-
బిజీగా ఉన్నాను.. అందుకే..
ముంబై: దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)కి తాను మద్దతు ఇస్తున్నానని శివసేన ఎంపీ హేమంగ్ పాటిల్ అన్నారు. తాను బిజీగా ఉన్నందు వల్లే సీఏఏ, ఎన్నార్సీని సమర్థిస్తూ నిర్వహిస్తున్న ర్యాలీలకు హాజరకాలేక పోతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు తన నియోజకవర్గ ప్రజలకు ఆయన లేఖ రాశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభలో మద్దతు తెలిపిన శివసేన.. రాజ్యసభలో మాత్రం బిల్లును వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అదే విధంగా తాము సీఏఏకు వ్యతిరేకమని శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. హిందుత్వ నాయకుడు వీడీ సావర్కర్ ఆశయాలకు సీఏఏ వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హిందుత్వ పార్టీగా పేరున్న శివసేన తీరును పార్టీ మద్దతుదారులు విమర్శించారు. అదే విధంగా మరికొంత మంది సీఏఏ, ఎన్నార్సీని సమర్థిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హింగోలీ ఎంపీ హేమంత్ పాటిల్ సీఏఏ, ఎన్నార్సీకి మద్దతు తెలుపుతూ రాసిన లేఖ చర్చనీయాంశమైంది. ‘ సమావేశాలకు హాజరు అవుతున్న కారణంగా ర్యాలీల్లో పాల్గొనలేకపోతున్నాను. ఇందుకు ఎంతగానో చింతిస్తున్నాను. అయితే నేను లోక్సభలో పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన విషయం అందరికీ తెలుసు. శివసేన ఎల్లప్పుడూ హిందుత్వ పార్టీగానే ఉంటుంది. సీఏఏ, ఎన్నార్సీని నేను ఎల్లప్పుడూ సమర్థిస్తానని మీకు ఈ లేఖ రాస్తున్నాను అని పాటిల్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు మాత్రం ఈ లేఖను పంపించకపోవడంతో.. హేమంత్ పాటిల్.. తన క్యాడర్ను సంతోషపరచడానికే ఇలా చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధిష్టానంతో నిజంగా విభేదించే సత్తా లేక.. తన కార్యకర్తలు బీజేపీలో చేరతారనే భయంతోనే లేఖ రాశారంటూ పలువురు విమర్శిస్తున్నారు. -
సల్మాన్ ను వెంటాడుతున్న కష్టాలు
ముంబై: 'హిట్ అండ్ రన్' కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ రవీంద్ర పాటిల్ మృతిపై దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు. పుణేకు చెందిన సామాజిక కార్యకర్త హేమంత్ పాటిల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. రవీంద్రపై సల్మాన్ ఖాన్ ఒత్తిడి తీసుకొచ్చిన విషయం కేసు విచారణ సమయంలో ప్రస్తావనకు రాలేదని గుర్తు చేశారు. తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని రవీంద్రపై ఒత్తిడి తెచ్చిన సల్మాన్ పై న్యాయపరమైన చర్య తీసుకోవాలని హేమంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన రోజు పోలీస్ స్టేషన్ లో రవీంద్ర పాటిల్ ఇచ్చిన సాక్ష్యంతోనే ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు జైలుశిక్ష పడిన సంగతి తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement