-
అన్నదాతల్లో ‘ధర’హాసం
గోదావరి జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి వరదా ఎస్వీ కృష్ణకిరణ్ : రాష్ట్రంలో రబీ ధాన్యం కొనుగోళ్లు వెల్లువలా కొనసా గుతున్నాయి. అకాల వర్షాల సమయంలో కోసిన ధాన్యాన్ని.. కోసినట్టుగా ప్రభుత్వం కొనుగోలు చేసింది. తడిసిన, నూక ధాన్యాన్ని సైతం (బ్రోకెన్ రైస్) ప్రభుత్వం కొనుగోలు చేసి నష్టాల ఊబి నుంచి రైతులను గట్టెక్కించడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. తొలిసారిగా జయ రకం (బొండా లు) ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుండటంతో ప్రైవేట్ మార్కెట్లో ఆ పంటకు మంచి ధర పలుకుతోంది. బుధవారం సాయంత్రానికి రూ. 2,541.51 కోట్ల విలువైన 12.45 లక్షల టన్నుల ధాన్యాన్ని ఆర్బీకే ద్వారా ప్రభుత్వం కొనుగోలు చే సింది. ఇందులో ధాన్యం విక్రయించిన 1.38 లక్షల మంది రైతులకు గాను 96 వేల మందికి రూ.1,673 కోట్లకు పైగా చెల్లింపులు పూర్తి చేసింది. బాయిల్డ్ మిల్లులకు తరలింపు వరి కోతలు ప్రారంభమైన దశలో అకాల వర్షాలు కు రవడం.. ఆ తరువాత అధిక ఉష్ణోగ్రతలతో ధాన్యంలో ముక్క విరుగుడు సమస్య తలెత్తింది. దీనిని సా కుగా చూపించి రైతులను మిల్లర్లు మోసం చేయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంబేడ్కర్ కోనసీ మ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మండలానికి ఒకటి చొప్పున.. ఏలూరు, కాకినా డ, తూర్పు గోదావరి జిల్లా ల్లో బ్రోకెన్స్ అధికంగా వ స్తు న్న ప్రాంతాల్లో మొబైల్ మి ల్లులను ప్రభుత్వం ఏర్పా టు చేసింది. రైతులు ముందుగా నే శాంపిళ్లను మొబైల్ మి ల్లు ల్లో మరాడించి.. అక్కడ ఇచ్చే రశీదు ఆధారంగా ధా న్యాన్ని విక్రయించుకునే సౌకర్యాన్ని కల్పించింది. ముక్క విరుగు డు ధాన్యాన్ని బాయిల్డ్ రకంగా పరిగణించి కొనుగోలు చేస్తూ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. జయ రకం (బొండాలు) ధాన్యానికి కూడా ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుండటంతో మార్కెట్లో పోటీ పెరిగింది. ప్రైవేట్ వ్యాపారులు మంచి ధరకు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. జయ రకం ఎక్కువగా పండించిన ప్రాంతంలో కళ్లాల్లోకి వచ్చి మరీ బస్తా (75 కేజీలు) రూ.1,500 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ రకాన్ని తక్కువ పండించిన ప్రాంతాల్లో అయితే.. బస్తాకు రూ. 1,600–రూ.1,700 కూడా చెల్లిస్తున్నారు. రూ.5 కోట్ల కార్పస్ ఫండ్ రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు వేగంగా మిల్లులకు తరలించేందుకు ప్రభుత్వం తొలిసారిగా ఉమ్మడి గోదావరి పరిధిలోని 5 జిల్లాలకు రూ.కోటి చొప్పున రూ.5 కోట్ల కార్పస్ ఫండ్ను ముందుగానే విడుదల చేసింది. ఫలితంగా ఆయా జిల్లాల్లో అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితు లకు అనుగుణంగా వాహనాలు, కూలీలను ఏ ర్పాటు చేస్తూ రైతులకు భారాన్ని తగ్గిస్తున్నారు. ఒకవేళ రైతులే సొంతంగా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే ఆ మొత్తాన్ని కూడా మద్దతు ధరతో కలిపి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. వాస్తవ పరిస్థితి ఇదీ.. ♦ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 90 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. పాలకొల్లు, నరసాపురం, ఆచంట ప్రాంతాల్లో ఇంకా కోతలు జరగాల్సి ఉందని పౌర సరఫరాల సంస్థ డీఎం శివరామ్ చెప్పారు. ♦ తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షల టన్నుల దిగుబడిలో సగానికి పైగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. బొండాలు రకం సాగు చేసిన రైతులు బయట మార్కెట్లోనే ఎక్కువగా విక్రయిస్తున్నారని పౌర సరఫరాల సంస్థ జిల్లా అధికారి కుమార్ తెలిపారు. ♦ కాకినాడ జిల్లాలో 10 శాతం విస్తీర్ణంలో కోతలు జరగాల్సి ఉందని పౌర సరఫరాల సంస్థ డీఎం పుష్పమణి చెప్పారు. ♦ ఏలూరు జిల్లాలో ధాన్యంలో ముక్క విరుగుడు సమస్య అధికంగా ఉంది. ఆ ధాన్యాన్ని కృష్ణా జిల్లాలోని బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నట్టు పౌర సరఫరాల సంస్థ డీఎం భార్గవి చెప్పారు. చింతలపూడి, లింగపాలెం, చాట్రాయి, పోలవరం ప్రాంతాల్లో కోతలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ♦ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కోతలు ఆలస్యం కావడంతో ధాన్యం ఇంకా పొలాలు, కళ్లాల్లోనే ఉంది. ఇక్కడ పంటను వేగంగా కొనుగోలు చేసేందుకు వీలుగా దగ్గర మిల్లులకే ధాన్యం తరలించేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ డీఎం సాగర్ తెలిపారు. మొత్తంగా అన్నిచోట్లా జూన్ రెండో వారంలోగా కొనుగోళ్లు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు వర్షాల్లోనూ కొన్నారు ఇటీవల కురిసిన వర్షాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన తీరు రైతుల్లో భరోసా నింపింది. అంత యుద్ధప్రాతిపదికన ఎక్కడి ధాన్యాన్ని అక్కడే ఆఫ్లైన్లో కొనేసి వెంటనే మిల్లులకు తరలించారు. నేను కూడా ఆ సమయంలో కొంత, వారం కిందట 582 బస్తాల (ఒక్కో బస్తా 40 కేజీలు) ధాన్యాన్ని విక్రయించాను. డబ్బులు కూడా చాలా వేగంగా ఖాతాల్లో జమ అవుతున్నాయి. – సూర్య నారాయణరాజు, లొల్ల, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎంతైనా కొంటాం అకాల వర్షాల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు చేశాం. ఇప్పటికీ చాలా జిల్లాల్లో ఇంకా కోతలు చేయాల్సి ఉంది. రైతులు తెచి్చన ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. – వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ రైతులు నష్టపోకుండా చర్యలు ధాన్యం సేకరణ పూర్తయ్యే వరకు ఈ ఫీడ్బ్యాక్ కొనసాగుతుంది. ఈ విధానం ద్వారా వ్యవస్థలో జవాబుదారీ పెంచడం, రైతులు నష్టపోకుండా కాపాడటమే ప్రధాన ఉద్దేశం. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ను ఆయా జిల్లాలకు పంపిస్తున్నాం. రైతులను ఇబ్బంది పెట్టినా, డబ్బులు వసూలు చేసినా మిల్లులను కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తున్నాం. జేసీలకు చెప్పి ఆ మొత్తాన్ని రైతులకు వెనక్కి ఇప్పిస్తున్నాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ -
AP: రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధిరేటు 8% పెరిగింది
సాక్షి, కడప: వ్యవసాయపరంగా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే తమ వర్సిటీ లక్ష్యమని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎల్.ప్రశాంతి చెప్పారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప సమీపంలోని ఊటుకూరు వ్యవసాయ పరిశోధనస్థానంలో గురువారం నిర్వహించిన కిసాన్మేళాలో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ మన రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధిరేటు 8 శాతం పెరిగిందని చెప్పారు. బోధన, పరిశోధన, విస్తరణ లక్ష్యంగా తమ విశ్వవిద్యాలయం పనిచేస్తోందన్నారు. ప్రగతిపరంగా దేశంలోనే 11వ స్థానంలో నిలిచామని, దాన్ని నంబర్వన్గా నిలిపేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. 2022లో అత్యున్నత స్కోచ్ అవార్డు కూడా సాధించామన్నారు. డ్రోన్ టెక్నాలజీలో డీసీజీఏ సర్టిఫికెట్ కూడా కైవసం చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని రెండువేల ఆర్బీకేలకు డ్రోన్లు సరఫరా చేసేందుకు రూ.200 కోట్ల బడ్జెట్ పొందామని, పైలట్, కో పైలట్లకు కడప, తిరుపతి, మార్టూరు, విజయనగరంలలో శిక్షణ ఇచ్చేందుకు అనుమతి లభించిందని చెప్పారు. -
ఉల్లి@రూ.40
రోజురోజుకూ ఘాటెక్కుతున్న ధర పది రోజుల్లోనే రూ. 15 మేర పెరిగిన రేటు ఇదే అదనుగా వ్యాపారుల అక్రమ నిల్వలు హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ ఉల్లి ఘాటు పెరుగుతోంది. వంటింటికి చేరకముందే కన్నీళ్లు తెప్పిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులతో సాగు చతికిలపడడం, వరదల కారణంగా మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడంతో ధర కొండెక్కి కూర్చుంది. మార్కెట్లో గ్రేడ్ వన్ రకం ఉల్లి కిలో ధర రూ.40కి పైనే పలుకుతోంది. రేట్లు ఇప్పట్లో దిగొస్తాయన్న ఆశ కూడా కనిపించడం లేదు. వ్యాపారుల అక్రమ నిల్వలు సైతం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. తగ్గిన సాగు విస్తీర్ణం.. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉల్లి సాగు గణనీయంగా తగ్గింది. మొత్తంగా 10 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతుందని భావించగా.. ఇప్పటి వరకు కేవలం 25 శాతం అంటే 2.5 వేల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. గతేడాది ఇదే సమయానికి రాష్ట్రంలో 5 వేల ఎకరాలకు పైగా ఉల్లి సాగు జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉల్లిని అధికంగా సాగు చేసే కర్నూలు జిల్లాలో సైతం పరిస్థితి ఆశాజనకంగా లేదు. రాష్ట్రానికి 90 శాతం మేర ఉల్లిని సరఫరా చేసే మహారాష్ట్రలో ఈ సంవత్సరం 30 వేల ఎకరాల్లో సాగు జరిగినా.. ఇటీవలి వర్షాల కారణంగా పంట దెబ్బతింది. ఫలితంగా అక్కడ్నుంచి 20 నుంచి 30 శాతం మేర సరఫరా తగ్గిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి వస్తున్న కొద్దిపాటి ఉల్లి సైతం కోల్డ్ స్టోరేజీల్లో ఇదివరకే నిల్వ చేసినదిగా ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. డిమాండ్ మేర సరఫరా లేకపోవడంతో ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయని చెబుతున్నాయి. పది రోజుల్లోనే పెరిగిన ధర పది రోజుల కిందట రూ.25 నుంచి రూ.28 మధ్య పలికిన కిలో ఉల్లి.. ప్రస్తుతం మార్కెట్లో గ్రేడ్-1 ఉల్లి రూ.40కి పైనే పలుకుతోంది. రైతు బజార్లలోనూ ధరల పెరుగుదల అనూహ్యంగా ఉంది. ఈనెల 20న రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.20 ఉండగా.. ప్రస్తుతం రూ.30 నుంచి రూ.32 పలుకుతోంది. గతేడాది ఈ సమయానికి కిలో రూ.24 నుంచి రూ.26 మధ్య ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గ్రేడ్-2 రకం ఉల్లి సైతం గతేడాదితో పోలిస్తే రూ.5 మేర పెరిగి మార్కెట్లో రూ.20కి లభ్యమవుతోంది. సమీప భవిష్యత్తులో కొత్త సరుకు మార్కెట్లోకి వచ్చే అవకాశం లేనందున వ్యాపారులు నిల్వలను పెంచుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ధరలు పెరిగినప్పుడు పౌరసరఫరాల శాఖ ద్వారా ఉల్లిని కొనుగోలు చేసి మార్కెటింగ్ శాఖ ధరను నియంత్రించింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement