-
ఏపీపీఎస్సీ: హార్టికల్చర్ ఆఫీసర్లు, తెలుగు రిపోర్టర్ జాబ్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)... ఏపీ హార్టికల్చర్ సర్వీస్లో.. హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: హార్టికల్చర్ ఆఫీసర్లు ► మొత్తం పోస్టుల సంఖ్య: 39 ► అర్హతలు: హార్టికల్చర్లో నాలుగేళ్ల బీఎస్సీ డిగ్రీ/ బీఎస్సీ ఆనర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► పరీక్ష విధానం: రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహా పద్ధతిలో నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలు– 100 మార్కులకు అర్హత పరీక్ష ఉంటుంది. దీనికి పరీక్ష సమయం 100 నిమిషాలు. పేపర్1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు–150 మార్కులకు; పేపర్2 హార్టికల్చర్–1, 150 ప్రశ్నలు– 150 మార్కులకు; పేపర్ 3, హార్టికల్చర్–2 150 ప్రశ్నలు– 150 మార్కులకు నిర్వహిస్తారు. ఈ మూడు పేపర్లకు ఒక్కో పేపర్కు పరీక్ష సమయం 150 నిమిషాలు కేటాయించారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.10.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 02.11.2021 ► వెబ్సైట్: https://psc.ap.gov.in ఏపీపీఎస్సీ– 05 తెలుగు రిపోర్టర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)... ఏపీ లెజిస్లేచర్ సర్వీస్లో తెలుగు రిపోర్ట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: తెలుగు రిపోర్టర్లు ► మొత్తం పోస్టుల సంఖ్య: 05 ► అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్బీటీఈటీ హైదరాబాద్ నిర్వహించిన షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్(తెలుగు)లో హయ్యర్ గ్రేడ్ అర్హతతోపాటు నిమిషానికి 80 పదాల వేగంతో తెలుగు షార్ట్ హ్యాండ్ టైపింగ్ చేయాలి. ► వయసు: 01.07.2021 నాటికి 18–42ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ /ఈడబ్ల్యూఎస్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► పరీక్ష విధానం: ఈ పరీక్షను మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీపై 150 ప్రశ్నలు–150 మార్కులకు ఉంటుంది. పేపర్ 2లో 150 మార్కులకు తెలుగులో షార్ట్హ్యాండ్ డిక్టేషన్, లాంగ్హ్యాండ్లో ట్రాన్స్స్క్రిప్షన్ టెస్ట్ ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.10.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 08.11.2021 ► వెబ్సైట్: https://psc.ap.gov.in -
అగ్రికల్చర్ ఆఫీసర్ కొలువులకు ఇంటర్వ్యూలు
హైదరాబాద్: ఉద్యానవన అధికారుల, వ్యవసాయాధికారుల ఉద్యోగాలకై నిర్వహించిన రాత పరీక్షల్లో మెరిట్ సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. వ్యవసాయాధికారుల పోస్టుల పరీక్షలో మెరిట్ సాధించినవారికి(235మందికి) ఈ నెల 6, 7న, ఉద్యానవనశాఖ పోస్టుల పరీక్షల్లో మెరిట్ సాధించినవారికి(151మందికి) 8,10 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వ్యవసాయశాఖలో 120 పోస్టులు ఖాళీ ఉండగా.. ఉద్యానవనశాఖలో 75 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటికి గత ఏడాది(2016) అక్టోబర్ 17, 18 తేదీల్లో విభాగాల వారిగా పరీక్ష నిర్వహించారు. -
అధికారులపై మంత్రి పోచారం ఆగ్రహం
హైదరాబాద్ : ఉద్యానవనశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. శనివారం హైదరాబాద్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రీన్ హౌస్, పాలి హౌజ్ టార్గెట్లను పూర్తి చేయడంలో విఫలమయ్యారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఉద్యానవన శాఖ అధికారులపై చర్యలకు తీసుకుంటామన్నారు. అందులో ఎలాంటి వెనకడుగు వేసే ప్రస్తక్తి లేదని ఉన్నతాధికారులకు పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. -
ఉద్యానవన అధికారులపై మంత్రి పోచారం ఫైర్
హైదరాబాద్ : ఉద్యానవన అధికారులపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ఒక సమావేశంలో ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వ సబ్సిడీలను రైతుల వద్దకు తీసుకెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారని మంత్రి అన్నారు. నిబంధనల పేరుతో అధికారులు రైతులను వేధిస్తున్నారని, ఈ విధంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు సడలించిన విషయం కూడా అధికారులకు తెలియకపోవడం బాధాకరమైన విషయమని మంత్రి పోచారం అన్నారు. ఉద్యానవన అవగాహన సదస్సులో భాగంగా అధికారులు తీరు మార్చుకోవాలని మంత్రి సూచించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement