-
ఆ నలుగురు
న్యూఢిల్లీ: జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంలను వ్యక్తిగత హోదాలో ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) సవరణ చట్టం(యూఏపీఏ)–1967కు కీలక సవరణలకు పార్లమెంటు ఆమోదం తెలిపిన ఒక నెలలోనే ఈ నలుగురిని కొత్త చట్టం కింద ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటివరకు యూఏపీఏ కింద చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సంస్థలనే ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. కానీ కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం వ్యక్తుల్ని సైతం ఉగ్రవాదులుగా ప్రకటించే వెసులుబాటు ఉంది. ఈ చట్టం కింద ఉగ్రవాదుల్ని ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వీరిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. -
ఎవరీ హఫీజ్ సయీద్?
డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ సయీద్ గిలానీ వీడియో కాన్ఫరెన్స్ విచారణతో 26/11 ముంబై దాడుల కేసు కీలక ఘట్టానికి చేరుకుంది. దాడుల కీలక సూత్రధారి హఫీజ్ మొహమ్మద్ సయీద్ పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతూ .. భారత్ కు వ్యతిరేకంగా మరింతమంది కసబ్ లను తయారుచేసేపనిలోఉన్నాడు. అయితే అందరు ఉగ్రవాద నాయకుల్లాగా రహస్యంగా దాక్కోకుండా.. బహిరంగంగా సంచరించడం, పెద్ద ఎత్తున జనాలన సమీకరించి సభలు నిర్వహించడం హఫీజ్ ప్రత్యేకత. జమాత్-ఉద్-దవా(జేయూడీ)పై నిషేధం ఉన్నప్పటికీ హఫీజ్ ను ఎందుకు నిలువరించలేకపోతున్నారు? నిజంగానే పాకిస్థాన్ లో ఆయనకు ప్రజాబలం ఉందా? లేక వాపును చూసి బలుపనుకుని అతణ్ని కట్టడిచేసేందుకు పాక్ ప్రభుత్వం వెనకడుగువేస్తోందా? ఒక్కసారి హఫీజ్ గురించిన వాస్తవాలను తెల్సుకొని ఈ ప్రశ్నలకు జవాబులు వెదుకుదాం.. ఏకాలంలోనైనా ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయలు సంవృద్ధిగా పండే నేల అది. కాస్త వివరంగా చెప్పాలంటే.. అమృతకశంలాంటి ఆ ప్రాంతాన్ని వదులుకోలేకే దాయాది దేశం మనతో యుద్ధాలు చేసింది. మారిన పరిస్థితుల్లో తాను ప్రత్యక్షంగా రంగంలోకి దిగలేక.. బీ టీమ్ లైన ఉగ్రవాదులన ఎగదోస్తోంది. ఆ 'ఆక్రమిత కశ్మీర్' లోని ముఖ్యనగరాల్లో ఒకటైన సర్గోదా.. హఫీజ్ మొహమ్మద్ సొంత ఊరు. 1950, మార్చి 10 ఆయన పుట్టినరోజు. తండ్రి పేరు కమాలుద్దీన్. ఇస్లామిక్ పండితుడైన కమాలుద్దీన్ వ్యవసాయం కూడా చేసేవాడు. హఫీజ్ తల్లితోపాటు బంధువర్గంలో చాలామంది విద్యావంతులే. హఫీజ్ పూర్వీకులది ఇండియానే ముస్లిం గుర్జర్లయిన హఫీజ్ పూర్వీకులది హర్యానాలోని హిస్సార్. దేశవిభజన సమయంలో అటువైపునకు బయలుదేరిన వారి కుటుంబం.. నాలుగు నెలల ప్రయాణం తర్వాతగానీ పాకిస్థాన్ కు చేరుకోలేదు. అదే సమయంలో చెలరేగిన హిందు- ముస్లిం ఘర్షణల్లో ఆ కుటుంబానికి చెందిన 36 మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్నప్పుడే మతపరమైన బోధనలకు ఆకర్షితుడైన హఫీజ్ 12 ఏళ్లకే పవిత్రగ్రంథాన్ని కంఠతాపట్టాడు. అయితే కేవలం మతానికే పరిమితమైపోకుండా సాధారణ చదువుల్లోనూ రాణించాడు. 1966లో మెట్రిక్యులేషన్, 68లో ప్లస్ టూ పూర్తిచేసి, లాహోర్ లోని పంజాబ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తోపాటు రెండు మాస్టర్ డిగ్రీలను సాధించాడు. ఆసియాలోని మొదటి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(లాహోర్)లో ప్రొఫెసర్ గా చేరాడు. కొంతకాలం తర్వాత సౌదీలోని కింగ్ సౌద్ యూనివర్సిటీలో చేరి అరబి భాష స్పెషలైజేషన్ గా మరో డిగ్రీ విత్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇస్లామిక్ స్టడీస్ తోపాటు ప్రాపంచిక అవగాహన కలిగిఉన్నాడనే భావనతో.. ప్రొఫెసర్ హఫీజ్ సయీద్ ను కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ(మత పరమైన విషయాల్లో పాక్ ప్రభుత్వానికి సలహాలిచ్చే రాజ్యాంగ సంస్థ) సభ్యుణ్ని చేశాడు నాటి పాక్ అధ్యక్షుడు జియా ఉల్ హక్. అప్పటి నుంచి దేశ రాజకీయాల్లో కీలక వ్యక్తిగామారిపోయాడు హఫీజ్. 1979లో ప్రారంభమైన అఫ్ఘాన్- సోవియట్ యుద్ధంలో ఆఫ్ఘన్లకు మద్దతుగా లష్కరే తోయిబా(అల్లాహ్ సైన్యం) అనే సంస్థను స్థాపించారు హఫీజ్ సయీద్, అబ్దుల్లా యూసుఫ్ ఆజం(ఈయనా ఇస్లామిక్ స్కాలరే, అల్- ఖాయిదా వ్యవస్థాపకుల్లో ఒకడు). యుద్ధం చివరిదశలో అంటే 1986లో ప్రారంభమైన ఈ సంస్థ వేలమంది పాకీస్థానీ యువకులకు జిహాదీ పాఠాలు నేర్పించి ఆఫ్ఘన్లకు మద్దతుగా సోవియట్ తో పోరాడేందుకు పురిగొల్పేది. లష్కరేకు మొదట్లో ఒసామా బిన్ లాడెనే ప్రధాన ఆర్థిక వనరు. అప్పట్లో అది అస్థిత్వపోరాటంగా ప్రాచుర్యం పొందింది. అయితే 1988లో సోవియెట్ యుద్ధం నుంచి వెనుకడుగు వేయటం, 1991 నాటికి ఏకంగా సోవియట్ యూనియనే కుప్పకూలడంతో యుద్ధంలోపోరాడిన ఇస్లామిక్ గ్రూపులన్నీ తలోదారి వెతుక్కున్నాయి. వాటిల్లో ఒకటైన అల్- కాయిదా అఫ్ఘానిస్థాన్ లో రాజకీయపట్టుకు ప్రయత్నించగా.. దిక్కుతోచకే 'ఆజాద్ కశ్మీర్' నినాదం హఫీజ్ నేతృత్వంలోని లష్కరే 'కశ్మీర్ విముక్తి'పై దృష్టిసారించింది. దాయాది దేశంతో యుద్ధం తర్వాత భారత భూభాగంలో ఉండిపోయిన కశ్మీర్ ను పాకిస్థాన్ లో కలపాలనే ప్రధాన డిమాండ్ తో ఆ సంస్థ మళ్లీ జిహాదీ పోరాటం ప్రారంభించింది. అటు ఉగ్రవాద కార్యకలాపాలతోనేకాక స్వదేశంపై రాజకీయపరమైన ఒత్తిడి పెంచాలనేది హఫీజ్ వ్యూహం. 1990ల్లో కశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున యువకుల్ని ఆకర్షించి, భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించిన లష్కరే.. కశ్మీర్ ను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించడంలో సఫలమైంది. అయితే 2001లో భారత పార్లమెంట్ పై దాడి అనంతరం అంతర్జాతీయంగా తలెత్తిన ఒత్తిడితో పాక్ ప్రభుత్వం లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా గుర్తించి దానిపై నిషేధం విధించింది. దీంతో లష్కరే నుంచి విడిపోయి 'జమాత్-ఉద్-దవా(జేయూడీ)' అనే కొత్త సంస్థను ప్రారంభించాడు హఫీజ్. పేరుతోపాటే విధివిధానాల్లోనూ పలు కీలక మార్పులు తెచ్చాడు. పాకిస్థాన్ లోని అనేక పట్టణాల్లో ఆసుపత్రులు, స్కూళ్లు నిర్మించి సేవకార్యక్రమాలను ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా విస్తరించిన జేయూడీ కార్యకర్తలు సంస్థ కోసం పెద్ద ఎత్తున నిధులు సేకరించగల సమర్థులు. కేవలం జీహాదీ గ్రూప్ గానేకాక.. రాజకీయ సంస్థగానూ జమాత్- ఉద్- దవాను తీర్చిదిద్దాలన్నది హఫీజ్ సయీద్ ప్రణాళిక. కానీ ముంబై దాడుల తర్వాత అతనికి, అతని సంస్థకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. లష్కరేతో తనకుగానీ, జేయూడీకిగానీ సంబంధాలు లేవని ఎంత బుకాయించినప్పటికీ ఆ బంధం తాలుకూ సాక్ష్యాధారాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం జేడీయూపైనా నిషేధం విధించింది. హఫీజ్ ను అరెస్టు చేసి కొంతకాలం జైల్లో పెట్టగలిగిందికానీ ఎప్పటిలాగే కోర్టు ఆదేశాల మేరకు అతణ్ని విడుదలచేసింది. ఆ సంస్థ పేరుచెబితే ఒళ్లుమంట 'బ్రిటన్ ప్రధానులు నాలుగు గదుల ఇంట్లో సాధారణంగా జీవిస్తుంటే మా దేశ నాయకులు మాత్రం మహల్లలో రాజభోగాలు అనుభవిస్తారు. ఇది ఇస్లాంకు విరుద్ధం' అని 'ది న్యూయార్క్ టైమ్స్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హఫీజ్.. పాకిస్థానీ పాలకులను తూర్పారబట్టాడు. అందుకు ప్రతీకారంగా అదనుచూసి అతణ్ని దెబ్బకొట్టాలని అక్కడి పాలకులు భావిస్తుండొచ్చు. అయితే తనదైన ఇస్లామిస్ట్ మార్క్ తో పాక్ ఆర్మీతో ఆయన ఏర్పర్చుకున్న సంబంధాలు, సయూద్ శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులు కశ్మీర్ లో పాక్ ఆర్మీకి బీ టీమ్ గా ఉండటం, భారత్ ను అస్థిరపర్చే క్రమంలో ఆ మూకలుచెప్పుకోదగ్గ విధ్వంసాలకు పాల్పడటం వంటి కారణాలు హఫీజ్ సయీద్ పూర్తికాల అరెస్టుకు ప్రతిబంధకాలని చెప్పొచ్చు. ఇండియాలో చోటుచేసుకునే పొలిటికల్ డెవలప్ మెంట్ల పై నిమిషాల వ్యవధిలో కామెంట్లు చేసే హఫీజ్ సయ్యిద్ కు స్వదేశంలోనూ శత్రువులు లేకపోలేరు. పాక్ ను నాశనం చేస్తామని కంకణం కట్టుకున్న పాక్ తాలిబన్లంటే ఆయనకు మంట. అందుకే ఆ సంస్థను భారత్ ప్రోత్సహిస్తోందంటూ నిరాధారమైన ఆరోపణలు గుప్పిస్తాడు. పార్లమెంట్ పై దాడి అనంతరం అరడజనుకుపైగా దేశాలు లష్కరేను ఉగ్రవాద సంస్థగా ప్రకటించగా, ముంబై దాడుల తర్వాత యావత్ ప్రపంచం మొత్తం హఫీజ్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా, ఆయన జేయూడీని ఉగ్రసంస్థగా గుర్తించింది. అమెరికా హఫీజ్ తలపై రూ.60 కోట్ల బహుమతిని ప్రకటించింది. ముంబైలో దాడుల్లో సజీవంగా దొరికిన కసబ్ లాంటి చిన్నచేపలు వెల్లడించిన సమాచారాన్ని బట్టి హఫీజ్ సయీద్ మాటలతో మత్తుమందు జల్లుతాడు. జిహాద్ కోసం ఎంతటి క్రౌర్యానికౌనా ఒడిగట్టేలా మనుషుల్ని మృగాలుగా మారుస్తాడు. లాహోర్ లోని ఓ మధ్యతరగతి నివాస ప్రాంతంలోని హఫీజ్ ఇంటిచుట్టూ ఆయన ప్రైవేటు బలగాలు తుపాకులతో పహారా కాస్తుంటారు. హఫీజ్ భార్య పేరు మైమూనా. వారికి ముగ్గురు సంతానం. కొడుకు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కుతుళ్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. -
‘దావూద్, సయీద్ ఆస్తులను సీజ్ చేయండి’
న్యూఢిల్లీ: అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీల ఆస్తులను సీజ్ చేయాలని పాకిస్తాన్ను భారత్ కోరనుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల జాబితాలో ఉన్న ఈ ముగ్గురు పాక్లో ఉన్నందున ఆ దేశం వీరి ఆస్తులను సీజ్ చేయాల్సి ఉంటుంది. ఐరాస మండలిలోని అల్ కాయిదా, తాలిబాన్ ఆంక్షల కమిటీ దావూద్పై 2003లో, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు సయీద్, ముంబై ఉగ్రదాడుల సూత్రధారి లఖ్వీలపై 2008లో ఆంక్షలు విధించింది. అందువల్ల వీరి ఆస్తులను సీజ్ చేయడం ఐరాస సభ్య దేశమైన పాక్ బాధ్యత. ‘ఈ ముగ్గురి ఆస్తులను సీజ్ చేశారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఒకవేళ సీజ్ చేయకుంటే ఇప్పుడు తక్షణమే వారి ఆస్తులను సీజ్ చేయండి. దీనిపై పాక్కు త్వరలోనే లేఖ రాయాలనుకుంటున్నాం’ అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఐరాస ఆంక్షల జాబితాలో ఉంటే వారి ఆస్తులను సీజ్ చేయడంతోపాటు వారి ఆయుధాలను, ప్రయాణాలను నిషేధించాల్సి ఉంటుంది. -
హఫీజ్, దావుద్లను భారత్కు అప్పగించండి
న్యూఢిల్లీ : కరడు గట్టిన తీవ్రవాది హఫిజ్, మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీంలకు భారత్కు అప్పగించాలని పాకిస్థాన్ను కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. గురువారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. పెషావర్ ఘటనతో ఉగ్రవాదంపై పోరును తీవ్రంగా పరిగణిస్తే... ఆ ఇద్దరిని అప్పగించాలని సూచించారు. ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని వెంకయ్య పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు హితవు పలికారు. పాకిస్థాన్లోని పెషావర్లో తాలిబన్ తీవ్రవాదులు రెచ్చిపోయారు. సైనిక దుస్తుల్లో ఆర్మి పాఠశాల్లోకి ప్రవేశించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 148 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
‘ముంబై’ ముష్కరులకు శిక్ష ఎప్పుడు?
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో 166 మందిని బలిగొన్న ఉగ్ర దాడులకు ఈ నెల 26తో ఐదేళ్లు పూర్తి కానున్నాయి. 2008 నవంబర్ 26 నాటి ఆ నరమేధంలో నేరుగా పాల్గొని పట్టుబడిన పాక్ ఉగ్రవాది కసబ్ను భారత్ గత ఏడాది నవంబర్లో ఉరి తీసింది. అయితే ఆ ఘాతుకానికి తెగించిన సూత్రధారులకు శిక్ష పడే సూచనలు మాత్రం కనుచూపుమేరలో కనిపించడం లేదు. దాడుల్లో కీలక పాత్ర పోషించిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ పాక్లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. దాడుల కేసులో పాక్ అరెస్టయిన ఏడుగురు ఆ దేశ ఉగ్రవాదులపై విచారణ నత్తనడకన సాగుతోంది. ‘26/11’లో వారి హస్తముందంటూ భారత్ పలుసార్లు గట్టి ఆధారాలు ఇచ్చినా పాక్ మాత్రం అవి తమ కోర్టుల్లో చెల్లవని, ఇంకా గట్టి సాక్ష్యాలు కావాలని విచారణకు మోకాలడ్డుతోంది. దాడుల కుట్ర తమ దేశంలోనే జరిగిందని ఒప్పుకున్న ఆ దేశం.. నిందితులకు వ్యతిరేకంగా గట్టి సాక్ష్యాలుంటేనే చర్యలంటూ రెండు నాల్కలతో మాట్లాడుతోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement