-
రబాడను ఎదుర్కొనేందుకు రోహిత్ స్పెషల్ ప్లాన్..
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలని భారత జట్టు వ్యహాలు రచిస్తోంది. తొలి టెస్టులో ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. శనివారం టీమిండియా నెట్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది. ఈ ప్రాక్టీస్ సెషన్కు భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ డుమ్మా కొట్టారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం నెట్స్లో తీవ్రంగా శ్రమించాడు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడను ఎదుర్కొనేందుకు హిట్మ్యాన్ ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. భారత పేసర్ ముఖేష్ కుమార్ బౌలింగ్లో రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దాదాపు రెండు గంటల పాటు ముఖేష్ బౌలింగ్ను రోహిత్ ఎదుర్కొన్నాడు. ముఖేష్ బౌలింగ్లో ఎక్కువగా లెంగ్త్ బాల్స్ను రోహిత్ ప్రాక్టీస్ చేశాడు. కాగా గత కాలంగా రబాడ బౌలింగ్ను ఎదుర్కొవడానికి శర్మ ఇబ్బంది పడుతున్నాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్లలో కూడా రబాడ బౌలింగ్లోనే ఔటయ్యాడు. ఇప్పటివరకు 14 సార్లు హిట్మ్యాన్ను రబాడ ఔట్ చేశాడు. ఇక జనవరి 3 నుంచి కేప్టౌన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్కు రవీంద్ర జడేజా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. జడ్డూ పూర్తి ఫిట్నెస్ సాధించి నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. చదవండి: ఐపీఎల్ ఒలింపిక్స్తో సమానం.. చాలా సంతోషంగా ఉంది: లక్నో హెడ్ కోచ్ -
చెలరేగిన ప్రొటిస్ పేసర్లు.. రోహిత్ సేన ఘోర పరాజయం.. ఈసారీ లేనట్లే
సౌతాఫ్రికాలో టీమిండియాకు మరోసారి పరాభవం ఎదురైంది. ఇంత వరకు సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవని భారత జట్టు ఈసారి కూడా అవకాశాన్ని చేజార్చుకుంది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ మీద 32 పరుగుల తేడాతో ఓడి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. సొంతగడ్డపై టీమిండియాపై మరోసారి ఆధిపత్యం చాటుకున్న సౌతాఫ్రికా మూడో రోజే ఆటను ముగించి సత్తా చాటింది. ప్రొటిస్ సెంచరీ హీరో డీన్ ఎల్గర్(185) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మంగళవారం మొదలైన బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కఠినమైన సెంచూరియన్ పిచ్పై ప్రొటిస్ పేసర్ల విజృంభణతో భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. స్టార్ బ్యాటర్లు, అనుభవజ్ఞులు అయిన ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(5), విరాట్ కోహ్లి(38) విఫలం కావడం ప్రభావం చూపింది. అయితే, ఆరో నంబర్లో బ్యాటింగ్కు దిగిన కేఎల్ రాహుల్ అసాధారణ పోరాటం కనబరిచాడు. అర్ధ శతకంతో రాణించి తొలి రోజు ఆటను ముగించాడు. అయితే రెండో రోజు ఆట సందర్భంగా సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ నండ్రీ బర్గర్ బౌలింగ్లో బౌల్డ్ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ చరమాంకానికి చేరుకుంది. 67.4 ఓవర్లలో కేవలం 245 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్ డీన్ ఎల్గర్ అదిరిపోయే ఆరంభం అందించాడు. అతడికి తోడుగా అరంగేట్ర బ్యాటర్ బెడింగ్హామ్ అర్ధ శతకం (56)తో రాణించాడు. ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 66 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. 11 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఇక మూడో రోజు ఆటలో భాగంగా 408 పరుగులకు ఆలౌట్ అయి ఆధిక్యాన్ని 163 పరుగులకు పెంచుకుంది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాను ప్రొటిస్ పేసర్లు దెబ్బకొట్టారు. కగిసో రబడ రోహిత్ శర్మను డకౌట్ చేసి శుభారంభం అందించగా.. నండ్రీ బర్గర్ యశస్వి జైస్వాల్(5)ను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత శుబ్మన్ గిల్(26)ను పెవిలియన్కు పంపిన మార్కో జాన్సెన్.. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్(6)ను కూడా అవుట్ చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి ఆచితూచి నిలకడగా ఆడాడు. అయితే, కేఎల్ రాహుల్(4) అవుటైన తర్వాత టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనం వేగం పుంజుకుంది. రాహుల్ను అవుట్ చేసిన మరుసటి బంతికే బర్గర్.. అశ్విన్ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత రబడ శార్దూల్ ఠాకూర్ వికెట్ను తన ఖాతాలో వేసుకోగా.. కోహ్లితో సమన్వయ లోపం కారణంగా బుమ్రా రనౌట్ అయ్యాడు. సిరాజ్ 4 పరుగులకే పెవిలియన్ చేరగా.. ప్రసిద్ కృష్ణ క్రీజులోకి వచ్చాడు. అయితే, 34.1వ ఓవర్ వద్ద మార్కో జాన్సెన్ బౌలింగ్లో కోహ్లి రబడకు క్యాచ్ అవ్వడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రీ బర్గర్ నాలుగు వికెట్లు తీయగా.. రబడకు రెండు, మార్కో జాన్సెన్కు మూడు వికెట్లు దక్కాయి. బుమ్రా రనౌట్లో ఎల్గర్, రబడ పాలు పంచుకున్నారు. .@imVkohli brings up his 5️⃣0️⃣ He came out in the middle with all guns blazing countering the fiery 🇿🇦 bowling attack 🔥 Will the 👑 go on & convert it into a big one? Tune in to #SAvIND 1st Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/edhPpCavOi — Star Sports (@StarSportsIndia) December 28, 2023 -
టీమిండియాతో తొలి టెస్టు.. రబాడ అరుదైన ఘనత! కేవలం 28 ఏళ్లకే
సెంచూరియన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న బ్యాక్సింగ్ డే టెస్టులో దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ నిప్పులు చేరుగుతున్నాడు. తొలి రోజు ఏకంగా 5 వికెట్లు పడగొట్టి భారత్ను బ్యాక్ఫుట్లో ఉంచాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, శార్ధూల్ ఠాకూర్ వంటి కీలక వికెట్లను రబాడ పడగొట్టాడు. ఈ క్రమంలో రబాడ ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లు తీసిన ఎలైట్ బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో రబాడ 39వ స్ధానంలో నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో శార్ధూల్ ఠాకూర్ను ఔట్ చేసిన ఈ సఫారీ సూపర్ స్టార్.. ఈ అరుదైన తన పేరిట లిఖించుకున్నాడు. కేవలం 28 ఏళ్లకే రబాడ ఈ ఘనత సాధించడం విశేషం. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో దక్షిణాఫ్రికా తరుపున అత్యధిక వికెట్లు తీసిన ఏడో బౌలర్గా రబాడ రికార్డులకెక్కాడు. దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు.. షాన్ పొలాక్ – 829 వికెట్లు డేల్ స్టెయిన్ – 699 మఖాయ ఎంతిని – 662 అలాన్ డోనాల్డ్ – 602 జాక్వెస్ కలిస్ – 577 మోర్నీ మోర్కెల్ – 544 కగిసో రబడ – 500* -
ముగిసిన తొలి రోజు ఆట.. నిప్పులు చేరిగిన రబాడ! రాహుల్ క్లాసీ ఇన్నింగ్స్
సెంచూరియన్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటముగిసింది. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 59 ఓవర్లు ఆట మాత్రమే సాధ్యమైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(70 బ్యాటింగ్), సిరాజ్ ఉన్నారు. అయితే మొదటి రోజు దక్షిణాఫ్రికా బౌలర్లు భారత్పై పైచేయి సాధించారు. ముఖ్యంగా స్టార్ పేసర్ రబాడ ఐదు వికెట్లతో చెలరేగాడు. రబాడతో పాటు బర్గర్ రెండు, జానెసన్ ఒక వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో రాహుల్తో పాటు విరాట్ కోహ్లి(38), శ్రేయస్ అయ్యర్(31) పరుగులతో పర్వాలేదన్పించారు. కాగా ఈ మ్యాచ్లో జైశ్వాల్(17),రోహిత్ శర్మ(5), గిల్(2) తీవ్ర నిరాశపరిచారు. రాహుల్ క్లాసీ ఇన్నింగ్స్.. భారత ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికీ.. రాహుల్ ఆచితూచి ఆడుతూ టీమిండియా స్కోర్ 200 పరుగుల దాటడంలో కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు నిప్పులు చేరుగుతున్న చోట రాహుల్ క్లాసీ ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: #KL Rahul: రబాడ బౌన్సర్ల వర్షం.. అయినా గానీ! శెభాష్ రాహుల్ -
రోహిత్ శర్మను ట్రాప్ చేసిన రబాడ.. వీడియో వైరల్
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశ పరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి రోహిత్ తొలి వికెట్గా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా పేసర్ రబాడ ట్రాప్ చేసి మరి హిట్మ్యాన్ను పెవిలియన్ పంపాడు. ఫైన్ లెగ్లో ఫీల్డర్ను పెట్టి రోహిత్కు షార్ట్ బాల్ను రబాడ సంధించాడు. ఈ క్రమంలో భారీ షాట్కు ప్రయత్నించిన రోహిత్.. ఫైన్ లెగ్ ఫీల్డర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో చేసేదేమి లేక రోహిత్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా వన్డే వరల్డ్కప్-2023 ఓటమి అనంతరం రోహిత్కు ఇదే తొలి మ్యాచ్. కాగా టెస్టుల్లో రోహిత్ను రబాడ ఔట్ చేయడం ఇది 13వ సారి కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్(5), జైశ్వాల్(17), గిల్(2) తీవ్ర నిరాశపరిచారు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్ను విరాట్ కోహ్లి(15), శ్రేయస్ అయ్యర్(9) చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 16 ఓవర్లకు భారత్ స్కోర్: 50/3. చదవండి: Adudam Andhra: ఏపీ క్రీడా సంబురం: టాలెంట్ హంట్లో CSK! ప్రణాళికాబద్ధంగా జగన్ ప్రభుత్వం Rohit Sharma Gone 💔 Early break through for SA#RohitSharma #AUSvsPAK #INDvsSA #ShubmanGill pic.twitter.com/R9gGwcz1qh — Ali Khan (@ProPakistanii7) December 26, 2023 -
Ind vs SA: అతడి నుంచి ఎక్కువగా ఆశించొద్దు: మాజీ ఓపెనర్
IND vs SA Test Series 2023: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్పై అంచనాలు పెంచుకోవద్దని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. సఫారీ పిచ్లపై బ్యాటింగ్ చేయడం అత్యంత సవాలుతో కూడుకున్నదని.. గత ప్రదర్శన ఆధారంగా యశస్విపై ఆశలు పెట్టుకోవద్దని పేర్కొన్నాడు. కాగా వెస్టిండీస్ పర్యటన సందర్భంగా యశస్వి జైశ్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విండీస్తో తొలి మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ 21 ఏళ్ల లెఫ్టాండర్.. సెంచరీతో చెలరేగాడు. అరంగేట్రంలోనే సెంచరీ కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్గా బరిలోకి దిగి 171 పరుగులు సాధించి అనేక రికార్డులు సృష్టించాడు. విండీస్పై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక రెండో టెస్టులోనూ అర్ధ శతకం(57)తో ఆకట్టుకున్న యశస్వి.. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ సందర్బంగా మొత్తంగా 266 పరుగులతో సత్తా చాటాడు. రెగ్యులర్ ఓపెనర్ శుబ్మన్ గిల్ వన్డౌన్లో ఆడటంతో ఓపెనర్గా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లోనూ అడుగుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇదిలా ఉంటే.. యశస్వి టీమిండియాతో పాటు ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో అంత ఈజీ కాదు.. ఎందుకంటే ప్రొటిస్తో టీ20 సిరీస్ అనంతరం డిసెంబరు 26 నుంచి మొదలుకానున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సన్నద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా అతడు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో.. మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘వెస్టిండీస్.. సౌతాఫ్రికా పరిస్థితులు పూర్తి భిన్నమైనవి. సఫారీ పిచ్లపై భారత బ్యాటర్లకు కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి. నిజానికి వెస్టిండీస్ పిచ్లు కాస్త ఉప ఖండపు పిచ్లను పోలి ఉంటాయి. ప్రొటిస్ పేసర్లను ఎదుర్కోవడం కష్టం కానీ సఫారీ గడ్డపై పేస్ దళం అటాకింగ్ను తట్టుకోవడం కష్టం. ముఖ్యంగా మార్కో జాన్సెన్, కగిసో రబడ, లుంగి ఎంగిడి, నండ్రే బర్గర్ వేసే బంతులను ఎదుర్కోవడం అత్యంత కష్టం. యశస్వి ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్ షాట్లు అద్భుతంగా ఆడతాడనడంలో సందేహం లేదు. అయితే, సౌతాఫ్రికాలో అతడికి అంత ఈజీ కాదు. మంచి ఎక్స్పీరియన్స్ మాత్రం వస్తుంది. అతడు ఇంకా యువకుడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రికెటర్. అతడిపై భారీగా అంచనాలు పెట్టుకోవద్దు. సౌతాఫ్రికాతో మ్యాచ్లోనూ సెంచరీ, డబుల్ సెంచరీ బాదాలని కోరుకోకూడదు’’ అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. చదవండి: Ind W vs Aus W: ఆసీస్ను చిత్తు చేసిన భారత్.. సరికొత్త చరిత్ర -
టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు సౌతాఫ్రికాకు షాక్!
South Africa vs India- Test Series: టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు సౌతాఫ్రికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. సఫారీ స్టార్ పేసర్ కగిసో రబడ మడిమ నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో భారత్తో సిరీస్కు ముందు దేశవాళీ క్రికెట్ ఆడాలన్న తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. కెప్టెన్ తెంబా బవుమా కూడా ముందుగా అనుకున్నట్లు ఫస్ట్క్లాస్ క్రికెట్ మ్యాచ్లో ఆడటం లేదు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా దేశవాళీ జట్టు లయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఒక్కసారైనా గెలవాలని పరిమిత ఓవర్ల క్రికెట్ను మినహాయిస్తే భారత జట్టు సఫారీ గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. ఈసారి.. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. వరల్డ్కప్-2023 ఫైనల్ ఓటమి బాధలో ఉన్న అభిమానులకు చారిత్రాత్మక గెలుపుతో ఊరటనివ్వాలని భావిస్తోంది. మరోవైపు.. ప్రొటిస్ జట్టు సైతం సొంతగడ్డపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ భారత్పై పైచేయి సాధించాలనే తలంపుతో ఉంది. దీంతో ఈసారి టీమిండియా- సౌతాఫ్రికా టెస్టు సిరీస్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బవుమా అలా.. గాయంతో రబడ ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ తెంబా బవుమా టీ20, వన్డే సిరీస్లకు దూరం అయ్యాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్తో పునరాగమనం చేయాలని భావిస్తున్న బవుమా.. అంతకంటే ముందు ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడి పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని భావించాడు. కెప్టెన్తో పాటు పేసర్ రబడ కూడా డొమెస్టిక్ టీమ్ లయన్స్ తరఫున ఆడాలని నిశ్చయించుకున్నాడు. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా బవుమా తన నిర్ణయాన్ని మార్చుకోగా.. రబడ గాయం తాలుకు నొప్పి కారణంగా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో డాల్ఫిన్స్ జట్టుతో తాము ఆడాల్సిన మ్యాచ్కు వీరిద్దరు అందుబాటులో ఉండటం లేదని లయన్స్ టీమ్ గురువారం ప్రకటించింది. కాగా వన్డే వరల్డ్కప్-2023లో ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా.. రబడ గాయపడ్డాడు. నాటి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్లో కేవలం ఆరు ఓవర్లు బౌలింగ్ చేసి 41 పరుగులు ఇచ్చాడు రబడ. అయితే, అతడు ఇంతవరకు పూర్తిగా కోలుకోలేదు. మరోవైపు.. అన్రిచ్ నోర్జే కూడా గాయం వల్ల చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. చదవండి: రితిక జోలికి వస్తే ఊరుకోను.. నాడు రోహిత్కు యువీ వార్నింగ్! ఆమెతో నాకేం పని అంటూ.. -
పాక్కు పరీక్ష! నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా.. అలీ స్థానంలో అతడే!
ICC ODI WC 2023- Pak Vs SA: వన్డే వరల్డ్కప్-2023 సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో సౌతాఫ్రికాను తొలుత బౌలింగ్కు ఆహ్వానించింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘‘మేము ముందు బ్యాటింగ్ చేస్తాం. ఇక నుంచి ప్రతీ మ్యాచ్ మాకు అత్యంత ముఖ్యమైనదే. ప్రతీ విభాగంలోనూ మేము మెరుగుపడాల్సి ఉంది. ముఖ్యంగా ఫీల్డింగ్ లోపాలు సరిచేసుకోవాలి. నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నా ఈ విషయాలన్నిటి గురించి అంతా కూర్చుని చర్చించుకున్నాం. నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నాను’’ అని పేర్కొన్నాడు. ఇక ప్రొటిస్ జట్టుతో మ్యాచ్కు హసన్ అలీ అనారోగ్యం కారణంగా దూరం కాగా.. వసీం జూనియర్ తుదిజట్టులోకి వచ్చినట్లు బాబర్ తెలిపాడు. మూడు మార్పులతో సౌతాఫ్రికా ఇక ఇప్పటి వరకు నెదర్లాండ్స్ చేతిలో తప్ప ఓటమన్నది ఎరుగని సౌతాఫ్రికా.. మరో భారీ విజయంపై కన్నేయగా.. హ్యాట్రిక్ ఓటములకు చెక పెట్టాలని పాక్ భావిస్తోంది. ఈ శతాబ్దం ఆరంభం నుంచి ప్రొటిస్ జట్టుపై తమకున్న ఆధిపత్యాన్ని మరోసారి చాటుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా పాక్తో మ్యాచ్లో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా.. తబ్రేజ్ షంసీ, లుంగి ఎంగిడి కూడా టీమ్తో చేరారు. రీజా హెండ్రిక్స్, కగిసో రబడ, లిజాద్ విలియమ్స్ దూరం కావడంతో ఈ ముగ్గురు రీఎంట్రీ ఇచ్చారు. పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా తుదిజట్లు పాకిస్తాన్ అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, హారిస్ రవూఫ్. సౌతాఫ్రికా క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), తెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంసీ, లుంగి ఎంగిడి . చదవండి: WC 2023: ఎవరు ఏం చెప్పినా వినాలి.. కెప్టెన్గా నేనున్నాంటే: రోహిత్ శర్మ -
WC 2023: చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు.. ఆసీస్కు ఘోర పరాభవం! వరుసగా రెండో‘సారీ’
ICC Cricket World Cup 2023- Australia vs South Africa, 10th Match: వన్డే వరల్డ్కప్-2023లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభం నుంచే షాకుల మీద షాకులిచ్చింది సౌతాఫ్రికా. ప్రొటిస్ బౌలర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. ముఖ్యంగా పేసర్ కగిసో రబడ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన కంగారూ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఆరో ఓవర్ ఐదో బంతికి మిచెల్ మార్ష్(7)ను మార్కో జాన్సెన్ అవుట్ చేయడంతో మొదలైంది ఆసీస్ వికెట్ల పతనం. ఆ తర్వాత ఎంగిడి బౌలింగ్లో డేవిడ్ వార్నర్(13), రబడ బౌలింగ్లో స్మిత్(19) ఎల్బీడబ్ల్యూ, జోష్ ఇంగ్లిస్ను బౌల్డ్ కాగా.. మహరాజ్ బౌలింగ్లో మాక్స్వెల్(3) క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మళ్లీ రంగంలోకి దిగిన రబడ స్టొయినిస్(5)ను అవుట్ చేయడంతో ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి దశలో మార్నస్ లబుషేన్కు తోడుగా టెయిలెండర్ మిచెల్ స్టార్క్(51 బంతుల్లో 27 పరుగులు) పట్టుదలగా క్రీజులో నిలబడిన వేళ మార్కో జాన్సెన్ దెబ్బకొట్టాడు. ఆ వెంటనే 46 పరుగులతో నిలకడగా ఆడుతున్న లబుషేన్ను కేశవ్ మహరాజ్ పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. నాలుగు బౌండరీల సాయంతో 22 పరుగులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, 41వ ఓవర్ మూడో బంతికి తబ్రేజ్ షంసీ బౌలింగ్లో కమిన్స్ ఇచ్చిన క్యాచ్ను మిల్లర్ ఎలాంటి పొరపాటు చేయకుండా ఒడిసిపట్టాడు. దీంతో షంసీ ఖాతాలో వరల్డ్కప్ క్రికెట్లో తొలి వికెట్ చేరింది. అదే ఓవర్లో హాజిల్వుడ్ను కూడా షంసీ అవుట్ చేయడంతో ఆసీస్ కథ ముగిసిపోయింది. 177 పరుగులకే ఆలౌట్ కావడంతో సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 134 పరుగులు భారీ తేడాతో ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ప్రొటిస్ పేసర్లలో రబడకు మూడు, జాన్సెన్కు రెండు, లుంగి ఎంగిడికి ఒక వికెట్ దక్కగా.. స్పిన్నర్లు కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంసీ చెరో రెండు వికెట్లు తీశారు. డికాక్ సెంచరీతో.. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం వేదికగా గురువార నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. కంగారూ జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన ప్రొటిస్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఓపెనర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్వింటన్ డికాక్ వన్డే వరల్డ్కప్-2023లో వరుసగా రెండో శతకం(109) నమోదు చేయగా.. నాలుగో నంబర్ బ్యాటర్ ఎయిడెన్ మార్కరమ్ 56 పరుగులతో రాణించాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టడంతో భారీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. కాగా ఈ మెగా టోర్నీ తాజా ఎడిషన్లో ఆసీస్కు ఇది వరుసగా రెండో పరాజయం.తొలుత చెన్నైలో టీమిండియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. -
కొడుకు వరల్డ్కప్లో ఆడుతున్నాడు.. టీమిండియాకు తండ్రి సపోర్టు! రోహిత్ జెర్సీతో
ICC ODI WC 2023: సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగింది టీమిండియా. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆస్ట్రేలియాతో తమ ఆరంభ మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో అభిమానులు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ చెబుతూ భారత జట్టును విష్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. తన కుమారుడు ప్రపంచకప్-2023లో ఈవెంట్లో ఆడుతున్న తరుణంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మద్దతుగా నిలుస్తూ.. హిట్మ్యాన్పై అభిమానం చాటుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే.. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ తండ్రి ఎంఫో రబడ. ‘‘ఈరోజు టీమిండియాకు నా మద్దతు’’ అంటూ రోహిత్ శర్మ పేరిట జెర్సీని ధరించి భారత జట్టును విష్ చేశాడు. రబడ తండ్రి చేసిన ప్రయత్నం రోహిత్ ఫ్యాన్స్తో పాటు టీమిండియా అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా తన తనయుడు కగిసో రబడకు చీర్ చేసేందుకు ఎంఫో రబడ భారత్కు వచ్చాడు. ఢిల్లీలో సౌతాఫ్రికా- శ్రీలంక మధ్య శనివారం నాటి మ్యాచ్కు హాజరై.. తన కుమారుడికి మద్దతు తెలిపాడు. కాగా లంకపై ప్రొటిస్ జట్టు ఏకంగా 102 పరుగుల తేడాతో గెలుపొంది ఘనంగా ఐసీసీ ఈవెంట్ను ఆరంభించింది. ఈ మ్యాచ్లో రబడ 7.5 ఓవర్ల బౌలింగ్లో 50 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక నవంబరు 5న టీమిండియా- సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగనుంది. మరి అప్పుడు ఎంఫో రబడ ఏం చేస్తాడో చూడాలి అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: #Ducks: ఆనందం కాసేపు కూడా లేదు! నువ్వేం కెప్టెన్? గోల్డెన్ డక్ బాయ్ నువ్వేమో.. -
అప్పుడలా! ఈసారి మాత్రం వరల్డ్కప్ ట్రోఫీ మాదే: సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్
అప్పటి దాకా అదరగొట్టడం... అభిమానుల్లో అంచనాలు పెంచేయడం... మేజర్ ఈవెంట్లలో కీలక సమయంలో చేతులెత్తేయడం.. కనీసం ఫైనల్ కూడా చేరలేక చతికిలపడటం.. మీరు ఊహించిన పేరు నిజమే! ఈ ప్రస్తావన సౌతాఫ్రికా గురించే! 1992 నుంచి వరల్డ్కప్ టోర్నీలో పోటీపడుతున్న దక్షిణాఫ్రికా ఇంత వరకు ఒక్క వన్డే ట్రోఫీ కూడా గెలవలేదు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లలో విజయం అంచులదాకా వెళ్లి బోల్తా పడటం.. ‘చోకర్స్’ అనే ‘నామధేయం’ తమకు సరిగ్గా సరిపోతుందని మళ్లీ మళ్లీ నిరూపించుకోవడం ప్రొటిస్కు బాగా అలవాటు. ఈసారి ట్రోఫీ గెలుస్తాం అయితే, ఈసారి ఆ అపఖ్యాతిని కచ్చితంగా చెరిపేసుకుంటాం అంటున్నాడు సౌతాఫ్రికా స్పీడ్స్టర్ కగిసో రబడ. ప్రపంచకప్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా భారత్లో బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు జరగనిది.. ఇప్పుడు చేసి చూపిస్తామంటూ ధీమా వ్యక్తం చేశాడు. ప్రొటిస్ పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న 28 ఏళ్ల రబడ ఈ మేరకు మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా క్రికెట్ గురించి బయట నడుస్తున్న డ్రామా, చర్చల గురించి మేము అస్సలు పట్టించుకోము. నిజమే ప్రపంచకప్ టోర్నీల్లో ఆడుతూ.. ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోతే ఎలా ఉంటుందో తెలుసు. ప్రతి క్రికెటర్ కల అదే! తీవ్రమైన నిరాశ కలుగుతుంది కదా! ఈ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈసారి దానిని సాధ్యం చేసి చూపించాలని నేను... మేమంతా బలంగా కోరుకుంటున్నాం. వరల్డ్కప్ ట్రోఫీ గెలవడం ఎవరికైనా ఇష్టమే కదా! ప్రతి ఒక్క క్రికెటర్ కల అదే! ఒక్కసారి జట్టును ప్రకటిస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు’’ అంటూ ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు. కాగా ఇప్పటి వరకు నాలుగుసార్లు వరల్డ్కప్ సెమీస్ వరకు చేరుకున్న సౌతాఫ్రికా ఒక్కసారి కూడా ముందడుగు వేయలేకపోయింది. అప్పుడలా.. ఆఖరిగా.. 2019 వరల్డ్కప్లో మాంచెస్టర్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 10 పరుగుల తేడాతో గెలిచి.. విజయంతో టోర్నీని ముగించింది. అయితే, ఈసారైనా కప్ గెలుస్తారంటూ.. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు మాత్రం ఫాఫ్ డుప్లెసిస్ బృందం నిరాశనే మిగిల్చింది. ఇదిలా ఉంటే.. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్కప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే! చదవండి: టీమిండియా క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్! -
ఐపీఎల్ 2023లో ఫ్లాప్ అయిన టాప్-5 విదేశీ ఆటగాళ్లు
రెండు నెలలుగా అభిమానులను అలరించిన ఐపీఎల్ 16వ సీజన్ ఈ వారంతో ముగియనుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్కింగ్స్, లక్నోసూపర్జెయింట్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్కు చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం(మే 23న) క్వాలిఫయర్-1లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ అమితుమీ తేల్చుకోనున్నాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెడితే.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఇక ఎలిమినేటర్ పోరులో లక్నో, ముంబై తలపడనున్నాయి. ఈ విషయం పక్కనబెడితే ఐపీఎల్ 16వ సీజన్ విదేశీ ఆటగాళ్లకంటే దేశవాలీ ఆటగాళ్లనే ఎక్కువగా వెలుగులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరకే అమ్ముడయిన చాలా మంది ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రింకూ సింగ్, ప్రభ్సిమ్రన్ సింగ్, అథర్వ టైడే, తుషార్ దేశ్పాండే, యశస్వి జైశ్వాల్, మతీషా పతీరానా సహా చాలా మంది ఉన్నారు. వీరిని మినహాయిస్తే ఐపీఎల్ 2023 సీజన్కు కోట్లు పెట్టి కొనుక్కున్న విదేశీ ఆటగాళ్లలో చాలా మంది దారుణంగా విఫలమయ్యారు. కొందరు గాయాలతో సీజన్కు దూరంగా ఉంటే.. అవకాశాలు ఇచ్చినా ఆడడంలో ఫెయిలయ్యారు. మరి ఐపీఎల్ 16వ సీజన్లో అత్యంత ఎక్కువ ధర పలికి ఫ్లాప్ షో కనబరిచిన టాప్-5 విదేశీ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం. బెన్ స్టోక్స్(సీఎస్కే): Photo: IPL Twitter ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ సీఎస్కే తరపున రెండు మ్యాచ్లు మాత్రమే ఆడి కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్లో ఒక ఓవర్ వేసి 18 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. అసలు సీజన్ ఆరంభానికి ముందు బెన్ స్టోక్స్ సీఎస్కేకు కీలకంగా మారతాడని అంతా అనుకున్నారు. కానీ గాయం కారణంగా అతను రెండు మ్యాచ్లకు మాత్రమే పరిమితమయ్యాడు. తర్వాత కోలుకున్నప్పటికి స్టోక్స్ను జట్టులోకి తీసుకోవడానికి మొగ్గు చూపలేదు. అలా రెండు మ్యాచ్లకు మాత్రమే పరిమితమైన స్టోక్స్ ఐర్లాండ్తో టెస్టుమ్యాచ్ కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు. ఐపీఎల్ మినీ వేలంలో సీఎస్కే బెన్ స్టోక్స్ను రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్): Photo: IPL Twitter జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో జోఫ్రా ఆర్చర్ ముంబై ఇండియన్స్ బౌలింగ్లో కీలకంగా వ్యవహరిస్తాడని అనుకున్నారు. కీలకంగా మారడం అటుంచి తన ప్రదర్శనతో జట్టుకు భారమయ్యాడు. సీజన్లో కేవలం ఐదు మ్యాచ్లు మాత్రమే ఆడిన ఆర్చర్ 9.50 ఎకానమీతో పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత గాయంతో ఐపీఎల్ నుంచే వైదొలిగాడు. ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన వారిలో ఆర్చర్ ఒకడిగా మిగిలిపోయాడు. హ్యారీ బ్రూక్(ఎస్ఆర్హెచ్): Photo: IPL Twitter ఐపీఎల్ ఆరంభానికి ముందు హ్యారీ బ్రూక్పై మంచి అంచనాలున్నాయి. ఎస్ఆర్హెచ్ ఏరికోరి బ్రూక్ను రూ. 13.35 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ తన ధరకు బ్రూక్ ఏ విధంగానూ న్యాయం చేయలేకపోయాడు. ఆడిన 11 మ్యాచ్ల్లో ఒక సెంచరీ సాయంతో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. తొలి అంచె పోటీల్లో అన్ని మ్యాచ్లు ఆడిన బ్రూక్ తర్వాత అంచె పోటీల్లో కేవలం మూడు మ్యాచ్లకే పరిమితమయ్యాడు. టెస్టుల్లోనే విధ్వంసకర ఇన్నింగ్స్లతో చెలరేగిన బ్రూక్ ఐపీఎల్లో మాత్రం ఫ్లాప్ షో చేశాడు. కగిసో రబాడ(పంజాబ్ కింగ్స్): Photo: IPL Twitter కగిసో రబాడ అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా తరపున టాప్ బౌలర్. అతని వైవిధ్యమైన పేస్తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టాడు. అలాంటి రబాడ ఐపీఎల్లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సీజన్లో ఆరు మ్యాచ్లాడిన రబాడ ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. సామ్ కరన్(పంజాబ్ కింగ్స్): Photo: IPL Twitter ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా సామ్ కరన్ చరిత్ర సృష్టించాడు. రూ. 18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. సీజన్కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్న సామ్ కరన్.. ధావన్ గైర్హాజరీలో పలు మ్యాచ్ల్లో పంజాబ్కు కెప్టెన్గా వ్యవహరించాడు. మొత్తం 14 మ్యాచ్ల్లో 276 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీశాడు. ప్రదర్శన పరంగా సామ్ కరన్ అందరిలో కాస్త బెటర్గా కనిపిస్తున్నప్పటికి.. అతనికి వెచ్చించిన ధర ప్రకారం ఈ ప్రదర్శన ఫ్లాప్ అని చెప్పొచ్చు. చదవండి: 'నాలుగేళ్ల వయసులో వాడేంటో తెలిసింది... ఇది ఊహించిందే!' -
రగ్బీ ప్లేయర్ నుంచి క్రికెటర్ దాకా.. ఆసక్తికర ప్రయాణం
కగిసో రబాడా.. దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్గా అందరికి సుపరిచితమే. తన ఫాస్ట్ బౌలింగ్తో జట్టును ఎన్నోసార్లు గెలిపించి కీలక బౌలర్గా ఎదిగాడు. మంచి వేగంతో బంతులు సంధించే రబాడ దెబ్బకు ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించడంలో దిట్ట. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున తొలి మ్యాచ్ ఆడాడు. గురువారం గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రబాడా ఐపీఎల్లో వందో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. సాహా వికెట్ తీయడం ద్వారా రబాడ ఈ మార్క్ను అందుకున్నాడు. అయితే రబాడా క్రికెటర్ కాకపోయుంటే రగ్బీ ప్లేయర్ అయ్యేవాడంట. అతని గురించి మనకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రగ్బీతో కెరీర్ మొదలుపెట్టి ఆపై క్రికెటర్గా.. కగిసో రబాడా మొదట రగ్బీలో కెరీర్ను కొనసాగించాలనుకున్నాడు. కానీ అతను తన మొదటి ప్రేమను అంటే రగ్బీని వదులుకోవాల్సి వచ్చింది. రగ్బీ ప్లేయర్ నుంచి కగిసో రబాడా క్రికెటర్గా మారిన కథ చాలా ఆసక్తికరంగా ఉంది. రబాడాకు చిన్నప్పటి నుంచి రగ్బీ అంటే ఆసక్తి. అతను పాఠశాల జట్టుతో రగ్బీ ఆడేవాడు. కానీ ఒక్కసారి ఆఫ్ సీజన్ కారణంగా సరదాగా క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. తర్వాత ఎ లెవల్ క్రికెట్ టీమ్లోనూ, రగ్బీ టీమ్లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. అందుకే ఈ ఆటగాడు రగ్బీని వదిలి క్రికెటర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు మే 25, 1995న జోహన్నెస్బర్గ్లో జన్మించిన రబాడా 2013లో దేశవాళీ క్రికెట్లో ఆడడం ప్రారంభించాడు. మరుసటి సంవత్సరం అంటే 2014లో అండర్-19 ప్రపంచకప్ జట్టులోకి ఎంపికయ్యాడు. తన ప్రతిభను ప్రదర్శించేందుకు రబడకు ఇది పెద్ద వేదికగా మారింది. అండర్-19 ప్రపంచకప్లో సెమీఫైనల్లో తన స్పీడ్ మ్యాజిక్ను చూపించాడు. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై రబాడా 25 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఆ సంవత్సరం ప్రొటీస్ జట్టును ప్రపంచ ఛాంపియన్గా చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు. Photo: IPL Twitter తండ్రి డాక్టర్, తల్లి లాయర్ దీంతో.. కగిసో రబాడాకి ఆర్థికంగా ఇబ్బందులు లేవు. తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం లభించింది. అండర్-19 టి20 ప్రపంచకప్ తర్వాత అతను విజయాల మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. ఈ టాల్ ఫాస్ట్ బౌలర్ 2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 19 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన రబాడా అరంగేట్రం టీ20లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. Photo: IPL Twitter టి20 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఒక సంవత్సరం తర్వాత 2015లో రబాడా తన వన్డే అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో.. రబాడా 3 మెయిడిన్లు బౌలింగ్ వేసి 8 ఓవర్లలో హ్యాట్రిక్ సహా 6 వికెట్లు పడగొట్టాడు. ఇక కగిసో రబడ ఐపీఎల్ లో 2022 సంవత్సరంలో 13 మ్యాచ్లలో 23 వికెట్లు తీయగా, 2021 సంవత్సరంలో 15 వికెట్లు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రబడ అత్యుత్తమ ప్రదర్శన 2020లో వచ్చింది. ఈ సీజన్ లో 17 మ్యాచ్ల్లో 30 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా 64 మ్యాచ్ల్లో వంద వికెట్లు తీశాడు. -
వచ్చీ రావడంతోనే రికార్డు.. అత్యంత వేగంగా వంద వికెట్లు
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున గురువారం కగిసో రబడా తొలి మ్యాచ్ ఆఢాడు. ఈ క్రమంలో వచ్చీ రావడంతోనే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో సాహా వికెట్ తీయడం ద్వారా రబాడ ఐపీఎల్లో వందో వికెట్ సాధించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా తక్కువ బంతుల్లో వంద వికెట్లు తీసిన బౌలర్గా రబాడ తొలి స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో వంద వికెట్లు సాధించేందుకు రబాడ 1438 బంతులు తీసుకున్నాడు. రబాడ తర్వాత మలింగ 1622 బంతుల్తో రెండో స్థానంలో ఉండగా.. డ్వేన్ బ్రావో 1619 బంతులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో హర్షల్పటేల్ 1647 బంతులతో ఉన్నాడు. ఇక మ్యాచ్ల పరంగానూ అతి తక్కువ మ్యాచ్ల్లో వంద వికెట్లు సాధించిన బౌలర్గా రబాడ తొలి స్థానంలో ఉన్నాడు. రబాడ 64 మ్యాచ్ల్లో వంద వికెట్లు సాధించాడు. రబాడ తర్వాత మలింగ(70 మ్యాచ్లు), భువనేశ్వర్, హర్షల్ పటేల్లు 81 మ్యాచ్లు, రషీద్ ఖాన్, అమిత్ మిశ్రా, ఆశిష్ నెహ్రాలు 83 మ్యాచ్లు, యజ్వేంద్ర చహల్ 84 మ్యాచల్లో వంద వికెట్ల మార్క్ను చేరుకున్నాడు. 𝐴𝑎𝑡𝑒 ℎ𝑖 𝑑𝑖𝑙 𝑘ℎ𝑢𝑠ℎ 𝑘𝑎𝑟 𝑑𝑖𝑡𝑡𝑎, Rabada veere! 🙌 Kagiso Rabada is 🔙 with pace 🔥 as he brings up a 💯 wickets in #TATAIPL✨#PBKSvGT #IPLonJioCinema #IPL2023 | @KagisoRabada25 @PunjabKingsIPL pic.twitter.com/vnXHyt3quI — JioCinema (@JioCinema) April 13, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
PBKS Vs GT: పవర్ హిట్టర్ వచ్చేశాడు! అందరి కళ్లు అతడిపైనే!
IPL 2023- Punjab Kings vs Gujarat Titans: ఐపీఎల్-2023లో భాగంగా డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్తో పోరుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. సొంత మైదానంలో టైటాన్స్తో ఢొకొట్టేందుకు ధావన్ సేన పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. పవర్ హిట్టర్, ఇంగ్లంగ్ స్టార్ లియామ్ లివింగ్స్టోన్ రాకతో పంజాబ్లో జోష్ వచ్చింది. తమ స్టార్ ప్లేయర్ వచ్చేశాడని.. అందరి కళ్లు అతడిపైనే ఉన్నాయంటూ కింగ్స్ జట్టు లివింగ్స్టోన్ ఫొటోలు షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకుంది. కాగా గాయం కారణంగా సుదీర్ఘ కాలం పాటు ఆటకు దూరమైన లివింగ్స్టోన్ ఈ మ్యాచ్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు.. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లోనే అందుబాటులోకి వచ్చినప్పటికీ బెంచ్కే పరిమితమైన సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ కూడా గుజరాత్తో మ్యాచ్లో ఆడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్ తుది జట్టు ఎలా ఉండబోతుందన్న అంశాన్ని పరిశీలిద్దాం. గుజరాత్తో పంజాబ్ ఢీ ఓపెనర్లుగా ప్రబ్సిమ్రన్ సింగ్, కెప్టెన్ శిఖర్ ధావన్ జోడీ కొనసాగనుండగా.. లివింగ్స్టోన్ను వన్డౌన్లో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక భనుక రాజపక్స స్థానంలో గత మ్యాచ్లో వన్డౌన్లో వచ్చిన మాథ్యూ షార్ట్ బెంచ్కే పరిమితం కానున్నాడు. అదే విధంగా ఆశించిన మేర రాణించలేకపోతున్న సికందర్ రజాకు ఇదే ఆఖరి ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది. మిడిలార్డర్లో షారుక్ ఖాన్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ, హర్ప్రీత్ బ్రార్ ఆడనున్నారు. వీరితో పాటు సామ్ కర్రన్ ఉండనే ఉంటాడు. గతంలో చెరోసారి ఇక.. బౌలింగ్ విభాగంలో పేసర్లు కగిసో రబడ, నాథన్ ఎల్లిస్లలో ఒకరు.. అర్ష్దీప్ సింగ్తో పాటు స్పిన్నర్ రాహుల్ చహర్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. కాగా గత మ్యాచ్లో శిఖర్ ధావన్ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం కావడంతో సన్రైజర్స్ చేతిలో పంజాబ్కు ఓటమి తప్పలేదు. మరోవైపు.. గుజరాత్కు సైతం గత మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ రూపంలో ఈ సీజన్లో తొలి ఓటమి ఎదురైంది. దీంతో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. కాగా గురువారం మ్యాచ్ జరుగనున్న మొహాలీ స్టేడియంలో గతంలో ఇరు జట్లు తలపడిన రెండు సందర్భాల్లో చెరో విజయం నమోదు చేశాయి. గుజరాత్తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ తుది జట్ల(అంచనా): పంజాబ్ కింగ్స్ ప్రబ్సిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్స్టోన్, సికిందర్ రజా, జతేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, సామ్ కర్రన్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, నాథన్ ఎల్లిస్/కగిసో రబడ, అర్ష్దీప్ సింగ్. గుజరాత్ టైటాన్స్ వృద్ధిమాన్ సాహా, శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్. చదవండి: IPL 2023: నీ తప్పిదం వల్ల భారీ మూల్యం! అమ్మో ఈ ‘మహానుభావుడు’ ఉంటేనా.. సచిన్ నన్ను బ్యాట్తో కొట్టాడు.. పిచ్చివాడిని చేస్తావా అంటూ ఫైర్ అయ్యాడు: సెహ్వాగ్ All the focus is on 𝐨𝐧𝐞 𝐦𝐚𝐧! 📸@liaml4893 is ready to Roar 🦁#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/wo7boR6Qvk — Punjab Kings (@PunjabKingsIPL) April 12, 2023 -
పంజాబ్కు గుడ్న్యూస్.. అతడు వచ్చేశాడు! హైదరాబాద్కు చేరుకున్నధావన్ సేన
IPL 2023- Punjab Kings- Liam Livingstone- Kagiso Rabada: వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్కు శుభవార్త. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ భారత్కు వచ్చేశాడు. జట్టుతో కలిసి హైదరాబాద్కు చేరుకున్నాడు. అదే విధంగా ధావన్ సేనకు సంబంధించిన మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. భారీ మొత్తం వెచ్చించి కింగ్స్ కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ రాకకోసం మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా కోలుకోలేదు మోకాలి గాయం కారణంగా రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న లివింగ్స్టోన్ ఇంకా పూర్తి కోలుకోలేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఓల్డ్ ట్రఫోర్డ్లో చికిత్స పొందుతున్న లివింగ్స్టోన్ ఏప్రిల్ 15 తర్వాతే భారత్కు వెళ్లే అవకాశం ఉందని క్రిక్బజ్తో పేర్కొన్నారు. కాగా గాయం కారణంగా గతేడాది డిసెంబరు నుంచి లియామ్ లివింగ్స్టోన్ ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న అతడు.. ఏప్రిల్ మొదటి వారంలోనే పంజాబ్ కింగ్స్తో చేరతాడనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం అతడి రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబడ మాత్రం తదుపరి మ్యాచ్లో అందుబాటులోకి రానున్నాడు. కాగా ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్ హైదరాబాద్ వేదికగా.. సన్రైజర్స్తో మ్యాచ్లో తలపడనుంది. హైదరాబాద్కు చేరుకున్న ధావన్ సేన ఈ నేపథ్యంలో ధావన్ సేన.. హైదరాబాద్కు చేరుకుంది. సంప్రదాయ పద్ధతిలో గబ్బర్ బృందానికి స్వాగతం లభించింది. కాగా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2023 సీజన్ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్పై 7 పరుగుల తేడాతో గెలుపొందిన పంజాబ్.. రెండో మ్యాచ్లో రాజస్తాన్పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వల్ప తేడాలతో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా 11.50 కోట్ల రూపాయల భారీ మొత్తం చెల్లించి పంజాబ్ లివింగ్స్టోన్ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక రబడ కోసం 9.25 కోట్లు ఖర్చు చేసింది. చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే కోహ్లి వచ్చాడు.. కోపంగా బ్యాట్ విసిరేశాడు.. పక్కనే కూర్చున్న నాతో.. Sadda Captain has spoken. 🫡 📍Hello, Hyderabad. 👋🏻#JazbaHaiPunjabi #SaddaPunjab #TATAIPL | @SDhawan25 pic.twitter.com/4GpSvq1Q9J — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 All eyes on KG! 👀#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL I @KagisoRabada25 pic.twitter.com/wwhpjjLRTv — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 Sadde 🦁s enjoyed a warm Hyderabadi welcome! 😊 🙏#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/wuvpq4Fyb7 — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 -
SA Vs WI: జేసన్ హోల్డర్ ఒంటరి పోరాటం.. అయినా పాపం!
South Africa vs West Indies, 2nd Test- జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 251 పరుగులకు ఆలౌటైంది. జేసన్ హోల్డర్ (117 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఇతర బ్యాటర్లలో కైల్ మేయర్స్ (29), రోస్టన్ ఛేజ్ (28), జొషువా డ సిల్వ (26) కొన్ని పరుగులు జోడించగలిగారు. సఫారీ బౌలర్లలో కోయెట్జీ 3 వికెట్లు పడగొట్టగా...రబడ, హార్మర్ చెరో 2 వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్లో 69 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ కోల్పోకుండా 4 పరుగులు చేసింది. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 311/7తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్లో 320 పరుగులకు ఆలౌటైంది. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు వెస్టిండీస్ సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. ఫిబ్రవరి 28న ఆరంభమైన టెస్టు సిరీస్లో భాగంగా ఆతిథ్య ప్రొటిస్ తొలి మ్యాచ్లో 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మార్చి 8న మొదలైన రెండో టెస్టులోనూ విండీస్పై బవుమా బృందానిదే పైచేయిగా ఉంది. ఇదిలా ఉంటే.. మార్చి 16-21 వరకు వన్డే, మార్చి 25-28 వరకు సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ జరుగనుంది. చదవండి: Wanindu Hasaranga: పెళ్లి చేసుకున్న శ్రీలంక ఆల్రౌండర్.. ఫొటోలు వైరల్! Steve Smith: అంతా బాగానే ఉంది కానీ.. ఇదేంటి స్మిత్! మరీ ఇలా.. కెరీర్లో ఇదే తొలిసారి! -
విండీస్ను శాసించిన రబాడ.. తొలి టెస్టులో ఘన విజయం
వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. సెంచూరియన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ప్రొటీస్ 87 పరుగుల తేడాతో విజయం అందుకుంది. 246 పరుగుల టార్గెట్తో నాలుగో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ 41 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. జెర్మెన్ బ్లాక్వుడ్ 79 పరుగులతో ఒంటరిపోరాటం చేయగా మిగతావారు విఫలమయ్యారు. కగిసో రబాడ ఆరు వికెట్లతో విండీస్ నడ్డి విరవగా.. మార్కో జాన్సెన్ రెండు, నోర్ట్జే , కోట్జే చెరొక వికెట్ తీశారు. అంతకముందు సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 116 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 342 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ తొలి ఇన్నింగ్స్లో 212 పరుగుల వద్ద ముగించడంతో సౌతాఫ్రికాకు 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. ఇక తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో 47 పరుగులతో ఆకట్టుకున్న ఓపెనర్ మార్క్రమ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మార్చి 8 నుంచి 12 వరకు జోహన్నెస్బర్గ్ వేదికగా జరగనుంది. చదవండి: టీమిండియా నిలబెట్టుకుంటే.. 141 ఏళ్ల రికార్డు బద్దలు! 'లక్ష్యం చిన్నదే.. రేపు ఏమైనా జరగొచ్చు!' -
ఐసీసీ టెస్టు జట్టు: ఆసీస్, ఇంగ్లండ్ ప్లేయర్ల హవా.. భారత్ నుంచి ఒకే ఒక్కడు
ICC Men’s Test Team of the Year 2022: గతేడాది టెస్టుల్లో తమదైన ముద్ర వేసిన పురుష క్రికెటర్లతో కూడిన జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం ప్రకటించింది. 2022 ఏడాదికి గానూ.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది ప్లేయర్ల పేర్లను వెల్లడించింది. ఈ జట్టుకు బెన్స్టోక్స్ను సారథిగా ఎంపిక చేసిన ఐసీసీ.. టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్కు వికెట్ కీపర్గా అవకాశమిచ్చింది. భారత్ నుంచి ఒకే ఒక్కడు కాగా టీమిండియా నుంచి పంత్ ఒక్కడికే ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టులో స్థానం దక్కడం విశేషం. ఈ టీమ్లో ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, క్రెయిగ్ బ్రాత్వెయిట్.. మూడో స్థానంలో మార్నస్ లబుషేన్, ఆ తర్వాతి స్థానాల్లో బాబర్ ఆజం, జానీ బెయిర్స్టో, బెన్స్టోక్స్, రిషభ్ పంత్, ప్యాట్ కమిన్స్కు చోటిచ్చింది ఐసీసీ. ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్ల హవా పేస్ విభాగంలో కగిసో రబడ, జేమ్స్ ఆండర్సన్ స్పిన్ విభాగంలో నాథన్ లియోన్ ఐసీసీ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే 2021-23 సీజన్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరిన ఆసీస్ జట్టుకు చెందిన ఆటగాళ్లు అత్యధికంగా నలుగురు ఈ జట్టులో స్థానం సంపాదించారు. బజ్బాల్ విధానంతో టెస్టు క్రికెట్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్న సారథి స్టోక్స్తో పాటు బెయిర్స్టో, ఆండర్సన్ ఇంగ్లండ్ నుంచి చోటు దక్కించుకున్నారు. వారెవ్వా పంత్ 2022లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ 12 ఇన్నింగ్స్లో 61.81 సగటుతో 680 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక గతేడాది పంత్ టెస్టుల్లో 21 సిక్సర్లు బాదాడు. ఆరు స్టంప్స్లో భాగమయ్యాడు. 23 క్యాచ్లు అందుకున్నాడు. కాగా గతేడాది డిసెంబరు 30న కారు ప్రమాదానికి గురైన పంత్ కోలుకుంటున్న విషయం విదితమే. ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022 1.ఉస్మాన్ ఖవాజా- ఆస్ట్రేలియా 2.క్రెయిగ్ బ్రాత్వెట్- వెస్టిండీస్ 3.మార్నస్ లబుషేన్- ఆస్ట్రేలియా 4.బాబర్ ఆజం- పాకిస్తాన్ 5.జానీ బెయిర్స్టో- ఇంగ్లండ్ 6.బెన్ స్టోక్స్- ఇంగ్లండ్ (కెప్టెన్) 7.రిషభ్ పంత్- ఇండియా(వికెట్ కీపర్) 8.ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా 9.కగిసో రబడ- సౌతాఫ్రికా 10.నాథన్ లియోన్- ఆస్ట్రేలియా 11.జేమ్స్ ఆండర్సన్- ఇంగ్లండ్. చదవండి: IND VS NZ 3rd ODI: 17 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు సెంచరీ బాదిన హిట్మ్యాన్ ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టు ప్రకటన.. కెప్టెన్గా బాబర్ ఆజం.. టీమిండియా నుంచి ఇద్దరే -
నిప్పులు చెరిగిన పేసర్లు.. తొలి రోజే 15 వికెట్లు
ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా జట్ల మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో ఇరు జట్ల పేస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఫలితంగా ఆట తొలి రోజే ఏకంగా 15 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా పర్యాటక సౌతాఫ్రికాను 152 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం సఫారీ బౌలర్లు సైతం రెచ్చిపోయి 145 పరుగులకే సగం ఆసీస్ వికెట్లను పడగొట్టారు. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ (77 బంతుల్లో 78 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ తొలి బంతికే కగిసో రబాడ.. డేవిడ్ వార్నర్ను పెవిలియన్కు పంపగా, ఉస్మాన్ ఖ్వాజా (11), స్టీవ్ స్మిత్ (36)లను నోర్జే.. మార్నస్ లబూషేన్ (11)ను జన్సెన్ ఔట్ చేశారు. స్కాట్ బోలాండ్ (1)ను రబాడ ఔట్ చేయడంతో తొలి రోజు ఆట ముగిసింది. అంతకుముందు మిచెల్ స్టార్క్ (3/41), పాట్ కమిన్స్ (2/35), బోలాండ్ (2/28), నాథన్ లయోన్ (3/14) ధాటికి సౌతాఫ్రికా 152 పరుగులకే చాపచుట్టేసింది. సఫారీ ఇన్నింగ్స్లో వికెట్కీపర్ వెర్రిన్ (64) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. వెర్రిన్తో పాటు సరెల్ ఎర్వీ (10), టెంబా బవుమా (38), రబాడ (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కెప్టెన్ డీన్ ఎల్గర్ (3), వాన్ డెర్ డస్సెన్ (5), జోండో (0), జన్సెన్ (2), మహారాజ్ (2), నోర్జే (0), ఎంగిడి (3) దారుణంగా విఫలమయ్యారు. కాగా, ఈ ఆస్ట్రేలియా పర్యటనలో సౌతాఫ్రికా 3 టెస్ట్లు, 3 వన్డేలు ఆడనుంది. -
WC 2022: ‘వాళ్లిద్దరు అద్భుతం.. ఈసారి వరల్డ్కప్ ట్రోఫీ సౌతాఫ్రికాదే!’
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో తొలి మ్యాచ్లో చేదు అనుభవం ఎదుర్కొన్న సౌతాఫ్రికా.. రెండో మ్యాచ్లో మాత్రం అదరగొట్టింది. తద్వారా నెట్ రన్రేటు భారీగా పెంచుకుని గ్రూప్-2లో గట్టి పోటీదారుగా నిలిచింది. కాగా వర్షం కారణంగా హోబర్ట్లో జింబాబ్వేతో మ్యాచ్లో ఫలితం తేలకుండా పోవడంతో ప్రొటిస్కు ఒకే ఒక్క పాయింట్ వచ్చిన విషయం తెలిసిందే. గెలిచే మ్యాచ్లో వరుణుడి రూపంలో ఇలా దురదృష్టం వెక్కిరించడంతో ఉసూరుమంది. అయితే, ఆ బెంగ తీరేలా బంగ్లాదేశ్తో మ్యాచ్లో 104 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్లో రిలీ రోసో అద్భుత సెంచరీ(109)తో మెరవగా.. 205 పరుగుల భారీ స్కోరు చేసింది సౌతాఫ్రికా. అద్భుతం చేసిన బౌలర్లు ఇక బౌలర్లు కగిసో రబడ ఒకటి, కేశవ్ మహరాజ్ ఒకటి, తబ్రేజ్ షంసీ 3 వికెట్లు తీశారు. ఇక అన్రిచ్ నోర్జే 3.3 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో భారీ తేడాతో గెలిచిన ప్రొటిస్ జట్టు రెండు మ్యాచ్లు ముగిసే సరికి మూడు పాయింట్లు, నెట్రన్ రేటు 5.200తో గ్రూప్-2లో ప్రస్తుతం టీమిండియా తర్వాతి స్థానం(2)లో నిలిచింది. ఈసారి విజేతగా సౌతాఫ్రికా ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ పేసర్, కామెంటేటర్ డేల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పేసర్లకు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్లపై తమ బౌలర్లు అద్భుతం చేయగలరని.. ప్రొటిస్ తొలిసారి ప్రపంచ విజేతగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేశాడు. ఈ మేరకు ఐసీసీ వెబ్సైట్తో స్టెయిన్ మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా బౌలింగ్ అటాక్కు కగిసో రబడ నాయకుడు. అతడికి తోడుగా అన్రిచ్ నోర్జే కూడా ఉన్నాడు. ఈ ఫాస్ట్బౌలర్ల జోడీ అద్భుతంగా రాణించగలదు. వీళ్లిద్దరూ కలిసి ఈసారి సౌతాఫ్రికాకు వరల్డ్కప్ అందించగలరని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. నా టాప్-5 బౌలర్లు వీరే ‘‘వాళ్ల పేస్లో వైవిధ్యం ఉంది. మెరుగైన నైపుణ్యాలు కలిగి ఉన్న బౌలర్లు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఎక్స్ట్రా పేస్కు అనుకూలించే పిచ్లపై రబడ రెచ్చిపోవడం ఖాయం. నోర్జే కూడా తక్కువేమీ కాదు’’ అంటూ ప్రొటిస్ను గెలిపించగల సత్తా వీరికి ఉందని డేల్ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. ఇక గ్రూప్-1లోని ఇంగ్లండ్ జట్టులో మార్క్ వుడ్ తన ఫేవరెట్ అన్న ఈ స్పీడ్స్టర్.. యార్కర్లు, బౌన్సర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో అతడు దిట్ట అని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ ఈ టోర్నీలో గనుక ముందుకు వెళ్తే అందులో మార్క్దే కీలక పాత్ర అని చెప్పవచ్చని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ప్రస్తుత వరల్డ్కప్ టోర్నీలో తన టాప్-5 బౌలర్ల పేర్లను స్టెయిన్ వెల్లడించాడు. కగిసో రబడ, అన్రిచ్ నోర్జే, మార్క్ వుడ్, మిచెల్ స్టార్క్, షాహిన్ ఆఫ్రిదిలకు ఈ లిస్టులో స్థానమిచ్చాడు. ఇక స్టెయిన్ ఈ జాబితాలో ఒక్క టీమిండియా పేసర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీ గెలవని జట్టుగా సౌతాఫ్రికాకు అపవాదు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టెయిన్ వ్యాఖ్యలపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ‘‘కనీసం ఈసారైనా టైటిల్ గెలిచి చోకర్స్ ట్యాగ్ను తొలగించుకోండి’’ అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. చదవండి: ఏ నిమిషానికి ఏమి జరుగునో! రిజర్వ్ డే ఉన్నా.. 667లో ఒక్కటే రద్దైనా.. ఫైనల్ ‘బెంగ’! T20 WC 2022: 'అతడు జట్టులో లేడు.. అందుకే పాకిస్తాన్కు ఈ పరిస్థితి' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Eng Vs SA: దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ ఘన విజయం.. ఏకంగా..
South Africa tour of England, 2022 - England vs South Africa, 3rd Test: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. కాగా లండన్లోని కెనింగ్టన్ వేదికగా సెప్టెంబరు 8న ఆరంభమైన ఆఖరి టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 118 పరుగులకే ఆలౌట్! ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పర్యాటక ప్రొటిస్ జట్టుకు ఇంగ్లండ్ బౌలర్లు రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్ చుక్కలు చూపించారు. రాబిన్సన్ ఐదు వికెట్లు, బ్రాడ్ నాలుగు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా జట్టు 118 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్తో పాటు సిరీస్ కూడా సొంతం! ఇక ఇంగ్లండ్ 158 పరుగులకు ఆలౌట్ అయింది. ఇదిలా ఉంటే.. బ్రాడ్ మరోసారి మూడు వికెట్లతో రెచ్చిపోవడం.. ఇందుకు కెప్టెన్ బెన్స్టోక్స్ కూడా జత కావడంతో దక్షిణాఫ్రికా 169 పరుగులకే రెండో ఇన్నింగ్స్ను ముగించింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ కేవలం ఒకే ఒక వికెట్ నష్టపోయి.. ఆఖరి రోజు జయభేరి మోగించింది. సిరీస్ను సైతం సొంతం చేసుకుంది. రాబిన్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఇంగ్లండ్ కెప్టెన్ బెన్స్టోక్స్తో పాటు ప్రొటిస్ బౌలర్ కగిసొ రబడ అందుకున్నాడు. ఈ మ్యాచ్లో రబడ మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. టీ20 సిరీస్ ప్రొటిస్ది.. టెస్టు సిరీస్ ఇంగ్లండ్ది! మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడే నిమిత్తం దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా మొదటి వన్డేలో పర్యాటక ప్రొటిస్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లంఢ్ గెలుపొందింది. ఆఖరి వన్డేలో ఫలితం తేలలేదు. ఇక టీ20 సిరీస్ను దక్షిణాఫ్రికా 2-1తో కైవసం చేసుకోగా.. ఆఖరి రెండు టెస్టుల్లో ఓటమి పాలై.. టెస్టు సిరీస్ను 2-1తో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. చదవండి: ఇండియా నుంచి వచ్చారా? హ్యాపీగా ఉన్నారనుకుంటా: రమీజ్ రాజా దురుసు ప్రవర్తన SL Vs Pak: పాక్తో ఫైనల్! అప్పుడు వాళ్లు అలా.. ఇప్పుడు మేమిలా: దసున్ షనక -
అద్భుత విన్యాసం.. వికెట్లే కాదు క్యాచ్లు కూడా బాగా పట్టగలడు
ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అద్భుత విన్యాసంతో మెరిశాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బ్రాడ్ ఈ విన్యాసం చేశాడు. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో కగిసో రబడా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. మాథ్యూ పాట్ బౌలింగ్లో రబడా మిడ్ఫీల్డ్ దిశగా బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడుంది ఎవరు.. ఆరు అడుగులు ఆరు అంగుళాల స్టువర్ట్ బ్రాడ్. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన బ్రాడ్ ఒకవైపుగా డైవ్చేస్తూ ఒంటిచేత్తో ఎవరు ఊహించని విధంగా స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. తన మెరుపు విన్యాసంతో జట్టు ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి జట్టును కూడా నోరెళ్లబెట్టేలా చేశాడు. బ్రాడ్ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఇదే టెస్టులో బ్రాడ్.. ప్రొటిస్ బ్యాటర్ వెరిన్నేను ఔట్ చేయడం ద్వారా లార్డ్స్ వేదికలో 100వ వికెట్ సాధించాడు. తద్వారా టెస్టుల్లో ఒకే వేదికపై వంద వికెట్లు సాధించిన ఇంగ్లండ్ రెండో బౌలర్గా.. ఓవరాల్గా నాలుగో బౌలర్గా ఘనత సాధించాడు. బ్రాడ్ ఇంత మంచి ఫీట్ అందుకున్నా ఇంగ్లండ్ మాత్రం తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైంది. ఏకంగా ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో దక్షిణాఫ్రికా ఆధిక్యంలో నిలిచింది. ఓవర్నైట్ స్కోర్ 289/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులకు ఆలౌటైంది.దీంతో తొలి ఇన్నింగ్స్లో ప్రోటీస్కు 161 పరుగల లీడ్ లభించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో సారెల్ ఎర్వీ (73) అర్ధ సెంచరీ చేయగా, ఎల్గర్ (47), కేశవ్ మహరాజ్ (41) పరుగులతో రాణించారు. అనంతరం 161 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 149 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. Oh Broady! 😱 Live clips: https://t.co/2nFwGblL1E 🏴 #ENGvSA 🇿🇦 | @StuartBroad8 pic.twitter.com/SCkwjfD7g5 — England Cricket (@englandcricket) August 19, 2022 చదవండి: Asia Cup 2022: కెప్టెన్గా షనక.. ఆసియాకప్కు జట్టును ప్రకటించిన శ్రీలంక ఇంగ్లండ్ జట్టుకు ఘోర పరాభవం.. 19 ఏళ్ల తర్వాత తొలి సారిగా! -
SA Vs ENG: రబడా పాంచ్ పటాకా..
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. దాంతో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 124 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సారెల్ ఎర్వీ (73) అర్ధ సెంచరీ చేయగా, ఎల్గర్ (47), కేశవ్ మహరాజ్ (41), మార్కో జాన్సెన్ (41 బ్యాటింగ్) రాణించారు. బెన్ స్టోక్స్కు 3 వికెట్లు దక్కాయి. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 116/6తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్ (73) టాప్ స్కోరర్గా నిలిచాడు. పేస్ బౌలర్ రబడాకు 5 వికెట్లు దక్కగా, నోర్జే 3 వికెట్లు తీశాడు. -
ఐర్లాండ్తో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్..!
ఐర్లాండ్తో టీ20 సిరీస్కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ గాయం కారణంగా ఐర్లాండ్తో టీ20 సిరీస్కు దూరం కానున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20 లో రబాడా ఎడమ కాలి చీలమండకు గాయమైంది. దీంతో అతడు ఇంగ్లండ్తో జరిగిన అఖరి టీ20కూడా దూరమయ్యాడు. అయితే రబాడ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు ప్రోటిస్ జట్టు బృందం తెలిపింది. ఈ క్రమంలో అతడు ఐర్లాండ్ సిరీస్తో పాటు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఇంగ్లండ్ వేదికగా రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఐర్లాండ్తో ప్రోటీస్ తలపడనుంది. ఐర్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 బ్రిస్టల్ వేదికగా బుధవారం జరగనుంది. ఈ సిరీస్ మొత్తం బ్రిస్టల్ వేదికగా జరగనుంది. ఇక ఈ సిరీస్ ముగిసిన అనంతరం దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇంగ్లండ్తో తలపడనుంది. కాగా ఇంగ్లండ్తో మూడు టీ20 సిరీస్ను 2-1తో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఐర్లాండ్తో టీ20లకు దక్షిణాఫ్రికా జట్టు డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, రిలీ రోసౌ, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, గ్రెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్,తబ్రైజ్ షమ్సీ, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే చదవండి: IND vs WI 3rd T20: భారత్-విండీస్ మూడో టీ20 కూడా ఆలస్యం.. కారణం ఇదే..!
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బద్ధిపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వేసవిలో ‘చల్లని’ సేవ
గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివించండి
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బుద్ధ జయంతిని విజయవంతం చేయాలి
ఎప్సెట్ ఫలితాల్లో ‘శ్రీచైతన్య’ విజయకేతనం
ఏషియన్ పవర్ లిఫ్టింగ్లో బంగారు పతకం
నేటి నుంచి జీల్గుల మల్లికార్జునస్వామి ఉత్సవాలు
వ్యానును ఢీకొన్న కారు
తప్పక చదవండి
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
Advertisement