-
చెల్పూరు గ్రామాన్ని కమ్ముకున్న కారు మేఘాలు
గణపురం : మండలంలోని చెల్పూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం కారు మేఘాలు కమ్ముకున్నాయి. గ్రామస్తులంతా మబ్బులను చూసి కంగారు పడ్డారు. చెల్పూరు ప్రభుత్వ పాఠశాల నుంచి ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు. -
పీటల మీద పెళ్లి ఆగిపోయింది!
గణపురం: పెళ్లికి సిద్ధమైన వరుడి గుట్టు బయటపడడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. వేరొక మహిళతో ఉన్న సంబంధాన్ని దాచిపెట్టి మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులో శనివారం జరిగింది. రాంప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి ఓ వివాహితతో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఆమెకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి చెల్పూరులో ఓ యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. విషయం ఎలాగో బయటకు పొక్కడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. వధువు తల్లిదండ్రులు, బంధువులు గణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కేటీపీపీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
గణపురం: జయశంకర్ జిల్లా గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుత్తు ప్లాంట్(కేటీపీపీ)లో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. 600 మెగావాట్ల రెండో దశ విద్యుత్తు కేంద్రంలో బాయిలర్ లీకేజీ వల్ల ఉత్పత్తి నిలిచిపోయినట్లు చీఫ్ ఇంజినీర్ మహేష్కుమార్ తెలిపారు. రెండు రోజుల్లో మరమ్మతులు చేసి ప్లాంట్ను పునఃప్రారంభిస్తామన్నారు. రోజుకు రూ.32లక్షల విలువైన విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. -
శిల్ప సంపద అద్భుతం
గణపురం : గణపేశ్వరాలయ శిల్పాలు అద్భుతం, అపూర్వమని అమెరికాకు చెందిన సందర్శకుల బృందం స్పష్టం చేసింది. జిల్లాలో పలు చోట్ల కాకతీయుల కట్టడాలను చూడడం జరిగిందని వారు తెలిపారు. అన్ని దేవాలయాల్లో శిల్పసంపద ఉంది. అపరూపమైన శిల్పాలను ధ్వంసం కాకుండా చూడాలని సూచించారు. గణపేశ్వరునికి పూజలు నిర్వహించారు. దేవాలయాలను నిర్మించిన కాకతీయుల గూర్చి అడిగి తెలుసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో 35 గొర్రెలు మృతి
గణపురం (వరంగల్ జిల్లా) : వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని కుందయ్యపల్లి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 35 గొర్రెలు మృతిచెందాయి. రేగొండ మండలం నాగుర్లపల్లి గ్రామానికి చెందిన బండారి కొమురయ్య, బండారి ఓదెలు, కొడారి రాజయ్య, కొడారి రాజేంద్రంకు చెందిన 400ల గొర్రెలను మేత కోసం భూపాలపల్లి అడవులకు తరలిస్తున్న క్రమంలో కుందయ్యపల్లి దగ్గర తిరుమల పాలను సరఫరా చేసే వ్యాన్ డ్రైవర్ అజాగ్రత్తతో ప్రమాదం జరిగింది. 35 గొర్రెల విలువ రూ.2 లక్షల వరకు ఉంటుంది. గణపురం ఎస్సై విజయ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేసి కేసు నమోదు చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement