-
చేతన సామ్రాజ్యాన్ని తానే నిర్మించుకుంది
చేతనాజైన్... ఆర్కిటెక్ట్. యాభై మంది ఉద్యోగులున్న తన సొంత సంస్థకు ఆమె సీఈవో. తండ్రి స్థాపించిన సంస్థను వారసత్వంగా అందిపుచ్చుకున్న మహిళ కాదామె. తన జీవితాన్ని తానే నిర్మించుకున్న ఓ ట్రెండ్సెట్టర్. ఆర్కిటెక్చర్ రంగంలో మహిళలు లెక్కలేనంత మంది ఉన్న మాట నిజమే. కానీ ఎక్కువ మంది మగవాళ్లు స్థాపించిన సంస్థలో ఉద్యోగి గా ఉండడానికే ఇష్టపడుతుంటారు. మరికొందరు ఇంటీరియర్ డిజైనింగ్ వైపు మరలిపోతుంటారు. అలాంటి సమయంలో ఇరవై రెండేళ్ల కిందట సొంత సంస్థను స్థాపించి, నిర్మాణరంగంలో తనదైన పాదముద్రలు వేసిన మహిళ చేతనా జైన్. అమ్మ అనుసరించిన సూత్రమే.... హైదరాబాద్లో పుట్టి పెరిగిన చేతనాజైన్ ది గుజరాతీ వ్యాపార కుటుంబం. ఆర్కిటెక్ట్గా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులను విస్తృతంగా చేస్తున్నారామె. కార్పొరేట్ కంపెనీల యాజమాన్యం నుంచి తాపీ మేస్త్రీల వరకు అందరితోనూ మాట్లాడాల్సి ఉంటుంది. ఏ నేల మీద ఉంటే ఆ భాష నేర్చుకుని తీరాలనే తన తల్లి అనుసరించిన సూత్రమే తన విజయానికి పునాది అన్నారు చేతనాజైన్. ‘‘ఏ నేల మనకు జీవితాన్నిస్తుందో ఆ నేలను, అక్కడి భాష ను గౌరవించాలనేది మా అమ్మ. కనీసం బస్సుల మీద పేర్లు చదవగలగాలి కదా అనేది. అలా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చదివాను. ఇక ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో నా వంతు వచ్చేటప్పటికి జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ లో మాత్రమే ఖాళీలున్నాయి. ఆర్కిటెక్ట్ ఏం పని చేయాల్సి ఉంటుందని అడిగి తెలుసుకుంది మా అమ్మ. ‘పెళ్లయిన తర్వాత ఇంట్లో ఉండి కూడా పని చేసుకోవచ్చు’ అని ఆర్కిటెక్చర్లో చేర్చేసింది. ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ తర్వాత జెమ్షెడ్పూర్లో ఎంబీఏ చేశాను. స్వయంగా ఇన్వాల్వ్ అయినప్పుడే... ఎన్ఆర్ అసోసియేషన్స్లో మల్లికార్జునరావుగారి దగ్గర జూనియర్గా ఒకటిన్నర ఏడాది పని నేర్చుకున్నాను. కాలేజ్లో కాన్సెప్ట్ మాత్రమే తెలుసుకుంటాం. అసలైన పని వచ్చేది ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే. ‘ఒక బిల్డింగ్ పునాది నుంచి పూర్తయే వరకు ప్రతి పనిలోనూ స్వయం గా ఇన్వాల్వ్ అయినప్పుడే పనిలో నైపుణ్యం వస్తుంది’ అని ఆయన చెప్పిన మాటే నా కెరీర్ నిర్మాణానికి పునాది. చేతిలో పని లేకపోతే పాత డిజైన్లను తీసి చూస్తుంటే.. అదే స్థలంలో ఇంకా చక్కని డిజైన్ వేయడానికి ఉన్న అవకాశాలు అవగతమవుతాయని చెప్పారు. హైదరాబాద్, మొజంజాహి మార్కెట్ రెస్టోరేషన్ విజయవంతంగా చేయగలిగానంటే అప్పట్లో ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలే కారణం. ఆయన పోయిన తర్వాత ఇక ఉద్యోగం చేయలేదు. సొంత ఫర్మ్ పెట్టాను. భవనం జెండర్ చూడదు ‘‘నువ్వు కట్టే భవనం నువ్వు స్త్రీవా, పురుషుడివా అని చూడదు. ఇక్కడ పనిచేసేది జెండర్ కాదు మన మెదడు మాత్రమే. ఆడవాళ్లం కాబట్టి ఆఫీస్కే పరిమితం అనుకుంటే ఎప్పటికీ ఏమీ సాధించలేరు. మీరు వేసిన డిజైన్ను సైట్లో భవన రూపంలోకి తెచ్చే పనిలో కూడా భాగస్వాములయి తీరాలి. అప్పుడే ఆచరణలో ఎదురయ్యే సవాళ్లు అర్థమవుతాయి. అవసరమైతే సైట్లో ఆ క్షణంలోనే డిజైన్ని మార్చి ఇవ్వగలిగే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. మహిళలుగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేతప్ప మహిళని కదా అని పని లో వెసులుబాటు వెతుక్కోకూడదు’’ అంటారు ఈ రంగంలో కొత్తగా చేరే స్త్రీలతో చేతనాజైన్. నిజానికి ప్రతి రంగమూ అందరిదీ. ఆడవాళ్లు అడుగు పెట్టనంత వరకే అది మగవాళ్ల సామ్రాజ్యంగా ఒక ముద్ర వేసుకుని ఉంటుంది. కొన్ని కనిపించని పరిధులు విధించుకుని ఉంటుంది. ఆ సరిహద్దు గీతను తుడిచేస్తున్న మహిళల్లో చేతనాజైన్ కూడా ఒకరు. కెరీర్కి కిరీటం వారసత్వ హోదా ఉన్న కట్టడాన్ని పునరుద్ధరించాలంటే నైపుణ్యం కంటే ఎక్కువగా అంకితభావం ఉండాలి. మొజంజాహి మార్కెట్ పునరుద్ధరణ పనిని 2016 చివర్లో మొదలుపెట్టాం. ఆ నిర్మాణం తొలిరూపాన్ని అర్థం చేసుకోవడానికి ఆరునెలలకు పైగా పట్టింది. హబ్సిగూడలో ఉన్న స్టేట్ ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లో ఈ భవనానికి సంబంధించిన ప్రతి ఆధారమూ ఉంది. నిజాం నవాబు 1935లో ఈ భవనం కోసం విడుదల చేసిన తొలి మొత్తం 30 రూపాయల డాక్యుమెంట్తో సహా ఉన్నాయి. దుకాణదారులు ఎవరికి వాళ్లు తమకు కావల్సినట్లు కరెంట్ లైన్లు, వాటర్ పైప్ లైన్లు, ఫ్లోరింగ్ వేసుకున్నారు. దుకాణదారులతో మాట్లాడి వాళ్ల అవసరాలు నెరవేరేటట్లు చూస్తూనే, భవనం అసలు స్వరూపాన్ని పరిరక్షించగలిగాం. ఇందుకోసం మా టీమ్ రెండేళ్లు పని చేసింది. కమర్షియల్గా అయితే రెండేళ్లలో సమాంతరంగా అనేక ప్రాజెక్టులు చేయగలుగుతాం. కానీ ఇలాంటివి చేయడం కెరీర్కి గర్వకారణం. – చేతనాజైన్, సీఈవో, ధ్రుమతారు కన్సల్టెంట్స్ – వాకా మంజులారెడ్డి -
ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా సదర్మఠ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా మేడంపల్లి గ్రామ పరిధిలోని సదర్మఠ్ ఆనకట్ట, కామారెడ్డి జిల్లాలోని పెద్ద చెరువును ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐసీఐడీ) గుర్తించింది. ఆగస్టు 30న కెనడాలో జరిగిన ఐసీఐడీ 69వ వార్షిక సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ మేరకు ఈ నెల 9న కేంద్ర జల సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. 4.12 టీఎంసీల సామర్థ్యమున్న సదర్మఠ్ ఆనకట్టను 1891–92 ఏడాదిలో నిర్మించారు. ఈ ప్రాజెక్టును ఫ్రెంచ్ ఇంజనీర్ జేజే ఓట్లీ డిజైన్ చేశారు. దీనికింద 13,100 ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, దీన్ని 7.76 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా నిర్మించారు. రాష్ట్రంలో అత్యంత పురాతన కట్టడం కావడంతో దీన్ని వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసిన ప్రతిపాదనకు ఐసీఐడీ ఆమోదం తెలిపింది. ఇక కామారెడ్డిలోని పెద్ద చెరువును 1897లో నిర్మించారు. దీని కింద 858 ఎకరాలు సాగవుతోంది. ఇటీవలే మిషన్ కాకతీయలో భాగంగా రూ.8.96 కోట్లతో దీన్ని మినీ ట్యాంక్బండ్గా మార్చారు. దీన్ని సైతం వారసత్వ కట్టడంగా గుర్తించాలని ప్రతిపాదించగా.. గ్రీన్సిగ్నల్ దక్కింది. వారసత్వ కట్టడాలుగా సదర్మఠ్, పెద్ద చెరువును ప్రకటించడంపై మంత్రి హరీశ్రావు, ఈఎన్సీ నాగేందర్రావు హర్షం వ్యక్తం చేశారు. వారసత్వ కట్టడాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని హరీశ్రావు పేర్కొన్నారు. -
రాష్ట్రానికి వారసత్వ హోదా ఫైల్
కడప కల్చరల్ : గండికోటకు ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చేందుకు అవసరమైన వివరాలు సేకరించే ఫైలు మన రాష్ట్రంలోని కేంద్ర పురావస్తు శాఖకు చేరినట్లు విశ్వసనీయ సమాచారం. గండికోటకు ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వాలని గుంటూరుకు చెందిన పర్యాటక అభిమాని జాస్తి వీరాంజనేయులు కోరారు. రాష్ట్రంలోని మొత్తం 5పర్యాటక ప్రాంతాలకు హోదా ఇవ్వాలని ఆయన నేరుగా ప్రధానమంత్రి కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన కార్యాలయం అక్కడి కేంద్ర పర్యాటక శాఖను దీనికి సంబంధించిన వివరాలను సేకరించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా జాస్తి వీరాంజనేయులు వారసత్వ హోదా విషయంలో తొలి ప్రాధాన్యత గండికోటకు ఇవ్వాలని మరో వినతి పత్రమిచ్చారు. దాన్ని కూడా స్వీకరించిన పర్యాటక శాఖ అధికారులు దాన్ని కేంద్ర పురావస్తు శాఖకు బదిలీ చేస్తూ ఆ 5 ప్రాంతాల పూర్తి వివరాలను తమకు అందజేయాలని కోరారు. తొలి ప్రాధాన్యత గండికోటకే ఇస్తూ.. మన రాష్ట్రంలోని కేంద్ర పురావస్తు శాఖ కార్యాలయానికి గండికోటకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని ఆదేశాలు పంపారు. ప్రస్తుతం ఆ కార్యాలయ అధికారులు గండికోటకు సంబంధించిన భౌగోళిక వివరాలతోపాటు చారిత్రక కట్టడాలు, శాసనాలు, ఇతర పురావస్తుల వివరాల రికార్డును సిద్ధం చేస్తున్నారు. తమ పరిధిలోని మిగతా నాలుగు ప్రాంతాల వివరాలను కూడా పంపేందుకు వివరాలు సేకరిస్తున్నారు. త్వరలో గండికోటకే ప్రత్యేక కన్సల్టెంట్ను నియమించనున్నారు. ఆయనతో కలిసి ఈ ప్రాంతంలో కేంద్ర పురావస్తు శాఖ రాష్ట్ర అధికారులు గండికోటకు సంబంధించిన సమగ్రమైన సర్వే, వీడియో, ఫొటోలను సేకరించి కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. మొత్తానికి గండికోటకు ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వాలన్న డిమాండు ఇంత దూరం రావడంపట్ల జిల్లా పర్యాటక అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement