు చెప్పే రచన ‘బోయకొట్టములు పండ్రెండు’. History is a bunch of answers which are Hypothetical, to the questions posed about unknown past... ఆ శాసనం ద్వారా ‘పన్నెండు బోయకొట్టములను, పండరంగడనేవాడు యుద్ధంలో గెల్చి, నేలమట్టం చేసి, కందుకూరు బెజవాడల మల్లె చదును చేసేశాడు’ అని మాత్రమే తెలుస్తుంది. ఆ సదరు పండరంగడనేవాడు గర్వాతిశయంతో బోయకొట్టములు చదును చేసి పారేసినానని శాసనంలో చెక్కించాడంటే అదేదో గొప్ప యుద్ధమై ఉండవలె... ఆ కొట్టముల బోయలు బహు పరాక్రమవంతులై ఉండవలె... అయితే ఆ బోయలెక్కడివారు? ఈ శాసనం చెక్కించిన పండరంగడెవరు? అన్నవి అత్యంత సహజంగా తలెత్తే ప్రశ్నలు. ఆ ప్రశ్నలు అంతే సహజంగా ఆ శాసనాన్ని చూసిన సుబ్రహ్మణ్యం పిళ్లెగారిలో తలెత్తాయి. జవాబులుగా దాదాపు 300 పేజీల నవల పుట్టుకొచ్చింది. ఆ ప్రశ్నల్లో ఒకటి సాహితీ సంబంధి. శాసనం ‘తరువోజ’ ఛందస్సులో ఉంది. కాలమా నన్నయకు పూర్వం... అంటే తెలుగు పద్యం నన్నయకు పూర్వమే ఊపిరి పోసుకుని, తరువోజ, సీసం, తేటగీతి, ఆటవెలది, మధ్యాక్కరల రూపంలో అస్తిత్వం కలిగుంది. దానికీ సమాధానాలు... దాదాపు సత్యానికి కొన్ని ఇంచీల దూరంలో ఉన్నట్టనిపించే కథనం ఇందులో. అంత బలవంతులైన బోయలెక్కడివారు? చాళుక్య, పల్లవ రాజుల యుద్ధాల మధ్య నలిగి అలసిన నల్లమల ప్రాంతపువారై త్రిపురాంతకం నించీ కందుకూరు, అద్దంకికి వలస వచ్చినవారు... వారికో నాయకుడు కావాలి గదా? యుద్ధాల మధ్య వికలాంగుడైన ఓ మధ్య వయస్కుడైన బోయ... వాడికో పేరు కట్టెం వీరబోయడు... వాడి భార్య మంగసాని... చాలు కథ మొదలైంది. కొన్ని తరాలు గడిచింది. ప్రేమలూ, ద్వేషాలూ, ఆప్యాయతలూ, రాజభక్తీ, శౌర్యం, రాజకీయపుటెత్తులూ, పగా, ప్రతీకారాలూ, యుద్ధాలూ, చిట్టచివరికి సర్వనాశనం... అద్భుత కథనం... చరిత్రలో కేవలం ఒకే ఒక వాక్యంగా మిగిలిన తరాల కథ... చెక్ రచయిత మిలన్ కుందేరా ‘ఇమ్మార్టాలిటీ’ అన్న నవల ఒక స్త్రీ ఆంగికం... కేవలం ఒక్క శారీరక కదలికలోంచీ పుట్టుకొచ్చిన 350 పేజీల నవల... తెలుగు సాహిత్యంలో ఇంతటి సృజన కలిగిన వారి గురించి ఆలోచిస్తున్న సమయాన, ఓ శాసన వాక్యం నించీ ‘బోయ కొట్టములు పండ్రెండు’ నవల రచించిన కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్లెగారు ఇదుగో నేనున్నానన్నారు. జయహో! - కాశీభట్ల వేణుగోపాల్ ఫోన్: 9550079473
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
వెళ్తూ వెళ్తూ...!
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
కేకేఆర్తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement