-
సిరాజ్ పెర్ఫార్మెన్స్కు ఆనంద్ మహీంద్రా ఫిదా.. కార్ ఇచ్చేయండి సార్..
భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆసియా కప్-2023 (Asia Cup) ఫైనల్ మ్యాచ్ కొలొంబో వేదికగా ఈరోజు (సెప్టెంబర్ 17) జరుగుతోంది. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే ఆల్అవుట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 51 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో ఆసియా కప్ భారత్ వశమైంది. కాగా మొదటి ఇన్నింగ్స్లో బౌలింగ్కు దిగిన భారత్ బౌలర్లు విజృంభించారు. శ్రీలంక టాప్ బ్యాంటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ముఖ్యంగా నాలుగో ఓవర్లో భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కేవలం నాలుగు పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో సిరాజ్ 6 వికెట్లు సాధించాడు. మహమ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్కు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఫిదా అయ్యారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టారు. సిరాజ్ ప్రదర్శనకు సంబంధించి ఐసీసీ చేసిన ట్వీట్ను ట్యాగ్ చేస్తూ మీరు ఒక మార్వెల్ అవెంజర్ అంటూ మహమ్మద్ సిరాజ్ను అభినందించారు. ఈ పోస్ట్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పలువురు తమకు తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు. ‘సార్ సిరాజ్కు ఎస్యూవీ గిఫ్ట్ ఇచ్చేయండి’ అంటూ కోరగా దానికి ఆనంద్ మహీంద్ర స్పందిస్తూ కచ్చితంగా ఇస్తానంటూ పేర్కొన్నారు. I don’t think I have EVER before felt my heart weep for our opponents….It’s as if we have unleashed a supernatural force upon them… @mdsirajofficial you are a Marvel Avenger… https://t.co/DqlWbnXbxq — anand mahindra (@anandmahindra) September 17, 2023 -
అర్షదీప్ను ఇక్కడ ప్రాక్టీస్ చేయించండి.. నో బాల్స్ ఎలా వేస్తాడో చూద్దాం..!
టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్ నో బాల్స్ వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేల ఓ ఆసక్తికర కార్టూన్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. శ్రీలంకతో మొన్న (జనవరి 5) జరిగిన రెండో టీ20లో ఏకంగా 5 నో బాల్స్ వేసి టీమిండియా ఓటమికి పరోక్ష కారణమైన అర్షదీప్కు భారత అభిమాని ఒకరు కార్టూన్ ద్వారా ఓ సలహా ఇచ్చాడు. అర్షదీప్ జీవితంలో ఒక్క నో బాల్ కూడా వేయకుండా ఉండాలంటే ఇక్కడ ప్రాక్టీస్ చేయించండి అంటూ ఓ కార్టూన్ను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ కార్టూన్లో బౌలర్ పర్వతం అంచున ఉన్న క్రీజ్ గుండా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బౌలర్ క్రీజ్ దాటి నో బాల్ వేస్తే లోయలో పడిపోతాడు. అర్షదీప్ కోసం సరదాగా పోస్ట్ చేసిన ఈ కార్టూన్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇది చూసిన నెటిజన్లు.. అవును ఇది కరెక్టే.. ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తే అర్షదీపే కాదు ప్రపంచంలో ఏ బౌలర్ కూడా క్రీజ్ దాటి నో బాల్ వేసే సాహసం చేయలేడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. This is the Special pitch to practice for #arshdeepsingh #INDvSL #UmranMalik pic.twitter.com/FeqwaZUVeq — Abhijit sarkar (@singlecoreGG) January 6, 2023 కాగా, శ్రీలంకతో మ్యాచ్లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ బౌల్ చేసిన అర్షదీప్ వరుసగా మూడు నోబాల్స్ సంధించాడు. ఆతర్వాత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మరో రెండు నో బాల్స్ వేసి అభిమానులు, సహచరులతో సహా విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేశాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 2 ఓవర్లు వేసిన అర్షదీప్ ఏకంగా 37 పరుగులు సమర్పించుకుని టీమిండియా ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు. ఇదిలా ఉంటే, లంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైన విషయం తెలిసిందే. 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ మావీ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఇవాళ (జనవరి 7) రాజ్కోట్ వేదికగా జరుగనుంది. -
చక్దా ఎక్స్ప్రెస్.. స్పెషల్ స్టోరీ ఆన్ ఇండియన్ టైగ్రెస్ ఝులన్ గోస్వామి
కళ్లల్లో లక్ష్యం.. పరుగులో వేగం.. వెరసి స్టేడియంలో మెరుపు.. పిచ్లో స్టంప్ అవుట్స్! ఆ టైగ్రెస్ పేరు ఝులన్ గోస్వామి! ఆమె ఉంటే సొంత జట్టుకి ఉత్సాహం.. ప్రత్యర్థి జట్టుకి ఇరకాటం! విమెన్ క్రికెట్కు ఆమె ఓ సిగ్నేచర్! 2022 సెప్టెంబర్ 24.. లండన్లోని లార్డ్స్ స్టేడియం.. 39 ఏళ్ల లెజండరీ క్రికెటర్ ఝులన్ గోస్వామి రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ సమయం! టాస్ వేయాల్సిందిగా ఆమెనే పిలిచింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కన్నీళ్లతో. ఆ మ్యాచ్లో ఝులన్ తన కెరీర్లోనే ఆఖరి బాల్ వేస్తున్నప్పుడు టీమ్తో పాటు ప్రేక్షకుల మనసూ బరువెక్కింది. మ్యాచ్ అయిపోయాక ఇంగ్లండ్ టీమ్.. ఇండియా టీమ్ ఆమెకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. క్రికెటే జీవితంగా భావించిన ఝులన్కు అది కోరుకున్న నిష్క్రమణే అయినా.. తన శరీరం నుంచి హృదయాన్ని వేరు చేస్తున్న వేదన.. ఆమె బౌలింగ్ అంత వేగంగా పొట్టలోంచి ఉబికి వస్తున్న దుఃఖం కన్నీళ్లుగా కారకుండా కష్టంగా ఆపుకొంది! తన ఎడబాటుతో ఝులన్ను అంత వేదనకు గురిచేసిన ఆ ఆట ఆమెకు పరిచయమై ఆసక్తి కలిగిన సందర్భం.. 1992.. వరల్డ్ కప్! ఝులన్ వాళ్ల అన్న, కజిన్స్ క్రికెట్కు పెద్ద ఫ్యాన్స్. దాంతో టీవీలో వస్తున్న 1992 వరల్డ్ కప్ మ్యాచెస్ను ఉత్కంఠతో చూస్తున్నారు. వాళ్లతోపాటు పదేళ్ల ఝులన్ కూడా చూడాల్సి వచ్చింది అనివార్యంగా. అప్పటిదాకా ఆమె దృష్టిలో ఆటంటే ఫుట్బాలే. కానీ ఆ వరల్డ్ కప్ ఆమె దృష్టిని మార్చేసింది. క్రికెట్ మీదకు మళ్లించింది. ఆసక్తిని కలిగించింది. నాటినుంచి గల్లీలో అబ్బాయిలతో కలసి ఆడడం స్టార్ట్ చేసింది. బౌలింగ్ అంటే ఇష్టం. కానీ స్లోగా చేసేది. దాంతో అబ్బాయిలంతా ఆమెను గేలి చేసేవాళ్లు. ఆ హేళన ఆమెలో కసిని పెంచింది.. ఎంతలా అంటే బౌలింగ్ వేగం గంటకు 120 కిలోమీటర్లకు చేరి వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్గా ఆమెను నిలబెట్టేంతగా! క్రికెటే లక్ష్యంగా మారిన సమయం.. కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్.. 1997మహిళా క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతోంది. ఆ స్టేడియంలో ఝులన్ బాల్ గర్ల్. అమ్మాయిలు క్రికెట్ ఆడుతుంటే చూడటం అదే తొలిసారి. బెలిండా క్లార్క్ ఆట ఆమెను కట్టిపడేసింది.. క్రికెట్ను ప్రేమించేలా చేసింది. అంతే అప్పటికప్పుడు ఝులన్ నిర్ణయించేసుకుంది ఏది ఏమైనా తాను కూడా భారతదేశం తరపున ఆడాలని! కానీ తనుంటున్న చక్దా పల్లెటూరు. బడి అంటే ఓకే కానీ ఆటలను నేర్పించేంత సౌకర్యాలు తన ఊళ్లో లేవు. శిక్షణ కోసం కోల్కతా వెళ్లాల్సిందే. ఝులన్ నోటి వెంట ఆ మాట వినడమే ఆలస్యం ‘వద్దు’ అని చెప్పేశారు అమ్మా, నాన్న ముక్త కంఠంతో. ఆడపిల్లకు చదువుతో పాటు ఆట, పాట ఉండాలి అంటే ఏకంగా క్రికెట్కే గురి పెడతావా? పెళ్లికావాల్సిన పిల్లవి.. రేప్పొద్దున ఏదన్నా తేడా జరిగితే పెళ్లి అవుతుందా? అంటూ ఆందోళనా వ్యక్తం చేశారు. కాని దేశానికి స్వాతంత్య్రం సిద్ధించకముందు పుట్టిన ఝులన్ నానమ్మకు తెలుసు ఆడపిల్లకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు ఎంత అవసరమో! అందుకే ‘ఆడపిల్లలు అన్నిట్లో ముందుండాలి. దేనికీ అధైర్యపడొద్దు. నచ్చిన పని చేయాలి’ అంటూ ఝులన్ను ప్రోత్సహించింది. ‘నాకు రెండేళ్లు టైమ్ ఇవ్వండి.. క్రికెట్లో ఝులన్ను స్టార్ను చేస్తా’ అంటూ కోచ్ స్వపన్ సాధు కూడా ఆమె కుటుంబాన్ని ఒప్పించాడు. ‘ఎంతో మంది ఆడ పిల్లలకు శిక్షణ నిచ్చా.. కాని నీలాగా హై ఆర్మ్ బౌలింగ్ చేసేవాళ్లను చూడలేదు. ఇంత టాలెంట్ని వృథా పోనివ్వను. క్రికెట్కే నిన్ను ఓ అసెట్లా తీర్చిదిద్దుతా’ అంటూ కోచ్గానే కాదు గైడ్, ఫిలాసఫర్గా ఆమెకు అండగా నిలిచాడు స్వపన్ సాధు. అలా ఝులన్ తన క్రికెట్ కలను నేరవేర్చుకోవడానికి.. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కోల్కతా ప్రయాణమైంది. 2007– 08 నుంచి ఆటగాళ్లకి ర్యాంకింగ్ సిస్టమ్ మొదలైంది. బౌలర్లలో ఝులన్ది నంబర్ వన్ ర్యాంక్. ఐసీసీ ఆమెకు గోల్డెన్ ఆర్మ్ బ్యాండ్ను బహుకరించింది. అలా కోచ్ ఊహించినట్టుగానే క్రికెట్ స్టార్ అయింది. ఓ ‘అద్భుతం’గా రికార్డ్ అయింది! ‘ప్రతిరోజూ ఉదయం ఏడున్నర కల్లా గ్రౌండ్లో ఉండాల్సిందే. లేకపోతే ఆరోజు ఆడనిచ్చేవాడు కాదు కోచ్. అందుకే పొద్దున్నే ఐదింటికల్లా సీల్దా నుంచి బాలిగంజ్ ట్రైన్లో బయలుదేరేదాన్ని. అందులో అందరూ స్పోర్ట్స్పర్సన్సే ఉండేవారు. అబ్బాయిలు, అమ్మాయిలం ఒక గ్రూప్గా బోల్డు కబుర్లు చెప్పుకుంటూ వెళ్లేవాళ్లం. పొరపాటున ట్రైన్ మిస్ అయితే జీవితంలో ఒకరోజు కోల్పోయిన ఫీల్ ఉండేది. ఏమైనా అవి బంగారు రోజులు’ అంటూ తన కోచింగ్ రోజులను గుర్తు చేసుకుంటుంది ఝులన్. ‘మా ఆటకు స్టేడియం ఖాళీగా ఉంటుంది. జనం కొట్టే జేజేలు, కేరింతలు లేకున్నా మా ఉత్సాహం ఏ మాత్రం తగ్గదు. నాకైతే ఎదురుగా బ్యాట్తో సిద్ధంగా ఉన్న ప్రత్యర్థి, స్టంప్స్ మాత్రమే కనిపించేవి. ప్రత్యర్థిని ఎలా ఔట్ చేయాలన్న ఏకైక లక్ష్యంతో దూసుకుపోయేదాన్ని’ అంటూ తన ఆట తీరును నెమరువేసుకుంటుంది ఝులన్. రిటైర్మెంట్ తర్వాత.. మ్యాచెస్లేని రోజులను ఊహించడం కష్టమే అయినా క్రికెట్ వల్ల వాయిదా పడ్డ పనులెన్నిటినో చేసుకోవడానికి కావల్సినంత సమయం దొరికింది అని తన మనసుకు నచ్చజెప్పుకుంటోంది ఝులన్. ‘ఇప్పుడిక దేనికీ ఏ రోక్టోక్ (ఆటంకం) లేదు. బిందాస్గా స్ట్రీట్ ఫుడ్ తింటా.. చక్కగా దుర్గా పూజను ఆస్వాదిస్తా’నంటూ తనేం చేయాలను కుందో చెప్పు కొచ్చింది. ‘2009 ప్రపంచ కప్ తర్వాత రిటైర్ అయిపోవాలి అనుకున్నా. ఇప్పటికి ఆ నిర్ణయం తీసుకోగలిగా. ఇండియా జెర్సీ వేసుకుని గ్రౌండ్లోకి వెళ్లడం, బౌలింగ్ చేయడం, నేషనల్ యాంథమ్ పాడటం వంటి అనుభూతులన్నిటినీ మిస్ అవుతాను’ అంటూ రిటైర్మెంట్ మిగిల్చే లోటునూ పంచుకుంది. ‘నా తొలి టెస్ట్ మ్యాచ్, తొలి వన్ డే మ్యాచ్, టీ20 డెబ్యూ కూడా ఇంగ్లండ్తోనే. చిత్రమేంటంటే నా ఆఖరి మ్యాచ్ కూడా ఇంగ్లండ్తోనే. బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలించిన చరిత్ర వింటూ పెరిగినందువల్లో ఏమో ఇంగ్లండ్ అంటే నాకు కోపం. ఆ సంగతి మా కెప్టెన్కీ తెలుసు. ఇంగ్లండ్తో మ్యాచ్ అప్పుడు ‘నీ కసికొద్దీ బాల్ని కొట్టిరా’ అంటూ బౌలింగ్కు పంపించేది’ అని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ఝులన్. గ్రాఫ్ అండ్ గ్రేస్ 2007–ఐసిసి విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా గౌరవం పొందింది. (2008–2011)–విమెన్స్ క్రికెట్ కెప్టెన్ 204 మ్యాచుల్లో 255 వికెట్లతో అత్యధికంగా వికెట్లు తీసుకున్న ప్లేయర్గా నిలిచింది. 2010–అర్జున, 2012–పద్మశ్రీ అవార్డులను అందుకుంది. అనుష్క శర్మ నటిస్తున్న ఝులన్ బయోపిక్ చక్దా ఎక్స్ప్రెస్ నెట్ఫ్లిక్స్లో రాబోతోంది. ఆటకు అన్యాయం చేస్తానేమో అనే భయంతో పెళ్లి కూడా వద్దనుకుంది. కొన్ని ఫ్యాషన్ షోల్లోనూ పాల్గొంది. ఝులన్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది ప్రభుత్వం. జె.. పాజీ.. బాబుల్ టీమ్లో నేనే వరస్ట్ డాన్సర్నని ఆట పట్టిస్తారంతా. నేను క్రికెటర్ని మరి.. డాన్సర్ని కాదుగా! టీమ్లో అల్లరిపిల్ల అంటే వేద. ఝులన్ దీదీ.. ఝులన్ దీ.. ఝులన్ నుంచి ఇప్పుడు జె అని పిలిచేవరకు వచ్చింది ఆ పిల్ల తీరు. ‘నా పేరుమొత్తం కట్ చేసేశావ్, నన్ను టీమ్ నుంచి బయటకు మాత్రం పంపకు’ అని జోక్ చేసేదాన్ని. హర్మన్ పూర్తిగా పంజాబీ యాక్సెంట్లోనే మాట్లాడుతుంటుంది. నాకొచ్చిన ఒకేఒక్క పంజాబీ పదం పాజీ. నేను తనని పాజీ అనేదాన్ని. అలా తను నాకు పాజీ అని పేరు పెట్టేసింది. చాలామంది బాబుల్ అని కూడా పిలుస్తారు. ఝులన్ గురించి మిథాలి.. ‘నాకు ఝులన్ అండర్ 19లో రాయ్ బరేలీలో ఆడినప్పటి నుంచి తెలుసు. అప్పుడు గ్రౌండ్ వెనుక ఉన్న హాస్టల్లో మాకు బస. నా గది కిటికీ నుంచి ఝులన్ను మొదటిసారి చూశా. బోరింగ్ పంప్ కొట్టి బకెట్లో నీళ్లు నింపి అక్కడే కూర్చుని బ్రష్ చేసుకుంటోంది. తన మొదటి బంతి క్యాచ్ చేయడం కూడా నాకు గుర్తు. చాలా కష్టపడి ఆడే అమ్మాయి. ప్రాక్టీస్ టైమ్లో కూడా తనతో పోటీ పడటం కష్టమే. ఎవరిలో లేని లక్షణం ఒకటి ఆమెలో ఉంది. మేం ఆటలో ఓడుతున్నా, గెలుస్తున్నా ఝులన్ ఏదో ఒక కార్నర్లో ఉండి టీమ్ని ఎంకరేజ్ చేస్తూ కనిపిస్తుంటుంది.’ గెలిచే వరకు.. పద్దెనిమిదేళ్ల పాటు నేను, మిథాలీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. వరల్డ్ కప్ గెలవలేకపోయాం. మన విమెన్ టీమ్ ప్రపంచ కప్ గెలవాలి. విమెన్ టీం ప్రపంచ కప్ గెలిస్తే చాలు. గెలిచే వరకు ఆ కలను కంటూనే ఉంటాను. -
నాటి టీమిండియా క్రికెటర్.. నేడు ఖగోళ శాస్త్రవేత్త
ముంబై: సాధారణంగా ఆటగాళ్లు క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడం వల్ల వారి విద్యాభ్యాసం సజావుగా సాగదు. క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన చాలా మంది క్రికెటర్లు చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే, ఇప్పుడు మనం చూపబోయే ఈ టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరూ ఊహించని స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించి ఆస్ట్రోఫిజిస్ట్ అయ్యాడు. ఈ శతాబ్దపు ఆరంభంలో(2003) టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆవిష్కార్ సాల్వి.. తాజాగా ఆస్ట్రోఫిజిక్స్లో పీహెచ్డీ పూర్తి చేసి, క్రికెట్ ఫ్యాన్స్ను ఆశ్చర్యపరుస్తూ.. భారత క్రికెట్ చరిత్రలో అత్యున్నత విద్యావంతుల జాబితాలో ముందువరుసలో నిలిచాడు. ఒకప్పటి టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకుని క్రికెట్ అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు నాసా లేదా ఇస్రో వంటి సంస్థల్లో పని చేస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖగోళ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేయాలంటే అసాధారణమైన తెలివితేటలతో పాటు ఓర్పు, సహనం ఉండాలి. అయితే అంతరిక్ష అధ్యయనాలపై మక్కువతో తాను ఆస్ట్రో ఫిజిక్స్లో పీహెచ్డీ పూర్తి చేశానని సాల్వి చెప్పుకొచ్చాడు. కాగా, సాల్వి.. 2003లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్లో అతను 2 వికెట్లు పడగొట్టాడు. అయితే కేవలం 4 వన్డేలు మాత్రమే ఆడిన సాల్వి.. తీవ్రమైన గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున ఐపీఎల్లో కూడా పాల్గొన్నారు. 39 ఏళ్ల సాల్వి పదవీ విరమణ పొందిన అనంతరం క్రికెట్ కోచ్గా కూడా మారాడు. 2018లో పుదుచ్చేరి జట్టు కోచింగ్ స్టాఫ్లో ఒకరిగా పని చేశారు. దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన సాల్వి.. 50 ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్ల్లో ఆడాడు. ఇదిలా ఉంటే, భారత మాజీ క్రికెటర్లలో కుంబ్లే, లక్ష్మణ్, అశ్విన్, ద్రవిడ్ లాంటి క్రికెటర్లు అత్యున్నత చదువులు చదువుకున్నారు. అయితే వారందరికంటే అత్యున్నత విద్యను అభ్యసించిన సాల్వి 'ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఇండియన్ క్రికెటర్'గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చదవండి: వికెట్లను కాకుండా వ్యక్తులను టార్గెట్ చేయడమేంటి..? -
24 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన ప్రసిద్ద్ కృష్ణ
పూణే: ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో అరంగేట్రం బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ(4/54) అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. మంగళవారం ఎమ్సీఏ మైదానం వేదికగా జరిగిన తొలి వన్డేలో కృనాల్ పాండ్యాతో పాటు వన్డే క్యాప్ను అందుకున్న ఈ పాతికేళ్ల కర్ణాటక పేసర్.. మ్యాచ్ను మలుపు తిప్పే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో జేసన్ రాయ్ (46), ప్రమాదకర బెన్ స్టోక్స్ (1)ను ఔట్ చేసి ఇంగ్లండ్ పతనాన్ని ప్రారంభించి, ఆతరువాత మిడిల్ ఓవర్లలో సామ్ బిల్లింగ్స్ (18), టామ్ కర్రన్ (11) వికెట్లు తీసి ఇంగ్లండ్ ఓటమిని ఖరారు చేశాడు. మొత్తం 8.1 ఓవర్లు బౌల్ చేసిన ఆయన.. 54 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతను వన్డే అరంగేట్రంలో ఏ భారత బౌలర్కు సాధ్యపడని నాలుగు వికెట్ల ఘనతను సాధించాడు. గతంలో వన్డే అరంగేట్రంలో భారత బౌలర్లు నోయల్ డేవిడ్ (3/21), వరుణ్ అరోణ్ (3/24), హార్దిక్ పాండ్యా (3/31), పీయూస్ చావ్లా (3/37)లు మూడు వికెట్ల ప్రదర్శన చేయగా తాజాగా ప్రసిద్ద్ కృష్ణ ఆ నలుగురు బౌలర్లను వెనక్కునెట్టి నాలుగు వికెట్లు ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచాడు. వీరిలో స్పిన్నర్ నోయల్ డేవిడ్ 1997లో వెస్టిండీస్పై చేసిన ప్రదర్శన ఇప్పటి వరకు టాప్లో ఉండింది. ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో ప్రసిద్ద్ కృష్ణ ఆ రికార్డును సవరించి 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. కాగా, మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఇదే వేదికగా రెండో వన్డే జరుగనుంది. చదవండి: అదరగొట్టిన అరంగేట్రం ఆటగాళ్లు.. టీమిండియాదే తొలి వన్డే
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement