-
జట్టుకు ఎంపిక చేయమన్న రిషి సునాక్: ఇప్పుడే కుదరదన్న ఈసీబీ!
యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్ మరోసారి ఇంగ్లండ్ క్రికెటర్లతో మమేకమయ్యారు. ఆట పట్ల మరోసారి తన అభిరుచిని చాటుకున్నారు. దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో తన బ్యాటింగ్ నైపుణ్యాలు ప్రదర్శించారు. కాగా క్రికెట్ను మరింతగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రధాని రిషి సునాక్ 35 మిలియన్ బ్రిటిష్ పౌండ్ల(GBP- British pound sterling ) ప్యాకేజీని ప్రకటించారు. పాఠశాల స్థాయి నుంచే క్రికెట్ పట్ల ఆసక్తి కనబరిచే వారికి ప్రోత్సాహం అందించేందుకు ఈ భారీ మొత్తం ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. దాదాపు తొమ్మిది లక్షల మందికి ప్రయోజనం చేకూర్చేవిధంగా ప్రణాళికలు రచించినట్లు రిషి సునాక్ వెల్లడించారు. ఇక ఈ విషయాన్ని ప్రకటించే క్రమంలో లండన్లో ఆయన.. ఇంగ్లండ్ క్రికెటర్లతో పాటు వర్ధమాన ఆటగాళ్లను కలిశారు. ఈ సందర్భంగా.. ఆండర్సన్తో ఫ్యాన్ బాయ్ మూమెంట్ను సునాక్ షేర్ చేసుకోవడం ఆయన హుందాతనానికి నిదర్శనంగా నిలిచింది. అదే విధంగా.. యువ క్రికెటర్లను సైతం ఉత్సాహరుస్తూ వారికి ఆటోగ్రాఫ్లు ఇచ్చారు సునాక్. కాగా ఆండర్సన్ను ఎదుర్కొనేందుకు తాను ముందుగానే నెట్ సెషన్లో పాల్గొన్నానంటూ రిషి సునాక్ వెల్లడించడం విశేషం. ఇందుకు బదులిచ్చిన ఆండర్సన్ ఆయన అభిమానానికి ఫిదా అయ్యాడు. ఇక ఈ విశేషాలకు సంబంధించిన వీడియో షేర్ చేసిన రిషి సునాక్.. ‘‘ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పిలుపునకు సిద్ధంగా ఉన్నా’’ అని తన సెలక్షన్ గురించి ఈసీబీకి సరదాగా రిక్వెస్ట్ పెట్టారు. ఇందుకు బదులిచ్చిన ఈసీబీ.. ‘‘బాగానే ఆడారు. కాకపోతే మీరు ఇంకొన్ని నెట్ సెషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది’’ అని అంతే సరదాగా స్పందించింది. కాగా 2026లో మహిళా టీ20 ప్రపంచకప్, 2030లో పురుషుల టీ20 వరల్డ్కప్నకు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రమంలో ఈసీబీకి మరింత బూస్ట్ ఇచ్చేలా ప్రధాని రిషి సునాక్ ఈమేరకు ప్యాకేజీ ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో ఆండర్సన్ సహా పలువురు క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. Not bad, perhaps a few more net sessions first 😉 https://t.co/u7AHCOMO08 — England Cricket (@englandcricket) April 5, 2024 -
Sports: తాను '700ల మైలు రాయిని' దాటిన వండర్సన్..!
41 సంవత్సరాల 7 నెలల 8 రోజులు.. ఈ వయసులో అంతర్జాతీయ క్రీడల్లో చాలా మంది రిటైర్మెంట్ తీసుకొని ఎక్కడో ఒక చోట కోచ్గానో లేక వ్యాఖ్యాతగానో పని చేస్తూ ఉంటారు. లేదంటే ఆటకు దూరంగా దానితో సంబంధం లేకుండా కుటుంబంతో సమయం గడుపుతూ ఉంటారు. కానీ జేమ్స్ అండర్సన్ ఇంకా క్రికెట్ మైదానంలో పరుగెడుతూ ఉన్నాడు. పట్టుదలగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థిని నిలువరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ పోరాటతత్త్వమే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఏకంగా 700 వికెట్ల మైలురాయిని అందుకునేలా చేసింది. 21 ఏళ్లుగా సాగుతున్న అంతర్జాతీయ కెరీర్ అతని స్థాయి ఏమిటో చూపిస్తే, అలసట లేకుండా సాగుతున్న ప్రయాణం ఎన్నో అద్భుత ప్రదర్శనలను ప్రపంచ క్రికెట్ అభిమానులకు అందించింది. సాధారణంగా బ్యాటర్లు ఎక్కువ సంవత్సరాలు ఆటలో కొనసాగడంలో విశేషం లేదు. గతంలోనూ చాలామంది ఇంతకంటే ఎక్కువ ఏళ్లు క్రికెట్ ఆడారు. కానీ ఎంతో కఠోర శ్రమతో కూడిన పేస్ బౌలింగ్లో అన్ని ప్రతికూలతలను, గాయాలను దాటి ఒక బౌలర్ ఇలా సత్తా చాటడం ఎంతో అరుదైన విషయం. 2002లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జిమ్మీ అండర్సన్ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ క్రికెట్ ఆల్టైమ్ గ్రేట్లలో ఒకడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. 187 టెస్టు మ్యాచ్లు.. జిమ్మీ అండర్సన్ కెరీర్ ఇది. ప్రపంచ క్రికెట్లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (200) మాత్రమే ఇంతకంటే ఎక్కువ టెస్టులు ఆడాడు. 16 ఏళ్లకే అరంగేట్రం చేసిన బ్యాటర్గా సచిన్తో పోలిస్తే 20 ఏళ్ల వయసులో తొలి టెస్టు ఆడిన అండర్సన్ కెరీర్ ప్రస్థానం పూర్తిగా భిన్నం. టి–20ల కాలంలో నాలుగు ఓవర్లు వేయగానే అలసిపోతున్న ఈతరం బౌలర్లతో పోటీ పడుతూ రోజుకు 15–20 వరకు అంతర్జాతీయ టెస్టుల్లో బౌలింగ్ చేయడం అసాధారణం. వీటికి 194 వన్డేలు అదనం. టెస్టులు, వన్డేలు కలిపి అతను దాదాపు 50 వేల బంతులు బౌలింగ్ చేశాడు. వన్డేలకు దాదాపు 9 ఏళ్ల క్రితమే వీడ్కోలు పలికినా టెస్టుల్లో ఇంకా అదే జోరును అండర్సన్ కొనసాగించి చూపిస్తున్నాడు. ఒకే ఒక లక్ష్యంతో.. జేమ్స్ అండర్సన్ క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడంలో ఎప్పుడూ ఎలాంటి సమస్యా రాలేదు. అతను చిన్నప్పటినుంచే క్రికెట్ అంటే బాగా ఇష్టపడ్డాడు. చూడటంతో పాటు క్రికెట్ కోసమే పుట్టినట్లుగా ఆడేవాడు. అందుకే ఇంట్లోనూ ప్రోత్సాహం లభించింది. స్కూల్ క్రికెట్నుంచే అతను బౌలింగ్పై దృష్టి పెట్టాడు. సాధనతో ఆపై పూర్తి స్థాయి పేస్ బౌలర్గా సత్తా చాటాడు. దాంతో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. స్థానిక లాంక్షైర్ కౌంటీ మైనర్ లీగ్లలో అండర్సన్ సత్తా చాటాడు. దాంతో లాంక్షైర్ ప్రధాన కౌంటీ టీమ్ తరఫున ఆడేందుకు ఎంపికయ్యాడు. అండర్సన్ ఎంత మెరుగ్గా కౌంటీల్లో ప్రభావం చూపించాడంటే లాంక్షైర్ తరఫున కేవలం 3 వన్డేలు ఆడగానే అతనికి ఇంగ్లండ్ జాతీయ జట్టులో చోటు లభించడం విశేషం. తన జెర్సీపై కనీసం తన పేరు, నంబర్ కూడా లేకుండానే హడావిడిగా టీమ్తో కలిసిన అండర్సన్ అడిలైడ్లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన బౌలింగ్ను ప్రదర్శించాడు. దాంతో 2003 వరల్డ్ కప్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇలా మొదలైన ఆరంభం రెండు దశాబ్దాలుగా గొప్పగా సాగుతూనే ఉంది. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలతో.. అండర్సన్ కెరీర్ ఆరంభంలో రెండు పార్శా్వలతో సాగింది. చక్కటి బౌలింగ్తో లయతో సాగుతున్నప్పుడు అతనిలాంటి మంచి బౌలర్ ఎవరూ లేరన్నట్లుగా వికెట్ల వర్షం కురిసింది. కానీ ఒక్కసారి లయ కోల్పోతే అంత చెత్త బౌలర్ లేరన్నట్లుగా బ్యాటర్లు చితకబాదారు. లార్డ్స్ మైదానంలో తన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లోనే ఐదు వికెట్లతో తన రాకను ఘనంగా చాటడం, ఆ తర్వాత కొద్ది రోజులకే పాకిస్తాన్పై వన్డేల్లో హ్యట్రిక్ అతడికి తగిన గుర్తింపును తెచ్చి పెట్టాయి. కానీ అప్పటికే ఇంగ్లండ్ జట్టులో పలువురు సీనియర్లు పాతుకుపోయి ఉండటంతో తగినన్ని అవకాశాలు దక్కలేదు. దాంతో విరామాలతో వచ్చిన అవకాశాల్లో అండర్సన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే 2005 తర్వాత ఇంగ్లండ్ ప్రధాన పేసర్లంతా ఆటకు గుడ్బై చెప్పడంతో వచ్చిన అండర్సన్ ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వెలింగ్టన్లో న్యూజిలాండ్పై చెలరేగి ఐదు వికెట్ల ప్రదర్శనతో జట్టును గెలిపించడంతో టీమ్లో స్థానం సుస్థిరమైంది. సంప్రదాయ స్వింగ్, సీమ్ బౌలింగ్తో పాటు రివర్స్ స్వింగ్ విద్యలో కూడా ఆరితేరిన తర్వాత అండర్సన్ మరింత ప్రమాదకరంగా మారాడు. కెరీర్ ఆరంభంలో తన యాక్షన్ను మార్చుకొని కొంత ఇబ్బందిపడిన అతను కొద్ది రోజులకే మళ్లీ తన పాత్ సైడ్ ఆర్మ్ యాక్షన్కు వచ్చి అద్భుతాలు చేశాడు. ముఖ్యంగా 2010 తర్వాత అండర్సన్ తనను తాను అత్యుత్తమ పేసర్గా తీర్చి దిద్దుకున్నాడు. ఇంగ్లండ్లో హీరో లేదా జీరో అయ్యేందుకు ఎప్పుడూ అవకాశం ఉండే సిరీస్ యాషెస్. సొంత గడ్డపై పలుమార్లు ఆసీస్ బ్యాటర్ల పని పట్టిన అండర్సన్ కెరీర్లో 2010–11 ఆస్ట్రేలియా పర్యటన హైలైట్గా నిలిచింది. ఆసీస్ను వారి సొంతగడ్డపై 3–1తో చిత్తుగా ఓడించడంలో 24 వికెట్లతో అండర్సన్ ప్రధాన పాత్ర పోషించాడు. టెస్టు క్రికెట్పైనే పూర్తిగా దృష్టి పెట్టేందుకు 2015 వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు గుడ్బై చెప్పిన అండర్సన్ తాను అనుకున్నట్లుగా ఈ ఫార్మాట్లో మరిన్ని గొప్ప ప్రదర్శనలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా చెలరేగి.. అండర్సన్ సొంత మైదానాల్లో మాత్రమే రాణిస్తాడని, వాతావరణంలో కాస్త మంచు, తేమ ఉంటేనే స్వింగ్తో చెలరేగుతాడనేది అతనిపై పలు సందర్భాల్లో వచ్చిన విమర్శ. అయితే ఒక్కో ఏడాది ఆటలో రాటుదేలుతూ పోయిన తర్వాత ఇలాంటి విమర్శలకు అతను చెక్ పెట్టాడు. ఇంగ్లండ్లోని అన్ని వేదికలపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లో సహజంగానే అతని పేరు కనిపిస్తుంది. కానీ వీటికి తోడు శ్రీలంకలోని గాలేలో 6 వికెట్లు, కేప్టౌన్లో 5 వికెట్లు, అడిలైడ్లో 5 వికెట్లు, 2012లో నాగ్పూర్లో భారత్పై 4 కీలక వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్రదర్శన.. ఇలా విదేశీ గడ్డపై అండర్సన్ తీసిన వికెట్లు అతని ప్రభావాన్ని చూపించాయి. ఇక అరంగేట్ర టెస్టు నుంచి ఇప్పటి వరకు అతని ఆటలో సాగిన పురోగతి, వేర్వేరు ప్రత్యర్థులపై నమోదు చేసిన గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. మాస్టర్ ఆఫ్ స్వింగ్ నుంచి అతను మాస్టర్ ఆఫ్ ఆల్ కండిషన్స్గా మారాడు. 700 వికెట్లు ముగ్గురే సాధించగా వారిలో మురళీధరన్, వార్న్ స్పిన్నర్లు కాగా అండర్సన్ తొలి పేస్ బౌలర్. ఇతర జట్లతో పోలిస్తే ఇంగ్లండ్ ఎక్కువ టెస్టులు ఆడటం సహజంగానే అండర్సన్కు కలిసి వచ్చినా, అతను ఆటడం మాత్రమే కాకుండా అత్యున్నత ప్రమాణాలు కొనసాగించాడు. వయసు పెరుగుతున్న కొద్దీ విలువ పెరిగే వైన్లాగా అతను మారాడు. అతని వికెట్లను మూడు దశలుగా విడగొడితే; తొలి 44 టెస్టుల్లో సగటు 35 కాగా, తర్వాతి 47 టెస్టుల్లో అది 28కి తగ్గింది. ఇక 2014నుంచి ఆడిన 96 టెస్టుల్లో సగటు ఏకంగా 22.66కి తగ్గడం అంటే బౌలర్గా అతను ఎంత మెరుగయ్యాడో అర్థమవుతుంది. ముఖ్యంగా 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత అండర్సన్ ఏకంగా 220 వికెట్లు తీయడం విశేషం. స్వింగ్కు పెద్దగా అనుకూలించని ఉపఖండపు పిచ్లపై కూడా గత పదేళ్లలో అండర్సన్ 23.56 సగటును నమోదు చేయడం అతను ఎంత ప్రభావం చూపించాడో చెబుతుంది. మురళీధరన్ (800 వికెట్లు)ను చేరుకోవడం చాలా కష్టం కాబట్టి మరో 9 వికెట్లు తీసి షేన్వార్న్ (708)ను దాటడం అండర్సన్ తదుపరి లక్ష్యం. ఇంగ్లండ్ బోర్డు అతనిపై నమ్మకముంచితే, అతని ఘనతలను పరిగణనలోకి తీసుకొని వేటు వేయకుండా మరికొంత కాలం ఆడే అవకాశం కల్పిస్తే సచిన్ అత్యధిక టెస్టుల (200) రికార్డును అండర్సన్ అధిగమించగలడు. ఒకవేళ ఆ లోపే అతని ఆట ముగిసిపోయినా, వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకడిగా అతను సాధించిన ఘనతల విలువ ఏమాత్రం తగ్గదు. — మొహమ్మద్ అబ్దుల్ హాది. -
ఆండర్సన్ ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి
Ind vs Eng- James Michael Anderson 700 Test Wickets: ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి పేసర్గా ప్రపంచ రికార్డు సాధించాడు. టీమిండియాతో ఐదో టెస్టు సందర్భంగా ఆండర్సన్ ఈ ఘనత సాధించాడు. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ధర్మశాలలో నామమాత్రపు ఐదో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా గురువారం మొదలైన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 218 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో.. మూడో రోజు ఆటలో టీమిండియా 477 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అయితే, శనివారం నాటి ఆట ఆరంభమైన కాసేపటికే జేమ్స్ ఆండర్సన్ నైట్ వాచ్మన్ కుల్దీప్ యాదవ్(30)ను పెవిలియన్కు పంపాడు. దీంతో ఆండర్సన్ ఖాతాలో 700వ టెస్టు వికెట్ జమ అయింది. ఈ క్రమంలో.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి పేసర్గా అతడు రికార్డు సాధించాడు. 41 ఏళ్ల వయసులో ఆండర్సన్ ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక- స్పిన్నర్)- 800 షేన్ వార్న్(ఆస్ట్రేలియా- స్పిన్నర్)- 708 జేమ్స్ ఆండర్సన్(ఇంగ్లండ్- పేసర్)- 700* అనిల్ కుంబ్లే(ఇండియా- స్పిన్నర్)- 619 స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్- పేసర్)- 604 View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
Ind vs Eng: టీమిండియా ఘన విజయం.. సిరీస్ 4-1తో సొంతం
India vs England 5th Test Day 3 Updates: టీమిండియా ఘన విజయం ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను భారత్ చిత్తు చేసింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లండ్.. 195 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(84) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ధర్మశాలలో 473/8 ఓవర్నైట్ స్కోరుతో భారత్ శనివారం నాటి ఆట మొదలుపెట్టింది. ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో బుమ్రా తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. భారత తొలి ఇన్నింగ్స్లో 124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 45.5: తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ జడేజా బౌలింగ్లో షోయబ్ బషీర్(13) బౌల్డ్. స్కోరు: 189/9 (45.5). ఆండర్సన్ క్రీజులోకి వచ్చాడు. రూట్ 78 పరుగులతో ఆడుతున్నాడు. రూట్ అర్ధ శతకం 36.2: బుమ్రా బౌలింగ్లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జో రూట్ ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 34.4: బుమ్రా బౌలింగ్లో మార్క్ వుడ్(0) ఎల్బీడబ్ల్యూ. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. షోయబ్ బషీర్ క్రీజులోకి వచ్చాడు. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 34.2: టామ్ హార్లే(20) రూపంలో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. మార్క్వుడ్క్రీజులోకి వచ్చాడు. రూట్ 44 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 141/7 (34.3) ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 26.4: అశ్విన్ బౌలింగ్లో బౌల్డ్ అయిన బెన్ ఫోక్స్(8). ఫలితంగా ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. స్కోరు: 113/6 (26.4). టామ్ హార్లే క్రీజులోకి వచ్చాడు. రూట్ 36 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా కంటే 146 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ 26 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 113/5 భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 103/5 (22.5) జో రూట్ 34 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది. అశ్విన్ తిప్పేస్తున్నాడు.. ఐదో వికెట్ డౌన్ 22.5: అశ్విన్ బౌలింగ్ స్టోక్స్(2) బౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 17.4: నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతున్న బెయిర్ స్టోకు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కళ్లెం వేశాడు. వికెట్ల ముందు అతడిని దొరకబుచ్చుకుని పెవిలియన్కు సాగనంపాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన బెయిర్ స్టో రివ్యూకు వెళ్లగా.. ఫలితం అతడికి అనుకూలంగా రాలేదు. స్కోరు: 94-4(18). బెన్ స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. నిలకడగా బెయిర్ స్టో, రూట్ ఇన్నింగ్స్ 17 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 90/3. బెయిర్ స్టో, రూట్ నిలకడగా ఆడుతుండటంతో ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది. బెయిర్ స్టో 28 బంతుల్లో 38 పరుగులతో ‘బజ్బాల్’ క్రికెట్ ఆడుతున్నాడు. దూకుడుగా ఆడుతున్న బెయిర్ స్టో వందో టెస్టు వీరుడు బెయిర్ స్టో దూకుడుగా ఆడుతున్నాడు. 15వ ఓవర్ ముగిసే సరికి 21 బంతుల్లో 26 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు జో రూట్ 25 బంతుల్లో 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 9.2: మూడో వికెట్ డౌన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్కు చుక్కలు చూపిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే బెన్ డకెట్(2)ను అవుట్ చేసిన అశూ.. అనంతరం మరో ఓపెనర్ క్రాలే(1)ను కూడా వెనక్కి పంపాడు. తాజాగా.. వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(19) రూపంలో మూడో వికెట్ కూడా తానే దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ టాపార్డర్ను కుప్పకూల్చాడు. స్కోరు: 41-3(10) . రూట్ 12, బెయిర్ స్టో ఒక పరుగుతో ఆడుతున్నారు. 5.3: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ అశ్విన్ బౌలింగ్లో సర్ఫరాజ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన క్రాలే(1). జో రూట్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 23-2(6). పోప్ 17 పరుగులతో ఆడుతున్నాడు. 1.5: తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ అశ్విన్ బౌలింగ్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(2) బౌల్డ్. స్కోరు: 2-1. ఒలీ పోప్ క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ క్రాలే సున్నా పరుగులతో ఉన్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) టీమిండియా ఆలౌట్ మూడో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ కుల్దీప్ యాదవ్(30)ని వెనక్కి పంపగా.. షోయబ్ బషీర్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా(20) స్టంపౌట్గా వెనుదిరిగాడు. దీంతో మూడో రోజు ఆటలో.. ఓవర్నైట్ స్కోరుకు కేవలం నాలుగు పరుగులు మాత్రమే జత చేసి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. 124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లండ్ కంటే 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్లలో షోయబ్ బషీర్ అత్యధికంగా ఐదు వికెట్లు దక్కించుకోగా.. టామ్ హార్లే రెండు వికెట్లు తీశాడు. ఇక పేసర్లు జేమ్స్ ఆండర్సన్ రెండు, కెప్టెన్ స్టోక్స్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక గురువారం నాటి తొలి రోజు ఆటలోనే ఇంగ్లండ్ 218 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-1తో గెలుచుకుంది. 124.1: టీమిండియా ఆలౌట్ జస్ప్రీత్ బుమ్రా రూపంలో భారత్ ఆఖరి వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో బుమ్రా స్టంపౌట్ అయ్యాడు. ఫలితంగా 477 (124.1) స్కోరు వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ మీద 259 పరుగలు ఆధిక్యం సంపాదించింది. 123.4: తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా మూడో రోజు ఆట ఆరంభంలోనే ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టీమిండియాకు షాకిచ్చాడు. అతడి బౌలింగ్లో నైట్ వాచ్మన్ కుల్దీప్ యాదవ్(30) వికెట్ కీపర్క్యాచ్గా వెనుదిరిగాడు. ఫలితంగా భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 477/9 (124). బుమ్రా 20, సిరాజ్ సున్నా పరుగులతో ఉన్నారు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ►ఇదిలా ఉంటే.. జేమ్స్ ఆండర్సన్కు ఇది 700వ టెస్టు వికెట్ కావడం విశేషం. రెండో రోజు ఆటలో హైలైట్స్ ►తొలి ఇన్నింగ్స్లో భారత్ 473/8(120 ఓవర్లలో) ►రోహిత్ శర్మ(103), శుబ్మన్ గిల్(110) సెంచరీలు ►రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ ఆధిక్యం 255 పరుగులు ►అరంగేట్రంలో రాణించిన దేవ్దత్ పడిక్కల్(65) ►సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం(56) ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు- ధర్మశాల- తుదిజట్లు ఇండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, దేవ్దత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. ఇంగ్లండ్ జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్లే, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్. -
జేమ్స్ ఆండర్సన్ సూపర్ డెలివరీ.. గిల్కు మైండ్ బ్లాంక్! వీడియో
ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ సంచలన బంతితో మెరిశాడు. అద్భుతమైన బంతితో భారత బ్యాటర్ శుబ్మన్ గిల్ను ఆండర్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. భారత ఇన్నింగ్స్ 63 ఓవర్ వేసిన ఆండర్సన్ రెండో బంతిని గిల్కు ఇన్స్వింగర్గా సంధించాడు. ఆండర్సన్ వేసిన బంతికి గిల్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. గిల్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా బంతి అద్బుతంగా టర్న్ అయ్యి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. ఇది చూసిన గిల్ బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో గిల్ సెంచరీతో చెలరేగాడు. 150 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్లతో 110 పరుగులు చేసింది. గిల్కు ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం విశేషం. ఇక తొలి ఇన్నింగ్స్లో 81 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 366 పరుగులు చేసింది. pic.twitter.com/HuGzNOAzav — Sitaraman (@Sitaraman112971) March 8, 2024
Pagination
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
Advertisement