-
ఐఐటీలకు విదేశాల నుంచి విజ్ఞప్తులు
న్యూఢిల్లీ: ఐఐటీ క్యాంపస్లను నెలకొల్పాలంటూ పలు అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు భారత ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయని ఆయన అన్నారు. ఇవి కేవలం ఐఐటీలుగానే కాదు, పరివర్తన సాధనాలుగా కూడా మారాయన్నారు. ఐఐటీ –ఢిల్లీలో శుక్రవారం ఆయన రెండు రోజుల ఇన్వెంటివ్ ఫెయిర్ను ప్రారంభించి ప్రసంగించారు. ప్రతిభ, మార్కెట్ పరిమాణం, కొనుగోలు శక్తి వంటివి దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తున్నాయని, మన ఐఐటీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. -
ఐఐటీ, ఎన్ఐటీల్లో ఫీజుల మోత!
♦ ఐఐటీల్లో రూ. 1.45 లక్షలు, ఎన్ఐటీల్లో రూ. 95 వేలుగా ఖరారు? ♦ యూజీ కోర్సు ఫీజుల పెంపునకు కేంద్రం సూత్రప్రాయ నిర్ణయం ♦ కేబినెట్ నిర్ణయం తర్వాత అధికారిక ప్రకటన ♦ నాలుగేళ్లకోసారి ఫీజుల పెంపునకు నిర్ణయం ♦ ఫీజు పెంపు అధికారం విద్యా సంస్థలకే అప్పగింత ♦ ఈ సంస్థల్లో ప్రస్తుత ఫీజు వరుసగా రూ. 90 వేలు, రూ. 70 వేలు సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లలో ఫీజుల మోత మోగనుంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ఫీజులు పెంచాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఐఐటీ విద్యార్థులకు రూ. 1.45 లక్షలు (ప్రస్తుతం రూ. 90 వేలు), ఎన్ఐటీ విద్యార్థులకు రూ. 95 వేలు (ప్రస్తుతం రూ. 70 వేలు) ఫీజు ఖరారు చేసినట్లు అత్యున్నత అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే కేంద్ర కేబినెట్ నిర్ణయం తరువాతే ఫీజుల పెంపుపై అధికారిక ప్రకటన ఉంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. పెరిగిన ఫీజులు అమల్లోకి వస్తే నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ పూర్తి చేయడానికి ఎన్ఐటీల్లో రూ. 3.80 లక్షలు, ఐఐటీల్లో రూ. 5.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. పార్లమెంటు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో లేదా ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో పెరిగే ఫీజులకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. భారీగా ఫీజులు ప్రతిపాదించిన ఐఐటీ, ఎన్ఐటీలు ఏటా కొత్తగా ఎన్ఐటీ, ఐఐటీ విద్యా సంస్థలు ఏర్పాటవుతున్న దృష్ట్యా పెరిగిపోతున్న భారాన్ని కొంత మేర విద్యార్థుల నుంచి వసూలు చేయాలంటే ఫీజులు పెంచక తప్పదని కేంద్ర హెచ్ఆర్డీశాఖ భావించింది. దీనికి అనుగుణంగా దేశంలోని అన్ని ఎన్ఐటీలు, ఐఐటీలు ఫీజుల పెంపునకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పిం చాయి. అత్యధికంగా ఐఐటీ ఖరగ్పూర్ రూ. 3.25 లక్షలను ఫీజు ప్రతిపాదించగా అతి తక్కువగా ఐఐటీ గౌహతి రూ. 1.75 లక్షలుగా ప్రతిపాదించింది. ఎన్ఐటీలు రూ. 1.50 నుంచి రూ. 1.75 లక్షలు ఫీజుగా ఉంటే బాగుంటుందని ప్రతి పాదించాయి. అయితే ఒకేసారి భారీగా ఫీజులు పెంచితే పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థులు అత్యుత్తమ సాంకేతిక విద్యకు దూరమవుతారని కొన్ని ఐఐటీలకు చెందిన డీన్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖకు సూచించారు. ప్రస్తుతం కేంద్రం ఈ సంస్థలకు వెచ్చిస్తున్న వ్యయం, విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజుకు తేడా చాలా ఉన్నప్పటికీ, దానిని సవరించడానికి ఒకేసారి రెట్టింపు చేసినా ఇబ్బందేనని, ఫీజులకు భయపడి అనేక మంది పేదలు జేఈఈ పరీక్షకు హాజరు కాకపోయే ప్రమాదం ఉందని ఐఐటీ బాంబేకి చెందిన సీనియర్ అధికారి తన నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఫీజులు కొంత మేరకే పెంచాలని హెచ్ఆర్డీశాఖ నిర్ణయించింది. ఐఐటీలు, ఎన్ఐటీలు ఒకేసారి కాకుండా ప్రతి నాలుగేళ్లకోసారి 25 శాతం చొప్పున ఫీజులు పెంచడం ద్వారా వచ్చే రెండు దశాబ్దాల్లో వ్యయానికీ, ఫీజుల రాబడికి మధ్య తేడా లేకుండా చూడాలని కేంద్రం భావిస్తోంది. విదేశాలకు వలసలపై ఆందోళన ఐఐటీల్లో బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన వారిలో 77 శాతం మంది (2014 బ్యాచ్) విదేశాలకు వెళ్లి అభ్యసిస్తున్నారు. ఏటా రూ. 12 లక్షలు అంతకంటే ఎక్కువ ప్యాకేజీతో ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు పొందిన వారిలోనూ 63 శాతం మంది అమెరికాలో మాస్టర్ డిగ్రీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేసి నాణ్యమైన విద్యను అందించినా దేశానికి పెద్దగా ప్రయోజనం ఉండట్లేదని ఐఐటీలు భావిస్తున్నా యి. ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో డిగ్రీ పూర్తి చేసే విద్యార్థులు విదేశాల్లో లక్షల రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు రాయితీ ఇవ్వాలని ఐఐటీ కాన్పూర్ తన నివేది కలో పేర్కోంది. ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు 2010 నుంచి 60 శాతం కంటే ఎక్కువ మంది విదేశాలకు తరలి వెళ్తున్నారని, వారిలో అందరూ అక్కడే స్థిరపడుతున్నారని మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిశీలనలో వెల్లడైంది.ఈ ఏడాది విదేశాలకు వెళ్లి మాస్టర్ డిగ్రీ చేసే వారి సంఖ్య 80 శాతం దాటొచ్చని చెబుతున్నారు. 2010 నుంచి విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసిస్తున్న వారిలో అత్యధికులు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులే కావడం గమనార్హం. మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో డిగ్రీ పూర్తి చేసిన వారిలో విదేశాలకు వెళ్లి చదువుతున్న వారి సగటు 43%గా ఉంది. -
నేడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
చిత్తూరు : ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని విద్యాసంస్థలకు ఆయన నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఏర్పేడు, మేర్లపాకలలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థలకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో ఎటు పోయింది: మీసా భారతి
ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయలేదంటే: జ్యోతిక
గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
సోనియా గాంధీ ప్రయత్నం ఫలించడం లేదు: అమిత్ షా కీలక వ్యాఖ్యలు
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు.. 22,500 దిగువకు నిఫ్టీ
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"
పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "
కూటమి అంటేనే ఎలపరమబ్బా....
సీఎం జగన్కు ఘన స్వాగతం..!
తప్పక చదవండి
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
Advertisement