-
కపిల్ ‘లెజెండరీ ఇన్నింగ్స్’ను మళ్లీ చూడొచ్చు!!
ముంబై: భారత క్రికెట్ అభిమానుల మదిలో మరుపురాని ఇన్నింగ్స్.. 1983 నాటి ప్రపంచకప్లో జింబాంబ్వేపై అప్పటి టీమిండియా సారథి కపిల్దేవ్ చేసిన 175 పరుగుల ‘లెజండరీ ఇన్నింగ్స్’.. నిజానికి ఆ ఇన్నింగ్స్ను చాలామంది కళ్లారా వీక్షించలేకపోయారు. అప్పట్లో బీబీసీ సమ్మె చేయడంతో ఈ మ్యాచ్ను ప్రసారం చేయలేదు. అంతేకాదు.. ఈ మ్యాచ్ను రికార్డు కూడా చేయలేదు. దీంతో తర్వాత కూడా ఆ ‘లెజండరీ ఇన్నింగ్స్’చూసే భాగ్యం భారతీయులకు దక్కలేదు. అయితే, ఆ ఇన్నింగ్స్ను వెండితెరపై పునర్ ఆవిష్కరిస్తున్నామని, కపిల్ నాడు చేసిన 175 పరుగుల వీరోచిత బ్యాటింగ్ను తమ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నామంటుంది ‘83’ చిత్ర యూనిట్. భారత్ గెలిచిన తొలి ప్రపంచకప్ నేపథ్యంతో కపిల్ దేవ్ బయోపిక్గా కబీర్ ఖాన్ దర్శకత్వంలో ‘83’ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 36 ఏళ్ల క్రితం క్రికెట్ చర్రితలో కపిల్ సరికొత్త రికార్డు నెలకొల్పారని.. 1983 ప్రపంచ కప్లో జింబాంబ్వేపై ఆయన ఆడిన ఇన్నింగ్స్ ఓ అద్భుతమని, ఆ మరిచిపోలేని ఘట్టాన్ని తమ సినిమాలో పునర్ ఆవిష్కరిస్తున్నామని ఈ సినిమాలో కపిల్ దేవ్గా నటిస్తున్న రణ్వీర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆనాటి పాత ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు. కపిల్ ‘లెజండరీ ఇన్నింగ్స్’ పై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. బీబీసీ టీవీ సిబ్బంది సమ్మె చేయడం వల్ల నాటి కపిల్ లెజండరీ ఇన్నింగ్స్ మ్యాచ్ను బీబీసీ ప్రసారం చేయలేకపోయిందని తెలిపారు. -
ఫెంటాస్టిక్.. ఫాంటమ్
భజ్రంగీ భాయ్జాన్ దర్శకుడు కబీర్ఖాన్ దర్శకత్వంలో వచ్చిన మరో మెరిక లాంటి చిత్రం ఫాంటమ్. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం భారత్ను ఎలా ఇబ్బంది పెడుతుందోన్నదని చిత్ర కథ. భారత్ కూడా పాక్ బాటలో నడిచి వారి దేశంలోకి గూఢచారులను పంపడం మొదలు పెడితే ఎలా ఉంటుంది? అన్న వైవిధ్యమైన కోణంలో కథ ముందుకు సాగుతుంది. ఇంతవరకూ ఇటువంటి పాయింట్తో భారత సెల్యులాయిడ్పై చిత్రం రాలేదు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగానే కనిపించినా డైలాగులు మాత్రం తేలిపోయాయి. కథేంటి? 26/11 ముంబై దాడి సూత్రధారులను శిక్షించాలని కోరుతూ భారత్ చేసే ప్రయత్నాలు సఫలం కావు. దీంతో నిందితులకు శిక్ష పడాలంటే ‘ముల్లుకు ముల్లు’ సిద్ధాంతమే సరైనదని భారత గూఢచార సంస్థ ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’ (రా) నిర్ణయిస్తుంది. దీనికి ఉన్నతాధికారులు అంగీకరించరు. దీంతో రహస్యంగా ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయిస్తారు. ఈ పనికోసం సైన్యం నుంచి తీసివేసిన దనియల్ ఖాన్ను (సైఫ్ అలీఖాన్) సంప్రదిస్తారు. అతన్ని లండన్కు పంపి ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల శిక్షకుడు, లష్కరే తోయిబాకు సహకరించిన సాజిద్ను మట్టుబెడతారు. ఇందుకు అమెరికాకు చెందిన ఆయుధాల సరఫరా కంపెనీ ఏజెంట్, ఫార్శీ (ఇరాన్) అయిన నవాజ్ మిస్త్రీ (కత్రినా కైఫ్) సాయం తీసుకుంటారు. తర్వాత దనియల్ ఖాన్ అమెరికా వెళ్తాడు. అక్కడ జరిగిన ఓ గొడవలో ఇరుక్కుని జైల్లో పడతాడు. ముంబై దాడులకు ముందు ఇండియాలో రెక్కీ నిర్వహించిన డేవిడ్ హెడ్లీ అదే జైలులో ఉంటాడు. ‘రా’ ఆదేశాలతో జైలులోనే ఎవరికీ అనుమానం రాకుండా అతన్ని హతమారుస్తాడు. తర్వాత నవాజ్ (కత్రినా) సాయంతో నకిలీ పాస్పోర్టు తీసుకుని పాకిస్తాన్ చేరుకుంటాడు. అక్కడ రా ఏజెంట్ల సాయంతో ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ను, హిజబుల్ ముజాహిదీన్ అధినేత సయీద్ సలావుద్దీన్లను తెలివిగా చంపేస్తాడు. ఈ ప్రయత్నంలో వారికి సహకరించిన వారందరూ చనిపోతారు. చివరకు దనియాల్, నవాజ్ ఇద్దరే కరాచీ తీరానికి చేరుకుంటారు. సరిగ్గా 26/11 దాడులకు తీవ్రవాదులు ఎలాగైతే భారత్కు వచ్చారో, అలాగే దేశం చేరుకోవాలనుకుంటారు. కానీ, ఆ ప్రయత్నంలో దనియాల్ ప్రాణాలు కోల్పోతాడు. నవాజ్ మాత్రమే భారత్ చేరుకుంటుంది. సాంకేతిక వర్గం పనితీరు.. సినిమాకు సాంకేతిక వర్గం తమ అద్భుతమైన పనితీరుతో ప్రాణం పోశారు. ముఖ్యంగా సిరియా ఎన్కౌంటర్, పాకిస్తాన్ సెట్టింగ్లు వేయడం మామూలు విషయం కాదు. హాలీవుడ్ స్థాయి పోరాటాలు, సినిమాటోగ్రఫీ సూపర్గా ఉన్నాయి. చక్కని నేపథ్య సంగీతం, రీ రికార్డింగ్లు సినిమాను సాంకేతికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. స్క్రీన్ ప్లే అద్భుతంగా సాగింది. అన్నీ వెరసి హైదరాబాదీ, దర్శకుడు కబీర్ ఖాన్కు బాలీవుడ్లో వరుసగా రెండో హిట్ తెచ్చిపెట్టాయి. తేలిపోయిన మాటలు.. సినిమాలో సంభాషణలు చాలా బలహీనంగా ఉన్నాయి. దీనికి తోడు సైఫ్ అలీఖాన్, కత్రినా కైఫ్ నటన అంతగా ఆకట్టుకోలేదు. రెండు దేశాల మధ్య సంబంధాల విషయంలో హఫీజ్ మాట్లాడే మాటలు, కత్రినా పాకిస్తాన్లో తన బాల్యాన్ని వివరించే తీరు, రా అధికారుల సంభాషణలు సన్నివేశం బరువుకు తగ్గట్టుగా లేవు. ప్రధాన తారాగణం: సైఫ్ అలీఖాన్, కత్రినా కైఫ్, జునే స్మిత్ తదితరులు. సంగీతం: ప్రీతం కెమెరా: అసీమ్ మిశ్రా కథ: కబీర్ ఖాన్, పర్వేజ్ షేక్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కబీర్ ఖాన్ నిర్మాత: సాజిద్ నదియాద్వాలా డిస్ట్రిబ్యూటర్: యూటీవీ మోషన్ పిక్చర్స్ సందేశం: తీవ్రవాదం ఎక్కడ, ఎలాంటి రూపంలో ఉన్నా సహించకూడదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement