-
నేనింకా రిటైర్ కాలేదు.. రిటైర్మెంట్ కథనాలను కొట్టిపారేసిన మేరీ కోమ్
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఇవాల్టి ఉదయం నుంచి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా కోమ్ ఈ ప్రచారంపై స్పందిస్తూ.. తన రిటైర్మెంట్పై వచ్చిన వార్తాల్లో ఎంత మాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని.. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే వ్యక్తిగతంగా మీడియా ముందుకు వస్తానని ఆమె తెలిపింది. ఈ మేరకు కోమ్ ప్రముఖ మీడియా సంస్థకు వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే, 41 ఏళ్ల మేరీ కోమ్ మహిళల బాక్సింగ్లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్గా, ఒలింపిక్ విన్నర్గా (2012 ఒలింపిక్స్లో 51 కేజీల విభాగంలో కాంస్య పతకం) నిలిచిన కోమ్.. పురుష బాక్సర్లు కూడా సాధించలేని ఎన్నో ఘనతలు సాధించి చాలా సందర్భాల్లో విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. ఓవరాల్గా మేరీ కోమ్ తన కెరీర్లో 13 స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలను సాధించి బాక్సింగ్ లెజెండ్గా గుర్తింపు తెచ్చుకుంది. మేరీ కోమ్ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆమెకు 2002లో అర్జున అవార్డు, 2009లో ఖేల్ రత్న అవార్డు, 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసింది. మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కోమ్ రింగ్లో ఎన్నో అపురూప విజయాలు సాధించి ఔరా అనిపించింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన బాక్సింగ్ దిగ్గజం
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన ప్రకటన చేసింది. ఇకపై బాక్సింగ్ రింగ్లోకి దిగేది లేదని ప్రకటించింది. వయో పరిమితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అన్ని కేటగిరీల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది. భవిష్యత్లో బాక్సింగ్తో అనుసంధానమై ఉంటానని తెలిపింది. కాగా, అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) నిబంధనల ప్రకారం 40 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు ప్రొఫెషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లలో పాల్గొనడానికి అనుమతి లేదు. గతేడాదే ఏజ్ లిమిట్ను దాటిన 41 ఏళ్ల మేరీ కోమ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల బాక్సింగ్లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్గా, ఒలింపిక్ విన్నర్గా (2012 ఒలింపిక్స్లో 51 కేజీల విభాగంలో కాంస్య పతకం) నిలిచిన కోమ్.. పురుష బాక్సర్లు కూడా సాధించలేని ఎన్నో ఘనతలు సాధించి చాలా సందర్భాల్లో విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. ఓవరాల్గా మేరీ కోమ్ తన కెరీర్లో 13 స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలను సాధించి బాక్సింగ్ లెజెండ్గా గుర్తింపు తెచ్చుకుంది. మేరీ కోమ్ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆమెకు 2002లో అర్జున అవార్డు, 2009లో ఖేల్ రత్న అవార్డు, 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసింది. మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కోమ్ రింగ్లో ఎన్నో అపురూప విజయాలు సాధించి ఔరా అనిపించింది. -
ఔరా... మేరీ!
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ తానేంటో ఇది వరకే చాలాసార్లు నిరూపించుకుంది. అలాంటి చాంపియన్ బాక్సర్ తనకు పతకాలు తెచ్చే కేటగిరీ (48 కేజీలు) కోసం వీరోచిత కసరత్తే చేసి ఔరా అనిపించింది. కేవలం 4 గంటల్లోనే 2 కిలోల బరువు తగ్గింది. పోలాండ్లో జరిగిన బాక్సింగ్ చాంపియన్షిప్ కోసం అక్కడికి వెళ్లేసరికి ఆమె బరువు 50 కేజీలుగా ఉంది. పోటీలకు ముందు నిర్వహించే వేయింగ్ కార్యక్రమానికి మరో 4 గంటలు సమయం మాత్రమే ఉండటంతో బరువు తగ్గించుకోవడంపై దృష్టి సారించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏకబిగిన స్కిప్పింగ్ చేసింది. ఆమె పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది. వేయింగ్ సమయానికి సరిగ్గా 48 కేజీల బరువుతో పోటీకి అర్హత సాధించింది. అనంతరం తన పంచ్ పవర్తో షరామాములుగా బంగారు పతకం గెలిచింది. దీనిపై ఆమె మాట్లాడుతూ ‘ఒకవేళ వెయింగ్లో 48 కేజీలకు పైబడి ఉంటే నాపై అనర్హత వేటు పడేది. అందుకే 4 గంటలపాటు తీవ్రంగా చెమటోడ్చాను. వేయింగ్ సమయానికి సరైన బరువుతో సిద్ధమయ్యాను’ అని చెప్పింది. -
ఆసియా క్రీడలకు హుసాముద్దీన్
న్యూఢిల్లీ: రెండేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోన్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్కు తగిన గుర్తింపు లభించింది. వచ్చే ఆగస్టు–సెప్టెంబర్లో ఇండోనేసియా వేదికగా జరిగే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బాక్సింగ్ జట్టులో హుసాముద్దీన్కు (56 కేజీలు) స్థానం దక్కింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల హుసాముద్దీన్ ఏప్రిల్లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించాడు. గతవారం జర్మనీలో జరిగిన కెమిస్ట్రీ కప్ అంతర్జాతీయ టోర్నీలో హుసాముద్దీన్ స్వర్ణం దక్కించుకున్నాడు. ఫలితంగా ఎలాంటి ట్రయల్స్ లేకుండానే అతనికి జట్టులో బెర్త్ ఖాయమైంది. భారత పురుషుల బాక్సింగ్ జట్టు: అమిత్ పంగల్ (49 కేజీలు), గౌరవ్ సోలంకి (52 కేజీలు), మొహమ్మద్ హుసాముద్దీన్ (56 కేజీలు), శివ థాపా (60 కేజీలు), ధీరజ్ (64 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు). మహిళల జట్టు: సర్జూబాలా దేవి (51 కేజీలు), సోనియా లాథెర్ (57 కేజీలు), పవిత్ర (60 కేజీలు). -
'రియోలో పతకం సాధిస్తా'
న్యూఢిల్లీ: త్వరలో బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్లో పతకం సాధిస్తానని భారత బాక్సర్ వికాస్ క్రిషన్ పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ప్రపంచ క్వాలిఫయింగ్ పోటీలో వికాస్ క్రిషన్(75కేజీ) సెమీస్ కు చేరి రియో అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే రియోలో కూడా పతకం సాధిస్తాననే ధీమా వ్యక్తం చేశాడు. ' నాకు రియోలో పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. కనీసం కాంస్య పతకమైనా సాధిస్తా. రెండు బౌట్లు గెలిస్తే కాంస్య పతకం గెలిచే అవకాశ ఉంది. నా వరల్డ్ ర్యాంకింగ్ను బట్టి రియోలో డ్రా కూడా నాకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నా. తొలి రెండు బౌట్లలో కఠినమైన ప్రత్యర్థులు ఎదురుపడకపోవచ్చు. ఇదే కేటగిరిలో గతంలో విజేందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. కనీసం కాంస్య పతకాన్ని సాధిస్తానని నాకు కూడా బలమైన నమ్మకం ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్లో పతకం సాధించలేకపోయా. ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చిన అవకాశాన్ని వదులుకోను. పతకం సాధించడానికి శతవిధిలా ప్రయత్నిస్తా' వికాస్ క్రిషన్ తెలిపాడు. తాను రియో ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తానని తొలుత అనుకోలేదన్నాడు. వరల్డ్ క్వాలిఫయింగ్ పోటీలకు తీవ్రమైన ఒత్తిడిలో సన్నద్దమయ్యానని, ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా శ్రమించానన్నాడు. దీంతో ఫలితాన్ని సాధించానన్నాడు. ఈ పోరులో మూడు బౌట్లను ఏకపక్షంగా గెలిచి సత్తాచాటడంతో తనపై నమ్మకం పెరిగిందన్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement