-
ఒకే రకమైన దర్శనం కల్పించాలి
యాదగిరిగుట్ట: అద్భుత క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో రాబోయే రోజుల్లో భక్తులందరికీ ఒకే రకమైన దర్శనం లభించే విధంగా ప్రభుత్వం, అధికారులు కృషిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్రెడ్డి అన్నారు. యాదాద్రీశుడిని శనివారం జస్టిస్ సుభాష్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసిన జస్టిస్ సుభాష్రెడ్డి, కుటుంబ సభ్యులకు ఆచార్యులు మండపంలో ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం జస్టిస్ సుభాష్రెడ్డి, కుటుంబ సభ్యులు ప్రధానాలయ పునర్నిర్మాణ పనులను చేవేళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే యాదాద్రి క్షేత్రం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. వీఐపీలు, వీవీఐపీలతో పాటు సాధారణ భక్తులకు సైతం శ్రీస్వామివారి దర్శనం అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట జిల్లా జడ్జి, పలువురు న్యాయవాదులు ఉన్నారు. -
రేప్ కేసుల విచారణ తీరుపై ‘సుప్రీం’ కమిటీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోర్టుల్లో అత్యాచార ఘటనల కేసుల విచారణ ఎంత సత్వరంగా జరుగుతోందో పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నియమించారని సోమవారం సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. మహిళలు, చిన్నారులపై పెరిగిపోతున్న లైంగికదాడులు, సంచలనం రేపిన ‘దిశ’ కేసులో నలుగురు నిందితులు ఎదురు కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. -
కార్యదక్షుడు జస్టిస్ సుభాష్రెడ్డి
హైదరాబాద్: కార్యదక్షుడు కాబట్టే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి నియమితులయ్యారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.పి.జీవన్రెడ్డి అన్నారు. శనివారం ఆర్టీసీ కల్యాణ మండపంలో ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ తెలంగాణ ఆధ్వర్యంలో న్యాయవాదుల మహాసమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన సుభాష్రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ జీవన్రెడ్డి మాట్లాడుతూ.. హైకోర్టు న్యాయమూర్తిగా సమర్థవంతంగా పనిచేయడం వల్లనే గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుభాష్రెడ్డి నియమితులయ్యారని అన్నారు. అక్కడ కూడా తన సత్తాను నిరూపించుకోవడంతోపాటు ఆయన ఇచ్చిన తీర్పుల వల్ల మంచి గుర్తింపు రావడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారని కితాబిచ్చారు. సుప్రీంకోర్టులో కూడా సుభాష్రెడ్డి తనదైన శైలిలో మంచి తీర్పులు ఇచ్చి గుర్తింపు పొందుతారని ఆశాబావం వ్యక్తం చేశారు. మాజీ లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్రెడ్డి మాట్లాడుతూ.. అంకితభావం, కార్యదీక్షతో కష్టపడి పనిచేసి సుభాష్రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారని కితాబిచ్చారు. గుజరాత్ ప్రధాన న్యాయమూర్తిగా విజయవంతం కావడం వల్లనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికయ్యారని అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లడం ఆలస్యం అయినప్పటికీ తక్కువ సమయంలో ఎన్నో మంచి తీర్పులు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జీవన్రెడ్డి సుప్రీంకోర్టు జడ్జీగా ఐదేళ్ల నాలుగు నెలల కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చారని.. ఆ తీర్పులను ఇతర దేశాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రానికి గుర్తింపు తెస్తా: జస్టిస్ సుభాష్రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్రెడ్డి మాట్లాడుతూ.. తాను గ్రామీణ వాతావరణం నుంచి వచ్చానని, ఇంటర్లో తెలుగు మీడియం చదివినప్పటికీ డిగ్రీలో ఇంగ్లిష్ మీడియంలో చేరానని చెప్పారు. బాగా కష్టపడి పనిచేయడంతో పాటు పెద్దల ఆశీర్వాదంతో ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. గుజరాత్ ప్రధాన న్యాయమూర్తిగా మంచి గుర్తింపు వచ్చిందని ఇంకా బాగా కష్టపడి పనిచేసి మన రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకొస్తానని అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షులు అనంతరెడ్డి, హరిమోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, రాజేందర్రెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు అనంతసేనరెడ్డి, అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వి.బాలరాజు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, జితేందర్రెడ్డి, బి.జయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభాష్రెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రామయ్యగారి సుభాష్రెడ్డి శుక్రవారం ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ సుభాష్రెడ్డితోపాటు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎంఆర్.షా, జస్టిస్ అజయ్ రస్తోగీలు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ సుభాష్రెడ్డి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనంలో కేసులను విచారించారు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ సుభాష్రెడ్డిని తెలంగాణ రాష్ట్ర కోటా నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నలుగురు న్యాయమూర్తుల నియామకంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 28కి పెరిగింది. సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 31 కాగా, ఈ నెల 29న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్, అలాగే డిసెంబర్ 30న జస్టిస్ మదన్ బి.లోకూర్లు పదవీ విరమణ చేయనున్నారు. -
ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సుభాష్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రామయ్యగారి సుభాష్ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురు జడ్జీలు కూడా సుప్రీం న్యాయమూర్తులుగా నేడు బాధ్యతలు చేపట్టారు. వీరిలో జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అజయ్ రస్తోగిలు ఉన్నారు. వీరిచే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్ర కోటా నుంచి సుభాష్రెడ్డిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కొత్తగా నలుగురు న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టడంతో.. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది. సుప్రీంలో మొత్తం 31 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. ఇంకా మూడు పదవులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలోని మెదక్ జిల్లా శంకరంపేట మండలం కమరం గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుభాష్ రెడ్డి.. మండల కేంద్రంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లోని ఆంధ్రా కాలేజీ నుంచి ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ సాధించారు. ఆ తర్వాత న్యాయవాద వృత్తిలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. వివిధ బాధ్యతలు చేపట్టారు. 2016 ఫిబ్రవరి 13 నుంచి గుజరాత్ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement