-
విలీనంతో ఎస్బీఐ ఆస్తులకు దన్ను
విలువ రూ. 30 లక్షల కోట్లకు బలమైన ప్రపంచ స్థాయి బ్యాంకుగా అవతరణ ముంబై : 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనంతో ఎస్బీఐ ఆస్తుల విలువ భారీగా పెరగనుంది. మరెన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ► విలీనం ద్వారా 120 బిలియన్ డాలర్ల (రూ.8.04లక్షల కోట్ల) మేర ఆస్తుల విలువ పెరుగుతుంది. ఈ విలీనం అనంతరం ఎస్బీఐ మొత్తం ఆస్తుల విలువ 36 శాతం పెరిగి 447 (సుమారు రూ.30 లక్షల కోట్లు) బిలియన్ డాలర్లకు చేరుతుంది. ► ఐసీఐసీఐ ఆస్తుల విలువ అప్పుడు ఎస్బీఐ విలువలో పావుశాతంగానే ఉంటుంది. ► 24వేల శాఖలతో, 2,70,000 మంది ఉద్యోగులతో, 58వేల ఏటీఎంలతో 50 కోట్ల మందికి సేవలు అందించే బ్యాంకుగా ఎస్బీఐ ఎదుగుతుంది. ► విలీనం ద్వారా నిర్వహణ సామర్థ్యాలు మెరుగవడంతోపాటు కొత్త క్లయింట్లను చేరుకోవడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకోవడం సాధ్యపడుతుంది. -
ఎస్బీఐతో భారతీయ మహిళా బ్యాంక్ విలీనం!
ఆర్థికశాఖ పరిశీలనలో కీలక ప్రతిపాదన ముంబై: కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం 2013లో ‘మహిళల కోసం’ ఏర్పాటు చేసిన భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) త్వరలో తెరమరుగుకానుందా? ఈ బ్యాంకును దేశీయ ప్రభుత్వ బ్యాకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో విలీనం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తుది నిర్ణయం ఏదీ ఇప్పటివరకూ తీసుకోకపోయినా... విలీన ప్రతిపాదనను ఆర్థికమంత్రిత్వశాఖ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. రూ.1,000 కోట్ల తొలి మూలధనంగా బీఎంబీ ప్రారంభమైంది. నాకు తెలియదు: ఎస్బీఐ చీఫ్ కాగా ఈ వార్తల గురించి తనకేమీ తెలియదని ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ప్రతిపాదన ఉన్నట్లు తన దృష్టికి రాలేదని, తనను ఎవ్వరూ సంప్రదించలేదని తెలిపారు. ఒకవేళ ఈ ప్రతిపాదనను క్యాబినెట్లో చర్చించివుండవచ్చని సైతం అభిప్రాయపడ్డారు. ఈ విలీనం జరిగితే ఎస్బీఐకి ఎటువంటి ఇబ్బందీ ఉండబోదని సైతం ఆమె వ్యాఖ్యానించారు. అతి చిన్న బ్యాంక్ అయినప్పటికీ, అది విలీనానికి ఎటువంటి అడ్డంకీ కాబోదన్నారు. బీఎంబీ గురించి... ప్రస్తుతం ఈ బ్యాంకుకు దేశంలో దాదాపు 60 శాఖలు ఉన్నాయి. పబ్లిక్ రంగ బ్యాంకుల్లో బీఎంబీ అన్లిస్టెడ్ సంస్థ. మహిళా ఆర్థిక సాధికారత లక్ష్యంగా ఈ బ్యాంక్ ఏర్పాటయ్యింది. 2013-14లో ఆదాయం రూ.45.29 కోట్లు. 2014 మార్చి నాటికి బ్యాంక్ వ్యాపారం రూ.175 కోట్లు. -
భారతీయ మహిళా బ్యాంక్
మహిళ కష్టపడి డబ్బు సంపాదిస్తే సరిపోతుందా? దాన్ని దాచుకునే దారి కూడా ఉండాలి కదా! ఇక్కడ మాట్లాడుతున్నది పెద్ద ఉద్యోగాలు చేస్తూ వేలు, లక్షల రూపాయలు సంపాదించే మహిళల గురించి కాదు.. రోజు కూలీ చేసుకునే సామాన్య మహిళకు పొదుపు చేసుకునేందుకు భద్రమైన చోటు కావాలి. బ్యాంక్లో నాలుగు పైసలుంటే ఉండే భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్క భారతీయ మహిళకూ బ్యాంక్లో అకౌంటు ఉండాలనే లక్ష్యంతో గతేడాది ముంబైలో ‘భారతీయ మహిళా బ్యాంక్’ నెలకొల్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35 భారతీయ మహిళా బ్యాంక్లున్నాయి. పందొమ్మిదో బ్రాంచ్గా హైదరాబాద్లో వెలసిన బీఎమ్బీ.. అకౌంట్ల ఓపెనింగ్లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. - భువనేశ్వరి ఈ ఏడాది మార్చిలో అమీర్పేట దగ్గర భారతీయ మహిళా బ్యాంక్ (బీఎమ్బీ)ని నెలకొల్పిన కొత్తలో సిబ్బంది పడ్డ పాట్లు అన్నీఇన్నీ కావు. ‘బ్యాంక్లో మొత్తం ఆరుగురు మహిళా ఉద్యోగులం ఉన్నాం. మా బ్యాంక్ చుట్టూ మరో నాలుగు ఇతర బ్యాంకులున్నాయి. ఎవరొచ్చినా వాటిలోకే వెళ్లేవారు. ఒక్కరు కూడా మా బ్యాంకు వైపు తొంగి చూసేవారు కాదు. ‘మహిళా బ్యాంక్లో సొమ్ము దాచుకోవడం ఏంటమ్మా..’ అంటూ హేళన చేసేవారు ఎదురయ్యారు. లాభం లేదని మేమంతా కుర్చీలు వదిలేసి బ్యాంక్ బయట మెట్లపై కూర్చొని అటుగా వచ్చేవారికి మా బ్యాంక్ గురించి చెప్పడం మొదలుపెట్టాం. చాలావరకూ మహిళలకే చెప్పేవాళ్లం. కొందరు బ్యాంక్ లోపలికి వచ్చి మరిన్ని వివరాలు తెలుసుకుని అకౌంట్ ఓపెన్ చేసేవారు. కొన్ని రోజులు గడిచాక మేం మా సీట్లలో కూర్చుని పనిచేయడం మొదలుపెట్టాం’ అంటూ తమ బ్రాంచ్ ఓపెన్ అయిన తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు సీనియర్ మేనేజర్ సుచరిత. క్యాంప్.. ఆపరేషన్.. మహిళా ఖాతాదారుల సంఖ్య వేగంగా పెంచాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంక్ సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేశారు. వారాంతాల్లో మురికివాడలకు వెళ్లి అక్కడి మహిళల్ని కలసి కౌన్సెలింగ్ ఇచ్చి వారితో ఖాతాలు తెరిపించడం మొదలుపెట్టారు. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో విరివిరిగా క్యాంపులు నిర్వహించారు. ఫలితంగా.. పట్టుమని పదినెలలు కూడా పూర్తి కాకుండానే బ్యాంకులో అకౌంట్ల సంఖ్య 7 వేలకు చేరింది. ఇందులో ఆరున్నరవేల ఖాతాలు మహిళలవే కావడం విశేషం. ‘పేద, సామాన్య మహిళలు ఏదో ఒక పనిచేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్నారు. కానీ వాటిని పొదుపు చేసుకునే తీరు, దారి తెలియక ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారు ఎక్కడున్నారో ముందుగా ఎంక్వయిరీ చేసుకుని వారి ఇళ్లకు వెళ్లి.. బీఎమ్బీ గురించి వివరించాం. అప్పుడప్పుడు క్యాంపులు నిర్వహించాం. ‘బ్యాంకు ఖాతా వల్ల ఉపయోగం ఏంటి..?’ అనేవారికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తున్నాం..’ అని వివరించారు మేనేజర్ విశాలిని. నమ్మకమే పూచీకత్తు.. మహిళలకు పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వడం బీఎమ్బీకున్న ప్రత్యేకత. మామూలుగా అయితే ష్యూరిటీ లేనిదే రూపాయి కూడా లోన్ ఇవ్వరు. అయితే మహిళా సాధికారికత కోసం ప్రత్యేక పథకం కింద బీఎమ్బీ పూచీకత్తు లేని రుణాలు అందిస్తోంది. ‘కర్రీ పాయింట్లు, క్రష్లు, క్యాటరింగ్ వ్యాపారాలు, బ్యూటీపార్లర్లు వంటి చిన్న చిన్న వ్యాపారాలకు మహిళల దగ్గర ఎలాంటి పూచికత్తులు కోరడం లేదు మేం. ఆసక్తి ఉన్న మహిళలతో మేమే దగ్గరుండి వ్యాపారం పెట్టిస్తున్నాం. అలా ఇప్పటివరకూ వంద మంది మహిళలతో చిన్న వ్యాపారాలు పెట్టించాం’ అని వివరించారు బ్యాంక్ ఉద్యోగి సుచరిత. ఖాతాలు తెరిపించడం, వ్యాపారాలు పెట్టించడంతో ఆపకుండా.. కార్పొరేట్ రంగంలో కూడా మహిళలకు అండగా నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
వెయ్యి కోట్ల డిపాజిట్లపై మహిళా బ్యాంక్ దృష్టి
ముంబై: భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) 2015 మార్చి నాటికి రూ.1,000 కోట్ల డిపాజిట్లు, రూ.800 కోట్లరుణ మంజూరు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చైర్మన్ అండ్ మేనేజింగ్ (సీఎండీ) డెరైక్టర్ ఉషా అనంత సుబ్రమణియన్ తెలిపారు. ఇక్కడ శనివారం బ్యాంక్ 35వ బ్రాంచ్ ప్రారంభించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుత బ్యాంక్ డిపాజిట్లు రూ. 300 కోట్లుకాగా, రుణ పరిమాణం రూ.500 కోట్లుగా ఉంది. మార్చి నాటికి బ్రాంచ్ నెట్వర్క్ సంఖ్యను 80కి పెంచాలన్నది కూడా లక్ష్యం. ముఖ్యంగా ఈ విషయంలో ద్వితీయ, తృతీయ పట్టణాల్లో బ్రాంచీల ప్రారంభానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎండీ తెలిపారు. -
మహిళా బ్యాంక్ ‘రూపే’ డెబిట్ కార్డ్
న్యూఢిల్లీ: ఈఎంవీ(యూరో పే, మాస్టర్ కార్డ్, వీసా) చిప్తో కూడిన రూపే డెబిట్ కార్డులను భారతీయ మహిళా బ్యాంక్(బీఎంబీ) గురువారం ప్రారంభించింది. ఎన్ఎఫ్ఎస్ నెట్వర్క్లోని 1.73 లక్షలకుపైగా ఏటీఎంలు, 9.89 లక్షల వాణిజ్య సముదాయాలు, 15 వేలకుపైగా ఆన్లైన్ మర్చెంట్ సైట్లలో వీటిని అనుమతిస్తారని బ్యాంక్ సీఎండీ ఉషా అనంత సుబ్రమణియన్ తెలిపారు. తమ ఖాతాదారులకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సేవలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement