-
మహిళా టీచర్లపై అసభ్య ప్రవర్తన
శాలిగౌరారం: మహిళా ఉపాధ్యాయుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరుగురు విద్యార్థులను ఉపాధ్యాయులు చితకబాదారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో జరిగిన ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ స్కూల్లో 708 మంది విద్యార్థులున్నారు. వారిలో 500 మంది పాఠశాల స్థాయిలో ఉండగా, మరో 208 మంది ఇంటర్ విద్యార్థులు. మోడల్ స్కూల్లో 8 మంది మహిళా టీచర్లు ఉన్నారు. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఆరుగురు విద్యార్థులు మహిళా ఉపాధ్యాయుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో విద్యార్థులను ఉపాధ్యాయులు సోమవారం ప్రిన్సిపాల్ చాంబర్లోకి పిలిపించి విచారించారు. చాంబర్లోని సీసీ కెమెరాలను నిలిపివేసి ఉపాధ్యాయులు విద్యార్థులను కర్రలతో కొట్టారు. ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో నడవలేని స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆ విద్యార్థి నకిరేకల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో విషయం వెలుగులోకి రావడంతో పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ లక్ష్మయ్య పాఠశాలను సందర్శించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. -
మేధావులను మెప్పించిన ‘మోడల్’ విద్యార్థి
సిద్దిపేట ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న మధ్యతరగతి విద్యార్థిని ఆవిష్కరించిన ప్రదర్శనకు జాతీయ స్థాయిలో చోటు లభించింది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్రీయ నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్లో మెతుకుసీమ మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది. మెదక్ మండలంలోని తిమ్మాయిపల్లికి చెందిన విద్యార్థిని మానస రెండేళ్ల క్రితం జరిగిన జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న విషయం విదితమే. ఇదిలా ఉండగా ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఇర్కోడ్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని కృష్ణశ్రీ ఆవిష్కరించిన ప్రయోగం రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈ క్రమంలో ఈ నెల 22నుంచి 24వ వరకు వరంగల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో కృష్ణశ్రీ ప్రయోగం జాతీయ స్థాయికి ఎంపికైంది. ఈ పోటీలకు పది జిల్లాల నుంచి 696 ప్రదర్శనలు రాగా న్యాయనిర్ణేతలు వీటిలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన 35 ప్రయోగాలను జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గురువారం ‘సాక్షి’ కృష్ణశ్రీని అభినందించి తన మనోభాలను తెలుసుకుంది. విద్యుత్ కొరతే ఆవిష్కరణకు నాందిగా... ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న విద్యుత్ కొరత, నీటి వృథాను నియంత్రించే లక్ష్యంతో పాఠశాల ప్రిన్సిపల్, సబ్జెక్ట్ టీచర్ చొరవతో మురుగు నీటితో విద్యుత్ ఉత్పత్తి ప్రదర్శనకు నాంది పలికినట్లు విద్యార్థిని కృష్ణశ్రీ తెలిపింది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ చిన్నారి ఇర్కోడ్ మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. ఈమె తల్లిదండ్రులు స్వరూప, నగేష్లు ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. 7వ తరగతి వరకు సిద్దిపేటలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో చదివిన కృష్ణశ్రీ ఇర్కోడ్లోని ఆదర్శ పాఠశాలలో 8వ తరగతిలో ప్రవేశం పొందింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్పైర్ అవార్డుల ఎంపికకు వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహిస్తోందని తెలుసుకున్న కృష్ణశ్రీకి ‘వ్యర్థజలాలతో విద్యుత్ ఉత్పత్తి’ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలకు చెందిన గైడ్ టీచర్ ముఖేష్ సహకారంతో తన ఆలోచనకు పదును పెట్టింది. స్థానికంగా దొరికే వస్తువులతో ప్రయోగాన్ని ప్రారంభించి విజయవంతంగా ప్రదర్శించింది. మెదక్లో జరిగిన జిల్లా స్థాయి ప్రదర్శనలో ఈ ప్రయోగం ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. అక్కడ కూడా తన ప్రయోగం, వాక్చాతుర్యం ద్వారా న్యాయనిర్ణేతల మెప్పు పొంది తన ప్రదర్శనను జాతీయ స్థాయికి ఎంపికయ్యేలా సత్తాచాటింది. ఆవిష్కరణ సమగ్ర రూపం అంశం: మురుగు నీటితో విద్యుత్ ఉత్పత్తి. కావలసిన పరికరాలు: అట్టపెట్టెలు, ప్లాస్టిక్ బాక్స్లు, ప్లాస్టిక్ పైప్లు, డైనమో, మోటార్, చిన్న ఫ్యాన్, ఫ్లైవుడ్, గ్రీన్ సీట్. ప్రయోగ విధానం: మురుగు కాల్వల నుంచి వచ్చే నీటిని ఒక గది (చాంబర్)లో నిల్వ చేయాలి. దానిని 20 నుంచి 30 రోజుల వరకు నిల్వ ఉంచాలి. అలా నిల్వ ఉంచడం వల్ల దానిలో సూక్ష్మజీవులు పెరుగుతాయి. దీనివల్ల ఈ నీటిలో సీహెచ్4 (మిథేన్ గ్యాస్) ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అయిన గ్యాస్ను, మిథేన్ చాంబర్లో నిల్వ చేయాలి. నిల్వ చేసిన మిథేన్ను పైప్ల ద్వారా ఫర్నెన్స్ అనే చాంబర్లోకి పంపించాలి. దీనిలో గ్యాస్ను మండించడం వల్ల ఉష్ణం వెలువడుతుంది. దీన్ని హీట్ ఎక్స్చేంజర్ చాంబర్లోకి పంపించాలి. నిల్వ ఉంచిన గది నుంచి మురుగు నీటిని పైప్ల ద్వారా బాయిలర్లోకి పంపిస్తాం. బాయిలర్లో మురికి నీరు, ఉష్ణం కలవడం వల్ల నీరు అనేది నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరిని మనం పైప్ల ద్వారా ఫర్నెన్స్ గదిలోకి పంపిస్తాం. నీటి ఆవిరి వేగంగా ఫర్నెన్స్ను తిప్పుతాయి. దీని వల్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్ను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మరోవైపు విద్యుత్ ఉత్పాదన సమయంలో కొంత స్వచ్ఛమైన నీరు ఏర్పడుతుంది. ఆ నీటిని మనం వ్యవసాయ, ఇతర నిర్మాణ రంగాలకు వాడుకోవచ్చు. ఉపయోగాలు... ఈ ప్రయోగం ద్వారా అనేక ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం ఉండదు. నీరు వృథా కాదు, భూగర్భ జలాశయాలను కాపాడుకోవచ్చు. తక్కువ ఖర్చుతో విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. మిగిలిన స్వచ్ఛమైన నీటిని వ్యవసాయ, ఇతర పనులకు వాడుకోవచ్చు. -
క్వార్టర్స్లో ఆలియా, గతి స్కూల్స్
హ్యాండ్బాల్ స్కూల్ లీగ్ సాక్షి, హైదరాబాద్: విశాల్ స్మారక హైదరాబాద్ హ్యాండ్బాల్ స్కూల్ లీగ్ టోర్నమెంట్లో ఆలియా గవర్నమెంట్ మోడల్ స్కూల్ (జీహెచ్ఎస్), గతి స్కూల్ జట్లు బాలుర విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. బాలికల ఈవెంట్లో నల్లగొండ జెడ్పీహెచ్ఎస్, సెయింట్ జోసెఫ్ స్కూల్ జట్లు క్వార్టర్ పోరుకు సిద్ధమయ్యాయి. ఎల్బీస్టేడియంలో బుధవారం జరిగిన బాలుర విభాగం పోటీల్లో ఆలియా జీహెచ్ఎస్ 11-4తో సెయింట్ జోసెఫ్ (కింగ్కోఠి)పై, మరో మ్యాచ్లో ఆలియా జట్టు 7-2తో మమత హైస్కూల్ (పోచంపల్లి)పై గెలుపొందింది. గతి జీహెచ్ఎస్ (బంజారాహిల్) 5-1తో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్పై, రెండో మ్యాచ్లో గతి 10-0తో తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల (టీఎస్డబ్ల్యూఆర్ఎస్, వికారాబాద్)పై నెగ్గింది. అంతకుముందు టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జట్టు 10-2తో ప్రభుత్వ హైస్కూల్ (దేవల్జామ్సింగ్)పై, ఆర్మీ స్కూల్ 8-3తో జీహెచ్ఎస్ (విజయనగర్ కాలనీ)పై, ఎంవీఎం (హైటెక్) 8-3తో జీహెచ్ఎస్ (విజయనగర్ కాలనీ)పై, టీఎస్డబ్ల్యూఆర్ఎస్ (షేక్పేట్) 11-0తో సెయింట్ పీటర్ హైస్కూల్పై, జీహెచ్ఎస్ (చాదర్ఘాట్) 7-0తో మమత హైస్కూల్ (సికింద్రాబాద్)పై, కేంద్రీయ విద్యాలయం (శివరాంపల్లి) 7-2తో చిరెక్ (ఖాజాగూడ)పై విజయం సాధించాయి. బాలికల విభాగంలో నల్లగొండ జెడ్పీహెచ్ఎస్ 3-2తో జీహెచ్ఎస్ (విజయనగర్ కాలనీ)పై, గతి జీహెచ్ఎస్ 3-0తో జీహెచ్ఎస్ (దేవల్జామ్సింగ్)పై, మమత హైస్కూల్ 4-1తో గతి జీహెచ్ఎస్పై, ఎంవీఎం (కొండాపూర్) 4-2తో జీహెచ్ఎస్ (విజయనగర్ కాలనీ)పై, ఎంవీఎం (హైటెక్) 3-1తో చిరెక్ (ఖాజాగూడ)పై, లిటిల్ ప్లవర్ హైస్కూల్ 2-1తో జీహెచ్ఎస్ (దేవల్ జామ్సింగ్)పై, లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ 4-3తో మమత హైస్కూల్పై, చిరెక్ (కొండాపూర్) 5-1తో జీహెచ్ఎస్ (విజయనగర్ కాలనీ)పై, సెయింట్ జోసెఫ్ (కింగ్కోఠి) 2-1తో సెయింట్ ఫ్రాన్సిస్ (సికింద్రాబాద్)పై, మమత హైస్కూల్ 2-1తో జీహెచ్ఎస్-ఎస్వీబీపీపై గెలుపొందాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement