-
అచ్చన్నా.. నీ సంగతి చూసుకో!
ఇతరశాఖలపై ఫిర్యాదులు తర్వాత.. అచ్చెన్నాయుడుపై చంద్రబాబు ఆగ్రహం ‘చంద్రన్న కానుక’ను అభాసుపాల్జేశారు నాపేరు పెట్టి నాసిరకం వస్తువులిచ్చారు పరిటాల సునీతపై సీఎం తీవ్ర అసంతృప్తి రాజధాని రైతుల నిరసనలు పసిగట్టలేకపోయారు నారాయణ, దేవినేని, పుల్లారావులకూ అక్షింతలు సాక్షి, హైదరాబాద్: ‘అచ్చెన్నా.. అన్ని శాఖల గురించి ఫిర్యాదు చేయడం నీకు అలవాటైపోయింది... ముందు నీ శాఖ గురించి నువ్వు చూసుకో’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్వరంతో హెచ్చరించే సరికి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు బిత్తరపోయారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆరుగంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం అచ్చన్నాయుడుతో పాటు మరికొందరు మంత్రుల పనితీరుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. సమావేశంలో శాఖలపై సమీక్ష సందర్భంగా రహదారులు, భవనాల పనితీరు పట్ల సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మంత్రి అచ్చన్నాయుడు మాత్రం రోడ్లు సక్రమంగా లేవని అన్నారు. తనతో పాటు మిగిలిన వారు రోడ్లు బాగున్నాయని చెప్తుంటే అచ్చెన్నాయుడు బాగా లేవని చెప్పటంతో... ‘ప్రతి శాఖ పనితీరు బాగా లేదని చెప్పటం నీకు అలవాటైపోయింది. ముందు నీ శాఖ పనితీరు బాగా జరిగేలా చూసుకో, పట్టుపెంచుకో, మిగిలిన శాఖలపై తరువాత ఫిర్యాదు చేద్దువుగాని’ అన్నట్లు తెలిసింది. తనపేరుతో ప్రకటించిన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పథకం అభాసుపాల్జేశారంటూ ముఖ్యమంత్రి వాపోయారు. నాసిరకం వస్తువులు సరఫరా చేసిన పౌరసరఫరాల శాఖ అధికారులతో పాటు పర్యవేక్షణ సరిగా లేదంటూ ఆ శాఖమంత్రి పరిటాల సునీత పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వస్తువులు సరఫరా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మీ వల్ల నాకు ఇబ్బందులు... రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో రైతుల నుంచి నిరసన వ్యక్తమౌతున్నా పసిగట్టడంలో విఫలమైన మంత్రులు పి. పుల్లారావు, పి. నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావులపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ వ్యవహారశైలి, శాఖలపై పట్టు పెంచుకోకపోవటం వల్ల నేను ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ఆయన ఈ సందర్భంగా ఘాటుగానే అన్నట్లు సమాచారం. ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంటే తొలి నుంచి రాజధాని వ్యవహారాలు పర్యవే క్షిస్తున్న మంత్రి నారాయణతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిసింది. మంత్రులందరూ రైతుల్లో అసంతృప్తిని గుర్తించటంలో విఫలం అయ్యారని, ఇక నుంచి సమన్వయంతో పనిచేసి ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పినట్లు తెలిసింది. సాగునీటి శాఖ పనితీరు వల్ల ప్రభుత్వానికి కొంత మంచి పేరు వచ్చిందని, ఇప్పటికే రూ. తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టామని, మరో రూ. తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో చేపడతామని సీఎం అన్నట్లు తెలిసింది. హైదరాబాద్లోనే బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు హైదరాబాద్లోనే నిర్వహించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. గుంటూరు జిల్లాలో శాసనసభ సమావే శాలు నిర్వహిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో హాయ్ల్యాండ్తో పాటు కేఎల్ విశ్వవిద్యాలయాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సందర్శించారు. అధికారుల బృందాన్ని పంపి ఒక నివేదిక రూపొం దించి ప్రభుత్వానికి అందచేశారు. అన్ని అంశాలను పరిశీలించిన తరువాత మౌలిక వసతులున్న హైదరాబాద్లోనే సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మార్చి తొలివారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జాబ్కార్డ్ ఉన్న వారితో పారిశుధ్య కార్యక్రమాలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద జాబ్కార్డులు కలిగిన డ్వాక్రా మహిళలతో గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద వీరికి పనికి తగిన వేతనం చెల్లిస్తారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై కూడా సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరాలో కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయని, వాటిని సవరిస్తే ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి ఉండదని సీఎం చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంత్రులు ప్రచారం చేయాలని చంద్రబాబు చెప్పారు. తాను కూడా మూడు రోజుల పాటు అక్కడ ప్రచారం చేస్తున్నానని చెప్పారు. -
ఒంటరవుతున్న అచ్చెన్న
కళా చుట్టూ నేతల ప్రదక్షిణ సమాచారం వెళ్ళినా మంత్రి మౌనం శ్రీకాకుళం : జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఒంటరవుతున్నారు. ఏడాదిన్నరపాటు జిల్లాలో హవా కొనసాగించిన ఆయన ఇపుడిపుడే కార్యకర్తల నుంచి దూరం అవుతున్నారు. కొన్నాళ్ళుగా అమరావతి శంకుస్థాపన పనిలో ఉన్న మంత్రికి ఇక్కడిసమాచారం తెలియడం లేదు. ఫోన్లో తాజా పరిస్థితిని నేతలు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. మొన్నటి వరకూ వెంట తిరిగి పనులు చేయించుకున్న దిగువశ్రేణి నేతలు కూడా ఇపుడు రూటు మారుస్తున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు సైతం సొంత పనుల కోసం పక్కచూపులు చూస్తున్నారు. తాజా పరిణామాలతో మంత్రి కుటుంబ సభ్యులు అవాక్కవుతున్నారు. క్యాబినెట్లో సీటు పొంది అసెంబ్లీలో నోరుపారేసుకుని, రాష్ట్ర ప్రథమపౌరుడ్ని పరుషజాలంతో మాట్లాడిన మంత్రి పరిస్థితి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. నిన్న మంత్రి వెంట... నేడు కళా చెంత... జిల్లాలోని మంత్రి వెంటే తిరిగిన నేతలు సైతం ఇపుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు చుట్టూ తిరుగుతున్నారు. గతంలో కేవలం ఎచ్చెర్ల నియోజకవర్గానికే పరిమితమైన కళాకు ఇపుడు రాష్ట్ర అధ్యక్షునిగా పదవి దక్కడంతో పనుల కోసం ఆయన వెంట ప్రదక్షిణలు చేస్తున్నారు. పాలకొండ కోటదుర్గమ్మ దర్శనానికి వెళ్ళిన కళా చుట్టూ అక్కడి కాపునేతలంతా చేరిపోయారు. తాజాగా శుక్రవారం శ్రీకాకుళం పట్టణాధ్యక్షుడు మాదారపు వెంకటేష్ సహా 30మంది ప్రత్యేక వాహనాల్లో రాజాం వెళ్ళి కళాను కలుసుకున్నారు. బుధవారం జరిగిన కళా అభినందన సభను బహిష్కరించిన వీళ్ళంతా నాటి సంఘటనకు కారణాలను వివరించి ఆయనను ప్రసన్నం చేసుకునేందుకే రాజాం వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. పైగా వెళ్ళినవారంతా శ్రీకాకుళం ఎమ్మెల్యే అనుచరులే కావడం విశేషం. జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా మంత్రి వెంటే తిరిగిన ఎమ్మెల్యే ఇపుడు రూటు మార్చినట్టు తమ్ముళ్ళే ప్రచారం చేస్తున్నారు. జిల్లా అధిష్టానంపైనా ఫిర్యాదు ఇదిలా ఉంటే జిల్లా అధిష్టానంపై దిగువశ్రేణి నేతలు కొంతమంది శుక్రవారం కళాకు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. బుధవారం నాటి కార్యక్రమం విఫలమైన నేపధ్యంలో జిల్లా అధ్యక్షురాలు శిరీష, పలాస ఎమ్మెల్యే శివాజీల మొండి వైఖరే కారణమని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్ర అధ్యక్షుడి సన్మాన కార్యక్రమానికి పట్టణాధ్యక్షున్ని వేదికపైకి పిలవాలని కోరితే శివాజీ మాత్రం ఒకరిని పిలిస్తే మండల నాయకులను సైతం పిలవాల్సి వస్తుందని ఘీంకరించారని, జిల్లా అధిష్టానంపై చర్య తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. కొన్నాళ్ళుగా శివాజీ పట్ల వ్యతిరేకంగా ఉన్నవారే ఈ చర్యలకు పూనుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాదులో కళా ప్రమాణస్వీకారం చేసినపుడు, కళా తొలిసారి జిల్లాకు వచ్చినపుడు కలవని నేతలు ఇన్నాళ్ళ తర్వాత ఒక్కొక్కరు వెళ్ళి అభినందించడంపైనా చర్చ జరుగుతోంది. ఇదంతా జిల్లా మంత్రిని ఒంటరిని చేసేందుకేనన్న ప్రచారమూ ఉంది. -
'పవన్ ఏ ఉద్దేశంతో మాట్లాడారో మాకు తెలీదు'
తిరుపతి: జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడారో లేక ఏ ఉద్దేశంతో మాట్లాడారో మాకు తెలిదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం తిరుపతి పర్యటనలో ఉన్న అచ్చెన్నాయుడు... రాజధాని భూములపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించాలని విలేకర్లు కోరగా... అందుకు అచ్చెన్నాయుడు పై విధంగా సమాధానం మిచ్చారు. ఈ బడ్జెట్లో క్రీడా రంగానికి రూ. 1000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. తిరుపతి, విశాఖ, విజయవాడ నగరాల్లో అంతర్జాతీయ స్టేడియాలు నిర్మిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివారం రాహుల్ గాంధీ..
హోమ్ ఓటింగ్ ప్రారంభం
రాజకీయ లబ్ధి కోసమే దుష్ప్రచారం
నరేంద్ర మోదీ.. అమిత్ షా..
జిల్లాపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టత ఇవ్వాలి
ఆలోచించి ఓటు వేయండి
కేటీఆర్.., హరీశ్రావు..
హెలీప్యాడ్ ఏర్పాటును పరిశీలించిన ఎమ్మెల్యే
జిల్లాల రద్దు లీకులపై సీఎం స్పందించాలి
ప్రమోషన్లు, బదిలీలు తక్షణమే చేపట్టాలి
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement