-
చిదంబరం ఇంట్లో భారీ చోరీ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు తెలిసింది. కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఈ కేసులో ఇద్దరు పనిమనుషులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దొంగతనం జరిగిందని తొలుత చేసిన ఫిర్యాదును చిదంబరం భార్య నళిని చిదంబరం ఆదివారం రాత్రి వెనక్కి తీసుకోవడం గమనార్హం. తమ నివాసంలో ఎలాంటి దొంగతనం జరగలేదన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం...చెన్నై నుంగంబాక్కం ఫైవ్క్రాఫ్ట్స్ రోడ్డులోని ఇంట్లో చిదంబరం, భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధి నివసిస్తున్నారు. ఓ కార్యక్రమానికి వెళ్లడానికి ముందు నగలు అలంకరించుకునేందుకు నళిని శనివారం తన గదిలోని బీరువా తెరచిచూడగా అందులో పెట్టిన పురాతన మరకతాలు, బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయగా, వారు ఇంటి ప్రాంగణంలో అమర్చిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. సుమారు నెల క్రితం ఇద్దరు మహిళలు ముఖాలకు ముసుగేసుకుని నళిని గదిలోకి వెళ్లడం, కొద్దిసేపటి తరువాత ఒక సంచితో బయటకు వచ్చిన దృశ్యాలు అందులో నమోదయ్యాయి. వాటిలోని వ్యక్తుల రూపురేఖల ఆధారంగా, చిదంబరం ఇంట్లో పనిచేస్తున్న వెన్నెల, విజిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
విద్యుత్ కార్యాలయంలో భారీ చోరీ
తూప్రాన్: డివిజన్ కేంద్రంలోని పోతరాజ్పల్లి సమీపంలో రహదారి పక్కన ఉన్న విద్యుత్ డీఈ కార్యాలయంలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. తూప్రాన్ డీఎస్పీ రామ్గోపాల్రావు, విద్యుత్ డీఈ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. డివిజన్ పరిధిలోని గ్రామాల్లో వసూలు చేసిన కరెంట్ బిల్లుల నగదు రూ.16.39 లక్షలను రెండు బ్యాగుల్లో ఉంచి కార్యాలయంలోని లాకర్లో శనివారం రాత్రి భద్రపరిచారు. కార్యాలయం ప్రధాన గేటు తాళాన్ని, లాకర్లను దొంగలు గుణపం సహాయంతో పగలగొట్టి నగదును దోచుకెళ్లారు. కార్యాలయంలోని పై అంతస్తులో నిద్రిస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించి, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల వేలిముద్రలను క్లూస్ టీమ్ సేకరించినట్లు డీఎస్పీ రామ్గోపాల్రావు తెలిపారు. -
కర్నూలులో కిలో బంగారం చోరీ
-
కర్నూలులో భారీ చోరీ.. కిలో బంగారం మాయం!
సాక్షి, కర్నూలు: పట్టణంలోని కృష్ణానగర్లో భారీ దొంగతనం జరిగింది. కృష్ణానగర్ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి దొంగలు కిలో బంగారం, రూ. 4 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ కాలనీలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. అయినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగల భయంతో తాము హడలిపోతున్నామని అంటున్నారు. కృష్ణా నగర్లోని రవీంద్ర స్కూల్ వెనుక వైపు రైల్వే ట్రాక్ ఎదురుగా ఉన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బంగారంతోపాటు పిల్లల ఫీజుల కోసం దాచి ఉంచిన నగదును దొంగలు దోచుకెళ్లారని బాధితురాలు శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి నెల్లూరుకు వెళ్లడంతో ఈ ఘటన జరిగింది. ఇంటికి వేసిన తాళాలు తెరిచి ఉండటంతో ఉదయం పక్కింటివారు గుర్తించడంతో రాత్రి చోరీ జరిగిన వ్యవహారం వెలుగుచూసింది. ఘటనపై బాధితురాలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
పుష్కరాలకు వెళ్తే.. ఇల్లు గుల్ల చేశారు
ఒంగోలు క్రైం : దొంగలు నగరం నడిబొడ్డులో భారీ చోరీకి తెగబడ్డారు. ఒన్టౌన్ పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలో బుధవారం అర్ధరాత్రి ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. స్థానిక ఏనుగు చెట్టుకు తాతా కన్నయ్య బిల్డింగ్కు మధ్యలో ఉన్న చేజర్ల లక్ష్మణాచారి వీధిలో పారిశ్రామికవేత్త పల్లపోతు ప్రభాకర గుప్తా ఇంట్లో దొంగలు తమ చేతివాటం చూపారు. 1100 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు చోరీ చేసినట్లు ప్రాథమికంగా తేలింది. వీటితో పాటు 2.3 కేజీల వెండి వస్తువులు కూడా మాయమయ్యాయి. ప్రభాకరగుప్తా విజయ టైల్స్ అధినేత. ఈ వ్యాపారంతో పాటు పలు ఇతర వ్యాపారాలు చేస్తుంటారు. గోదావరి పుష్కరాలకని బుధవారం తెల్లవారు జామున కుటుంబ సమేతంగా వెళ్లారు. పుష్కరాలకు వెళ్తూ తమ షాపులో పని చేసే గుమాస్తాను ఇంట్లో ఉంచారు. తెల్లవారు జామున ఇంటి యజమానులు వెళ్లిపోవటంతో ఉదయం 8 గంటల వరకు గుమాస్తా ఉండి ప్రధాన ద్వారం లోపల తాళం వేసి, ఇంటి వరసందు వైపు తలుపునకు కూడా బయట తాళం వేసి షాపునకు వెళ్లిపోయాడు. తాళాన్ని పక్కింటి వారికి ఇచ్చాడు. యజమానులు సాయంత్రమే వస్తారని తెలిసి గుమస్తా రాత్రికి నేరుగా తన ఇంటికి వెళ్లిపోయాడు. తీరా ప్రభాకర గుప్తా కుటుంబం బుధవారం అర్ధరాత్రి 1.30- 2 గంటల మధ్యలో ఇంటికి చేరుకుంది. ప్రధాన ద్వారం తెరిచేందుకు ప్రయత్నించారు. లోపల గడియ పెట్టి ఉండటంతో తలుపులు తెరుచుకోలేదు. వరసందు వైపు వె ళ్లి తలుపులు తీసేందుకు చూశారు. తీరా చూస్తే తలుపు గడియ విరగ్గొట్టి తలుపు తీసి ఉంది. అప్పుడే ఇంట్లోకి దొంగలు చొరబడి ఉన్నారని భావించి చుట్టు పక్కలవారిని కేకలు వేశారు. అందరూ వచ్చిన తర్వాత లోనికి వెళ్లి చూస్తే ఎవరూ లేరు. దొంగలు ఇంట్లో సొత్తు దోచుకుపోయారని గుర్తించారు. వెంటనే ఒన్టౌన్ ఇన్చార్జి సిఐ పి.దేవప్రభాకర్కు ఫిర్యాదు చేశారు. ఒంగోలు డీఎస్సీ, జి. శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు, ఒన్టౌన్, తాలూకా సీఐలు దేవప్రభాకర్, ఎస్.ఆంటోనిరాజులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నగరంతో పాటు పరిసర ప్రాంత మండలాల పోలీసులను అప్రమత్తం చేశారు. అసలు చోరీజరిగింది పగలా.. రాత్రా అన్నది సందిగ్ధంగా మారింది. రెండు బ్యాగులు అక్కడే వదిలి.. చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ మొత్తంలో ఇంట్లో నుంచి దోచుకుపోయారు. మరి ఇది ఒకరి పనా.. లేక ఇద్దరా, ముఠానా అన్నది పోలీసుల దరాప్తులో తేలాల్సి ఉంది. భారీ మొత్తం బంగారు ఆభరణాలు, నగదుతో పాటు మరో రెండు బ్యాగులను కూడా పట్టుకెళ్లారు. లక్ష్మణాచారి వీధిలో నుంచి ఉత్తరంగా బయల్దేరి ఇంటికి సమీపంలో వెనుక పైపు ఉన్న పాడుపడ్డ ఇళ్ల ప్రాంగణంలో రెండు బ్యాగులను దాచి పెట్టారు. తీరా ఆ బ్యాగులను డాగ్ స్క్వాడ్ గురువారం మధ్యాహ్నం గుర్తించింది. దొంగతనం జరిగిన ఇంటి నుంచి బయల్దేరిన డాగ్ స్క్వాడ్ రెండిళ్లు దాటిన తర్వాత ఉన్న సందులోకి వెళ్లింది. ఆ సందులోని చివర పాడుపడ్డ ఇళ్లలోని చెట్ల పొదల్లోకి వెళ్లి మురకలు పట్టింది. దీంతో స్క్వాడ్ బృందం సభ్యులు ఆ పరిసర ప్రాంతాలను నిశితంగా గమనించారు. చెట్ల పొదల్లో రెండు బ్యాగులు లభించాయి. తీరా వాటిని తీసి చూస్తే వాటి నిండా వెండి ప్లేట్లు, రూ.10, రూ.5 విలువగల బంగారు రంగుతో ఉన్న నాణేలు, రూ.10 నోట్ల కట్టలు, పూజకు వాడే 108 చిన్న బంగారు పుష్పాలు, రకరకాల నేణేలు, ఇతర వెండి వస్తువులు ఉన్నాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ చోరీ జరిగిన ఇంటిని గురువారం పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. ఏ మేరకు నష్టం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఇంటి పరిసరాలను గమనించారు. పరిస్థితులను ఒంగోలు డీఎస్పీ జి.శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి ఒన్టౌన్ పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. చోరీ జరిగిన తీరుపై అధికారులతో లోతుగా చర్చించినట్లు సమాచారం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement